Saturday, July 17, 2010

పర్యావరణ కాలుష్యము , Environmental Pollution India



పర్యావరణము లో హానికర పదార్ధాలు ఎక్కువ పరిమాణములో ఉండి , జీవులకు హాని కలిగిస్తుంటే దాన్ని కాలుష్యము అని పేర్కొనవచ్చును . అడవుల్లో రగిలే కార్చిచ్చు , అగ్ని పర్వతాలు బద్దలు కావడం వంటివి సహజ కాలుష్యకారణాలు . శిలాజ ఇంధనాలను , కట్టెలను మండించడము , పారిశ్రామిక వ్యర్ధపదర్ధాలు వంటివి మానవ చర్యలవల్ల కలిగే కాలుష్య కారణాలు . కాలుష్యాన్ని కలిగించే వాటిని కాలుష్య కారకాలు అంటారు .
ఇవి 2 రకాలు :
1. విచ్చిన్నము చెందే కారకాలు -> పేపరు , కూరగాయలు , వృక్ష , జంతు ఉత్పత్తులు .
2. విచ్చిన్నము చెందని కారకాలు -> ప్లాస్టిక్ , అల్యూమినియం , సీసము , లోహాలు , డి.డి.టి(వంటి పురుగుల మందులు).
కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి ->
1. వాయుకాలుష్యము,
2. నీటి కాలుష్యము ,
3. భూమికాలుష్యము ,
4. ధ్వని కాలుష్యము ,
5. రేడియోధార్మిక కాలుష్యము ,

1. వాయుకాలుష్యము (Air pollution):
వాహనాలనుంచి , పరిశ్రమలనుంచి వెలువడే వాయులు దీనికి ముఖ్యకారణము . ఉదా: కార్బన్ డైఆక్షైడ్ , కార్బన మోనాక్షైడ్ , సల్ఫర్ డైఆక్షైడ్ , నైట్రోజన్ ఆక్షైడ్ , ధూళిరేణువులు వంటివి వాయుకాలుష్యానికి కారకాలు . ఇంధనాలు మండటం వల్ల కార్బండైఆక్షైడ్ వెలువడుతుంది ... కార్బండైఆక్షైడ్ వల్ల గ్రీం హౌస్ ఎఫెక్ట్ లేదా గ్లోబల్ వార్మింగ్ కలుగుతుంది . భూమిచుట్టూ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వారిమింగ్ అంటాము . దీనివల్ల సముద్రమట్టాలు పెరగడము , తీరప్రాంతాలు మునిగిపోవడము , అతివృష్టి , అనావృష్టి , ఎల్ నినో , లానినో ... సంభవించడం , వ్యాధులు ప్రబలడము , వంటి అనేక ప్రభావాలు కలుగుతాయి . కార్బన్ డైఆక్షైడ్ తో పాటు మీధేన్ , నైట్రోజన్ ఆక్షైడ్ , క్లోరో ఫ్లోరో కార్బన్ లు , ఓజోన్ , వంటివి కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు కారణమవుతాయి . వీటిలో మీధేన్ .. చిత్తడి నేలల నుంచి , వరిపొలాల నుంచి జీవులు కుళ్ళుతున్నప్పుడు వెలువడుతుంది .
అత్యధిక గాఢత ఉన్న కార్బన్ మోనాక్షైడ్ మరణాన్ని కలుగ జేస్తుంది .
సల్ఫర్ డై ఆక్షైడ్ వల్ల శ్వాసనాళం లో మంట , కళ్ళు మంట కలుగజేస్తుంది .
మహానగరాల్లో కాంతి రసాయనిక పొగమంచులో నైట్రోజన్ ఆక్షైడ్ లు , ఓజోన్, పెరాక్సి ఎసిటైల్ నైట్రేట్ , ఘనరూప పదార్ధాలు , ఆల్డి హైడ్స్ వంటివి ఉంటాయి . పొగమంచు దట్టం గా ఏర్పడ్డం వల్ల నగరాల్లో రవాణా వ్యవస్థకు ఆటంకము కలుగుతుంది . 1952 డిసెంబర్ 05 న లండన్ నగరము పై దట్టమైన పొగమంచు అయిదు రోజులపాటు ఆవరించడము వల్ల అనేక వ్యాదుల వలన సుమారు 4000 వేలమంది మరణించారు . క్లోరోఫ్లొరో కార్బన్ లు ఓజోన్ పొరను నష్టపరుస్తాయి . దీనివల్ల అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపైకి చేరి మానవులకు చర్మ క్యా్న్సర్ కలిగిస్తాయి .

for more details : Air pollution(Wikipedia.org)
---------------------------------------------------------------------
2. నీటి కాలుష్యం (Water pollution) : అనేది నీటి మరియు నీటి వనరులు కలుషితమైన ప్రక్రియ లేదా పరిస్థితి. ఈ వనరులు అనగా సరస్సులు, నదులు, సముద్రాలు, ఇంకా భూగర్భజలాలు మనుషుల చర్యలవల్ల కలుషితమవుతాయి. ఈ నీటి వనరుల మీద ఆధారపడి బ్రతికే ప్రాణులు మరియు మొక్కలకి ఇది హానికరమైనది. నీటిని శుద్ధి చేయకుండా కలుషితాలను నేరుగా నీటివనరులలోకి వదిలివేయడం వలన ఇది ఏర్పడుతుంది.


పూర్తి వివరాలకోసం _ వికిపెడియా లో చచవండి
-------------------------------------------------------------------------------------------

3. భూమికాలుష్యము :


పారిశ్రామిక ప్రాంతాలలోని పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయి . వ్యవసాయ ఎరువులు వాడకం ద్వరా , పురుగు మందులు చల్లడం వల్లను మట్టితో సహా పండ్లు , కూరగాయలు కలుషితమవుతున్నాయి . ఇవి తిని ఆరోగ్యము బారిన పడుతున్నారు . రోడ్ల పైన చెత్తా చెదారము కుళ్ళి సూక్ష్మ క్రిముల ఉత్పత్తికి దోహదపడతాయి . జంతుకళేబరాలను జాగ్రత్తగా డిస్పోజ్ చేయనిఎడల దుర్గంధము తో పారు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువకావచ్చును . తగు జాగ్రత్తలు తీవుకోవడము మానవాలి మనుగడకు మంచిది .


--------------------------------------------------------------------------
4 . ధ్వని కాలుష్యము :

శబ్ద ఆరోగ్య ప్రభావాల స్వభావం ఆరోగ్య మరియు ప్రవర్తనపై ఉంటుంది. అక్కరలేని ధ్వనులను శబ్దం అంటారు.ఈ అక్కరలేని ధ్వనుల వల్ల మానసికంగా మరియు దేహపరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.శబ్ద కాలుష్యం కోపము ఇంకా కలహాలకు కారణమవుతుంది,అధిక రక్తపోటు,అధిక ఒత్తిళ్ళకు,టిన్నిటస్(చెవిలో శబ్దాలు), వినికిడి కోల్పోవటం, నిద్రకు ఆటంకాలు, ఇంకా మిగిలిన హానికరమైన ప్రభావాలు ఉంటాయి. ఇంతేకాకుండా, ఒత్తిడి ఇంకా అధిక రక్తపోటు ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది, ఇంకా టిన్నిటస్(చెవిలో శబ్దాలు) మతిమరుపుకు దారితీస్తుంది, తీవ్రమైన వ్యాకులము,ఇంకా కొన్నిసార్లు భయంకరమైన పోటులకు గురిచేస్తుంది.
దీర్ఘకాలంగా శబ్దం వినటంవల్ల శబ్డంచే ప్రేరేపించబడిన చెవుడు వస్తుంది.కాలముతోపాటు వినికిడి శక్తి తేడాలు తగ్గినప్పటికీ ఇంకా రెండు వర్గాలమధ్య 79 సంవత్సరాల తర్వాత భేదం గుర్తించు సాధ్యం కాదు. వయసుపైబడినవారు చెప్పుకోదగినంత వృత్తిరీత్యాశబ్దాలను వినిఉంటే, వారి వినికిడి శక్తిని శబ్దంవినని వారిసమకాలీకులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఏవిధమైన ప్రయాణసాధనాలు ఇంకా పరిశ్రమల శబ్దాలు వినని మాబన్ కోయ మనుషులకుఇంకా అన్ని శబ్దాలు వినే U.S.లో నివసించే మనుషులకు జరిగిన తరతమ పరిశీలనలో దీర్ఘకాలంగా పరిసరాలలోని శబ్దాలు వింటున్నవారికి చెవుడు వస్తుందని తేలింది.


అధిక శబ్దాలు హృదయనాళాల మీద ప్రభావం చూపుతాయి ఇంకా ఎక్కువగా ఉన్న శబ్దాలు ఎనిమిది గంటలువింటే రక్తపోటు స్థిరముగా ఐదు నుంచీ పది పాయింట్లు పెరుగుతుంది, ఇంకా ఒత్తిడి పెరుగుతుంది మరియు పైన చెప్పినవిధముగా వాసోకన్స్ట్రిక్షన్ వల్ల రక్తపోటు పెరగటమే కాకుండా కరోనరీ అర్టేరి డిసీజ్వచ్చే అవకాశం ఉంది.

శబ్ద కాలుష్యం కోపానికి ఒక కారణం. 2005 లో స్పానిష్ పరిశోధకులు చేసిన పరిశీలనలో నగరంలో నివసించేవారు శబ్ద కాలుష్యం తగ్గించటానికి ప్రతిసంవత్సరము ఒక డేసిబెల్ కు నాలుగుయురోలు చెల్లించటానికి తయారుగాఉన్నారని తెలిపారు.

మరికొన్ని విషయాలకోసం : శబ్దకాలుష్యం

-----------------------------------------------------------------------------------------------
5. రేడియోధార్మిక కాలుష్యము :
కొన్ని మూలకాల్లోని కేంద్రకణాలు అస్థిరంగా వుంటాయి. ఇవి అప్రమత్తంగా వాటికవే విచ్ఛిన్నం చెంది రేడియోధార్మిక కిరణాలను వెలువరిస్తాయి. ఈ లక్షణాన్నే రేడియోధార్మికత అంటారు. ఈ మూలక కేంద్రకం వెలువరించే కిరణాల పేరు ఆల్ఫా, బీటా, గామా కిరణాలు.

వీటిలో ఆల్ఫా కిరణాలకు తక్కువశక్తి, గామా కిరణాలకు ఎక్కువ శక్తి వుంటుంది. ఈ మూడు కిర ణాలు కూడా జీవజాలానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. ఈ రేడియేషన్‌ శాతం చాలా తక్కువగా వుంటే మాన వాళి ఆరోగ్యానికి పెద్దగా హాని కలుగదు. ఈ కిరణా లను కొన్ని పరిమితుల మేరకు వైద్యంలోను, పారిశ్రా మిక రంగంలోను కూడా ఉపయోగించుకుంటున్నారు.
తక్కువ శాతంలో వున్న ఈ కిరణాలను ఆహార పదార్థాలు నిల్వ చేసేందుకు, సిరంజీల్నీ, ఇంజక్షన్‌ సూదులను స్టెరిలైజ్‌ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. దీనినే 'ఇర్రేడియేషన్‌' అంటారు.

పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, ఇంకా ఇతర ఆహార పదార్థాలను ఇర్రేడియేషన్‌కు గురిచేసి అవి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ చేయగల్గుతున్నారు. ఈ రేడియేషన్‌ వల్ల వాటిని పాడు చేసే సూక్ష్మ జీవులు నశించిపోతాయి.

సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు 15 నుండి 20 రోజులకు మించి నిల్వ వుండవు. అయితే వీటిని ఇర్రేడియేషన్‌కు గురి చేస్తే అవి ఆరు నెలల వరకు నిల్వ వుంటాయి. ఈ ఇర్రేడియేషన్‌కు గురైన ఆహార పదార్థాలను భుజించడం వల్ల మనిషికి ఎటువంటి హానీ జరగదు.

రేడియోధార్మిక కాలుష్యం : రేడియోధార్మికత వల్ల మనిషికి ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతాయి. అత్యధిక మోతాదులో మనిషి ఈ రేడియేషన్‌ ప్రభావానికి గురైతే ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. చాలా తక్కువ మోతాదులో రేడియేషన్‌ మన శరీరంలోకి వెళుతుంటే పలు వ్యాధులు మొదలై మరణానికి చేరువవుతాము.

ఇంత ప్రమాదకరమైన రేడియేషన్‌కు మనిషి దూరంగా వుండలేకపోతున్నాడు. మన చుట్టూ వున్న వాతావరణంలో కంటికి కనిపించని రేడియేషన్‌ నిత్యం మన శరీరంలో ప్రవహిస్తూనే వుంటోంది. దీనికి తోడు మనిషి నాగరికత కారణంగా ఏర్పడిన కృత్రిమ రేడియోధార్మిక శక్తి కూడా మనిషికి హాని కల్గిస్తోంది. మనం తినే ఆహారం ద్వారా, పీల్చే గాలి ద్వారా మనం రేడియేషన్‌కు గురవుతూనే వున్నాం.

న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్లకు సమీపంలో వున్న ప్రజలు రేడియేషన్‌ కారణంగానే ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురవుతున్నారు.

కాలుష్యంతో కూడిన పొగ నల్లగా వుంటుంది. రసాయనాలను కూడా వాసన, రంగు ద్వారా గ్రహించవచ్చు. కాని స్లోపాయిజన్‌గా మనలో ప్రవేశించే అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్‌ను మాత్రం మనం చూడలేము.

ప్రతీ చోట ఇదే పరిస్థితి !

ప్రతిసెకెను మన శరీరంలోకి వందకు పైగా కాస్మిక కిరణాలు దూసు కుపోతున్నాయి. వాతావ రణంలోని రేడి యోధార్మిక శక్తిగల అణువులు మనం పీల్చే గాలి ద్వారా ఊపిరి తిత్తులలోకి వెళుతూ వుం టాయి. కొన్ని వేల సంఖ్య లో పొటాషియం అణు వులు, రెండు లేదా మూ డు యురేనియం అణు వులు మనం తాగే నీరు, ఆహారం ద్వారా లోనికి పోతూనే వుంటాయి.

వీటితో పాటు భూమి నుండి విడుదలయ్యే గామా కిరణాలు నిత్యం మన శరీరంలోకి ప్రవేశిస్తూనే వున్నాయి. ఇదంతా సహజంగా జరిగేది. ఇదిగాక వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక పరిశోధనారంగాల ద్వారా మనం అనునిత్యం కృత్రిమ రేడియేషన్‌కు గురవుతూనే వున్నాం.

ముఖ్యంగా ఆధునిక వైద్య పరీక్షల కోసం ఉపయోగించే ఎక్స్‌ కిరణాలు, సీటీస్కాన్‌ల ద్వారా మనం ఎక్కువగా రేడియేషన్‌కు గురవుతున్నాము. గతంలో యురేనియం, రేడియం వంటి రేడియోధార్మిక పదార్థాలను ఆభరణాల్లో వుపయోగించేవారు. గాజుతో తయారయ్యే వాటి మీద రంగు కోసం యురేనియంను, వాచీ డయల్స్‌లో రేడియంను వాడేవారు. ప్రస్తుతం వాటి వాడకాన్ని చాలా దేశాలు నియంత్రించాయి.

కాలుష్యాన్ని గుర్తించే పరికరం : ఈ రేడియేషన్‌ బారి నుండి కాపాడాలంటే మన శరీరంలోకి ప్రవేశించే రేడియోధార్మిక కణాలను గుర్తించడం ఎంతైనా అవసరం - అలా గుర్తించగల ప్రత్యేకమైన 'గాగుల్స్‌'ను బ్రిటీష్‌ పరిశోధక బృందం రూపొందించింది.

జింక్‌ సల్ఫైడ్‌ పై ఆల్ఫా కిరణాలు పడితే అది ప్రకాశిస్తుంది. దీనినే 'స్కింటిలేషన్‌' అంటారు. తక్కువ పరిమాణంలో రేడియోధార్మిక గుణాన్ని కలిగిన పదార్థాల నుంచి వచ్చే బలహీనమైన కిరణాలను మరింత ప్రకాశవంతంగా మెరిసేలా చేసి - అంటే మనిషి కన్ను చూడగలిగేలా చేసేందుకు శాస్త్ర బృందం ఒక విధానం రూపొందించింది.

ఇందుకోసం ఆ బృందం చీకట్లో సైతం చూడగలిగే గాగుల్స్‌నూ, జింక్‌ సల్ఫైడ్‌ను ఉపయోగించింది. వీటి ద్వారా రేడియోధార్మిక పదార్థాలను గుర్తించవచ్చు. ఒక చదరపు సెంటీమీటరు పరిధిలోని రేడియోధార్మిక కాలుష్యంలో 30 ఆల్ఫా కిరణాల కన్నా తక్కువ వున్నట్లయితే అద్దాలతో అమర్చిన మోనోక్రోమ్‌ తెర ప్రకాశవంతంగా కన్పిస్తుంది. అంతేగాకుండా దీనిని ఉపయోగించి ఒక ఆకారం లేకుండా వివిధ ప్రాంతాల్లో రకరకాల వాహాకాల ద్వారా వ్యాపించే రేడియోధార్మికతను లెక్కించవచ్చు.

ఈ అద్దాలను ఉపయోగించి రేడియోధార్మిక ప్రభావం ఎక్కువగా వున్న పరిసరాల నుండి ప్రజలను దూరంగా వుండమని హెచ్చరించవచ్చు. అయితే ఇందులో ఒక ఇబ్బంది వుంది. మనం పరిశోధన చేసే స్థలంలో ముందుగా జింక్‌ సల్ఫైడ్‌ను స్ప్రే చెయ్యాలి. అంతేకాదు ఈ గాగుల్స్‌ను బయట వాతావరణంలో కేవలం రాత్రిపూట మాత్రమే వినియోగించగలం. పగటి సమయంలో సూర్యకాంతి రేడియోధార్మిక కిరణాలను చూసేందుకు సహకరించదు. ఇబ్బందులు వున్నా రేడియోధార్మిక కాలుష్యం గుర్తించి నియంత్రించేందుకు ఇది ఉపకరిస్తుంది.
  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/