Tuesday, August 31, 2010

గాల్‌ బ్లాడర్‌ స్టోన్స్‌-నివారణ ,పసరతిత్తిలో రాళ్ళు , Gall Blader Stones and Treatment






Gall Stones :

పిత్తాశయం(గాల్‌బ్లాడర్) పొట్టకు కుడివైపున లివర్ కింది భాగంలో బేరీపండు ఆకారంలో ఉంటుంది. కాలేయం నుంచి ప్రవాహం మాదిరిగా వచ్చే పైత్యరసంను పిత్తాశయం నిలువ ఉంచుతుంది. ఆహారం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు నిలువ ఉంచుకున్న పైత్యరసాన్ని బయటకు పంపించడం జరుగుతుంది. పైత్యరసంలో నీరు, కొలెస్టరాల్, ఫ్యాట్స్, బైల్ సాల్ట్స్, ప్రొటీన్స్, బైల్‌రూబిన్ ఉంటాయి.

భారత దేశంలో పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఆహారపు అలవాట్లలో మార్పే ప్రధాన కారణం. పాశ్చాత్య దేశాల్లో 60 ఏళ్లు దాటిన వారిలో 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. లావుగా ఉన్నవాళ్లలో, ఆడవారిలో, 50 సంవత్సరాలు వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకు కారణాలు, కాలేయంలో విడుదలైన పైత్యరసం పిత్తాశయంలో ఎక్కువకాలం నిల్వ ఉండడం వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి.కాల్షియమ్‌కి ఇతర ఖనిజాలు తోడై ఈ రాళ్లు ఏర్పడతాయి. దీనికి కొలెస్ట్రాల్‌, పిగ్మెంట్స్‌ కలుస్తాయి. కొన్నిసార్లు వీటన్ని కలయికతో రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయం కండరాలు సరిగ్గా సంకోచించక పోవడం వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. ఈ రెండింటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

పైత్యరసంలో ఎక్కువ శాతంలో కొలెస్టరాల్, బైల్‌రూబిన్ ఉన్నట్లయితే అప్పుడు పైత్యరసం గట్టిపడి రాళ్లుగా మారుతుంది. పిత్తాశయంలో కొలెస్టరాల్ స్టోన్స్ లేక పిగ్మెంట్ స్టోన్స్ అని రెండు రకాల రాళ్లు ఏర్పడతాయి. కొలెస్టరాల్ స్టోన్స్ పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొలెస్టరాల్ ఘనీభవించగా ఏర్పడిన రాళ్లు ఇవి. పిగ్మెంట్ స్టోన్స్ బైల్‌రూబిన్ వల్ల ఏర్పడతాయి. పిత్తాశయంలో ఒకటి లేక రెండు పెద్ద రాళ్లు ఏర్పడవచ్చు. చిన్నసైజులో ఉంటే అంతకంటే ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది.

తీసుకున్న ఆహారంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం, ఊబకాయం, గర్భనిరోధక మా త్రలు ఎక్కువ రోజులు వాడడం, గాల్‌ బ్లాడర్‌ ఇన్‌ఫెక్షన్‌, గర్భం దాల్చి నప్పుడు గాల్‌ బ్లాడర్‌ సరిగా వ్యాకోచించకలేకపోవడం వల్ల పిత్తాశ యంలో రాళ్లు ఏర్పడతాయి. అరుదుగా రక్తకణాలు ఎక్కువగా పగిలి పోవటం వలన కూడా రాళ్లు ఏర్పడవచ్చు. బహు అరుదుగా క్లోమం క్యాన్సర్‌, పిత్తాశయం క్యాన్సర్‌ వలన రాళ్లు ఏర్పడతాయి.

లక్షణాలు: 10 శాతం మందిలో ఎటువంటి ఇబ్బంది కలుగజేయవు. వేరే కారణాల కోసం పరీక్ష చేసినప్పుడు ఇవి బయటపడవచ్చు. కొన్ని సార్లు కుడివైపు కడుపు పై భాగంలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి వీపు కూ డా పాకుతుంది. వ్యాపిస్తుంది. వాంతులొస్తాయి. కొద్దిగా తినడంతోనే కడుపు నిండిపోయిన భావం కలుగుతుంది. త్రేన్పులు రావడం, గుం డెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా గాల్‌ బ్లాడర్‌కు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు జ్వరం రావచ్చు. పిత్తాశయంలోని రాయి కిందకు జరినప్పుడు సంబంధిత కామెర్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది.

రాళ్ల బాధలు
చాలామందిలో ఏ ఇబ్బందీ తెచ్చిపెట్టని ఈ రాళ్లు.. కొందరిలో మాత్రం చాలా సమస్యలు సృష్టిస్తాయి. ముఖ్యంగా ఈ రాళ్లు పిత్తాశయం నుంచి బయటపడితే సమస్య ప్రాణాంతకంగానూ తయారవుతుంది.

1. బయటకు జారి.. ఇరుక్కోవటం: పిత్తాశయంలోని రాళ్లు బయటకు వచ్చి.. పైత్యరసనాళంలో ఇరుక్కుపోవటం మరో ముఖ్యమైన సమస్య. ఒకసారి రాయి పైత్యరస నాళంలోకి జారితే దానివల్ల కామెర్లు (అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌) రావచ్చు. రాయి పైత్యరసనాళంలో అడ్డుపడినప్పుడు ప్రధానంగా- జ్వరం, చలి, కామెర్లు, కడుపునొప్పి.. ఈ నాలుగు లక్షణాలూ కనబడతాయి. ఈ లక్షణాలను బట్టే వైద్యులు రాయి ఇరుక్కుందని తేలికగా చెప్పెయ్యగలుగుతారు.

2. క్యాన్సర్‌: ఇది మన ప్రాంతంలో కొంత అరుదే. రాళ్లు ఉన్న వారందరికీ క్యాన్సర్‌ రావాలనేం లేదు. కానీ క్యాన్సర్‌ వచ్చిన వారందరికీ రాళ్లు ఉంటున్నాయి. దీనికి జన్యుపరమైన అంశాలు కారణం కావచ్చు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. మామూలుగా 2-3 మి.మీ. మందం ఉండే పిత్తాశయం గోడలు.. లోపల రాళ్ల కారణంగా 5-6 మి.మీ. కంటే మందంగా తయారై.. క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి.

3. చీము పట్టటం: రాయి పిత్తాశయం మూతి వద్దకు వచ్చి ఇరుక్కుపోయి బాధలు మొదలైతే... ఉన్నట్టుండి పిత్తాశయం వాచి, తీవ్రమైన కడుపునొప్పి ఆరంభమవుతుంది. దీన్నే 'అక్యూట్‌ కోలిసిస్త్టెటిస్‌' అంటారు. క్రమేపీ పిత్తాశయంలో ఇన్ఫెక్షన్‌ పెరిగి.. ఆ పసరు తిత్తి మొత్తం చీము పట్టినట్టవుతుంది. దీన్ని 'ఎంపయిమా ఆఫ్‌ గాల్‌బ్లాడర్‌' అంటారు. దీనిలో పసరుతిత్తి నిండా చీము చేరిపోయి ఉంటుంది. అప్పుడు బయటి నుంచి లోపలికి ఒక గొట్టం అమర్చి అందులోని చీమునంతా బయటకు తీసేసి, తర్వాత సర్జరీతో పిత్తాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది.

4. పాంక్రియాటైటిస్‌: రాళ్లతో వచ్చే అత్యంత ప్రమాదకరమైన సమస్య ఇది. పిత్తాశయంలోని రాయి కిందకు జారి.. ఆ పైత్యరసనాళం చివర్లో ఉన్న క్లోమగ్రంథి నాళానికి అడ్డుపడితే.. పైత్యరసం క్లోమంలోకి వెళ్లి.. ఆ క్లోమ గ్రంథి వాపు మొదలవుతుంది. దీన్నే 'పాంక్రియాటైటిస్‌' అంటారు. ఇది అత్యంత తీవ్రమైన సమస్య. ఇదిముదిరితే 40% మందిలో ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందుకే ఈ సమస్య తలెత్తినప్పుడు అత్యవసరంగా ఎండోస్కోపీ ద్వారా ముందు ఆ అడ్డుపడిన రాయిని తీసేసి, ఆ తర్వాత మొత్తం పిత్తాశయాన్ని తొలగించటం అవసరం.

5. కొవ్వు తింటే అజీర్ణం: కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తిన్న తర్వాత అజీర్ణం, అసౌకర్యం తలెత్తుతుంటే రాళ్ల కారణంగా పిత్తాశయం సరిగా సంకోచించక, దానిలోని పైత్యరసం సాఫీగా పేగుల్లోకి రావటం లేదని అర్థమవుతుంది. దీన్ని 'ఫ్యాటీ డిస్పెప్సియా' అంటారు. దీనికి ఆహారం తినక ముందు, తిన్న తర్వాత అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తే- పిత్తాశయం సరిగా సంకోచిస్తోందా? లేదా? తెలుస్తుంది. ఒకవేళ సంకోచాలు సరిగా లేవని తేలితే.. రాళ్ల వల్ల వారిలో ఇతరత్రా సమస్యల్లేకపోయినా కూడా.. సర్జరీ చేసి పిత్తాశయాన్ని తొలగించాల్సి వస్తుంది.

గుర్తించడం ఎలా?

* ఎక్సేరే పరీక్షలో రాళ్లు నూటికి 90 శాతం కనిపించవు. వీటిని కను గొనేందుకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మంచి పద్ధతి. ఈ పరీక్షలో 99 శాతం గుర్తించవచ్చు. ఆహారం ఏమీ తీసుకోకుండా పరీక్ష చే యించుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కామె ర్లు ఉంటే కాలేయానికి సంబంధించిన పరీక్షలు కూడా చేయిం చుకోవాలి. గాల్‌స్టోన్స్‌తో పాటు క్లోమంగాని, ఉదరం సంబం ధించిన వ్యాధులు గాని ఉంటే సి.టి స్కాన్‌ చే యించుకోవాలి.

పిత్తాశయంలో రాళ్లతో ఏర్పడే చిక్కులు (complications):
* ఎల్లప్పుడూ కడుపు నొప్పి ఉండడం, కామెర్లు రావడం, ఇన్‌ఫెక్షన్స్‌ రావడం, గాల్‌ బ్లాడర్‌ అం తా చీము పట్టడం, పేగులకు అతుకులు రావడం వంటి సమ స్యలు తలెత్తుతాయి. గాల్‌ బ్లాడర్‌ కి రంధ్రం పడి పైత్య రసం పొట్ట లోకి రావచ్చు


చికిత్స: గాల్‌స్టోన్స్‌ ఉన్నా ఎటు వంటి ఇబ్బందులు లేకుంటే వై ద్యం అవసరం లేదు. అనేక రాళ్లు ఉన్నప్పుడు, ఒక రాయి మాత్రమే ఉన్నా, దాని పరిమాణం ఒక సెం టీమీటర్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, షుగర్‌(Diabetes) ఉన్నప్పుడు, ఇది వరకు ఒకటి, రెండు సార్లు నొప్పి వచ్చినట్లయితే చికిత్స అవసరమవుతుంది. గాల్‌బ్లాడర్‌ చీము పట్టి న ప్పుడు, గాల్‌స్టోన్స్‌ వల్ల కామెర్లు వచ్చినప్పుడు కూడా వైద్యం తీసుకోవాలి.

ఔషధాలతో చికిత్స : మందులను తీసుకోవడం వలన కొంతమందిలో రాళ్లు కరుగవచ్చు. ఈ వైద్యం ఆరునెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు కొందరకి సరిపడవు. అరుగుదల సమస్య ఏర్పడుతుంది. మోషన్స్‌ (విరోచనాలు)ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా ఈ చికిత్స తీసుకోవడం ఆపేయగానే మరలా రా ళ్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ చికిత్సను ప్రస్తుతం వైద్యు లు సూచించడం తగ్గించారు.

లిథోట్రిప్సి : రాళ్లను తొలిగించేందకు ఇదొక పద్ధతి. దీనిని శస్తచ్రికిత్స లేకుండా చేస్తారు. ఈ విధానంలో రాళ్లు బాగా లోపలికి ఉన్నప్పుడు తొలిగించడం ఇబ్బంది అవుతంది. అన్నిసార్లు పూర్తిగా రాళ్లను కరిగిం చకపోవచ్చు. ఈ వైద్యం చేయించుకున్న తరువాత కొన్ని రోజులకు మరలా రాళ్లు తయారు కావచ్చు.

శస్త్ర చికిత్స : ఎప్పటికైనా సర్జరీ మంచి పద్ధతి. ఎందుకంటే గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడడమే కాదు, గాల్‌ బ్లాడర్‌పైనున్న పొరకూడా చాలాసార్లు దెబ్బతిని ఉంటుంది. గాల్‌స్టోన్స్‌తో పాటు, గాల్‌ బ్లాడర్‌ లేకుండా తీసేస్తే రోగికి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.

ఎప్పుడు ఈ చికిత్స అవసరం : నొప్పి వచ్చిన మూడు రోజులలో సర్జరీ చేయించుకుంటే మంచిది. ఈ మూడు రోజుల్లో వీలు కుదర కపోతే మూడు వారాల తరువాత చేయించుకోవాలి. శస్త్ర చికిత్సలో 1.ఓపెన్‌, 2.ల్యాప్రోస్కోపి కొలిసిస్టెక్టమీ అనే రెండ రకాలున్నాయి.

ల్యాప్రోస్కోపి :1970లో ఈ విధానం మొదలైంది. ఇది ఆపరేషన్‌ రూపురేఖల్ని మార్చి వేసింది. కేవలం ఒక సెంటీమీటర్‌ కోతతో ఈ ఆపరేషన్‌ చేయవచ్చు. ఈ శస్త్ర చికిత్సను చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. ఆస్పత్రులో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండాల్సి వస్తుంది. నొప్పి చాలా తక్కువ. పనికి తొందరగా వెళ్లవచ్చు. ఆపరేషన్‌ తరువాత వచ్చే ఇబ్బందులు, కుట్టు చీము పట్టడం వంటి సమస్యలు ఉండవు.
తేలికైన సర్జరీ

పిత్తాశయంలో రాళ్ల కారణంగా నొప్పి వంటి బాధలు మొదలైతే సర్జరీ చేసి మొత్తం పిత్తాశయాన్ని తొలగించటం అవసరం. చాలామంది కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా.. అనుకుంటూ ఉంటారు. కానీ రాళ్ల కారణంగా పిత్తాశయం ఒకసారి వాచి, చీముపట్టిన తర్వాత.. దాని లోపలి పొరల స్వభావంలో తేడాలు వచ్చేస్తాయి. ఫలితంగా లోపల తరచూ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. అరుదుగా ఇది క్యాన్సర్‌గా కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం పిత్తాశయాన్ని తొలగించటం ఉత్తమం.

* పిత్తాశయంలో రాళ్ల సమస్యకు... మొట్టమొదటిసారిగా 1881లో కాల్‌ ఆండర్స్‌ అనే వైద్యుడు శస్త్రచికిత్స చేశారు. అంతకు ముందు లక్షణాలను బట్టి మందులు ఇచ్చేవారు గానీ చాలామంది మరణించేవారు.

* 1881లో మొత్తం పొట్ట తెరిచి సర్జరీ చేశారు. అప్పట్లో ఈ సర్జరీ చాలా క్లిష్టమైనది, రిస్కుతో కూడుకున్నది. ఎందుకంటే పిత్తాశయం కాలేయం కిందగా ఇరుక్కున్నట్టు ఉంటుంది, దీనిచుట్టూ కేవలం ఒక్క సెంటీ మీటర్‌ ప్రాంతంలోనే కీలకమైన రక్తనాళాలు, నిర్మాణాలు ఉంటాయి. ఇంత చిన్న ప్రాంతంలో ఏవీ దెబ్బతినకుండా సర్జరీ చెయ్యటమన్నది పెద్ద సవాల్‌లా ఉండేది. 1881లో మొట్టమొదటి సర్జరీ చేస్తే.. దాదాపు వందేళ్ల తర్వాత 1989లో మొదటగా దీన్ని ల్యాప్రోస్కోపీ పద్ధతిలో తొలగించారు. ఈ విధానంలో పొట్ట తెరవాల్సిన పని లేదు. పొట్ట మీద కేవలం మూడు రంధ్రాలువేసి.. వాటి ద్వారా కెమెరా గొట్టం పంపి.. టీవీ తెర మీద పెద్దగా చూస్తూ.. సర్జరీ చేస్తారు. రోగి త్వరగా కోలుకుని మర్నాటికే ఇంటికి వెళ్లిపోవచ్చు. అందుకే ఇది ప్రామాణిక చికిత్సగా నిలిచింది.

* తాజాగా బొడ్డు దగ్గర ఒక్క రంధ్రంతోనే (సింగిల్‌ పోర్టు) పిత్తాశయాన్ని తొలగించే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంకా అత్యాధునికంగా- స్త్రీలకు పొట్ట మీద ఎక్కడా రంధ్రం వెయ్యాల్సిన అవసరం లేకుండా కేవలం యోని ద్వారం గుండానే పరికరాలు పంపించి పిత్తాశయాన్ని తొలగించే విధానం (నోట్స్‌) కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం దీన్ని చాలాకొద్ది కేంద్రాల్లోనే చేస్తున్నారు, దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

గర్భిణుల్లో..
హార్మోన్ల ప్రభావంతో పిత్తాశయంలో రాళ్ల సమస్య స్త్రీలలో ఎక్కువ. అప్పటికే రాళ్లున్న వారు గర్భం ధరిస్తే.. సమస్యలు మొదలయ్యే అవకాశాలుంటాయి. హార్మోన్ల మార్పులకు తోడు గర్భిణులు కొవ్వు అధికంగా ఉండే బలవర్ధక ఆహారం అధికంగా తీసుకోవటం కూడా దీనికి దోహదం చేస్తుంది. గర్భిణుల్లో ఈ సమస్య వస్తే 1-3 నెలల్లో సాధారణంగా సర్జరీని వాయిదా వెయ్యటానికి ప్రయత్నిస్తారు. 3-6 నెలల గర్భిణుల్లో సర్జరీ చెయ్యటం సురక్షితమే. 6-9 నెలల మధ్య చెయ్యచ్చుగానీ సర్జరీ సంక్లిష్టంగా తయారవుతుంది. కేవలం నొప్పి మాత్రమే అయితే మొదటి మూడు నెలల్లో మందుల వంటివి ఇచ్చి.. 3-6 నెలల మధ్య సర్జరీ చేసి తొలగిస్తారు.
బాధల్లేకపోయినా సర్జరీ?
రాళ్లు మూలంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా కూడా కొందరిలో ఆపరేషన్‌ చేసి పిత్తాశయాన్ని తీసెయ్యటం ఉత్తమం. ఎవరెవరి కంటే..
* వంశంలో పిత్తాశయ క్యాన్సర్‌ చరిత్ర ఉండి.. ఇప్పుడు వీరికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినా
* సికిల్‌సెల్‌ ఎనీమియా వంటివి ఉండి, పిత్తాశయంలో రాళ్లు వచ్చినా
* గుండె, కిడ్నీల వంటివి మార్పిడి చేయించుకుంటున్న వారికి
* మధుమేహుల్లో పిత్తాశయంలో రాళ్లు ఉండి, ఇన్ఫెక్షన్‌ వస్తే అది చాలా తీవ్రంగా ఉండొచ్చు. కాబట్టి అసలా పరిస్థితి రాకుండా ముందే పిత్తాశయాన్ని తీసెయ్యటం మంచిదన్న భావన ఉంది.
* మన దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేని, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి.. రాళ్ల వల్ల ఎప్పుడైనా హఠాత్తుగా సమస్య తలెత్తితే 48 గంటల్లోపు వైద్యం అందే వెసులుబాటు ఉండదు కాబట్టి వారు ముందు జాగ్రత్తగా సర్జరీ చేయించుకోవటం మేలని భావిస్తారు.

--డా|| జి.వి.రావు-చీఫ్‌ ఆఫ్‌ సర్జరీ ఏసియన్‌ ఇనిస్టిట్యూట్‌-ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ-హైదరాబాద్‌

జాగ్రత్తలు : కొవ్వు పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. నాన్‌ వెజిటేరియన్‌ తగ్గించాలి. గర్భ నిరోధక మాత్రలు వాడకాన్ని తగ్గించాలి.ఈ పిత్తాశయం తొలగిస్తే ప్రమాదమని కొంతమంది భావిస్తుంటారు. దీనికి భయపడనవసరం లేదు. కొవ్వు పదార్థాలు అరగడానికి పైత్యరసం ఉపయోగపడుతుంది. ఈ రసం కాలేయం నుంచి స్రవించి, పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. దీనిని తొలిగిస్తే కాలేయంలో విడుదలయిన పైత్యరసం నేరుగా పేగుల్లోకి వచ్చి ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతే కాని ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. అయితే తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు తీసుకుంటే అందరిలాగే సాధారణ జీవితం గడపవచ్చు.


  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, August 28, 2010

ఆహారములో రంగులు లాభ నస్టాలు , Food Colors Merits and Demerits


  • [Foods.jpg]

ఆహారములో రంగులు లాభ నస్టాలు : మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఆహార పదార్థాలలో కల్తీ అనేది ముఖ్యమైనది. అక్రమ ధనార్జన చేయాలన్న ఆశతో ప్రజల అజ్ఞానాన్ని, అజాగ్రత్తను ఆసరా తీసుకుని, కొంత మంది మానవ మనుగడకు అవసరమైన ఆహార పదార్థాలలో హానికరమైన పదార్థాలను కలుపుతున్నారు.
ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి వంటి కీలక ప్రశ్నలకు సమాధానంగా, సమగ్ర సమాచారం---

రంగుల్లో విటమిన్లు
రంగుల ఆహారము చూసేందుకు అందముగా ఉండడమేకాక ఎన్నో విటమిన్లు కలిగి ఉండి ఆరోగ్యాన్నిస్తుంది. ఏయే రంగుల ఆహారములో ఏ విటమిన్లు ఉంటాయో చూడండి.

తెలుపు : పాలలా మెరిసే వెల్లుల్లి , ఉల్లిపాయలు, పాలు వంటి తెలుపురంగు ఆహారములో 'ట్యూమర్ల'నుంచి మనల్ని కాపాడే 'అల్లిసన్' ఉంటుంది. ఇక పుట్టగొడుగుల్లో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు , కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న 'ప్లావయినాడ్స్' ఉన్నాయి .

ఎరుపు,పర్పుల్, పింక్ : ఈ రంగులలో ఉండే ఆహారములో 'యాంథోసియానిన్స్' ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు గాను, రక్తము గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. కాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి.ఉదా: టమాటో(లైకోఫిన్‌), ముదురు పర్పుల్ రంగుగల ద్రాక్ష మొదలగునవి.

పసుపు : ఈ రంగుతో ఉన్న ఆహారము రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరంజ్ రంగులో ఉండే ఆహారములో 'బీటాక్రిప్టాక్సాన్థిన్(beta cryptaxanthin) అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే 'విటమిన్ -సి- ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది,కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది.

ఆకుపచ్చరంగు : ఈ రంగులో ఉన్న ఆహారములో ఐరన్ , కాల్షియం, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను సరిచేస్తుంది. కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాన్సర్ తో పోరాడే లివర్ ఎంజైముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

బ్రౌన్ , ఆరంజ్ : ఈ రంగు ఆహారములో విటమిన్ -ఎ- ఎక్కువగా ఉంటుంది, కంటి జబ్బులు రాకుండా 'బీటాకెరోటీన్లు' కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉండేందుకు దోహదము చేస్తాయి.
కృత్రిమ రంగులపై కుతూహలం వద్దు !

అందాలకు నిలయం ప్రకృతి. అంతా రంగులమయం ఆకులు, పూలు, పక్షులు, కీలకాలు...ఇలా ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ముచ్చటైన రంగులతో మన మనసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆహ్లాదాన్నిద పంచుతోంది. అలాంటి రంగులు ఆధునిక మానవ సమాజంలో ఎంతో ప్రాధాన్యత సంతరిచుకుంది. అయితే ప్రకృతి సహజమైన రంగులు మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంటే నవనాగరికతా ప్రభావంతో మనం కృత్రిమ రంగులతో ఖుషీచేసుకుంటున్నాం. మనకు సహజంగా లభించిన శారీరక రూపానికి మరింత వన్నెదిద్దాలన్న కుతూహలం మనలో ఉండడం తప్పుకాదు. కాని అవే తప్పనిసరి అనుకోవడం తప్పు. సహజసిద్ధమైన రంగులనే వినియోగిస్తే అందానికి తోడు ఆరోగ్యం లభిస్తుంది. అంతేగాని రసాయానాలతో కలగలిసిన ఆర్టిఫిషియల్‌ రంగులను ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఇటువంటి వ్యాపారాన్ని మనమే ప్రోత్సహిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం.

cosmetics-&-skin-Care : రంగులను వినియోగించే ముందు మనం కొంత ఆలోచన చేయాలి. శరీరానికి, ఆరోగ్యానికి హాని కలిగించని అవసరాలనే ఎంచుకోవాలి. అంటే ఆహారం విషయంలో మనం జాగ్రత్తపడాల్సిందే. ఆహారం మన జీవనధారం. ఇంతటి ముఖ్యమైన ఆహారాన్ని సైతం రంగులతో ముంచెత్తడం మరో క్లిష్టపరిణామం. అంగడిలో వండే స్వీట్లు, హాట్లు- పండ్లు, ఫలహారాలు, శీతల పానీయాలు రంగు రంగుల ఆకారాలతో మనలను ఊరిస్తూ ఉంటాయి. అవి తినడానికి ఆరాటపడతాం. అంతటితో సరిపోదు. ఇంటికి తీసుకుని పోయి భార్యాబిడ్డలకు అందిస్తాం. అంటే ఆ రంగులు చేసే అపకారాన్ని మనతోబాటు మన ఆత్మీయులకు చేరవేస్తున్నామన్న మాట. అంగడి వంటే కాదు ఇంటి వంటను సైతం రంగులతో నింపనిదే కొందరికి గొంతు దిగదు. ఇల్లాలు చేసే పిండి వంటలు సైతం రంగుల హంగులకు దూరం కాకపోవడం విడ్డూరమే మరి.
విశేషంగా ఆకట్టుకుంటున్నాయి : అందానికి అవసరమనుకుంటున్న కాస్మాటిక్స్‌ వినియోగం దేశ పరిధిలో వేల కోట్ల రూపాయలకు మించిపోయిందట. కాదా మరి. నఖములు, శిరోజాలు, నుదుట బొట్టు, కంటిరెప్పకు, కనుబొమ్మలకు, ముఖము, పెదిమలు నఖశిఖ పర్యంతం కృత్రిమరంగులతో నింపేస్తున్నాం. బట్టల రంగుల గురించి చెప్పేదేముంది. కట్టే బట్ట, నెత్తిన జుట్టు మనలను నిద్రపోనీయవు.

నిజమే మరి. మగవారికైనా మగువలకైనా ఈ రెండింటిపట్ల ఉండే శ్రద్ధ మరి దేని మీదా ఉండదంటారు. అంతేనా మన శరీర ఛాయ, మన పర్సనాలిటీకి తగిన రంగులు ఎంచుకోవడంలోనూ మనం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాం. రంగులపై మనకుగల కాంక్షను మన బలహీనతగా భావించిన ఉత్పత్తిదార్లు రంగు రంగుల ఉత్పత్తులు సరికొత్త పేర్లతో ప్రవేశపెట్టి మనలను ఆకర్షిస్తూనే ఉన్నారు. పౌడర్లు, బ్యూటీ క్రీములు, నెయిల్‌ పాలిష్‌లు, స్టిక్కర్లు, షాంపూలు, హైర్‌డైలు బ్యూటీపార్లర్లు వినియోగదార్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం బ్యూటీ పార్లర్ల వ్యాపారం రాష్ట్ర పరిధిలో 500 కోట్లను దాటిందంటున్నారు. ఆర్థిక నిపుణులు. అంటే రంగుల చట్రంలో మనమెంతగా ఇరుక్కుపోయామో తెలుసు కోవచ్చు.

లాభంకంటే నష్టమే ఎక్కువ : మనం తినే అన్నం తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నామేగాని అది మన ఆరోగ్యాన్ని ఏ మేరకు నష్టం కల్గిస్తుందో వైద్యులు ఎంతగా చెప్పినా మన బుర్రకెక్కడం లేదు. ఇక మనం తినే మందుల మాటకొస్తే నకిలీ మందులు 40 శాతానికి చేరాయంటున్నారు పరిశీలకులు. అసలే నకిలీ ఆపైన అనుమతించని రంగులతో చేసే టాబ్లెట్సు, క్యాప్స్యూల్స్‌, టానిక్స్‌ వినియోగిస్తే మనపని అంతేమరి. సరే అన్నీ, అంతా రంగులమయమా అంటే అలా అనుకోవడమూ సరికాదు. మన దేహానికి హాని కలిగించే రంగులకు దూరంకావాలి. అంటే సౌందర్య సాధనాలు, ఆహార పదార్థాలు అన్నమాట. తక్కిన గృహాలంకణలు అంటే ముగ్గులు, ఇంటికి వేసే రంగులు, రంగు టివి, రంగుల సినిమా, ధరించే వస్త్రాలు మొదలైనవి వినియోగించినా పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. ఏదిఏమైనా కృత్రిమ రంగుల వినియోగంతో మనం పొందే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు వైద్యులు. ఆహార రూపంలో లోనికి పంపే రంగులతో జీర్ణాకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువట. గ్యాస్ట్రోఐటిస్ , అజీరం, ఆకలి మందం, మలబద్ధకం వంటి రుగ్మతలు తలెత్తే అవకాశముంటుంది.

స్పష్టమైన విధానం అనుసరించాలి : శరీర ఉపరితలంపై వినియోగించే రంగులతో దురదలు, మచ్చలు వంటి చర్మవ్యాధులు, చర్మం పొడారిపోవడం, మృదుత్వం తగ్గిపోవడం కద్దు. తలపై వినియోగించే షాంపూలతో జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం అనుభవమే. కనుక రంగుల విషయంలో మనం స్పష్టమైన విధానం అనుసరించాలి. కృత్రిమ రంగులకు దూరంగా ఉండాలి. ప్రభుత్వం అనుమతించిన రంగులతో నష్టం లేదు గాని అందం కోసం రంగులను ఆహ్వానిస్తున్నా, ఇతరులను అనుకరిస్తున్నా ఆర్థికంగానే కాదు ఆరోగ్యాన్ని సైతం నష్టపోవడం తగని పని. మన బలహీనతలే ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు ఆటవిడుపు. తమ ఉత్పత్తి పేరు చెప్పి అసత్యాలను ఆశువుగా చెప్పించి మనలను రంగుల వలలో బంధిస్తూనే వుంటారు. అందుకే ప్రకృతి సహజమైన రంగులను ఇష్టపడదాం. ప్రభుత్వం అనుమతించిన రంగులనే వినియోగిద్దాం. అవైనా ఆహారానికి, శరీరానికి మినహాయించి.

ప్రతిఒక్కరూ కృషిచేయాలి : ‘రసాయన సంబంధిత రంగులను వాడడం తప్పనితెలిసినా చాలా మంది వినియోగిస్తూనే ఉన్నారు. అందుకు గల కారణాలను కాసేపు పక్కన పెడితే, వాటినిప్రోత్సహించడం వల్ల ఎంతటి అనర్థం వాటిల్లుతుందో ఒక్కసారి అలోచించాల్సిన అవసరం ఎంతోఉంది. రసాయనాల మిశ్రమాల కర్మాగారాల నుంచి వచ్చిపడే వ్యర్థాల కారణంగా మన పట్టణాలు, గ్రామాలు మాత్రం క్రమంగా దుర్గంధభరితంగా మారిపోతున్నాయి. ఈ కారణంగానే కలరా, హెపటైటిస్‌, ప్లేగు లాంటివి విజృంభిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి కృత్రిమ రసాయన మిశ్రమ రంగులను దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని నా అభిప్రాయం.
============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

అధిక బరువు వాస్తవాలు అలవాట్లు ,అధిక బరువు, ఊబకాయం, ఒబెసిటి, స్థూలకాయం, Over weight and Diet habits



బరువు తగ్గితే ఆరోగ్యం


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది.

మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

వ్యాధుల దాడి
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

బరువెందుకు పెరుగుతారు?
ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు.
*
కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు.
*
స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్‌ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి.

మూడు రకాలు
ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును మూడు రకాలుగా విభజించారు.
1. సామాన్య బరువు
2. అధిక బరువు
3. వూబకాయం.
ఎత్తు బరువుల నిష్పత్తి (బాడీ మాస్‌ ఇండెక్స్‌-బీఎంఐ) ప్రకారం దీనిని గణించొచ్చు. బీఎంఐ 20-25 ఉంటే సాధారణ బరువుతో ఉన్నట్టు. 25-30 ఉంటే అధికబరువుగానూ 30-35 ఉంటే వూబకాయంగానూ పరిగణిస్తారు.

వ్యాధిగ్రస్థ వూబకాయం: బీఎంఐ 40కి పైగా ఉంటే వ్యాధిగ్రస్థ వూబకాయం (మార్బిడ్‌ ఒబేసిటీ)లోకి అడుగిడినట్టే. ఈ దశలో నడవటమే కష్టమవుతుంది. ఏమాత్రం వ్యాయామం చేయలేరు. కష్టపడి వ్యాయామం చేసేందుకు ప్రయత్నించినా, తిండి తగ్గించినా కూడా బరువు తగ్గటమన్నది మాత్రం దుర్లభంగా తయారవుతుంది.

తగ్గే మార్గాలు
వ్యాయామం:
సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించింది లేదు. దీంతో శరీరాకృతిని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. తలనొప్పి, నడుంనొప్పి, ఆందోళన వంటి సమస్యలూ తగ్గిపోతాయి. వయసు పైబడుతున్నా వ్యాయామాన్ని మానరాదు. వయసుకు తగ్గ వ్యాయామాలను ఎంచుకోవాలి.

ఆహారం:
వ్యాయామం చేయటంతో పాటు జీవన విధానాన్ని మార్చుకోవటమూ అవసరమే. ఇందులో ఆహార నియమాలు, మితం పాటించటం ముఖ్యమైనవి. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించి సమతులాహారం తీసుకోవటంపై దృష్టి పెట్టాలి.

ధూమానికి దూరం:
అప్పుడుప్పుడు సిగరెట్లు, బీడీలు కాల్చితే అంతగా ముప్పు ఉండదని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వీటిల్లోని నికోటిన్‌ గుండె, శ్వాసకోశం, ఇతర కండరాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏమాత్రం పొగ తాగినా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. పొగ తాగటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు పడిపోయి రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ పొగ అలవాటుంటే వ్యాయామానికి అరగంట ముందూ తర్వాతా తాగకుండా ఉండటం మంచిది.

* ఆరోగ్యకరమైన జీవనశైలిని చిన్నప్పట్నుంచి పాటిస్తుంటే స్థూలకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

బేరియాట్రిక్‌ సర్జరీ
వూబకాయం ప్రమాదకర స్థాయికి (మార్బిడ్‌ ఒబేసిటీ) చేరినవారు బరువు తగ్గాలంటే ‘బేరియాట్రిక్‌ సర్జరీ’ సమర్థ మార్గం. ఆహారాన్ని తగ్గించి వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గనివారు, అధిక బరువు మూలంగా దైనందిన కార్యక్రమాలు చేయలేకపోతున్న వారికీ ఈ సర్జరీ మేలు చేస్తుంది. దీని ద్వారా తీసుకునే ఆహార పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో వివిధ రకాలున్నాయి. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగుల మొదటి భాగాల్లో జీర్ణమవుతుంది. అనంతరం చిన్నపేగుల గోడల ద్వారా పోషకాలు రక్తంలో కలుస్తాయి. మిగిలిన వ్యర్థాలు పెద్దపేగు ద్వారా బయటకు వెళ్తాయి. బేరియాట్రిక్‌ సర్జరీలో జీర్ణాశయంలో కొంతభాగాన్ని బాండ్‌తో బిగిస్తారు. దీనిని ‘గ్యాస్ట్రిక్‌ బ్యాండింగ్‌’ అంటారు. దీంతో జీర్ణాశయం సైజు తగ్గి ఆహారం తీసుకోవటం తగ్గిపోతుంది. ఇక చిన్నపేగుల బైపాస్‌ సర్జరీ ప్రక్రియలో పేగుల పొడవును తగ్గిస్తారు. దీని వల్ల ఆకలి తగ్గి క్రమంగా బరువు తగ్గుతారు.

* బేరియాట్రిక్‌ సర్జరీలో పొట్ట సైజును తగ్గించినంత మాత్రాన ఆకలి, తినాలనే కోరిక ఎలా తగ్గుతుందని చాలామంది అనుమానిస్తుంటారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో జీర్ణాశయానికి తగినట్టుగానే హార్మోన్ల ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. దీంతో ఎక్కువగా తినాలనే కోరిక కలగదు. వీటిని చేయించుకున్నవారిలో కొద్దిపాటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదురవ్వొచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ వీటిని నివారించుకోవచ్చు.

ఇదీ బీఎంఐ.. ఎత్తు-బరువుల నిష్పత్తి
* బరువును కేజీల్లో ఎంతుందో చూసుకోవాలి.
* అలాగే ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి.
* తర్వాత ఎత్తు సంఖ్యను తిరిగి అదే సంఖ్యతో గుణించి.. ఆ వచ్చిన సంఖ్యతో బరువును భాగించాలి.
* ఉదాహరణకు మీ బరువు 68 కేజీలు, ఎత్తు 1.6 మీటర్లు ఉందనుకోండి. అప్పుడు ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) 68/1.6X1.6 = 26 అవుతుంది.

నడుము చుట్టుకొలత
* స్త్రీలు 80 సెం.మీ. (31.6 అంగుళాలు), పురుషులు 90 సెం.మీ. (35.6 అంగుళాలు) మించి నడుం కొలత పెరగకుండా చూసుకోవాలి.
* బీఎంఐ తక్కువగా ఉండి, ఒక్క నడుము చుట్టుకొలత ఎక్కువున్నా వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని మరవరాదు.

(26 అక్టోబర్ – ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం)--డా|| కె.ఎస్‌.లక్ష్మి--ఒబేసిటీ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌--హైదరాబాద్‌

అధిక బరువు... అలవాట్ల వాస్తవాలివి ->...
రోజు వారి ఆహారంలో ఏం తినాలి.. ఏం తినకూడదు. కార్బోహైడ్రేట్లు మంచివా.. చెడ్డవా? పాలు, పాలపదార్థాల గురించి కొంతమంది మంచివంటే మరికొందరు బరువు పెంచుతాయంటారు... ఏది నిజం తెలుసుకోవాలంటే పోషకాహార నిపుణులు చెబుతున్న వాస్తవాలు తెలుసుకోవాల్సిందే!

అవాస్తవం: కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్‌ నిరోధించి.. బరువు పెంచుతాయి
వాస్తవం: బరువు పెరగడం అనేది ఫలానా పదార్థం వల్ల ఉంటుంది అని చెప్పలేం. అధిక కెలొరీలు స్వీకరించడం, అవి ఖర్చయ్యేలా వ్యాయామాలు చెయ్యకపోవడం వల్లే సాధారణంగా బరువు పెరుగుతారు. అలాగని బరువు పెరుగుతాం అన్న అభిప్రాయంతో కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం మంచిది కాదు. దానివల్ల మన ఆహారంలో కాల్షియం, పీచు పదార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. దాంతో ఆరోగ్యాన్నందించే ఫైటోకెమికల్స్‌ తగ్గుతాయి. బదులుగా అన్ని పోషకాలు అందించడానికి సప్లిమెంట్లను తీసుకొంటున్నాం కదా అనొచ్చు. కానీ అవి పోషకాల అందించే శక్తికి ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు అంటారు పోషకాహార నిపుణులు. కార్బోహైడ్రేట్లను తగు మోతాదులో తీసుకోవడం తప్పనిసరి.

అవాస్తవం: సాయంత్రం ఏడింటికే భోజనం కానిచ్చేయాలి.
వాస్తవం: సాయంత్రం ఎప్పుడు తిన్నా నిద్రించడానికి మూడు గంటలు ముందుగా భోజనం చేయాలి. ఒకవేళ మీ పనివేళలు ఇందుకు సహకరించకపోతే నూనెలు అధికంగా ఉన్నవాటిని నియంత్రించుకోవాలి. అవి కూడా ఆలస్యంగా తినడం శ్రేయస్కరం కాదు. తిన్న వెంటనే నిదురించడం ఎంత మాత్రం మంచిది కాదు. బరువు ఎక్కువయ్యే అవకాశము చాలా ఎక్కువ . తిన్నది జీర్ణం అయిన తర్వాతే నిద్రకు ఉపక్రమించండి.

అవాస్తవం: పాలు, పాల ఉత్పత్తులు అధిక బరువుకు కారణం.
వాస్తవం: పాలు సంపూర్ణ పోషకాహారం. ఇందులో సుమారు 14 రకాల ప్రధాన పోషకాలుంటాయి. ముఖ్యంగా మాంసకృత్తులు.. కాల్షియం ఉంటాయి. 'పాల నుంచి అందే కాల్షియం వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి అందే కాల్షియం కంటే త్వరగా శరీరానికి అందుతుంది. దీనిలో లినోలిక్‌ ఆమ్లం... కొవ్వును కరిగించడానికి ఉపకరిస్తుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

అవాస్తవం: ప్రొటీన్లను.. కార్బోహైడ్రేట్లను కలిపి స్వీకరించకూడదు. లేదా రెండు రకాల ప్రొటీన్లను ఒకేసారి తీసుకోకూడదు!
వాస్తవం: ఒకే రకమైన ఆహారాన్ని తినడానికి శరీరం సహకరించదు. దాంతో తక్కువ తింటాం. కానీ దీని వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందవు. అయితే దీని ఫలితాలు ఒక్కసారి కనిపించకపోయినా దీర్ఘకాలంలో అనేక వ్యాధులు వేధిస్తాయి. అందుకే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే పొట్టుతీయని గోధుమలతో చేసిన రొట్టెలు, చిక్కుడి జాతి గింజలు, పప్పులు, గింజలు, మాంసపు ఉత్పత్తులు తినాలి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువు తగ్గడానికి అన్ని తినాలి.. కానీ ఆ కెలొరీలను కరిగించడానికి తగిన వ్యాయామం కూడా అవసరమే అని గుర్తించుకోవాలి.

  • [Obesity+belly.jpg]

---------పాలు తాగితే బరువు తగ్గుతా0 :
పాలు తాగితే బలం వస్తుందని తెలుసు కానీ.. బరువు తగ్గుతామని తెల్సా...? అవును అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారు రెండేళ్ల పాటు పాలు తాగిన వారిపై జరిపిన పరిశోధనలో ఈ నిజాలు వెల్లడించారు.

ఇజ్రాయిల్‌లోని బెన్-గురియాన్ కళాశాలకు చెందిన డానిత్ షహార్ నేతృత్వంలో నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగిన వారు ఆరు నెలల వ్యవధిలో అధిక మోతాదులో డి-విటమిన్‌ను పొందగలిగినట్లు గుర్తించారు.

ఈ పరిశోధనలో భాగంగా 40 నుంచి 65 ఏళ్ల వయస్సు గల 300లకు పైగా స్త్రీ, పురుషులపై రండేళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి రోజు పాలు తాగే వారు, పాలు తాగని వారితో పోలిస్తే సగటున ఆరు కిలోల బరువు తగ్గినట్లు వారు తెలిపారు.
పాల పదార్థాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు అధిక కాల్షియం ఉండే డైరీ పదార్థాలను తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత సగటున ఆరు కిలోల బరువు తగ్గగా.. తక్కువ కాల్షియం ఉండే డైరీ పదార్థాలను తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత సగటున 3.5 కిలో బరువు తగ్గినట్లు వారు గుర్తించారు.

సాధారణంగా రోజుకు రెండు గ్లాసుల పాలను తీసుకోవడం వల్ల శరీరానికి 583 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. కాల్షియం వల్ల శరీరానికి విటమిన్-డి అందుతుంది. అంతేకాకుండా శరీరంలో విటమిన్-డి స్థాయి స్వతంత్రంగా బరువు తగ్గడానికి ఉపయయోగపడుతుంది.

పాలు, పాల ఉత్పత్తులు విటమిన్-డిను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తమ పరిశోధనలో వెల్లడైందని వారు తెలిపారు. సాధారణంగా ఒక రోజులో శరీరానికి 400 అంతర్జాతీయ యూనిట్స్(ఐయూ) విటమిన్-డి అవసరం అవుతుంది. అంటే దాదాపు నాలుగు గ్లాసుల "లో-ఫ్యాట్ మిల్క్" అన్నమాట.

కాబట్టి బరువు తగ్గడానికి బరువైన పనులు(ఎక్సర్‌ సైజులు)చేయడం మాని, ఎంచక్కా రెండు గ్లాసులు పాలు తాగితే చాలని వారు సూచిస్తున్నారు.

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. 'అలాంటివారు ఈ ఎనిమిది సూత్రాలూ పాటించండి, శ్రమలేకుండానే బరువు తగ్గిపోతారు' అంటున్నారు బ్రిటిష్‌ పోషకాహార నిపుణులు. (source : Dr. Ramakanth - Nutritionist , Vizag)

  1. * బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒకరోజు అన్నిపూటలూ భోజనానికి బదులుగా కూరగాయలూ ఆకుకూరల సలాడ్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఆ పోషకాలూ విటమిన్లతో చర్మానికి నిగారింపూ పెరుగుతుంది.
  2. * తగిన చోటు, సమయం చూసుకొని కూర్చొనే భోంచేయాలి. దాంతో ఆహారాన్ని బాగా నములుతారు. ఫలితంగా త్వరగా జీర్ణమవుతుంది.
  3. * సాధ్యమైనంత చిన్నసైజు ప్లేటులో భోంచేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు.
  4. * నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేయడం మంచిది. ఆలస్యంగా తినడంవల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది.
  5. * రోజూ పాల ఉత్పత్తులు ఎంతోకొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంతమేరకు తగ్గించగలదు.
  6. * వ్యాయామం చేసిన తర్వాత 30-60 నిమిషాల లోపు భోంచేయడం మేలు. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినపుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
  7. * భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని ఓ పరిశోధన.
  8. * వారంలో మూడు రోజులు గుడ్లు, ఒకపూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా.. అవగాహనాలేమితో చేసే పొరబాట్లతో మరింత బరువు పెరుగుతాం. వాస్తవాలు తెలుసుకుని సరైన నియమాలు పాటించగలగాలి.

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం.

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు.

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.


బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వేళపట్టున భోంచేయాలి. ప్రతి రెండుగంటలకోసారి కొద్దికొద్దిగా తినాలి. వేళపట్టున నిద్రపోవడం వల్ల కూడా స్థూలకాయం బాధించదని ఓ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి రాత్రిళ్లు త్వరగా భోంచేసి రెండు గంటల తరవాత నిద్రపోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగా తినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది.

అధిక బరువు తెలివికి చేటు!


వూబకాయంతో వచ్చే రకరకాల చిక్కుల గురించి వింటూనే ఉన్నాం. గురక నుంచి గుండె జబ్బుల వరకూ దీనితో ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవే కాదు... ఊబకాయం వల్ల పిల్లల్లో విషయ గ్రహణ సామర్థ్యం కూడా దెబ్బతింటున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా అధిక బరువు గల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో ఈ తేడా స్పష్టంగా కనబడుతున్నట్టు వీరు గమనించటం విశేషం. పిల్లల బరువు, నిద్ర సమస్యలు, తేలివి తేటలన్నీ ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధికబరువు గల పిల్లలు తగినంత నిద్రకు నోచుకోవటం లేదని.. ఇది తరగతిలో పాఠాలను నేర్చుకోవటంలో ఇబ్బందులకు కారణమవుతోందని తేలటం విశేషం. చికాగో ప్రికర్‌ స్కూల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కరెన్‌ స్ప్య్రూట్‌ ఇటీవల ఒక అధ్యయనం చేశారు. సగటున 8 సంవత్సరాల విద్యార్థులను ఎంచుకొని వారికి పాఠాలను నేర్చుకోవటం, జ్ఞాపకశక్తి, ప్రణాళికా రచన, సమస్యలను పరిష్కరించటం, ఏకాగ్రత వంటి తెలివి తేటలకు సంబంధించిన పరీక్షలు పెట్టారు. అలాగే రాత్రిపూట వాళ్లు నిద్రపోయే విధానాన్నీ పరీక్షించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
* నిద్ర సరిగా పట్టని పిల్లలకు ఊబకాయం ముప్పు పెరగటమే కాదు తెలివి తేటల పరీక్షలో తక్కువ మార్కులు కూడా వచ్చాయి.
* వూబకాయ పిల్లల్లో నిద్ర సంబంధ శ్వాస సమస్యలు, విషయ గ్రహణ సామర్ధ్య లేమి వంటి ఇబ్బందులు పొంచి ఉంటున్నాయి.
* ఇక పాఠాలు నేర్చుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారిలో ఊబకాయం, నిద్ర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చూస్తే- అధిక బరువు పిల్లల్లో నిద్ర సంబంధ శ్వాస సమస్యల వంటివాటిని నిర్లక్ష్యం చేయరాదని కరెన్‌ సూచిస్తున్నారు. తరగతిలో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న పిల్లల్లో తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అంశాల్లో నిద్ర కూడా ఒకటని నిపుణుల అభిప్రాయం. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరముందని భావిస్తున్నారు.

వూబకాయంతో చిగుళ్ల సమస్య
వూబకాయులు తరచూ చిగుళ్ల సమస్యను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అధిక కొవ్వు, స్థూలకాయం కారణంగా పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం ఇప్పటికే తెలిసిందే. వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, నిద్ర రుగ్మతలు, ఎముకల బలహీనత వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. స్థూలకాయులు బ్యాక్టీరియా బారిన ఎక్కువగా పడుతుంటారనీ, ఫలితంగా చిగుళ్ల వ్యాధులు వస్తాయని బోస్టన్‌ యూనివర్సిటీలో చేపట్టిన తాజా అధ్యయనంలో గుర్తించారు.ఇటీవల చేపట్టిన అధ్యయనంలో.. ఊబకాయుల నోటిలో జింజివైటిస్‌ సమస్య తీవ్రంగా ఉంటుందనీ, వారిలో దంతాల ఎముకలు బాగా దెబ్బతింటాయని, ఇన్‌ఫెక్షన్‌ కూడా ఎక్కువేనని వెల్లడైంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే రసాయనాలు కూడా వూబకాయుల్లో తక్కువేనని గుర్తించారు.

Half an hour for health,ఆరోగ్యానికో అరగంట

సన్నగా నాజూగ్గా ఉన్నవారిని చూసి, తమ శరీరతత్వంతో పోల్చి చూసుకుని బాధపడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దానికి బదులు వారు పాటిస్తున్న ఆరోగ్య నియమాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. భోజనం మానేస్తే బరువు తగ్గొచ్చు అనుకోవడం, బరువులెత్తే వ్యాయామాలు చేయడం వల్ల సన్నబడతాం అన్నది అపోహ మాత్రమే. తగినంత ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే ఎక్కువ కెలొరీలు ఉండే జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పోషకాలూ, పీచూ, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. నిర్ణీత సమయానికి భోంచేయడం, వేళకు పడుకోవడంతో పాటూ నడకా, పరుగూ, తోటపనీ వంటి వాటికి కొంత సమయం కేటాయించాలి. అది (సమయం)కనీసం అరగంట ఉంటే ఫలితం ఉంటుంది. మానసిక ఆందోళన కూడా అధిక బరువుకి కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత తీరిక లేకుండా ఉన్నా కనీసం కొంత సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకోండి. ఇది కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. బరువు తగ్గే దిశలో మీకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 26, 2010

యోనిశూల ,Vulvo Dynia



పదహారేళ్ళ వయసు నుంది నలభయేళ్ళ వయసు గల ఆడవారిలో అపుడప్పుడు యోని భాగం లో నొప్పి అనిపించడం , ఎండినత్లు అనిపించడము మామూలే . . . కాని ఈ నొప్పి తరచు గా వస్తూంటే దీనిని " యోనిశూల " (Vulvo Dynia ) అంటాము . స్త్రీలు ఈ భాదను ఎవరితోనూ చెప్పుకోని కారణం గా చాలా మంది వైద్యులకు దీని విషయాలు అంతగా తెలీవు . ఇఫ్ఫుడిప్పుడే ఆధునిక మహిళ లు భాద నివారణకోసం డాక్టర్ సలహా తీసుకుంటున్నారు .

యోనిశూల అంటే యోని దగ్గర ఏకారణం లేకుండా నొప్పిగా ఉండడము . ఇది రెండు రకాలు గా ఉంటుంది . 1.యోని చుట్టూ నొఫ్ఫి ఉండటం , 2. సరిగా యోని ద్వారం గోడలు దగ్గర నొప్పిగా ఉండడము .
కొన్ని కారణాలు :
  • యోని ప్రదేశము లో నరాల ఒత్తిడి ఉండడమuు
  • జననేంద్రియాల లోపము ,
  • యోని కండరాల బలహీనత
  • యోని చుట్టు కురుపులు గాని , పొక్కులు గాని ఉండడము ,
  • హార్మోనుల తేడాలు ,
  • వంశపారంపర్యము గా వచ్చుట ,
  • అడ్డదిడ్డము గా సంభోగము చేసినపుడు ,
  • ఎక్కువగా యాంటిబయోటిక్ మందులు వాడడము వల్ల ,
నలుగురిలో ఉన్నప్పుడు , భర్తతో ఉన్నప్పుడు ఈ భాద ఇబ్బందిగా ఉంటుంది . యోనిశూల సంసారజీవితం , సామాజిక జీవితం , వ్యాయామము చేసేవారి పై గొప్ప ప్రభావము చూపుతుంది . ఇది ప్రమాధకరమైన జబ్బు కాదు ... ఇబ్బంది పెట్టే ఆరోగ్యసమస్య . మానసిక సమస్యా మారె ప్రమాదము ఉంది .

జాగ్రత్తలు :
  • తెల్ల్ని మెత్తని లోదుస్తులే వాడాలి ,
  • ప్యాడ్స్ మెత్తటివి వాడితే రాపిడివలన నొప్పిరాదు ,

ట్రీట్ మెంట్ :
  • నొప్పికి సంభందిత మాత్రలు వాడవచ్చును ,
  • సంభోగ సమయం లో క్రీం రాసుకోవాలి ,
  • వ్యక్తిగత మర్మాంగాల పరిశుబ్రత పాటించాలి .
  • ష్యాంపూ యోని బాగాలలో రాయవద్దు ,
  • క్లోరీన్‌ ఎక్కువగా ఉండే నీరు స్నానానికి వాడకూడదు .
  • సైకిల్ తొక్కడం , గుర్రం స్వారీ చేయడం పనికిరారు ,
  • యోని బాగాలు డ్రై అయిపోకుండా వ్యాజలైన్‌ వాడవచ్చును

  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, August 25, 2010

కండరాల క్రాంప్స్ , లెగ్ క్రాంప్స్ , Leg Cramps , Muscle Cramps



కండరాలలో క్రాంపింగ్ అనేది సాధారణ సమస్య . పిక్క కండరాలు స్క్వీజ్ చేసినట్లు విపరీతమైన భరించరాని నొప్పి ఉంటుంది .
కారణాలు :
  • కండరాన్ని ఒకేపొజిషం లో తరచూ ఉంచడము వలన ,
  • రక్తము లో ఖనిజ లవణాలు తక్కువగా ఉనా ,
  • డయూరెటిక్స్ వంటి మందులు వాడుతున్నా ,
  • ఎక్కువ ఎండకు దొరికిపోయి చెమట పట్టినా ... లవణాలు కోల్ఫోవడం వలన ,
  • కండరాలను ఎక్కువ స్టెస్ కి గురిచేయడం వలన ,
  • వేరికోజ్ వెయిన్‌సు , సయాటికా .. ఉన్నా ,
  • హీట్‌ క్రాంప్స్‌ : ఎండ వేడిమి వల్ల శరీరంలోని సోడియం క్లోరైడ్‌ (ఉప్పు) వంటి లవణాలు కోల్పోవడం వల్ల కండరాలు పట్టేసినట్లుగా అవుతాయి. ఇలా కండరాలు పట్టేయడాన్ని హీట్‌ క్రాంప్స్‌ అంటారు. ఎండవేడిమి వల్ల కలిగే ప్రథమ సమస్యగా దీనిని గుర్తించవచ్చు.
చికిత్స :
  • క్రాంప్స్ వస్తే విశ్రాంతి తీసుకోవాలి .
  • నొప్పిగా ఉన్న కాలికి రెస్ట్ ఇవ్వాలి ,
  • ఐస్ అప్లై చేస్తె నొప్పి తగ్గుతుంది .
  • క్రాంప్స్ ఉన్న ప్రదేశములో మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది .

  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, August 16, 2010

Stress in Day to Day life , ఒత్తిడి వల్ల దుష్పరిణామాలు రోజువారిజీవితంలో



ఒత్తిడి నేటి నవసమాజము లో ప్రతి ఒక్కరినీ బాధించే సమస్య అయ్యింది . విద్యాలయాలలో విద్యార్ధులు , ఆఫీషుల్లో బృందం నాయకుడు , ఇంట్లో ఇంటి యజమాని , రాజకీయల్లో పార్టీనాయకుడు , హాస్పిటల్స్ లో సంబంధిత డాక్టరు ఇలా ఎంతోమంది ప్రతిరోజూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు .

మనిషి సంఘజీవి. తన చుట్టూ వున్న వారిని అనుకరిస్తుంటాడు, తనకంటే మెరుగనుకున్న వాటిని అలవర్చుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో శారీరక , మానషిక వత్తిడులకు లోనవుతూ ఉండాడు . ఒత్తిడిని భౌతికశాస్త్రము నుండి అరువు తెచ్చుకున్నాము ... ఒత్తిడి అంటే " ప్రెజర్ (pressure)" అన్నమాట . ప్రతిరోజూ మనము సంతోషముగా ఉండదల్చుకున్నామో , విషాదముగా ఉండదల్చుకున్నామో , ఒత్తిడితో ఉండదల్చుకున్నామో , విశ్రాంతిగా ఉండదల్చుకున్నామో మనమే ఎంపికచేసుకోవచ్చును . తాను చేసేపనిని ఎంజాయ్ చేయగలిగినంతకాలము ఒక వ్యక్తి ఎన్ని గంటలైనా పనిచేయవచ్చు ... లేదంటే అది వత్తిడికి దారి తీస్తుంది .

ప్రతి సంవత్సరము కూడా ఒత్తిడికి సంబంధించిన ఆరోగ్యసమస్యల వల్ల అనేకమంది ఆఫీసులకు సెలవులు పెట్టాల్సివస్తోంది . సరిగా పనిచేయలేక పని గంటలు కుంటుబడుతున్నాయి . ఈ వత్తిడికి సంబంధించినంతవరకు రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి . టైప్ ' ఎ ' వ్యక్తులు కోపము గా దురుసుగా ఉండేవారు . టైప్ ' బి ' తమ భావాలను పైకి వెల్లడించకుండా దాచుకొని తక్కువ మాట్లాడే వారు . ఈ రెండు రకాల వ్యక్తిత్వాల వల్ల " అడ్రినాలిన్‌ , నార్ అడ్రినాలిన్‌ , కార్టిసాల్ " హార్మోన్లు లెవల్స్ పెరుగుతాయి . దీనివల్ల గుండె కొట్టుకునే రీతి , పల్స్ రేటు , రక్తపోటు , ర్క్తము లో షుగర్ , చెడ్డ కొలెస్టరాల్ పెరుగుతాయి . . తద్వారా అనేక శరీరక రుగ్మతలు తలలెత్తుతాయి .
  • ఇలాంటివారి కి ఏ పని యైనా ఒత్తిడిగా అనిపిస్తుంది . అధికము గా తిండి తింటారు . ఎక్షరసైజులు చేయకుండా , ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండే జీవిత విధానము గడుపుతుంటారు .
  • ఊబకాయము తయారవడం , పొగ త్రాగుతుంటారు . . . ఇటువంటి జీవనము వలం నరాల పనితీరు అధికము గా స్పందించడం వల్ల -- డిప్రషన్‌ , డయబిటీస్ , జుట్టురాలిపోవడం , గుండె జబ్బులు , థైరాయిడ్ జబ్బులు , యాంగ్జైటీ డిజార్డర్ , దాంపత్యజీవనము లో మార్పులు , గాస్ట్రిక్ ఉలసర్స్ వంటివి వస్తాయి .

* గతకొద్ది సంవత్సరాలుగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ మానసిక ఒత్తిడి కారణంగా కొన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకోవడం అందరూ గమనిస్తున్న విషయమే! విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణాలు అనేకం. ముఖ్యమైనవిగా కింది వాటిని చెప్పుకోవచ్చు.

(1) ఆత్మవిశ్వాసం లోపించడం, (2) చదువుపట్ల లేదా సబ్జెక్టు పట్ల అనాసక్తత, (3) పెద్దల ఒత్తిడి, (4) రిలాక్సేషన్‌కు టైమ్‌ లేకపోవడం, (5) ఇష్టం లేని వాతావరణం, (6) పరీక్షల పట్ల భయం, (7) జ్ఞాపకశక్తి మీద అపనమ్మకం.
కారణాలు ఏవైనా మనిషిలో మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు అతడు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అయితే టీనేజ్‌లో ఏర్పడే శారీరక ఇబ్బందులు అధితమించడం పెద్ద కష్టం కాదు. కానీ మానసిక ఇబ్బందులను మాత్రం అధిగమించడం వారి శక్తికి మించిన పనిగా మారుతోంది. దాంతో వారు భావోద్వేగ పరంగా, ప్రవర్తనా పరంగా, ఆలోచనా పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

భావోద్వేగ పరంగా : ఆందోళన చెందడం, అనవసరంగా ఆవేశ పడడం, అతిగా భయపడడం, నిరాసక్తతకు లోనుకావడం మొదలైనవి.

ప్రవర్తనా పరంగా : అతిగా లేదా మితంగా తినడం, మాటల తడబాటు, అతివేగంగా వాహనాలు నడపడం, అతిగా నిద్రపోవడం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోవడం మొదలైనవి.

ఆలోచనా పరంగా : మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం మొదలైనవి.
  • మన మీద మనం విశ్వాసం కోల్పోయినప్పుడో లేదా కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నప్పుడో ఆ సమస్యలే అంతవరకు లేని వాటినే ఉన్న వాటిగా మారుస్తాయి. ఉదాహరణకి మీకు జ్ఞాపకశక్తి మీద అపనమ్మకం ఉండి తద్వారా టెన్షన్‌పడడం మొదలుపెడితే, ఆ టెన్షన్‌ కారణంగా ఏకాగ్రత లోపించి నిజంగానే మతిమరుపు మొదలవుతుంది. ఇలా లేని సమస్యల గురించి అతిగా ఆలోచించడం వలన కొత్త సమస్యలను కూడా కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. అలాగని లేని సమస్యల ద్వారానే స్ట్రెస్‌ వస్తుందని చెప్పలేం. మనకు వాస్తవంగా ఉన్న సమస్యలు కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఉదాహరణకు సబ్జెక్ట్స్‌ పట్ల అనాసక్తత, రిలాక్సేషన్‌కు టైమ్‌ లేకుండా చదవాల్సి రావడం - ఈ సమస్యలు నిజమైనవే! కాబట్టి లేని సమస్యల వల్ల గానీ, ఉన్న సమస్యల వల్ల గానీ మానసిక ఒత్తిడి కలిగితే తప్పకుండా మనం నష్టపోతాం. అందుకే మనకు మొదట ఎలాంటి సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుందో గుర్తించాలి.

ఇలాంటి మానసిక ఒత్తిడికి తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే :

1. మానసిక ఒత్తిడికి కారణమేమిటో గుర్తించాలి.

2. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి.

3. సమస్యలు తగ్గించుకోవాలి.

ఇక ఇప్పుడు మీ మానసిక ఒత్తిడి కారణాలు గుర్తించడం ఎలాగో తెలుసుకోండి

1. మీరు అనీజీగా ఫీలవుతున్న సమయాలను, అంశాల జాబితాను రాసుకోండి.

ఉదాహరణకు ఏదైనా పుస్తకం చేతిలోకి తీసుకోగానే ఇబ్బందిగా, అయిష్టంగా కనిపిస్తే ఆ భావాన్ని గుర్తించి నోట్‌ చేసుకోండి. ఆ భావానికి మరేవైనా కారణాలున్నాయేమో కూడా గుర్తించండి. ఉదాహరణకు 'జ్ఞాపకశక్తి' లోపించిదన్న భావన ఆ సబ్జెక్ట్స్‌ మీద అయిష్టతను ఏర్పరచిందేమో, విశ్లేషించుకోండి.

2. మీ మానసిక ఒత్తిడికి కారణాల లిస్ట్‌లో నుండి ఓ నోట్స్‌ తయారు చేసుకోండి. 'నాకు ఫలానా సమయంలో, ఫలానా కారణం, విపరీతంగా/ ఓ మోస్తరు ఒత్తిడి ఏర్పడుతోంది. దాని పర్యవసానంగా నేను చదవలేకపోతున్నాను/ మరచిపోతున్నాను.

3. ఈ నోట్స్‌ ద్వారా మీ స్ట్రెస్‌ గురించి మీకో క్లారిటీ ఏర్పడాలి. దాని ప్రకారం దానిని తొలగించుకుని మానసిక స్థైర్యాన్ని పొందే ప్రయత్నాన్ని చేయండి.

మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండిలా :

1. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని వందల టెక్నిక్స్‌ ఉన్నాయి. కాసేపు వ్యాయామం చేసినా, మెడిటేషన్‌ చేసినా ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునే టెక్నిక్స్‌ ఏవేవి ఉన్నాయో మొదట తెలుసుకోండి. (స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ బుక్స్‌ మీకీ విషయంలో బాగా ఉపయోగపడతాయి)

2. మీ పరిసరాలకు, సమయానుకూలతకు తగిన స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ ఎన్నుకోండి. వాటిని సిన్సియర్‌గా ప్రాక్టీస్‌ చేయండి.

3. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌ అప్లయి చేశాక మీలో వచ్చిన మార్పును గుర్తించండి. ఆ మార్పును ఫీలవుతూ, పాజిటివ్‌ థింకింగ్‌ ద్వారా ముందుకు సాగండి.

సమస్యలను తగ్గించుకోండిలా :

1. సాధారణంగా ఎక్కువ సమస్యలు మనం సృష్టించుకోవడం ద్వారానే ఏర్పడతాయి. మన మానసిక ధోరణిలో మార్పు ఏర్పడినప్పుడు నిజమైన సమస్యలు కూడా సమస్యలుగా అనిపించవు. ఉదాహరణకు 'చదువు పట్ల అనాసక్తత' అనేది మనం సృష్టించుకున్న సమస్యనే. మన మానసిక ధోరణిలో మార్పు ద్వారా దానిని అధిగమించవచ్చు. 'ఈ అనాసక్తతకు కారణమేంటి?..... నేను చదువు పట్ల ఇష్టం పెంచుకుంటాను' అని నిరంతరం మనసుకు సజెషన్స్‌ ఇచ్చుకోవాలి. ఇలా మనం ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతాం.

2. అలాగే కొత్తగా సమస్యలను ఆహ్వానించకుండా, మనసును పాజిటివ్‌గా ఆలోచించేలా మార్చుకోవాలి. ఉదాహరణకు ఒక వాతావరణంలోకి వెళ్ళగానే, 'ఈ పరిసరాలు నాకు సరిపడేలా లేవు. ఈ చోట నేను అడ్జస్ట్‌ కాలేనేమో' అని ముందుగానే అనుకోవడం కాకుండా, ఆ పరిసరాలలోని పాజిటివ్‌ అంశాలను ఆస్వాదిస్తూ ఎంజారు చేసేలా మనసుకు ట్రయినింగ్‌ ఇవ్వాలి. అప్పుడు మరిన్ని సమస్యలను మనం సృష్టించుకోకుండా ఉంటాం.

3. ఇక నిజమైన సమస్యలు వచ్చినా, ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని నిర్ణయించుకోండి. సరయిన భోజనం లేదు. లెక్చరర్స్‌ నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్నేహితులు లేదా క్లాస్‌మేట్స్‌ సమస్యలు సృష్టిస్తున్నారు వంటి వాటిని పట్టించుకోకండి. ఇవేవీ కష్టపెట్టలేవు. నష్టపెట్టలేవు అని ఆత్మవిశ్వాసంతో అనుకోండి. ఇలా మీరు మానసిక ఒత్తిడిని అధిగమిస్తే, మీ శక్తి సామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి.

ఒత్తిడిని దూరం చేయండి ఇలా :
లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో రామ్‌ సిద్ధహస్తుడు. బృందనాయకుడిగా కార్యాలయంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. అందరితోనూ కలుపుగోలుగా ఉండే అతను ప్రస్తుతం సహచరులతో సరిగా మాట్లాడడం లేదు. దీనికంతటికీ కారణం రామ్‌ విపరీతమైన ఒత్తిడికి గురికావడమే. అయితే ఈ ఒత్తిడి సహచరుల పనితీరుతో ఏర్పడిందే కానీ అతడిలో స్వతహాగా ఏ ఒత్తిడి లేదు. ఎంతో ఓర్పుగా ఉంటున్నప్పటికీ సహచరులు ఒత్తిడికి గురవడం వల్ల అతనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సాధారణంగా సహచరుల సాయంతో ఒత్తిడి అధిగమించొచ్చు. కానీ సహచరులే ఇబ్బంది పడుతుంటేబృందనాయకుడి పనిమీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా రామ్‌ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. మీరూ అటువంటి ఇబ్బందులు పడుతున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించి ఆ తరహా ఒత్తిడి మటుమాయం అవుతుంది.

సహచరుల తీరు గమనించండి
సహచరులు ఎలా పనిచేస్తున్నారు అనేదాన్ని పరిశీలించడం ముఖ్యం. లక్ష్యాలు నెరవేర్చడంలో అశ్రద్ధ చూపే వారిని గమనించండి. ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోండి. వ్యక్తిగతజీవితం ప్రభావం వల్లా లేక ఇతరత్రా కారణాలా క్షుణ్నంగా పరిశీలించాలి. ఇలాంటి వారందరికీ ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయించండి. కౌన్సిలింగ్‌ చేయడం ద్వారా వారి దృష్టి లక్ష్యాల మీదకి మరలించొచ్చు. అటువంటి వారికి అవసరమైతే బృందంగా కాకుండా ప్రత్యేకించి ప్రాజెక్టులు అప్పగించండి. సకాలంలో ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్‌ చేయండి. ఏ విధమైన ఒత్తిడి లేకుండా పనిదొంగల్లా వ్యవహరించే వారూ ఉంటారు. వారినీ ఓ కంట కనిపెట్టాల్సిందే.

  • [walking+morning.jpg]
సమస్యలపై దృష్టి పెట్టాలి
ఒత్తిడికి గురయ్యేవారి సమస్యల మీద దృష్టి పెట్టాలి. అంతేకాని వారిని వేరుగా చూడడం తగదు. వేరుగా చూడడం వల్ల తమను దూరం చేస్తున్నారని భావించి సహచరులు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశముంటుంది. సమస్యను భూతద్దంలో చూసే వారు ఉంటారు. ఇలాంటి వారు తరచూ సెలవులు కోరుతుంటారు. ఆ పని భారం బృంద నాయకుడి మీద పడుతుంటుంది. ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఒకసారి వారితో చర్చించడం మంచింది. తగిన పరిష్కార మార్గాలు సూచించండి. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. అప్పుడు తప్పకుండా వృత్తి జీవితం మీద దృష్టి పెడతారు.

తరచూ పర్యవేక్షణ
ఒత్తిడికి గురయ్యే సహచరులను బృంద నాయకుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. వారి ప్రణాళిక తెలుసుకోవాలి. ఏదో ఒక సమయంలో వారితో మాట్లాడాలి. కౌన్సిలింగ్‌ తర్వాత వారిలో వస్తున్న మార్పులు గమనించాలి. దీనివల్ల లక్ష్యాల మీద దృష్టి మరలిందా ఇంకా అలాగే ఉన్నారా అనేది తెలుస్తుంది. ఇంకా ఒత్తిడికి లోనవుతుంటే వైద్య సలహాకు పంపడం శ్రేయస్కరం.

* విరామంలో సహచరులతో సంభాషించాలి.
* కార్యాలయానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత ఆలోచనలు మానుకోవాలి.
* యోగా తరగతులకు వెళ్లడం ద్వారా మానసికంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పని ఒత్తిడి వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. ఎంత సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ దీన్ని తప్పించుకోవడం కష్టసాధ్యమే. ఒక్కోసారి లక్ష్యాలు సాధించడానికి అది ఎన్నో ప్రతిబంధకాలను ఏర్పరస్తుంది కూడా. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెంటిలోనూ ఒత్తిడి సహజం. ఒత్తిడి జయించడమూ ఒక కళే. దీన్ని అధిగమించి లక్ష్యాల మీద దాని ప్రభావం లేకుండా చూసుకోవడమే బృందనాయకుడి విజయసూత్రం.

ఒత్తిడి గురించిన అవాస్తవాలు :
  • ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉంటుంది :
ఇది సరి కాదు . ఒత్తిడి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది . మనిషి మనిషి కీ , మనసు మనసుకీ తేడా ఉన్నట్లే అందరిలోనూ ఒత్తిడి ఒకేలా ఉండదు .
  • ఒత్తిడి అనేది ఎప్పుడూ చెరుపుచేస్తుంది . ఒత్తిడి అసలు లేకపోతే సొంతోషముగా , అరోగ్యముగా ఉండవచ్చును .
ఇదీ నిజం కాదు . ఒత్తిడిని సరిగా మేనేజ్ చేస్తే ఎక్కువ పని చేయగలుగుతాము , సంతోషముగానూ ఉంటాము . ఎటువంటి చెడు జరుగదు .
  • ఒత్తిడి ప్రతీ చోటా ఉంటుంది . . కాబట్టి మనము చేయగలిగేది ఏమీ ఉండదు ..
తప్పు . ఎక్కువగా మనము ఏర్పాటు చేసుకున్న పరిసల పరిస్తుతుల పై అధారపడి ఒత్తిడి వస్తూ ఉంటుంది . ఒత్తిడి ఇంద్రియాలను మరీ ఎక్కువ పనిచేసేలా చేస్తుంది . ఒత్తిడిని మనము అధుపుచెసుకోవచ్చును . ఒత్తిడి అన్నిచోట్లా ఒకేలా ఉండదు .
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Suicidal tendency and prevention Hints , ఆత్మహత్యాయత్నాలు-నివారణ సూచనలు



ఆవేశము తొనే అఘాయిత్యాలు . తొందరపాటుతో ఆత్మహత్యాయత్నాలు . చిన్నపాటి కారణాలకే మనస్తాపాలు . ఇవన్నీమనిషి మానసిక పరిపక్వత , పరిసరప్రభావము , జీవితములో జయాపజయాలు మీద ఆదారపడి జరుగుతూ ఉంటాయి . ఉదా:
  • అడిగిన వెంటనే వేడి వేడిగా బజ్జీలు ఇవ్వలేదని హొటల్ యజమాని ముక్కు వేలి కొరికాడో యువకుడు . ఈ సంఘటనకు ముందుగాని , తర్వాత గాని ఆ యువకుడి ప్రవర్తననో నేరచరిత్ర కనిపించలేదు .
  • ఇంటర్మీడియట్ లో 94 శాతము మార్కులు సాధించి ఇంజినీరింగ్ మొదటి సమ్వత్సరము లో కూడా మంచి విద్యార్ధి అనిపించుకున్న ఒక యువకుడు రెండో ఏట కొన్ని సబ్జెక్టులు తప్పడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు .
  • ప్రభుత్వ డిగ్రీ కళాశలలో చదువుతున్న ఓ విద్యార్ధిని రూ.500/- పోయినందుకు మనస్థాపముతో కళాశాల ఆవరణ లో బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .
  • పట్నానికి చెందిన ఒక బాలిక బాగా చదవడం లేదని తల్లి మందలించడము తో మనస్థాపానికి గురియై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చివరికి నిండు ప్రాణాలు బలి తీసుకుంది .
  • ఏడాది క్రితము గొల్లవీధికి చెందిన బాలుడు పక్కింటి మహిళను ఏదో అన్నాడని గొడవ చేయడం తో ఆత్మహత్య చేసుకున్నాడు . ... ... . ఇలా ఎన్నో లెక్కలలోనికి రానివి .
జీవితం ఎంతో విలువైనది . క్షణికావేశం లో బలవన్మరణానికి పాల్పడుతున్న వీరంతా కావాలనుకున్నప్పుడు మళ్ళీ తం ప్రాణాలను తెచ్చుకోగలరా... కేవలము క్షణికావేశం లో ఏమాత్రం ప్రాధాన్యత లేని చిన్నపాటి విషయాలకే ప్రాణము తీసుకోవాలనే ఆక్రోషాన్ని గుండెలో నింపుకొంటున్న నేటితరము వ్యవహారశైలి పై కొన్ని సూచనలు - >

పట్టణ వాసం లో పనులలో ఒత్తిడి , ఒంటరితనము , ఎడతెగిన బంధాలు , అలవాట్లు , చుట్టూఉన్న పరిస్థితులు ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి . అయితే పల్లె జీవనము లో కూడా మారుతున్న ప్రమాణాలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి . నిత్యం అందరితో సందడిగా ఉండే పల్లెవాతావరణం లో ఆత్మహత్యలకు పాల్పడే క్షణికావేశము యువతలో ఇటీవల కాలములో పెరుగుతుంది . ఓ తొందరపాటు నిర్ణయం నిండు ప్రాణాల్ని బలితీసుకుంటోంది . కన్నవారికి కడుపుకోత మిగుల్చుతోంది .
మారుతున్న కాలం లో పిల్లల పెంపకం లో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు , పరిసరాల ప్రభావము , మీడియా కథనాలు ఆత్మహత్య్లకు ఉత్ప్రేరకాలు గా మారుతున్నాయి . పల్లెలలో కుడా మెల్ల మెల్లగా పాకుతున్న పట్టణ జీవనశైలి , అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానము నకే పరిమితమవుతున్న నేటి యువతరం అనుబంధాలకు , ఆత్మీయతకు , జీవిత ఆస్వాదనకు దూరమవుతున్నారు . దీంతో తనకన్నా తనతోటి సమాజాన్ని , దాని విలువను గుర్తిచలేకపోతున్నారు . చిన్నతనము నుంచి గారాబముగా పెంచడం తో చిన్నపాటి విషయానికి కూడా పెద్ద అవమానం గా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .
ఆత్మహత్యలు - కారణాలు :

మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్యపరిభాషలో పారాసూసైడ్‌ అంటారు. సాధారణ పరిభాషలో సూసైడల్‌ టెండెన్సీ అని వ్యవహరిస్తాము. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్‌ అంటాము.ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధుల విభాగంలో అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అంశాలు.

కారణాలు
మనిషి నిస్సహాయుడు కావడం, భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లడం, మానసిక వత్తిడి, తనకు లభించే మార్గాలను సరిగ్గా ఎంచుకోలేకపోవడం మొదలైన కారణాలు మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయి.

ఒక వ్యాధికి లేదా తీవ్ర మానసిక వత్తిడికి లోనయ్యేవారు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతారు.
సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరమైన సమస్యలు, మానసిక వత్తిళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతాయి.

సాంఘిక సమస్యలలో ప్రధానమైనవి జాతి వివక్ష, అణచివేతకు గురి కావడం ఆర్థిక కారణాల్లో ప్రధానమైనవి తమ స్థాయికి మించిన అప్పులు చేయడం, కనీసావసరాలకు కూడా డబ్బు సరిపోకపోవడం మానసిక కారణాల్లో ప్రధానమైనవి పరీక్షలు, ఎన్నికలు మొదలైన వాటిలో ఓటమి చవి చూడటం, వ్యాపారంలో నష్టపోవడం, ఆత్మీయులు మృతి చెందటం, భరించలేని స్థాయిలో అవమానాలకు గురి కావడం మానసిక వ్యాధులకు సంబంధించి డిప్రెషన్‌, స్కిజోఫ్రీనియా, వ్యక్తిత్వ లోపాలు, మద్యపానం మొదలైనవి ముఖ్య కారణాలు.
డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో 15 నుంచి 20 శాతం వరకూ ఆత్మహత్యలకు పాల్పడుతారు. స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడేవారిలో 10 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న సూచనలు ముందుగానే కనిపిస్తాయి.

ఆత్మహత్యలు చేసుకోవాని భావించే వారు ముందుగానే ఇతరులకు ఆ విషయం తెలియ జేయడం, లేదా ఉత్తరాలు రాసి ఉంచడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం మొదలైన చర్యలకు పాల్పడుతారు. స్కిజోఫ్రీనియా వ్యాధిగ్ర స్తుల్లో ముందుగా ఎలాంటి సూచనలు కనిపించవు. ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడుతారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో కేన్సర్‌, ఎయిడ్స్‌ తదితర ప్రమాదకర వ్యాధులకు గురైన వారు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్ప డుతుంటారు. సాధారణంగా 40 -50 సంవ త్సరాల మధ్య వయస్కుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆత్మహత్యాయత్నాలు స్త్రీలలో ఎక్కువగానూ, ఆత్మహత్యలు పురుషుల్లో ఎక్కువగానూ ఉంటాయి.

ఒక మనిషి ఆత్మహత్య గురించి ప్రస్తావిం చినప్పుడు కాని, ఉత్తరాల ద్వారా ఆ విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

ఆత్మహత్య గురించిన ఆలోచన వ్యక్తపరిచిన వ్యక్తిలో ఆ ఆలోచన ఎంత బలీయంగా ఉందో గమనించి దానినుంచి విరమించుకునేలా చేయాలి. దానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలి.

ఆత్మహత్యల గురించి ఆయా వ్యక్తులతో చర్చించడం వలన వారిని సరైన మార్గంలోకి మళ్లించడానికి వీలు కలుగుతుంది. ఏవైనా వ్యాధుల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారికి ఆ వ్యాధులకు సంబంధించి చికిత్స చేయడం ద్వారా ఆత్మహత్యాయత్నాలను విరమింపచేయవచ్చు.


చిన్నపాటి చిట్కాలు :
  • చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఒక్క క్షణము ఆలోచించండి ..,
  • ఇలాంటి ప్రమాదాలు చాలావరకు క్షణికావేశములోనే జరుగుతుంటాయి అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి .
  • కొద్దిసేపు మౌనము గా ఉండడం ,
  • కొన్ని నిముషాలపాటు అంకెలు లెక్కపెట్టడము ,
  • కడుపునిండా చల్లటి నీరు త్రాగడం ,
  • ఒంటరిగా ఉండ కుండా మీసమస్యను స్నేహితులతోను , తోబుట్టువులతోను , మీకు నచ్చిన వారితో పంచుకోవడం .
  • తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చేసే అకతాయి పనులకు పదే పదే .. అదేపనిగా మంలించడము , పదుగురి మధ్య ఆ విషయాలు చెప్పి అవమానించడం చేయకూడదు .
  • పిల్లలు పూర్తిగా టివి లకో , వీడియో గేములకో పరిమితమై ముభావము గా ఉంటే వారిని కాస్తా కుటుంబ వ్యవహారాల్లో బాధ్యులను చేయండి .
  • పరధ్యానము గా ఉండడము , భోజము పై ఆసక్తి చూపకపోవడం లాంటివి చేస్తుంటే వారిపట్ల జాగ్రత్తలు తీసుకొని సామాజిక పనులలో నిమగ్నమయినట్లు చేయంది .

  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, August 14, 2010

Anthrax , ఆంత్రాక్స్




ఆంత్రాక్స్ ప్రాణాంతక వ్యాధి . పశువుల నుంచి మనుషులకు , మనుషుల నించి పశువులకు సంక్రమించే సాంక్రమిక (Infective) వ్యాధి . దొమ్మావ్యాధి , నెత్తురు రెక్క , నెరడు దొమ్మ వంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తుంటారు . అన్ని రుతువుల్లోను ముఖ్యంగా కరువుకాటకాలు ఏర్పడినప్పుడు , వరదలు , వాతావరణం లో అకస్మిక మార్పులు
సంభవించినపుడు ఆంత్రాక్స్ వ్యాధి ప్రభలే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది .

దక్షిణ పూర్వ ఆసియా ఖండంలో ఆంత్రాక్స్ అతి తక్కువ మందికి సర్వ సాధారణంగా వచ్చే వ్యాధి. ఈ కొద్దిపాటి కేసులతో మనల్ని జాగృత పరచుకోవాలే కాని భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు.

వ్యాధి లక్షణాలు ?
ఆంత్రాక్స్ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి గడ్డితినే జంతువులలో వచ్చే అంటు వ్యాధి. ఇది బాసిల్లస్ ఆంత్రాక్స్ అను స్పోర్స్ ఏర్పరచే బాక్టీరియా వల్ల వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ జంతువుల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు సోకే ప్రమాదం ఉంది.
ఆంత్రాక్స్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది ?
ఆంత్రాక్స్ బాక్టీరియాను జీవాయుధంగా ఉపయోగిస్తున్నారనే నమ్మకమే ఇందుకు కారణం.
ఆంత్రాక్స్ ఎలా వ్యాపిస్తుంది ? ఎవరికి వ్యాపిస్తుంది ?
పశు సంపద ప్రధాన పాత్ర వహించే వ్యవసాయక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువ. పశువుల ద్వారా లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ఆంత్రాక్స్ మనుషులకు సోకుతుంది. చనిపోయిన జంతువులకు సంబంధించిన ముడిసరుకుల కర్మాగారాలలో పనిచేసేవారు విదేశాల నుంచి జంతు సంబంధమైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేవారు ఆంత్రాక్స్ బారినపడే అవకాశాలు ఉన్నాయి.
మనుషులలో ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి చర్మం సంబంధిత, శ్వాసకోశ సంబంధిత మరియు జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ అను మూడు రకాలుగా ఉంటుంది. ఆంత్రాసిస్ స్పోర్స్ మట్టిలో సైతం చాలా ఏళ్ళు మనగలుగుతాయి. ఆంత్రాక్స్ స్పోర్స్ లను పీల్చడం ద్వారా, ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడిన జంతుమాంసాన్ని సరిగ్గా వండకుండా తినడం వల్ల అనగా గాలి , నీటి , మేత - ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

ఆంత్రాక్స్ లక్షణాలేమిటి ?
వ్యాధి సోకిన విధానాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వ్యాధి సోకిన వారం రోజుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడతాయి.
చర్మ సంబంధిత ఆంత్రాక్స్ :
ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉన్ని, చర్మం, వెంట్రుకలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాలలో పని చేసేవారిక చర్మంపై ఉన్న గాయాల ద్వారా వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ భాగంలో ఏధైనా పురుగుకుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది. అది ఒకటి, రెండు రోజుల్లో ఉబికి అల్సర్ గా పరిణమిస్తుంది. మధ్యలో నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది.
ఎలాంటి చికిత్స జరగని సందర్భంలో 20% చర్మ సంబంధిత ఆంత్రాక్స్ కేసులు మరణానికి దారి తీస్తాయి. తగిన చికిత్సతో మరణాన్ని నివారించవచ్చు.
శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ :
గాలిలో ఉన్న ఆంత్రాక్స్ స్పోర్స్ పీల్చడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తొలి దశలో జలుబులా అనిపిస్తుంది. తరువాత శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ ప్రాణాంతకరము.
జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ :
ఆంత్రాక్స్ బాసిల్లస్ తో కలుషితమైన మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల ఇది వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరోచనాలు, గొంతునొప్పి మరియు కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా ఆంత్రాక్స్ బారిన పడ్డ కేసుల్లో 25%నుండి 60% వరకు మరణాలు సంభవిస్తాయి.
ఆంత్రాక్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ?
ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ ఆధార ప్రదేశాలలోను, ప్రజారోగ్య కార్యక్రమాలు సరిగా చేపట్టని దేశాల్లోను మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను కనిపిస్తుంది.
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందా ?
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు.
ఆంత్రాక్స్ ను నియంత్రించడం ఎలా ?
ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే దేశాలలో పశువులకు టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చును మరియు వ్యాధి బారిన పడిన జంతువుల కళేబరాలను కాల్చివేయడం ద్వారా స్పోర్స్ ను నాశనం చేయడం, వాటి మాంసాన్ని తినకుండా ఉండడం, వాటి ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చును.
ఆంత్రాక్స్ కు టీకా ఉందా ?
ఆంత్రాక్స్ కు టీకా ఉంది. కానీ ఈ టీకా వాడకము మనుషుల్లో అంతగా ప్రాచుర్యములో లేదు.
ఆంత్రాక్స్ టీకాను ఎవరు వేయించుకోవాలి ?

* పశువైద్య సిబ్బంది
* ప్రయోగశాలల్లో ఆంత్రాక్స్ బాక్టీరియాతో ప్రత్యక్షంగా పనిచేసేవారు
* జంతు సంబంధ ఉత్పత్తుల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది
* జీవాయుధాల ప్రమాదం పొంచి ఉన్నచోట విధులు నిర్వహించే రక్షణ సిబ్బంది

ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించటం ఎలా ?
ఆంత్రాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి రక్తంలోని నిర్ధిష్ట యాంటీ బాడీస్ ను లెక్కించటం, రక్తం, చర్మం, శ్వాసద్రవాల పదార్థాల నుంచి ఆంత్రాసిస్ వేరు చేయడం ద్వారా ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించవచ్చు.
మన రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాధిని నిర్ధారించే ప్రయోగశాలలు ఉన్నాయా ?
ఉన్నవి. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసన్, నారాయణ గూడ, హైదరాబాదు మరియు అన్ని వైద్య కళాశాలలకు అనుబంధముగా యున్న వైద్యశాలల్లో ఈ వనరులు కలవు.
ఆంత్రాక్స్ కు చికిత్స ఉందా ?
చికిత్స ఉంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమగును. వైద్యుల సలహా మేరకు పెన్సిలిన్, డాక్సిసైక్లిన్, ఎరిత్రోమైసిన్ లేదా సిప్రోప్లాక్సాసిన్ మందులు వాడితే వ్యాధినయమగును. ప్రస్తుతము సిప్రోప్లాక్సాసిన్ వాడుట మంచిది.

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 12, 2010

ఇమ్యునైజేషన్ , Immunazation


వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంపొందంచడాన్ని ఇమ్మ్యునైజేషన్‌ అంటారు . అంటు వ్యాధులు రాకుండా తట్టుకునే శక్తిని ' వ్యాధి నిరోధకత లేదా ఇమ్యూనిటీ ' అంటారు . వ్యాధి నిరోధక శక్తి సహజం గా లేదా కుత్రిమం గా కలుగుతుంది . కుత్రిమ పద్దతిలో వ్యాక్సిన్ల ద్వారా వివిధ వ్యాధులకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తారు . ఇమ్యూనిటీ గురుంచిన అధ్యయనాన్ని " ఇమ్యునాలజీ " అంటారు .

అసలు ఈ ఇమ్యునైజేషన్‌ అవసరమా... అవసరమైతే ఎందుకు.. అనే విషయం తెలుసుకోవాలి.
ఇది పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు తప్పని సరి. ఇమ్యున్ అనేది ఒక గ్రీకు పదం. రక్షించేది అని అర్థం. జనం ప్రాణాలను రక్షించేందుకు కొన్ని ఏజెన్సీలను నియమించారు. వీరి ద్వారా జరిగే ఈ ప్రక్రియను ఇమ్యునైజేషన్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్. రెండోది పాసివ్ ఇమ్యునైజేషన్. యాక్టివ్ ఇమ్యునైజేషన్ ధీర్ఘకాలిక రక్షణ ఇవ్వగలిగితే, పాసివ్ ఇమ్యునైజేషన్ స్వల్పకాలిక రక్షణ కల్పిస్తుంది.

సంక్రమణ, ప్రేరేపిత వ్యాధులు, కారకాలను ఇమ్యునైజేషన్ గుర్తిస్తుంది. తరువాత శరీరానికి రక్షక వలయంగా పని చేస్తుంది. తిరిగి అలాంటి వ్యాధుల శరీరానికి సోకకుండా నిరోధిస్తుంది. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి పిల్లలకు వాక్సిన్‌ను ఇప్పించాల్సిందే. వివిధ వ్యాధుల నివారణ, నియంత్రణ కోసం పిల్లలకు ఇమ్యునైజేషన్‌ను నిర్ణయించారు. కొన్ని వ్యాధులు కొంత వయస్సు దాటిన తరువాతనో, కొంత వయస్సు ముందరో వచ్చే అవకాశం ఉంది.

శాస్త్రవేత్తలు అందుకు అనుగుణంగానే ఇమ్యునేజేషన్‌ను నిర్ధారించారు. దీని ప్రకారం పుట్టినప్పటి నుంచి 16 యేళ్ళ వయస్సు వరకూ కూడా ఇమ్యునైజేషన్ ఉంటుంది. ప్రభుత్వం ఇమ్యునైజేషన్‌ను ఉచితంగా అందిస్తోంది. వాటి కోసం ప్రైవేటు ఆస్పత్రులనే సంప్రదించాల్సిన పనిలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పురపాలక ఆస్పత్రులలో వ్యాక్సినేషన్ లభిస్తాయి.

టీకా (vaccine) అనగా వ్యాధినిరోధకత(ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని(లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు

ఇమ్యునైజేషన్ షెడ్యూల్
భారతదేశంలోని టీకాల పద్ధతి
క్రమసంఖ్య వయస్సు టీకా మందు
1. పుట్టుక నుంచి 2 వారాలు బి.సి.జి. ; ఒ.పి.వి.
2. 6 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
3. 10 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
4. 14 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
5. 9 నెలలు ఒ.పి.వి. ; తట్టు(మీజిల్స్)
6. 1 సం. తరువాత ఆటలమ్మ (చికెన్ పాక్స్)
7. 15 నెలలు ఎమ్.ఎమ్.అర్.
8. 18 నెలలు ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
9. 2 సం. తరువాత టైఫాయిడ్
10. 5 సం. తరువాత ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
11. 10 సంవత్సరాలు. టి.టి.
12. 15-16 సంవత్సరాలు. టి.టి.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, August 10, 2010

Heart attack and high cholesterol,గుండెపోటు-అధిక కొలెస్టిరాల్



  • Courtesy with -డా|| ఎ.వి.ఆంజనేయులు,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,ఫోకస్‌ డయాగ్నస్టిక్స్‌,పంజగుట్ట, హైదరాబాద్‌ .

గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి.- దీనిని ఆదునిక వైద్యము లో " Ischemic Heart disease ' (Heart Attack) ఆంటారు .

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.


గుండెపోటు ఎలా వస్తుంది :
* గుండె అనేది నిరంతరం కొట్టుకుంటూ ఉండే ఒక దృఢమైన కండరం. ఇది పనిచెయ్యాలన్నా.. దీనికీ రక్తం కావాల్సిందే. అందుకే ఈ గుండె కండరంలోనే మూడు కీలకమైన రక్తనాళాలుంటాయి.

* ఎప్పుడైనా ఈ రక్తనాళాల్లో పూడికలు వచ్చి... గుండె కండరానికి రక్తసరఫరాలో అవరోధం ఏర్పడితే.. గుండె పోటు వస్తుంది.

* ముఖ్యంగా గుండెలోని ఎడమవైపు ధమని(ఎల్‌ఏడీ)లో పూడికలు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ. గుండెలో దాదాపు 40-45% కండరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఇది! కాబట్టి మిగతా రక్తనాళాలతో పోల్చుకుంటే.. దీనిలో పూడిక వచ్చి.. అది మూసుకుపోయి, గుండెపోటు వస్తే గుండెకండరం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

* గుండె పోటు రావటానికి మన చేతుల్లో ఉన్న కారణాలు కొన్ని. లేనివి కొన్ని. ఉదాహరణకు వంశపారంపర్యంగా గుండెపోటు రిస్కు ఉంటే దాని విషయంలో మనం చెయ్యగలిగింది తక్కువ. అలాగే స్త్రీలతో పోలిస్తే పురుషులకు రిస్కు ఎక్కువ. ఇలాంటి వాటిని మనం మార్చలేం. అదృష్టవశాత్తూ ఇలాంటివి చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి కాకుండా.. మనం ముందస్తుగా జాగ్రత్త పడటానికి వీలైన అంశాలే చాలా ఉన్నాయి... హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌, ధూమపానం, మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవటం.. ఇవన్నీ మనం నియంత్రించుకోవటానికి వీలైనవే కదా! మన నియంత్రణలో ఉండే రిస్కుల పట్ల కూడా మనం నిర్లక్ష్యం వహించటం మంచి విషయం కాదు.

* మధుమేహం, హైబీపీ రెండూ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

* కొన్నిసార్లు రక్తంలో వచ్చే మార్పుల వల్ల కూడా రక్తనాళాల్లో రక్తం దానంతట అదే గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అంతకు ముందు 30-40% పూడికలు ఉన్నా.. వాటి మీద ఈ రక్తం గడ్డ చేరి వెంటనే గుండెపోటు తెచ్చిపెట్టొచ్చు. ఒకసారి రక్తనాళంలో ఇలాంటిది అడ్డుగా తయారైతే.. ఇక కిందికి ఏ మాత్రం రక్తం వెళ్లక.. 5-10 నిమిషాల్లోనే ఆ కింది భాగం గుండె కండరమంతా చనిపోవటం ఆరంభమవుతుంది. ఇలా చనిపోయిన కండరాన్ని తిరిగి కోలుకునేలా చెయ్యటం చాలా కష్టం.

* గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఒక 'ఎకోస్ప్రిన్‌', లేదా 'సార్బిట్రేట్‌' బిళ్ల నోట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, ముఖ్యంగా దానివల్ల నష్టమేం లేదు. ఛాతీలో నొప్పి అన్నది వచ్చిన తర్వాత.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి చేరాలి. ఎందుకంటే అది గుండెపోటు అయితే.. నిమిషాలు గడిచిన కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతుంటుందని మర్చిపోకూడదు. అది పొట్టలో అసిడిటీ వల్ల వచ్చిన నొప్పేమో, ఛాతీలో కండరం పట్టేసిందేమో.. ఇలా అనుకుంటూ తాత్సారం చెయ్యటం ఏమాత్రం మంచిది కాదు. చాలామంది నొప్పి మరీ తీవ్రంగా మారితేనేగానీ ఆసుపత్రికి రారు.. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. అలాకాకుండా వెంటనే ఆసుపత్రికి వస్తే.. 'ఈసీజీ' పరీక్షలో అది గుండెపోటు అని గుర్తిస్తే తక్షణం 'ప్రైమరీ యాంజియోప్లాస్టీ' చేసి, గుండె కండరం దెబ్బతినకుండా, వెంటనే నష్టాన్ని నివారించవచ్చు. గుండె కండరం ఒకసారి దెబ్బతిన్న తర్వాత.. యాంజియోప్లాస్టీ చేసినా, బైపాస్‌ సర్జరీ చేసినా.. ఏం చేసినా.. ఆ నష్టాన్ని పూర్తిగా సరిచెయ్యలేం. అప్పటికి దెబ్బ తిన్నది తిన్నట్టే. దెబ్బతినకుండా ఇంకా మిగిలి ఉన్న భాగాన్ని మాత్రమే రక్షించుకోగలం.

* ఇలా గుండె కండరంలో కొంతభాగం దెబ్బతిన్నప్పుడు మన ఆయుర్దాయం సహజంగానే కొంత తగ్గుతుంది. ఇలా జరగకుండా.. ఒకసారి గుండె కండరం దెబ్బతిన్నా కూడా దీర్ఘకాలం జీవించేందుకు, ఇతరత్రా దుష్ప్రభావాలు లేకుండా ఉండేందుకు ఎక్కువ మందులు వాడుతుండాలి, 'రీహాబిలిటేషన్‌' పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రీహాబిలిటేషన్‌లో ఏం చేస్తారు?

ఆరోగ్యం అంచనా: ముందు రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఏయే సమస్యలున్నాయన్నది అంచనా వేస్తారు. గుండె సామర్థ్యంతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తుల వంటి ఇతరత్రా అవయవాల పనితీరునూ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. దీని ఆధారంగా రోగికి ఎటువంటి శిక్షణ అవసరం, ఎంత వరకూ ఇవ్వవచ్చన్నది నిర్ధారిస్తారు.

ఆహారం సలహాలు: రోజూ ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు? దానిలో కొవ్వు ఎంత? పండ్లూ కూరగాయలు తగినంతగా తింటున్నారా? లేదా? ముడిధాన్యం, చేపల వంటివి తీసుకుంటున్నారా? మద్యం అలవాటుందా? మధుమేహం, హైబీపీ వంటి సమస్యలున్నాయా? ఇవన్నీ పరిశీలించి అందుకు తగినట్లుగా రోజూ ఎటువంటి ఆహారం, ఎలా తీసుకోవాలో, కొలెస్ట్రాల్‌ వంటివి ఎలా తగ్గించుకోవాలో సిఫార్సు చేస్తారు. రీహాబిలిటేషన్‌లో ఈ 'డైట్‌ కౌన్సెలింగ్‌' చాలా కీలక అంశం.

బరువు: బీఎంఐ ఎక్కువుంటే క్రమేపీ బరువు తగ్గేందుకు సూచనలు చేస్తారు. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు లేని ఆహారం ఎలా తీసుకోవాలి, వ్యాయామం, శారీరక శ్రమ ఏ తీరులో పెంచాలన్నది సూచిస్తూ.. ఆశించిన మేర బరువు తగ్గేలా సలహాలిస్తారు.

మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్‌: గుండె జబ్బులకు సంబంధించి ఈ మూడింటినీ నియంత్రిణలో ఉంచుకోవటం అత్యంత కీలకమైన అంశం. ఈ మూడూ అదుపులో లేకపోతే- కొత్తగా అతికిన రక్తనాళాలు కూడా త్వరగానే పూడుకుపోతాయి, లేదా పాడైపోతాయి. అందుకే బీపీ ఎంత ఉంటోంది? చెడ్డ కొలెస్ట్రాల్‌, మంచి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయి? మధుమేహం అదుపులో ఉంటోందా? పరీక్షిస్తుంటారు. వీటిని అదుపులోకి తేవటానికి మందులు, ఆహారం, వ్యాయామాల వంటివన్నీ సూచిస్తూ, అవి ఏ తీరులో తగ్గుతున్నాయో ఎప్పటికప్పుడు సరిచూస్తుంటారు.

పొగ: మరోసారి గుండెపోటు రాకుండా ఉండాలన్నా, దెబ్బతిన్న గుండె రక్తనాళాలు తిరిగి బాగవ్వాలన్నా పొగ మానెయ్యటం చాలా ముఖ్యం. దానితో వచ్చే ముప్పులేమిటో, మానేస్తే లాభాలేమిటో వివరిస్తూ దాన్ని వదిలించుకునే క్రమంలో తలెత్తే డిప్రెషన్‌, కోపం వంటి భావోద్వేగాలనూ నెగ్గుకురావటమెలాగో నేర్పిస్తూ.. క్రమేపీ ఆ వ్యసనాన్ని వదిలించుకునేలా సహకరిస్తారు.

మానసిక సాంత్వన: గుండె జబ్బు నుంచి కోలుకుంటున్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌, కోపం, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలు ఎన్నో తలెత్తుతుంటాయి. వీటిని నెగ్గుకురావటానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి రీహాబిలిటేషన్‌లో భాగంగా ఇచ్చే కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది. యోగా, ధ్యానం, రోజూ కొంత సమయం కుటుంబంతో గడపటం, అప్పుడప్పుడు విహారానికి వెళ్లటం, ప్రశాంత వాతావరణంలో గడపటం వంటి వాటివల్ల ప్రయోజనం ఉంటుంది.

వ్యాయామం: గుండెకు అతిపెద్ద శత్రువు ఏ వ్యాయామమూ లేని జీవనశైలి! గుండెపోటుకు ఇది ముఖ్యమైన ముప్పు కారకం. అందుకే గుండె తిరిగి ఆరోగ్యంగా, సమర్థంగా తయారవ్వటానికి ఫిజియోథెరపిస్టులు, రీహాబిలిటేషన్‌ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఇచ్చే వ్యాయామ శిక్షణ కీలకమని గుర్తించాలి. రెండోది- చాలామందికి వ్యాయామ సమయంలో గుండె సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చెయ్యటం సురక్షితం. రోగి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, వ్యాధులను బట్టి ఎవరు ఏ స్థాయి వ్యాయామాలతో ఆరంభించాలి, ఎంతసేపు చెయ్యాలి, పరిమితులేమిటన్న సూచనలన్నీ స్పష్టంగా రూపొందిస్తారు. వ్యాయామం చేస్తున్నంత సేపూ ప్రత్యేక పరికరాల ద్వారా బీపీ, గుండె వేగం, ఊపిరితిత్తుల పనితీరు వంటివన్నీ ఎలా ఉంటున్నాయో పరిశీలిస్తూ ఉంటారు. క్రమేపీ ట్రెడ్‌మిల్‌, స్టేషనరీ సైకిల్‌ వంటి వాటితో ఏరోబిక్‌ వ్యాయామాలకు ప్రాధాన్యం ఇస్తూ.. దశల వారీగా తీవ్రత పెంచుతారు. తర్వాత దశలో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయిస్తారు. ఇలా ఐదారు వారాల పాటు నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చెయ్యటం వల్ల తాము ఎంత వరకూ చెయ్యచ్చు? ఏ పరిమితి దాటకూడదన్నది రోగులకే అర్థమవుతుంది. ఆ తర్వాత రోజువారీ ఇంటి వద్ద తిరగటం, మెట్లు ఎక్కటం వంటివన్నీ ఎలా చెయ్యాలో నేర్పిస్తారు. వ్యాయామంతో శారీరక సామర్థ్యం మెరుగై గుండె కొట్టుకునే వేగం, బీపీ, గుండె కండరానికి ఆక్సిజన్‌ అవసరాల వంటివన్నీ మెరుగవుతాయి. వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్‌ పెరగటం, సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ తగ్గటం, మధుమేహం అదుపులోకి రావటం వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

మందులు: ఒకసారి గుండె జబ్బు పడినవారు జీవనశైలిలో మార్పులతో పాటు వైద్యుల సిఫార్సు మేరకు కొన్ని రకాల మందులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి: రక్తనాళాలు సంకోచించకుండా కాస్త విప్పారినట్టు ఉంచే 'వేసో డైలేటర్స్‌', రక్తం గడ్డకట్టకుండా పల్చగా ఉండేలా చూసేందుకు తక్కువ డోసులో 'ఆస్పిరిన్‌', రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, తద్వారా రక్తనాళాల్లో మళ్లీ కొవ్వు పూడికలు రాకుండా చూసేందుకు 'స్టాటిన్స్‌', గుండె కండరం విశ్రాంతిగా ఉంటూ.. సమర్థంగా రక్తాన్ని పంపింగ్‌ చేసేందుకు దోహదపడే 'బీటా బ్లాకర్స్‌' రకం మందులు అవసరం.

మరికొన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి - > గుండెపోటు

భారతీయుల్లో గుండెపోటు :
ప్రపంచ జనాభాతో పోలిస్తే... మన భారతీయులను చిన్నవయసులోనే గుండెపోటు కబళిస్తోందని తాజాగా ఎన్నో అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. నవతరం 20, 30 ఏళ్లు కూడా దాటక ముందే గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళనకర పరిణామం. ఇంటికీ, దేశానికీ వెన్నెముకగా నిలబడాల్సిన యువత ఇలా అర్ధాయుష్షుతో కుప్పకూలిపోతుండటం పెను విపత్తుకు చిహ్నం. అందుకే పరిశోధనా రంగం ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది.
దీన్ని అడ్డుకునేదెలా? దీనికి మనమేం చెయ్యాలి? ఈ రెండే ఇప్పుడు మన ముందున్న కీలక ప్రశ్నలు.

పది, పదిహేనేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో గుండెపోటు, గుండె జబ్బుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇది యువతీ యువకుల్లోనూ.. అంటే 20, 30, 40 ఏళ్ల వారిలోనూ ఎక్కువగా కనిపించటం ఆందోళనకర పరిణామం. ఒకప్పుడీ పరిస్థితి లేదు. అందుకే భారతీయ సంతతినీ - పాశ్చాత్యులనూ పోలుస్తూ అమెరికా, బ్రిటన్‌, కెనడాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వీటిలో ఎన్నో ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైనఅంశాలు వెలుగు చూశాయి. పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులు 4 రెట్లు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నట్టు తేలింది. చిన్నవయసులోనే రావటం, హఠాత్తుగా రావటం మాత్రమే కాదు.. భారతీయుల్లో గుండెపోటు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. వీరిలో చాలామందిలో గుండెలోని రక్తనాళాలు- ఆపరేషన్‌తో కూడా సరిచేయలేనంత విస్తృతంగా చాలా ప్రాంతాల్లో మూసుకుపోవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. దీనిపై మన దేశంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడి కావటం విశేషం.
కారణాలు అనేకం
భారతీయులకు గుండె పోటు ఎందుకింత త్వరగా, తీవ్రంగా వస్తోంది? మిగతా జాతీయులతో పోలిస్తే వీరికి గుండెలోని రక్తనాళాలు పూడుకుపోవటమన్న సమస్య (సీఏడీ) ఎందుకు ఎక్కువగా ఉందన్న దానిపై లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయి.

* జన్యు స్వభావం: జన్యుపరంగానే భారతీయులకు గుండెపోటుకు కారణమయ్యే ముప్పులు(రిస్కులు) ఎక్కువగా ఉంటున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మధుమేహం, చెడ్డకొలెస్ట్రాల్‌.

* మధుమేహం: ఐరోపా, అమెరికా జాతీయులతో పోలిస్తే భారత ఉపఖండంలో మధుమేహం 3-6 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఊబకాయంతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే ఎంతోమంది మధుమేహం బారిన పడుతున్నారు. 50 ఏళ్ల వయసు వచ్చేసరికే జనాభాలో 50% మంది మధుమేహంతోనో, మధుమేహానికి దగ్గర్లోనో (ప్రీడయాబిటీస్‌) ఉంటున్నారు.

* చెడ్డ కొలెస్ట్రాల్‌: చిన్నవయసులో గుండెపోటుకు కారణమవుతున్న మరో ముఖ్యమైన అంశం, కొత్తగా గుర్తించిన అంశం- భారతీయుల్లో లైపోప్రోటీన్‌ 'ఎ' అనే రకం చెడ్డ కొలెస్ట్రాల్‌ చాలా ఎక్కువగా ఉంటుండటం. ఇది అత్యంత ప్రమాదకారి. (దీని గురించి బాక్సులో వివరంగా) మన దేశంలో సరైన తిండి లేని పేదల్లో కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి ఇది కొవ్వుపదార్థాల వంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేది కాదని, దీనికి జన్యు స్వభావం కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు.

* జీవన శైలి: నానాటికీ పాశ్చాత్య పోకడలను ఒంట బట్టించుకుంటూ శారీరక శ్రమకు దూరమవుతుండటం వల్ల ఊబకాయం, మధుమేహం, హైబీపీ వంటి రిస్కులు పెరిగి... అవి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. పొగతాగటం, ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినటం వంటివి వీటికి అదనం.

మన చేతుల్లో కీలకాంశాలు
* బొజ్జ: పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం గుండెకు చేటు. మన దేశంలో సుమారు 30 శాతం మందిలో ఈ బొజ్జ సమస్య ఉంది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి ఎన్నో రుగ్మతలను తెచ్చిపెడుతుంది, ఇవన్నీ కలిసి గుండెపోటు ముప్పు పెంచుతాయి. కాబట్టి నడుం కొలత పురుషుల్లో 90 సెం.మీ., స్త్రీలల్లో 80 సెం.మీ. మించకుండా చూసుకోవాలి. అందుకే 'వెయిస్ట్‌ లైన్‌ ఈజ్‌ యువర్‌ లైఫ్‌ లైన్‌' అనే నినాదం ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగని సన్నగా ఉండేవారిలో అధిక కొలెస్ట్రాల్‌ ఉండదనుకుంటే కూడా పొరబడ్డట్టే. వాళ్లూ కొలెస్ట్రాల్‌తో సహా గుండె రిస్కుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటమే ఉత్తమం.

ఆహారం
* హాని చేసేవి: గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.. కొవ్వు పదార్థాలు సాధ్యమైనంత తక్కువ తీసుకోవటం అవసరం. వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ఆలివ్‌ నూనె, సోయాబీన్‌ నూనె, పొద్దు తిరుగుడు నూనె వంటివి గుండెజబ్బు ముప్పును నివారించటంలో బాగా ఉపయోగపడతాయి. అయితే వీటినీ చాలా మితంగానే తీసుకోవాలి. ఒకసారి బాగా కాచిన నూనెను తిరిగి వాడటం కూడా ప్రమాదకరం. కొవ్వు పదార్థాల్లో 'ట్రాన్స్‌ఫ్యాట్స్‌' చాలా ప్రమాదకరం. వనస్పతితో తయారయ్యే వాటిల్లో ఇవి ఎక్కువుంటాయి. పామాయిల్‌ కూడా హాని చేస్తుంది.
* కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్‌, వేపుళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
* శాకాహారులు కూడా.. మాంసం తినటం లేదన్న మిషతో... వెన్న నెయ్యి, చీజ్‌, పెరుగు, ఐస్‌క్రీమ్‌ వంటివి ఎక్కువెక్కువగా తినేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదకరమైనవే. కాబట్టి శాకాహారులు కొవ్వుల విషయంలో జాగ్రత్త వహించకపోతే గుండెజబ్బు కొని తెచ్చుకున్నట్టే.
* మేలు చేసేవి: ఎండు పప్పుల్లో (నట్స్‌) ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్లు, పొటాషియం.. మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో 45-80 శాతం కొవ్వు ఉన్నా ఇది అసంతృప్త కొవ్వు కావటం వల్ల రక్తనాళాలకు మేలు చేస్తుంది. కాబట్టి బాదం, వాల్‌నట్‌, వేరుశెనగ, పిస్తా వంటి వాటిని రోజుకి 40-70 గ్రాముల వరకు తినాలి.
* వారానికి కనీసం రెండు సార్త్లెనా చేపలు తీసుకోవటం మంచిది.
* పండ్లు, కూరగాయల్లో పీచు, బి విటమిన్లు, సి విటమిన్‌, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, హోమోసిస్టీన్‌ పెరగకుండా చూస్తాయి, మొత్తమ్మీద గుండె జబ్బు ముప్పునూ తగ్గిస్తాయి. పండ్లు, కూరగాయలు కలిపి రోజుకు 10 కప్పులైనా తీసుకోవటం మంచిది.
* దంపుడు బియ్యం తినాలి. తెల్లగా పాలిష్‌ పట్టించిన బియ్యం తినే వారిలో కంటే దంపుడు బియ్యం తినేవారిలో మధుమేహం 15-20 శాతం తక్కువ. గుండె జబ్బుల ముప్పు తక్కువని గుర్తించారు.
* పొగ మానేయటం తక్షణావసరం. రోజూ వ్యాయామం చేయటం, చేపల వంటి వాటిల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్లను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అప్పటికీ మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటుంటే వైద్యుల పర్యవేక్షణలో 'నియాసిన్‌' విటమిన్‌ తీసుకోవటం మేలు చేస్తుంది. పైగా ఇది ప్రమాదకరమైన లైపోప్రోటీన్‌-ఎ స్థాయినీ తగ్గిస్తుంది.
మనకు మధుమేహంలో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుంటాయని తెలుసు. అలాగే గుండెపోటుకు దారి తీసే గుండె జబ్బులో కూడా మూడు రకాలున్నాయి.
* టైప్‌- 1: చాలా చిన్నవయసులోనే గుండెలోని రక్తనాళాలు కొవ్వుతో మూసుకుపోతుండే అత్యంత ప్రమాదకర రకం ఇది. సాధారణంగా గుండె జబ్బు 55-60 ఏళ్ల వారిలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ రకం 45 ఏళ్ల లోపే.. చిన్నవయసులోనే ఆరంభమైపోతుంది. కొందరికి 30 ఏళ్లలోపే గుండెలోని రక్తనాళాల్లో 70% వరకూ మూసుకుపోయి తీవ్రమైన గుండె జబ్బు ఆరంభమైపోతుంది కూడా. మధుమేహం, హైబీపీ వంటి ముప్పులేమీ లేకుండా కూడా వీరిని గుండెజబ్బు కబళిస్తుండటం గుర్తించాల్సిన అంశం. పైగా ఒకసారి ఈ రకం గుండెజబ్బు బారినపడ్డారంటే ఎంత చికిత్స చేసినా ఆ దుష్పరిణామాలను తప్పించుకోవటం కష్టంగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన 'మాలిగ్నంట్‌' రకం గుండె జబ్బు అంటున్నారు. దీనికి చెడ్డ కొలెస్ట్రాల్‌లో భాగమైన 'లైపోప్రోటీన్‌ ఎ' అనేదే ప్రధాన కారణమవుతోంది.
* టైప్‌-2: వయసు పైబడిన వారిలో అంటే 50, 60 ఏళ్ల తర్వాత సాధారణంగా తరచూ చూస్తుండే రకం ఇది. వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులన్నీ ఉంటాయి.
* టైప్‌ 3: ఇందులో పైన పేర్కొన్న రెండు రకాల లక్షణాలూ కనిపిస్తాయి. ఇది 45-65 ఏళ్ల లోపు ముంచుకొస్తుంది, వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులే కాదు.. లైపోప్రోటీన్‌-ఎ వంటి ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ముప్పులూ కనబడతాయి.

కొత్త ముప్పుపై కన్నేసి ఉంచండి!
లైపోప్రోటీన్‌ 'ఎ'
జన్యుపరంగా సహజంగానే భారతీయుల్లో చెడ్డకొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌) అధికంగా ఉంటోంది. దీనికి తోడు ట్రైగ్లిజరైడ్లు, ఏపీఓబీ, ఏపీఓఎ1 వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఉండాల్సిన మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) తక్కువగా ఉంటోంది. ఇవన్నీ గుండెజబ్బుకు దారి తీసేవే. వీటికి తోడు గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవటంలో కీలక పాత్ర పోషించే 'లిపోప్రోటీన్‌-ఎ' కూడా భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉంటోంది. ఇది నేరుగా రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఇది 20 ఎంజీ కన్నా తక్కువ ఉండాలి. ఇది 100 ఎంజీకి చేరుకుంటే చాలా త్వరగా రక్తనాళాల్లో పూడిక తెప్పిస్తుంది. ఇలాంటి వారికి స్టెంట్స్‌ అమర్చినా అవి కూడా త్వరగా పూడుకుపోతుంటాయి. అందుకే ఇది చాలా ప్రమాదకరమైందని అనుకోవచ్చు. స్వతహాగా ఇది నష్టం కలిగించటమే కాదు.. 'అగ్నికి ఆజ్యం'లా ఇతరత్రా ముప్పులకు తోడై.. పరిస్థితి త్వరగా ముదిరేలా కూడా చేస్తోంది.
ఈ లైపోప్రోటీన్‌-ఎ ఎక్కువ ఉండటంతో పాటు...
* మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటే- రిస్కు 8 రెట్లు ఎక్కువ.
* చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే- ముప్పు 12 రెట్లు ఎక్కువ.
* మధుమేహం ఉంటే- ముప్పు ఏకంగా 16 రెట్లు ఎక్కువ.


ముఖ్యంగా...
* పైవేమీ లేకపోయినా.. కేవలం లైపోప్రోటీన్‌-ఎ ఒక్కటే అధికంగా ఉన్నా సరే.. గుండెపోటు వ్యాధి ముప్పు 3 రెట్లు ఎక్కువ.
అందుకనే ఇటీవలి కాలంలో చెడ్డకొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివాటితో పాటు ఈ 'లైపోప్రోటీన్‌-ఎ' మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. గుండె జబ్బుల ముప్పు ఎంత మేరకు ఉందని చెప్పేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పరీక్షలన్నింటినీ కలిపి 'కరోనరీ రిస్క్‌ ప్రొఫైల్‌' అని ఒకే పేరు కింద చేస్తున్నారు. దీన్ని 20-30 ఏళ్ల వయసు వారు ఒకసారైనా చేయించుకోవటం మంచిది. వీటిలో ఏవైనా ఎక్కువగా ఉన్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్సతో చక్కదిద్దవచ్చు. పరిస్థితి గుండెపోటు వరకూ రాకుండా చూసుకోవటానికి ఇది ఉత్తమ పద్ధతి!
* వృద్ధుల్లో గుండెపోటు రావటానికి, యువకుల్లో రావటానికీ తేడా ఉంది. వృద్ధుల్లో గుండె నొప్పి, నడుస్తుంటే ఆయాసం రావటం, క్రమేపీ పనులు చేయలేకపోవటం వంటి ముందస్తు లక్షణాలు కనబడతాయి. కానీ యువకుల్లో ఇలాంటివేవీ కనిపించకుండానే హఠాత్తుగా గుండెపోటు ముంచుకొస్తోంది. పైగా ఈ వయసులో గుండె పోటు రాదన్న ధీమాతో దాన్ని ఎసిడిటీ సమస్యగా పొరబడే ప్రమాదం ఎక్కువ. అందుకే యువతలో గుండెపోటు మరణాల రేటూ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి రెండేళ్లకొక సారైనా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది.

--డా|| ఎ.వి.ఆంజనేయులు,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,ఫోకస్‌ డయాగ్నస్టిక్స్‌,పంజగుట్ట, హైదరాబాద్‌ .

దీర్ఘకాలము మధుమేహంతో గుండెపోటు!
ఒకసారి గుండెపోటు వచ్చినవారికి రెండోసారి వచ్చే అవకాశం ఎక్కువేనన్నది తెలిసిన విషయమే. కానీ చాలాకాలంగా టైప్‌2 మధుమేహం గల మగవారికీ ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంటుందని బ్రిటన్‌లో చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది. మధుమేహం వచ్చి ఎంత కాలం అయింది? అన్న దాన్నిబట్టి గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. సగటున పదిహేడు ఏళ్లు, అంతకన్నా ఎక్కువకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే ఈ ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇది ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో ఉండే ముప్పుతో సమానం. ఇక ఐదేళ్లుగా మధుమేహం గలవారిలో 54 శాతం రిస్క్‌ ఎక్కువ. ఎనిమిదేళ్ల క్రితం నుంచి మధుమేహంతో బాధపడే పురుషుల్లో గుండె సమస్యలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. అంటే 60 ఏళ్ల కన్నా ముందు ఎంత త్వరగా మధుమేహం మొదలైతే గుండెపోటు వచ్చే అవకాశమూ అంతే అధికంగా ఉంటోందని దీని ద్వారా తెలుస్తోంది. అయితే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రక్షణ ప్రభావం కారణంగా స్త్రీలల్లో ఈ ముప్పు కాస్త ఆలస్యంగా మొదలవుతుండటం విశేషం.

ట్రాఫిక్‌ కాలుష్యంతో గుండెపోటు
నగరాల్లో ట్రాఫిక్‌రద్దీ కారణంగా తలెత్తే వాయుకాలుష్యంతో గుండెపోటు సంభవించే ప్రమాదం ఉందని భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాయుకాలుష్యం ప్రభావం ఆరుగంటలపాటు ఉంటోందని పేర్కొన్నారు. లండన్‌ ఆరోగ్య, ఉష్ణమండల వైద్య పాఠశాలకు చెందిన కృష్ణన్‌ భాస్కరన్‌ తన సహచరులతో కలిసి.. గుండెపోటుకు కాలుష్యానికి మధ్య ఉన్న సంబంధంపై విస్తారంగా అధ్యయనం జరిపారు. దీంట్లో భాగంగా బ్రిటన్‌లో 2003-06 మధ్య కాలంలో సంభవించిన 80 వేల గుండెపోటు కేసులను పరిశీలించారు. గుండెపోటు వచ్చిన సమయాల్లో బ్రిటన్‌లోని వివిధ నగరాల్లో గంటగంటకూ నమోదైన వాయుకాలుష్యం మోతాదులను కూడా లెక్కలోకి తీసుకున్నారు.

గుండెను కాపాడే వెల్లుల్లినూనె

వెల్లుల్లి నూనెలోని ఒక భాగం గుండెపోటు తర్వాత గుండె చికిత్సకు ఉపయోగించొచ్చని ఎమోరి యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తెలిపారు. గుండెపోటు తర్వాత గుండె సంరక్షణకు వెల్లుల్లి నూనెలోని 'డియలిల్‌ ట్రిసుల్‌ఫైడ్‌' గుండెపోటు తర్వాత గుండెను సంరక్షించే సంయోగపదార్థాలను విడుదల చేయడంలో సహకరిస్తుందని పేర్కొన్నారు.

ఆవేదనతోనూ గుండెపోటు-Heart attack with Depression

కుటుంబంలో అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు ఎవరైనా విలవిల్లాడిపోవటం సహజమే. తీవ్ర ఆవేదనతో చాలారోజుల పాటు కుమిలిపోవటమూ తెలిసిందే. ఇలా ఆత్మీయులను కోల్పోయిన బాధను రచయితలు గుండెకోత, గుండె బరువెక్కటం వంటి పదాలతో వర్ణిస్తుంటారు కానీ.. ఇలాంటి సమయాల్లో నిజంగానే గుండెపోటు ముప్పూ పొంచి ఉంటుందంటే నమ్ముతారా? తాజా అధ్యయనంలో ఈ విషయమే బయటపడింది. గుండెపోటు మూలంగా ఆసుపత్రిలో చేరిన కొందరిపై ఇటీవల శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ములు.. ఇలా కుటుంబంలో సన్నిహితులు ఎవరైనా ఇటీవలే మరణించారా? అనే విషయాన్ని పరిశీలించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆత్మీయులు మరణించిన నాడే ఆ బాధతో కుమిలిపోయేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 21 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ముప్పు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. ఈ ప్రమాదం నెల వరకు కొనసాగుతుండటం గమనార్హం. తీవ్ర ఆవేదనకు లోనయ్యేవారిలో కుంగుబాటు, కోపం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే వీరిలో నిద్రలేమి, ఆకలి తగ్గటం, ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ అధిక స్థాయిలో ఉండటమూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని తెచ్చిపెట్టటానికి దోహదం చేస్తున్నాయి. అందువల్ల ఆవేదన, బాధలకు గురైన సమయాల్లో ఛాతీలో అసౌకర్యం, నొప్పి.. మెడ, దవడ, వెన్ను, చేతుల్లో అసౌకర్యం.. శ్వాసలో ఇబ్బంది.. వికారం.. కళ్లు తిరగటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ గుండెపోటు లక్షణాలను సూచించేవే అని మరవరాదు
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/