Thursday, June 24, 2010

కంప్యూటర్ల వలన వఛ్ఛే వ్యాధులు నివారణ , Computer Related Diseases & prevention

  • నేడు కంప్యూటర్లు మరియు తత్సంభదిత ఎలక్టానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయిపోయినాయి .
అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కంప్యూటర్‌ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్‌ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్‌ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.

  • కంప్యూటర్ పై పని చేసే వారికి సాదారణముగా కలిగే ఆరోగ్య సమస్యలు .:
  1. కంప్యూటర్ విజన సిండ్రోం - సి.వి.య స్ ,
  2. రిపిటేటివ్ స్టిములస్ ఇంజురీ - ఆర్.యస్.ఐ .,
  3. కండరాల నొప్పులు ,
  4. నిద్రపట్టక పోవడం ,
  5. సరిఅయిన వ్యాయామము లేక బి.పి , సుగర్ జబ్బులు వచ్చే ప్రమాదము ,
ఆర్‌ఎస్‌ఐ :ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూ వుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ (Repetitive Stress Injury) అంటారు. ఉదాహరణకి కంప్యూటర్‌ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్‌ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. సిటిఎస్‌ (Carpal Tunnel Syndrome) అనేది ఒక రకమైన ఆర్‌ఎస్‌ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్‌ అంటారు. దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా వున్న యురోపియన్‌ దేశాల్లోనే ఎక్కువమంది ఈ వ్యాధి వున్నట్లు అంచనా. కేవలం చేతులకేకాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

అసలు ఆర్‌ఎస్‌ఐ ఎందుకు వస్తుంది? ఎంతవరకు దీన్ని ప్రమాదకారిగా గుర్తించవచ్చు? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలమా? అనే అంశాలపై జరిగిన ఓ సర్వేలో వెల్లడైన అంశాలు- ఎడతెరిపిలేకుండా టైప్‌ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్‌ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్‌ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్‌ (ఫుట్‌ రెస్ట్‌) లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం

సివిఎస్‌ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్నోస్ట్రెస్‌ (Technostress) : దీనివల్ల కంప్యూటర్‌ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్‌, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, మెషీన్‌లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి.

టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ : ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి 'టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్‌' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, -
  • పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, -
  • కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -
  • ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, -
  • కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, -
  • కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, -
  • కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, -
  • కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి, -
  • ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, -
  • ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.

పిల్లలకు మానసిక సమస్యలు
:

మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరకశ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా
ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

Computer Game and ill-health

  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కంప్యూటర్ అవశేషాలు (Waste) అనారోగ్యము , Computer Waste & ill-health







e - (కంప్యూటర్ ) వేస్ట్‌ను ఏం చేద్దాం ?

పెరుగుతున్న విజ్ఞానంతో పాటు మనిషి అవసరాలు తీర్చేందుకు కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, టీవిలు, ప్రిజ్‌లు, మైక్రోవేవ్‌ ఒవెన్లు పుట్టుకొచ్చాయి. వీటి సర్వీస్‌ పూర్తవడంతో వాటిని వేస్జేజీగా జమకట్టి అమ్మేస్తుంటాం. కానీ పనికిరాని ఈ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్ని అమ్మేసి మనం చేతులు దులుపుకున్నా తయారీ సమయంలో వీటిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాలు ధ్వంసం చేయడానికి వీలులేకుండా పోతున్నాయి. వీటినే ‘ఈ-వేస్టు ‌’గా అంటారు. ఈవేస్ట్‌లో నిక్షిప్తమై ఉన్న రసాయనపదార్థాలు మనిషి ఆరోగ్యానికి కీడు చేయడంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా హాని కలిగిస్తున్నాయి. ఫలితంగా వీటి ప్రభావం మనతో పాటు రాబోయే తరాల వారికి కూడా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలో ప్రతి సంవత్సరం 200 నుం డి 500 లక్షల టన్నుల ఈవేస్ట్‌ ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే వ్యర్థ భాగంలో ఐదు శాతాన్ని ఆక్రమిస్తుంది. యూ రోపియన్‌ దేశాలు విడుదల చేసే ఈ వేస్ట్‌ నిష్పత్తి ప్రతి సంవత్సరం 35 శాతం పెరుగుతోందని గ్రీన్‌పీస్‌ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంటర్నేషనల్‌ సింపోజియమ్‌ ఆన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ రిపోర్టు ప్రకారం చైనాలో ప్రతియేటా 7 కోట్ల మొ బైల్‌ ఫోన్లు, 3.3 కోట్ల టీవీలు, 44 లక్షల కంప్యూటర్లు పనికిరాని వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయట.
వదిలించుకుంటున్నాయి...
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఈ-వ్యర్థాల్ని భూమిలో పాతకుండా, కాస్త ఖరె్చైనా రిసైక్లింగ్‌ చేయాలని ఆయా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నాయి. కొన్ని దేశాలు తెలివిగా తమ దేశాల్లో పేరుకుపోయిన ఈవేస్ట్‌ను ఆసియా, ఆఫ్రికా వంటి పేదదేశాలకు కారుచౌకగా అమ్మేసి చేతులు దులుపుకుంటున్నాయి.

యూరోపియన్‌ దేశాల్లో యేటా విడుదలయ్యే 77లక్షల టన్నుల ఈవేస్ట్‌లో దాదాపు 66 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను అక్రమంగా చైనా, భారత్‌, ఆఫ్రికా దేశాలకు రవాణా చేస్తున్నాయి. 2005లో అమెరికాలో ఈవేస్ట్‌గా సేకరించిన కంప్యూటర్లలో 10 శాతం, టీవీల్లో 14 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు తరలించారు. మిగిలిన వాటిని నైజీరియా వంటి పేద దేశాలకు అక్రమంగా తరలిస్తున్నాయి. మెరికా నుండి ప్రతి నెలా కనీసం లక్ష కంప్యూటర్లు ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి.

ప్రమాదభరితంగా రీసైక్లింగ్‌....
ధనిక దేశాలు రీసైక్లింగ్‌ పద్ధతులకు అవలంబించాల్సిన నిర్దుష్ట పద్ధతులు, నియమాలను తుంగలో తొక్కుతున్నాయి. దీనికి పేదరికం, నిరుద్యోగం తోడవడంతో వేలాది కార్మికులు ఉపాధి లభిస్తుందనే ఆశతో ప్రాణాలకు తెగించి రీసైక్లింగ్‌ పరిశ్రమల్లో పనికి చేరుతున్నారు.యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ పోగ్రాం అందించిన నివేదిక ప్రకారం రీసైక్టింగ్‌ యూనిట్లలో విషతుల్య డైఆక్సీన్‌ శాతం పరిమితికి మించి 37-133 శాతం ఉన్నట్లు నిర్ధారించింది.

శ్వాససంబంధ వ్యాధులు, హృద్రోగ సమస్యలతో వేలాది కార్మికులు అకాల మరణం చెందుతున్నారని యూఎన్‌ఈపీ అధ్యయనంలో తేలింది. మనదేశం లో నూ ఈవేస్ట్‌ను రిసైక్లింగ్‌ చేసే ప రిశ్రమల్లో పెద్ద ఎత్తున కంప్యూటర్‌ మానిటర్లు, కేబు ళ్లు, ప్రింట్‌ కార్ట్‌రిజ్‌లు, సీడీలు, విద్యుత్‌బల్బులు, ట్యూబ్‌లైట్లను భస్మం చేస్తుంటారు. ఫలితంగా ప్రమాదకారకమైన లెడ్‌(సీసం) వ్యర్థా లు కార్మికుల ఆరోగ్యాన్ని హరించడంతో పాటు పర్యావరణాన్ని మరింత కలుషితయం చేస్తున్నాయి.
-----------------------------------------------------------------------------------
ఎలా ధ్వంసం చేయాలంటే....
సాధారణంగా ఈవేస్ట్‌ను నాలుగు దశల్లో భస్మీపటలం చేస్తారు.
లాండ్‌పిల్‌:
ఇది సాధారణంగా అందరూ అవలంబించే పద్ధతి. కానీ ఈ పక్రియలో విషపూరిత రసాయనాలు, పదార్థాలు భూమిలో కలిసి జలవాయువుల్ని కలుషితం చేస్తున్నాయి. అమెరికన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ అందజేసిన లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే 2005లో 46 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను భూమిలో పాతిపెట్టారు. యూరోపియన్‌ దేశాల్లో ఈవేస్ట్‌ను నేలలో పాతిపెట్టడం చట్టరీత్యా నేరం.

ఫైర్‌ (కాల్చడం) :
ఈ పక్రియలో సేకరించిన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్ని నిర్దేశించిన ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. కానీ ఈ పద్ధతి వల్ల భారీ మోతాదులో సీసం, కాడ్మియం, డైఆక్సీన్‌ వంటి హానికారక రసాయనాలు వెలువడి గాలిని కలుషితయం చేస్తాయి.

రీయూజ్‌:
పరికరాల జీవన ప్రమాణాన్ని పెంచి మళ్లీ వాటిని వినియోగించడాన్నే రియూజ్‌ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ వేస్ట్‌ను దిగుమతి చేసుకునే ఉద్యేశ్యం కూడా ఇదే. తక్కువ ఖర్చులో విలువైన సామాగ్రిని పేద ప్రజలకు అందించాలనే బృహత్తర లక్ష్యం దీని వెనుకుంది. కానీ వీటి జీవితకాలం బహుస్వల్పం కావడం వల్ల వాటిని దిగుమతి చేసుకున్న దేశాలు పర్యావరణ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాయి.

రీసైక్లింగ్‌:
ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించిన ముడిపదార్ధాల్ని జాగ్రత్తగా సేకరించి కొత్త వాటిలో ఉపయోగించే పక్రియే రిసైక్లింగ్‌. కానీ ఈ పక్రియలో పనిచేసే కార్మికులకు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురౌతాయి. చుట్టుపక్కల ప్రాంతాలు పర్యావరణ పరంగా కలుషితం అవుతాయి.

మన దేశంలో:
ఆర్థికంగా శీఘ్రగతిన అబివృద్ధి చెందుతోన్న మన దేశంలో సగటున ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం ప్రతియేటా పెరుగుతోంది. ఫలితంగా ఈవేస్ట్‌ పరిమాణం కాస్తా వృద్ధి చెందింది. కానీ ఇప్పటి వరకు వీటిని పర్యావరణానికి హాని కలిగించకుండా ధ్వంసం చేయడానికి సరైన వ్యవస్థగానీ, నిపుణులు గానీ మనదేశంలో లేకపోవడం గమనార్హం. 2008లో భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈవేస్ట్‌ను ధ్వంసం చేయడానికి కొత్తగా దిశానిర్దేశాల్ని జారీచేసింది. అయినా ఇప్పటి వరకు ఇవి కార్యరూపం దాల్చలేదు.

కంప్యూటర్ల పాత్ర...
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈవేస్ట్‌లో అధికభాగం కంప్యూటర్ల నుండి వస్తుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. గ్రీన్‌పీస్‌ లెక్కల ప్రకారం 2006నాటికి కంప్యూటర్లు 57.35 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. టోక్యో (జపాన్‌)లోని ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కంప్యూటర్‌లో ఉపయోగించే చిన్న చిప్‌ను ధ్వంసం చేస్తే కలిగే పర్యావరణహాని ఒక కారును ధ్వసం చేసినపుడు వచ్చిన కాలుష్యానికి సమానమట. రెండు గ్రాముల బరువుండే కంప్యూటర్‌ చిప్‌ను తయారు చేయడానికి 1.6 కిలో ఇంధనం, 72గ్రాముల రసాయనాలు అవసరమౌతాయి.

మనిషి శరీరంపై కంప్యూటర్‌ పరికరాల దుష్ర్పభావం...
మానిటర్‌: ఇందులో ఉండే క్యాథోడ్‌ రే ట్యూబ్‌లో 4-8పౌండ్ల లెడ్‌ ఉంటుంది. ఇది మానిటర్‌ అద్దానికి రేడియేషన్‌ కిరణాల్ని పంపడంతో అవి నేరుగా మనకి వచ్చి తాకుతాయి. మానిటర్‌ అద్దానికి వాడే బేరియం, ఫాస్ఫేట్‌ వంటి రసాయనాలు విషతుల్యాలే.

కంప్యూటర్‌ ఛేసిస్‌:
లోహంతో తయారు చేసే కంప్యూటర్‌ బాడీలు వాతావరణ ప్రభావానికి లోనవకుండా ఉండేందుకు హెక్సావాలెంట్‌ క్రోమియం అనే విషపూరిత రసాయనంతో పూత పూస్తారు.

కేబుల్స్‌, వైర్లు:
వీటి తయారీకి పి.వి.సి, పి.బి.డి.ఇ (పాలీ బ్రోమినేటెడ్‌ డిఫెన్లీథర్స్‌) పదార్థాల్ని వాడుతారు.

సర్క్యూట్లు, బోర్డులు:
సర్క్యూట్ల తయారీలో లెడ్‌ తీగలు, సెమికండక్టర్లు, చిప్స్‌ వాడితే, బోర్డు తయారికి బెరీలియాన్ని వాడుతారు. వీటిపై పూతకోసం మెర్క్యురీ వాడుతారు. సెమికండక్టర్లు, రెసిస్టర్లలో కాడ్మియం వాడుతారు.

మానవ శరీరంపై దుష్ర్పభావాలు...

లెడ్‌ (సీసం):
మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలను అడ్డుకుటుంది.

బేరియం:
మెదడు వ్యాపు వ్యాధికి దారితీస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. గుండె, కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

హెక్సావాలెంట్‌ క్రోమియం:
డి.ఎన్‌.ఎ వ్యవస్థను నాశనం చేస్తుంది.

ఫాస్ఫరస్‌:
జ్ఞాపకశక్తి నశిస్తుంది.

బెరీలియం:
క్యాన్సర్‌ వ్యాధికి దారితీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది.

మెర్క్యురీ:
మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం, మహిళల్లో పిల్లల్ని కనే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.

పి.బి.డి.ఇ:
పిండం ఎదుగుదలను అడ్డుకుంటుంది.

  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్ ,Computer Vision Syndrome






కాలం మారింది. తినే తిండిలో, కట్టే బట్టలో ఇలా వేసే ప్రతి అడుగులోనూ మార్పులు వచ్చాయి. ఇక పిల్లల పరిస్థితి వేరే చెప్పక్కరలేదు. వీరి ప్రతి కదలికలోను వైవిధ్యం ఉంటోంది. నూటికి ఎనభై శాతం మంది హైపర్‌ ఆక్టివ్‌ పిల్లలు ఉంటున్నారు. రోజులో దాదాపు 10 గంటలు కంప్యూటర్స్‌, టివీల ముందు గడుపుతున్నారు. వీరిలో ఎంతమంది టివీ చూసేముందు, కంప్యూటర్‌ వాడేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారు? అంటే దాదాపు ఎవ్వరూ పాటించట్లేదనే చెప్పాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు పూర్తిగా కంప్యూటర్లతోనే పనిచేస్తున్నారు. వీరు ఎంతసేపూ పని ఎప్పుడు త్వరగా అవ్ఞతుందా అని చూస్తున్నారు తప్పితే, పనిచేసేటపుపడు జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మనిషికి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ వస్తుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ వాడకం ఒక నిత్యకృత్యమైపోయింది. దానితోపాటే వివిధ రకాల జీవనశైలికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ రకమైన వ్యాధుల్లో కళ్లు తడి ఆరిపోవడం, కంటి నొప్పి, తల, మెడ కండరాల నొప్పులు మొదలైనవి ముఖ్యమైనవి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా సుమారు 10 మిలియన్ల మంది కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (సివిఎస్‌)కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్‌పై పని చేసే వారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

సివిఎస్‌ సమస్య ఉత్పన్నమవడానికి కంప్యూటర్‌ స్క్రీన్‌నుంచి వెలువడే రేడియేషన్‌ ఒక ప్రధాన కారణం. అలాగే పరిసరాలలోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కంప్యూటర్‌ ముందు కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌ మీద పని చేయడం వంటి కారణాలతోపాటు, దృష్టి లోపాలు కూడా సివిఎస్‌ కలగడానికి కారణమవుతాయి.

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఈ కింద పేర్కొన్న సూచనలు సహాయకారిగా ఉంటాయి.అర్హత కలిగిన నేత్ర వైద్యులతో పరీక్షలు చేయించుకుని, తడి ఆరిపోయిన కళ్లకు, దృష్టిలోపాలకు సకాలంలో సరైన చికిత్స చేయించుకోవాలి. యాంటిగ్లేర్‌ అద్దాలను వాడాలి.కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి కనీసం 10 నిముషాలపాటు విశ్రాంతి తీసుకోవాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

కంప్యూటర్‌పై పని చేస్తున్న సమయంలో కను రెప్పలు కొట్టు కోవడం తగ్గు తుంది. కనుక ఎక్కువసార్లు కంటి రెప్పలు మూసి తెరుస్తూ ఉండాలి.
సవ్య, అపసవ్య దిశలలో ఐదుసార్లు కనుగుడ్లు తిప్పడం వల్ల ఇబ్బంది తగ్గుతుంది.కండి తడి ఆరి పోయిన వారు (డ్రై ఐస్‌ సమస్యతో బాధపడేవారు) వైద్య సలహా మేరకు లూబ్రికెంట్‌ మందులను వాడాలి.

కంటిని నీటితో కడగడం, అశాస్త్రీయ పద్ధతుల్లో కంటి చుక్కల మందులను వాడటం వల్ల కంటి దృష్టి మరింత మందగించే ప్రమాదం ఉంది.కళ్లు లాగుతున్నా, తరచుగా తలనొప్పి, మెడనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స పొందాలి.

‘‘సివిఎస్’’ నివారించాలంటే....ఈ క్రింది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి :

1. కాంట్రాస్ట్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసిన పరిసర ప్రాంతాలలో, అదే విదంగా, స్ర్కీన్ పైన ఎక్కువ కాంతి ఉండే విధంగా చూడకూడదు. స్ర్కీన్ పైన కూడా డార్క్ నెస్ ఎక్కువ ఉంచకూడదు. దీనివలన లెటర్స్ కన్పించే అవకాశం తక్కువ....అంటే...స్ర్కీన్ బ్రైట్ నెస్ ను తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
2. యాంటీ గ్లేర్ : మానిటర్ నుంచి వచ్చే కాంతి నేరుగా కళ్ళపై పడకుండా, నిరోధించటానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. దీన్ని మానిటర్ కు అమర్చుకోవటం వలన కళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది.
3. కలర్ : కలర్స్ ను కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి.
4. వర్క్ స్టేషన్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసుకున్న పరిసర ప్రాంతాలలో వాతావరణం చక్కగా ఉండేటట్లు చూడాలి. అంటే ఎర్గానమిక్ చైర్స్ ను ఉపయోగించటం...కంప్యూటర్ ను ఒక పద్ధతి ప్రకారం సెటప్ చేసుకోవం వంటివి చేయాలి. ఉదాహరణకు : కీ-బోర్డ్, మౌస్ ను సులువుగా, ఉపయోగించే విధంగా, అదే విధంగా మన చేతులకు కంటే కింద ఉంటే విధంగా సెటప్ చేయాలి. తరుచుగా ఉపయోగించే ఆబ్జెక్టులను కూడా మానిటర్ కు దగ్గరగా ఉంచటం వలన వాటికోసం వెతకనవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.
5. మోనిటర్ : సాదారణంగా మానిటర్ మధ్య భాగం, కళ్ళతో పోల్చినప్పుడు 4 నుంచి 6 అంగుళాలు కిందకు ఉండాలి. దీనివలన కంటి రెప్పలు, కల్ళను కొంత వరకూ కప్పి ఉంచుతాయి. దీనితో కళ్ళు ఎండిపోవటానికి అవకాశం ఉండదు. అదే విధంగా కంటికి స్క్రీన్ కు మధ్య దూరం 55 నుంచి 75 సెంటీ మీటర్స్ వరకూ ఉండాలి.
  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, June 21, 2010

Thyroid Gland Problems , థైరోయిడ్ సమస్యలు .




ధైరాయిడ్‌ తీరుతెన్నులు : మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్‌ వచ్చినపుడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

థైరాయిడ్‌:

థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠముడి (ఎడమ్స్‌ ఏపిల్‌) కింద ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక యొక్క రెక్క రూపంలో శ్వాస నాళానికి (ట్రెఖియా) యిరు పక్కలా ఉంటుంది.

థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.

హైపర్‌ థైరాయిడ్‌జమ్‌:

ఈ రుగ్మత థైరాయిడ్‌ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది.

లక్షణాలు:

ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్‌ గ్రంధి (వాపు) పెద్దదవవచ్చు (గాయిటర్‌).

1. త్వరితమైన గుండెరేటు- నిముషానికి 100 కంటే ఎక్కువ. 2. నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు. 3. చేతులు వణకడం. 4. చెమటలు పట్టడం. 5. మామూలుగా తింటున్నా బరువు కోల్పోవటం. 6. వేడి తట్టుకోలేక పోవటం.
7. జుట్టు ఊడిపోవటం 8. తరచూ విరేచనాలు. 9. కళ్ళు ముందుకు చొచ్చుకురావటం. 10. తరచూ రుతు శ్రావం.
11. సక్రమంగా లేని గుండె లయ

చికిత్స : ఇందులో వయసుబట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసులో ఉంటే యాంటి థైరాయిడ్‌ మందులు వాడుతారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సిరావచ్చు. రేడియో థార్మికత ఇచ్చే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదిసామాన్యంగా 45 ఏళ్లు పైవారికి ఇస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
propylthiouracil (PTU, AntiTyrox) and methimazole (Neomerkazole,MMI, Tapazole). Carbimazole (which is converted into MMI in the body) is available

మందులు స్పెసలిస్ట్ డాక్టర్ సలహా తో వాడాలి .

హైపోథైరాయిడిజం:

థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్న పðడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు:

1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా

డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును .

రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక.

థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుం ది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి .

రేడియం ఎబెలేషన్‌ సాదారణ ట్రీట్మెంట్ లో భాగమయిపోంది .
సర్జరీ కూడా కొన్ని చోట్ల చేస్తారు .

స్పెసలిస్ట్ లు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో స్పెసలిస్ట్ ని కలిసే తగిన ట్రీట్మింట్ ఎంచుకోవాలి .

మరి కొంత సమచారము కోసం - > హైపో థైరోయిడజం

గాయిటర్‌-goiter
థైరాయిడ్‌ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమ యంలో థైరాయిడ్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యాధాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవ రకంలో ఒక వైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు. రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్‌లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనిని వైద్యం తప్పనిసరి అవుతుంది.
చికిత్స : ఇలా అసహజంగా పెరిగిందానికి శస్తచ్రికిత్స అవసరం అవుతుంది. గడ్డలు ఉన్న స్థాయి, ప్రాంతాన్ని, పరిమణాన్ని, సంఖ్యని బట్టి శస్తచ్రికిత్స ఆధారపడి ఉంటుంది. లోవెక్టమీ, హెమీ థైరాయిడ్‌ వెక్టమీ, సబ్‌టోటల్‌ వెక్టమీ అనే సర్జరీలు చేయాల్సి ఉంటుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ :
ఇది చాలా అరుదుగా వస్తుంది. సర్జరీయే దీనికి చికిత్స. ఇందులో థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ ఆపరేషన్‌ తరువాత రోగి అందరిలాగే నిండైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది


గర్భిణులు థైరాయిడ్‌ గురించి ఆలోచించండి!

థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే గర్భిణులు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపిస్తే (హైపోథైరాయిడిజమ్‌) గర్భస్రావమయ్యే ముప్పు ఎక్కువని చాలామందికి తెలియదు. తగు చికిత్స తీసుకోకపోతే బరువు, రక్తపోటు పెరగటంతో పాటు ముందుగానే కాన్పు అయ్యే అవకాశమూ ఉంది. పుట్టిన పిల్లల్లోనూ బుద్ధి వికాసం అంతగా ఉండదు. మనదేశంలోని గర్భిణుల్లో హైపోథైరాయిడిజమ్‌ తరచుగానే కనిపిస్తున్నట్టు ఇటీవల ఢిల్లీలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడి కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగించేందుకు ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీ(ఐటీఎస్‌) జనవరి నెలను 'థింక్‌ థైరాయిడ్‌ మంత్‌'గా పాటిస్తోంది. మనదేశంలో గర్భిణుల్లో 6.47 శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్టు తేలటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణులంతా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలని (ఐటీఎస్‌) మెంబర్స్ చెబుతున్నారు. చాలామంది గర్భిణులు తాము తీసుకునే ఆహారం, రక్తపోటు, వ్యాయామం, డాక్టర్‌ వద్దకు వెళ్లటంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు గానీ థైరాయిడ్‌ పరీక్షను అంతగా పట్టించుకోరు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ పరీక్ష చేయించుకోవటం చాలా అవసరము .

థైరాయిడ్‌ వంటి సమస్యలుండే వారికి పోషకాహారము , Nutritive food for Thyroid patitients.

శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నప్పుడే చకచకా పనులు చేసుకోగలం. అదే థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అది సాధ్యం కాదు. నిలువునా నిస్సత్తువ ఆవరించి.. పనిమీద దృష్టి నిలపలేం. థైరాయిడ్‌లో రెండు రకాల సమస్యలుంటాయి. అవి హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌. వారి వారి సమస్యను బట్టి ప్రత్యేక పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పోషకాహారమే పరిష్కారం..
పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య హైపర్‌థైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. ప్రతి రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో తగిన రక్తపరీక్షల సాయంతో సమస్యని కనిపెట్టవచ్చు.

ఇనుమే.. ఇంధనం
పోషకాహారంతో ఈ సమస్యకి చెక్‌పెట్టవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు. కాబట్టి తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు తీసుకొంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి.

ఎప్పటికప్పుడు నిస్సత్తువగా అయిపోయే శరీరానికి బలాన్నివ్వాలంటే ఒకేసారి కాకుండా రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి.

ఇక ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగించే వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి.

క్రూసీఫెరస్‌ రకం ఆహారపదార్థాలుగా పిలుచుకొనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్‌, పాలకూర, సోయాబీన్స్‌ని తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి.

పాలు, చేపలతో ఫలితాలు
విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం.. ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు. థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి.

కొద్దికొద్దిగా.. ఎక్కువ సార్లు ఆహారం
క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి. ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు.

  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నడుము నొప్పి - Back Ach (Lumbago)



జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం లో నడుము నొప్పిని అనుభవించే ఉంటారు . దానికి ఎన్నో కారణాలు . కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది .

ఈ రోజుల్లో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలి విధానమే. ఒక ప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి ఆధునిక యుగంలో యుక్తవయస్కులను సైతం బాధిస్తుంది. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.


శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లే సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగడం వల్ల, నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

కారణాలు:

నడుము నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పు. (కార్టిలేజ్‌ వెన్నుపూసలు సులువుగా కదలడానికి తోడ్పడుతుంది) కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్లనొప్పి వస్తుంది. నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే. ఇంతేకాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నడుము నొప్పి..... ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే కొన్ని పనులకు... ముఖ్యంగా స్త్రీలు వంట పనులు చేస్తున్నప్పుడు వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు ఇది కలుగుతుంది.

- స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉప యాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం .
- పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
- కంప్యూటర్స్‌ ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం.
- తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం,
- ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పివస్తుంది.
- ఉద్యోగంలోని అసంతృప్తి అనారోగ్యాన్ని పెంచిపోషిస్తుందంటున్నాయి అధ్యయనాలు. వెన్నునొప్పికీ ఉద్యోగంలో ఎదుర్కునే అసంతృప్తులకు సంబంధం ఉందంటున్నాయి క్వీన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు. తక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్న తోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నవారిలో వెన్నునొప్పి తగ్గడానికి చాలాకాలం పడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు:

నడుము నొప్పి తీవ్రంగా ఉండి వంగటం, లేవటం, కూర్చోవటం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించ రాకుండా ఉంటుంది.

జాగ్రత్తలు:

- సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
- నడుము నొప్పి నివారణకు ప్రతిరోజు వ్యాయా మం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
- ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చు న్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
- వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
- సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
- నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
- శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
- శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
- స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
- పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి.

నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు
  • * కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
  • * వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
  • * మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.
  • * మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
  • * ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
  • * కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
  • * అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
  • * ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్స :
బుటాల్జిన్ అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున వాడినట్లయితే ఈ నడుము నొప్పి తగ్గుతుంది. అంటే వీటిని ప్రతి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి కాకపోతే బెరిన్ టాబ్లెట్లను రోజుకు రెండు చొప్పున వాడినా నడుము నొప్పి బాధ తగ్గతుంది.

దీనికి కొన్ని రకాల పైపూత మందులు(Dolorub, Zobid gel , Nobel gel etc.) కూడా వచ్చాయి. అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒకవేళ ఈ మందులు వాడినప్పటికీ నడుము నొప్పి తగ్గకపోయినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

నడుము నొప్పికి ఆయుర్వేదం :

కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు,
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల చేయాలి 10 సార్లు రోజు,

దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు,
వాన కాలం : 7 లేక 15 రోజులకు,
చలికాలం : రోజు,

1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి...పాత బెల్లం పావు కేజి...ఆవు లేక గేద నెయ్యి పావు కేజి...అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి ,వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా 40 రోజులు చేయలి .
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద అతికించాలి, అది వుడిపోదు..
3.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి
4.వెల్లుల్లి గారెలు :మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు...అల్లం 3 గ్రాములు...ఇంగువ 3 చిటికెలు...సైంధవలవణం పావు స్పూను...అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి,
5.బాదం పప్పు పావు కేజి,మునిగేటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి..పటిక బెల్లం పావు కేజి...అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి...ఇది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి,జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది

మధుమేహం - నడుము నొప్పి:
మధుమేహుల్ని వేధించే ఇబ్బందుల చిట్టా చేంతాడంత పెద్దది. ఆ వరసలో నడుము నొప్పీ ఉంటుందని చాలామందికి తెలియదు. వీరిలో ఇది.. ప్రత్యేకించి కూర్చున్నప్పుడు తగ్గుతూ, నడిచేటప్పుడు విజృంభిస్తుంటుంది. నడవటం మొదలుపెట్టగానే.. నొప్పి తీవ్రత పెరుగుతుంది. నడక ఆపితే, ఒక్కసారిగా తగ్గి, క్రమేపీ మాయమవుతుంది. అదే దీని ప్రత్యేకత.
మధుమేహులు ఈ తరహా నడుము నొప్పి విషయంలో పొరపాటు పడుతూ, లంబార్‌ స్పాండిలోసిస్‌, సయాటికా నొప్పి వంటివాటిని అనుమానిస్తారు. చాలా రోజులపాటు అలాగే తోసేసుకు తిరిగి, ఎట్టకేలకు ఎముకల వైద్యుల్ని సంప్రదిస్తారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలన్నింటినీ వరసపెట్టి చేయించి, చివరికి క్యాల్షియం, నొప్పి నివారిణి మాత్రలు, వ్యాయామ సూచనలతో ఇంటిముఖం పడతారు. వీటన్నింటినీ పాటించినా సరైన ఉపశమనం కనిపించదు. ప్రతి నెలా డాక్టర్ల చుట్టూ తిరగటం, మందుల్ని మార్చటం, నొప్పితో బాధపడటం.. ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది.

నడుము నొప్పా? యాంజైనా?
మధుమేహం లేని సాధారణ ఆరోగ్యవంతుల్లో నడుము నొప్పి వేధించటానికి మామూలుగా రెండు కారణాలు తోడవుతాయి. ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్‌ తాలూకు పాతనొప్పి తిరగదోడటం ఒకటైతే, అధిక బరువు, నడక తగ్గిపోవటం వంటివి రెండో కారణం. ఏ మాత్రం వ్యాయామం, వాకింగ్‌ చేయకుండా, గంటల తరబడి కూర్చోవటానికి అలవాటు పడితే.. నడుములో వెన్నుపూసలకు అనుసంధానంగా ఉండే కండరాలు, లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోతాయి. బిగుతుగా, బిరుసుగా మారతాయి. ఫలితంగా.. ఇలాంటి వారు వాకింగ్‌, శారీరక శ్రమ చేసినప్పుడు నడుము నొప్పి వేధిస్తుంది.

మరోవైపు.. మధుమేహ బాధితులకు నడుము, తొడల్లో నొప్పిగా ఉందంటే ఇతరత్రా కారణాల్ని అనుమానించాల్సిందే. వీరిలో సమస్యకు కారణం లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోవటం మాత్రం కాదు. నడుము, తొడల ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గిపోవటం కూడా మధుమేహ బాధితుల్లో ఇలాంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలా రక్తప్రసరణ చాలీచాలకుండా జరగటాన్ని వైద్య పరిభాషలో 'యాంజైనా' అంటారు. గుండె గోడలకు రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే 'ఛెస్ట్‌ యాంజైనా' తలెత్తినట్లే.. నడుము కండరాలకు చాలీచాలని రక్తప్రసరణ జరుగుతున్నప్పుడు 'వెయిస్ట్‌ యాంజైనా', 'నడుము నొప్పి' రూపంలో సమస్య బయటపడుతుంది. ఛెస్ట్‌ యాంజైనాను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు తలెత్తినట్లే, నడుము యాంజైనాకు సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పాదాలకు రక్తసరఫరా తగ్గి గ్యాంగ్రీన్‌ సమస్య తలెత్తవచ్చు.

నొప్పెందుకు?
గుండె నుంచి కిందికి వచ్చే పెద్ద రక్తనాళం పొట్ట దాకా వెళ్లి అక్కడ కాలేయం, పేగులు వంటి అవయవాలకు శుద్ధమైన ఆక్సిజన్‌ను అందజేస్తుంది. ఇదే నాళం నడుము భాగంలోని కండరాలు, అవయవాలకు కూడా ఆక్సిజన్‌ అందజేస్తుంది. ఆ తర్వాత అది రెండుగా విడిపోయి ఎడమ, కుడి తొడలవైపు ఒక్కో నాళం వెళ్లి, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఈ నాళాల ద్వారా రక్తం పాదాల వరకూ చేరుతుంది.

సాధారణంగా రక్తనాళాల గోడలకు కొవ్వు, కొలెస్ట్రాల్‌, క్యాల్షియం వంటివి పేరుకు పోతూంటే, రక్తనాళాలలో రక్తప్రసరణ మార్గం కుచించుకుపోతుందన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. మధుమేహ బాధితుల్లో వ్యాయామం, క్రమశిక్షణ కొరవడితే రక్తంలో గ్లూకోజ్‌ పెరిగి పోతుంది. కొవ్వు, క్యాల్షియం పేరుకుపోవటంతో రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడతాయి. మధుమేహుల్లో.. ఈ రక్తనాళం రెండుగా విడిపడే నడుము భాగంలో అవరోధం ఏర్పడవచ్చు. దాంతో తొడలు, పాదాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా నడుము నొప్పి వేధిస్తుంది. ఈ పరిస్థితిని 'లెరిచ్‌ సిండ్రోమ్‌'గా వ్యవహరిస్తారు.

నిర్లక్ష్యానికి మూల్యమెక్కువ
నడుము యాంజైనాకు సరైన చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే.. పురుషాంగానికి రక్తప్రసరణ మందగించి, సామర్థ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండో సమస్య- పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవటం. దీనివల్ల పాదాల్లో తీవ్రమైన నొప్పితోపాటు కండ నల్లబారటం, గ్యాంగ్రీన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. సెక్సు సామర్థ్యాన్ని పదిల పరచుకోవటానికీ, పాదాల్ని పరిరక్షించుకోవటానికి మధుమేహులు నడుము యాంజైనా విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే.

పెయిన్‌ కిల్లర్లు వద్దు
నడుము నొప్పితో బాధపడేవారు.. తరచూ డాక్టర్లను మార్చేస్తుంటారు. దీనితో వారు వాడే నొప్పినివారిణ మాత్రల (పెయిన్‌ కిల్లర్లు) బ్రాండ్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కొంతమంది డాక్టర్ని సంప్రదించటానికి బదులుగా, తమకు తామే నేరుగా మందుల దుకాణానికి వెళ్లి పలురకాల మాత్రల్ని తెచ్చుకుని వాడేస్తుంటారు. ఏ కొంచెం నొప్పిగా, నలతగా ఉన్నా వెంటనే మాత్ర వేసేసుకుంటారు. ఇలా పెయిన్‌ కిల్లర్లను ఏళ్ల తరబడి విచ్చలవిడిగా వాడటం వల్ల రెండురకాలుగా నష్టం వాటిల్లుతుంది. ఎలాగంటే.. నొప్పి నివారిణి మాత్రలతో నొప్పినుంచి ఉపశమనం పొందుతూ, నడుము యాంజైనాకు సరైన వైద్య చికిత్స తీసుకోకపోవటం వల్ల పాదం కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. రెండోవైపు- మూత్రపిండాల వైఫల్యం తెలెత్తే అవకాశం పెరుగుతుంది. పెయిన్‌ కిల్లర్లను ఎక్కువెక్కువగా వాడటమే ఇలాంటి సమస్యకు కారణం. ప్రత్యేకించి మధుమేహుల్లో పెయిన్‌ కిల్లర్లు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తాయి. కొంతలోకొంత ప్యారసెటమాల్‌ వంటివే కిడ్నీలకు సురక్షితమైన మాత్రలుగా తేలాయి.

నడుము నొప్పి.. ఏం చేయాలి?
నడుము నొప్పి సమస్య వేధిస్తుంటే.. పెయిన్‌ కిల్లర్లు వేసేసుకుని నొప్పి నుంచి ఉపశమనం పొందటం శాశ్వతమైన పరిష్కారం కాదన్న సంగతి గుర్తించాలి. మీరు మధుమేహులై, నడుము నొప్పితో కూడా బాధ పడుతున్నట్లయితే వెంటనే నడుము దగ్గర రక్తనాళాల పూడికలను కూడా అనుమానించటం మంచిది. తొడలు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల పరిస్థితి ఎలా ఉంది?రక్త సరఫరా సజావుగానే జరుగుతోందా అనేది నిర్ధారించుకోవాలి.

నడుము నొప్పితో బాధపడే మధుమేహులకు... వ్యాస్కులర్‌, కార్డియో థొరాసిక్‌ సర్జన్లు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. డాప్లర్‌, సీటీ యాంజియోగ్రఫీ, ఎంఆర్‌ యాంజియోగ్రఫీ వంటి రోగనిర్ధారణ సౌకర్యాలతోపాటు, లింబ్‌ బైపాస్‌ సర్జరీ, స్పైనల్‌ సర్జరీ వంటి శస్త్రచికిత్సలు చేసే అవకాశాలుండే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం.

పొగ వద్దేవద్దు
మధుమేహులకూ, పొగకూ ఆమడ దూరం. పొగాకుగానీ, పొగనుగానీ చేరదీస్తే రెండుకాళ్లకీ ముప్పు కొనితెచ్చుకోవటం ఖాయమన్న సంగతి మరవద్దు. మధుమేహుల విషయంలో.. ధూమపానం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. మధుమేహుల్లో కాళ్లు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది, దీనికి తోడు పొగాకు నమలటం, సిగరెట్‌ తాగటం వంటి అలవాట్లవల్ల సమస్య మరింత తీవ్రమై పాదాల్లో గ్యాంగ్రీన్‌ ఏర్పడి, కాళ్లు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇవేకాదు.. పొగాకు వినియోగం వల్ల లింబ్‌ బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు చేసిన తర్వాత కోలుకోవటం కూడా కష్టతరమవుతుంది. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా పొగతాగటం మాననట్లయితే.. కృత్రిమంగా అమర్చిన స్టెంట్‌ నాళాలు సైతం కుంచించుకుని సమస్యలకు దారితీస్తాయి. సిగరెట్లు తాగే సంఖ్యను నెమ్మదిగా తగ్గించటం వల్ల వైద్యపరంగా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. మొత్తంగా మానేస్తేనే చికిత్స పనిచేస్తుంది.

చికిత్స సౌకర్యాలేమిటి?
యాంజియోగ్రఫీ చేయటం ద్వారా.. కాళ్లూ, పాదాలకు రక్తసరఫరా చేసే రక్తనాళం ఎక్కడ, ఎంతమేర మూసుకుపోయిందనేది తెలుస్తుంది. దీంతో ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయించవచ్చు. మెజారిటీ కేసుల్లో ఆర్టీరియల్‌ బైపాస్‌ సర్జరీ అవసరమవుతుంటుంది. ఇందులో కృత్రిమ రక్తనాళాల్ని అమర్చుతారు. మరికొంతమందిలో స్టెంట్లు అమర్చటం ద్వారా మూసుకుపోయిన నాళాల్ని తెరుచుకునేలా చేస్తారు. అయితే.. ఇలాంటి చికిత్సల తర్వాత రోగి ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగవ్వాలంటే.. క్రమం తప్పకుండా నడవటం, వ్యాయామం తప్పనిసరి.

నడుము నొప్పికి ఆసనాలు -Back Ach Exercises

నడుము నొప్పి అపోహలు ,Backach and false belief

మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు నడుము నొప్పి బాధను అనుభవించినవారే. ప్రతి 10 మందిలో కనీసం 8 మంది ఏదో సమయంలో దీని బారినపడుతున్నట్టు అంచనా. ఈ నడుము నొప్పిపై అపోహలూ ఎక్కువే. వ్యాయామం చేస్తేనో, బరువులు ఎత్తితేనో నడుము నొప్పి వస్తుందని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇది వస్తే పూర్తిగా మంచంపై విశ్రాంతి తీసుకోవాల్సిందేనని భావిస్తుంటారు. అసలు ఇలాంటి అపోహల్లో నిజమెంత?

అపోహ: ఎప్పుడూ నిటారుగానే కూచోవాలి.
* ముందుకు వంగి కూచోవటం వల్ల వెన్నెముకకు హాని కలుగుతుందన్నది నిజమే. కానీ పూర్తి నిటారుగా, చాలాసేపు అలాగే కూచున్నా వెన్నెముక త్వరగా అలసిపోతుంది. కాబట్టి ఎక్కువ సమయం కూచోవాల్సి వస్తే.. కుర్చీ వెనక భాగానికి వెన్ను ఆనించి, కొద్దిగా ముందుకు వంగి కూచోవాలి. కాళ్లు నేలను తాకుతుండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూచునే ఉండకుండా.. గంటకోసారి లేచి కాస్త అటూఇటూ నడవటం.. ఫోనులో మాట్లాడటం వంటి పనులను నిలబడే చేస్తుండటం మంచిది.

అపోహ: మరీ బరువైన వస్తువులను ఎత్తరాదు.
* ఎవరికైనా శక్తికి మించిన బరువులను ఎత్తటం శ్రేయస్కరం కాదు. అయితే నడుమునొప్పి విషయంలో ఎంత బరువు ఎత్తుతున్నామన్న దానికన్నా ఎలా పైకి లేపుతున్నామన్నదే కీలకం. ఆయా వస్తువులను దూరం నుంచి వంగి ఎత్తటం కాకుండా.. వాటికి దగ్గరగా వచ్చి మోకాళ్ల మీద కూర్చుని పైకెత్తాలి. వెన్ను నిటారుగా ఉండేలా, శరీరం బరువు కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి. ఈ సమయంలో శరీరం పక్కలకు తిరిగినా, వంగినా వెన్నెముకను దెబ్బతీస్తుంది.

అపోహ: పూర్తి విశ్రాంతి తీసుకోవటమే మంచి చికిత్స.
* చిన్న చిన్న గాయాలు, బెణుకుల వంటి కారణంగా హఠాత్తుగా నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోవటం మంచిదే. అయితే పూర్తిగా మంచం మీదే పడుకోవాలనేది మాత్రం అపోహ. ఒకట్రెండు రోజులు కదలకుండా పూర్తిగా మంచం మీదే ఉండిపోతే నడుము నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

అపోహ: గాయాల వల్లనే నొప్పి కలుగుతుంది.
* ఒక్క గాయాలే కాదు.. వయసుతో పాటు వచ్చే వెన్నుపూసల అరుగుదల, రకరకాల కండరాల సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, జన్యు పరమైన కారణాల వంటివి కూడా నడుము నొప్పికి కారణమవుతాయి.

అపోహ: బక్క పలుచని వారికి నొప్పి రాదు.
* బరువు ఎక్కువ ఉన్న వారికి నడుమునొప్పి బాధలు ఎక్కువన్న మాట నిజమేగానీ అలాగని బక్కగా ఉండే వారికి నడుము నొప్పి రాదనుకోవటానికి లేదు. నడుము నొప్పి ఎవరికైనా రావొచ్చు. నిజానికి ఆహారం సరిగా తీసుకోకుండా చాలా సన్నగా ఉండేవారికి ఎముక క్షీణత ముప్పూ ఎక్కువే. ఇలాంటి వారికి నొప్పులే కాదు, వెన్నెముక విరిగే ప్రమాదమూ ఉంటుంది.

అపోహ: వ్యాయామం వెన్నెముకకు హాని చేస్తుంది.
* ఇది చాలా పెద్ద అపోహ. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నునొప్పి రాకుండా నివారించుకునే వీలుంది. తీవ్ర గాయాల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి వైద్యులు ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తారు. ఇక నొప్పి తగ్గిన తర్వాత తగు వ్యాయామాలు చేయటం ద్వారా మున్ముందు మళ్లీ నడుము నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు.
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/