Monday, January 31, 2011

కట్టుడు పళ్ళు ఎందుకు? ,Use of Artificial teeth and dentures


కట్టుడు పళ్ళు ఎందుకు? అంటే, ముసలి వాళ్లు పడుచుగా కన్పించడానికని చెప్పడం సులభమైన సమాధానం. ఎంత వృద్ధాప్యంలో వున్నా కాస్త పడుచుగా కనపడదాం అనుకోవ డం మానవ సహజ లక్షణం. ఇక్కడ స్త్రీ/పురు షుల తేడా లేనేలేదు. అయితే, కట్టుడుపళ్ళు పెట్టుకొనేది కేవలం ముసలి వాళ్ళు మాత్రమే కాదుకదా! ¸°వ్వనంలో మిసమిసలాడు తున్న వాళ్ళు, వృద్ధాప్యానికి ముసుగు తొడగా లనుకొనే వృద్ధులు ఇలా ఎందరో కట్టుడు పళ్ళు వాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు కూడా. పైన చెప్పిన మాట ఒకనాటి మాట. ఈనాడు వీటికి అర్థాలు వేరు. అవసరాలు అనేకం.

మనదేశంలో కట్టుడు పళ్ళు పెట్టుకొంటే, వారు సాధారణంగా వృద్ధులయివుంటారు. ఎందుచేత నంటే ఇంకా కొద్దో గొప్పో మనం అంతా భారతీయ సంస్కృతికే కట్టుబడి వున్నాం, కనుక. పళ్ళు సరిగా తోముకొనకపోయినా కనీసం భోజనం అయిన తరువాత గాని, అల్పాహారం ముగించిన తరువాత గాని, చిరుతిండ్లు తిన్న తరువాత గాని నోరుపుక్కిలించే అలవాటు, కనీసం వేలితో పళ్ళు రుద్దుకొనే అలవాటు సంప్రదాయబద్ధంగా మిగిలిన ఉండడం వల్ల, వృద్ధాప్యంవరకు కాకపోయినా, నడివయస్సు వచ్చే వరకయినా దంతాలను కలిగి వుంటున్నారు. మన సమాజంలో చాలామంది. ఖరీదయిన టూత్‌ బ్రష్‌లు, పూటకొకరకం పేష్టులు వాడుకొనేవారు మన సమాజంలో తక్కువగానే ఉన్నా, ప్రకృతి సిద్ధమైన పను దోము పుల్లలతో పళ్ళు తోముకొనేవారు చాలామంది ఉన్నారు.

అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల పరిస్థితి వేరుగా వుంది. యాంత్రిక జీవిత విధానాలలో, వాటితో సరి పుచ్చుకొనే అలవాట్లతో పళ్ళు తోముకోవడానికి వాళ్ళకి సరిపడి నంత సమయం చిక్కదు. దంత సంరక్షణ మీద వారికి సమయం కేటాయించే అవకాశ మే ఉండదు. వీరిది పూర్తిగా 'టిష్యూ పేపర్‌' కల్చర్‌. ఏమి తిన్నా పలుచని కాయితంతో నోరు తుడుచుకొని అవతల పారేయడం వీరి నాగరికత. అభివృద్ధికి చిహ్నం. అందుచేత నే, వీరిలో ఎవరు కట్టుడుపళ్ళు పెట్టుకొన్నారో, ఎవరికి సహజసిద్ధ మైన పలువరుస ఉందో గమనించడం కష్టం. అంటే ఎక్కువ శాతం మంది కట్టుడు పళ్ళు గలవారే అక్కడ ఉంటారన్నది నగ్న సత్యం. కారణాలు ఏమైనప్పటికి కట్టుడు పళ్ళు ఎందుకు? అన్న విషయం విపులంగా తెలుసుకొనవలసిన అవసరం ఇక్కడ వుంది.

పై దవుడలో పదహారు పళ్ళు కింద దవుడలో పదహారుపళ్ళు, ఉండడం వల్ల, ఒకదానికి ఒకటి పోటీగా ఆనుకొని, దవుడకీలు సరైన పద్ధతిలో నిలిచి వుండడానికి అవకాశం వుంది. ఇలా లేనప్పు డు విశ్రాంతి సమయంలో, ఈ కీళ్ళకు సరిపడ పోటీలేక, అవి క్రిందికి జారడం ఆపైన నొప్పి కలగడం జరుగుతుంది. ఇరువైపుల ఈ దవుడకీళ్ళు బాలెన్సును నిలపడానికి తప్పనిసరిగా కట్టుడు పళ్ళు అవసరం అవుతాయి. రెండవదిగా పళ్ళుపోయిన వారు, తమ మిగిలిన కాలం ఆరోగ్యంగా వుండి బ్రతికి బట్ట కట్టడానికి సరయిన ఆహారం తీసుకోవాలి కదా! తీసుకొన్న ఆహారం సరిగా నమలబడాలి గదా! సరిగ్గా నమలని ఆహారపదార్థాలు జీర్ణం కావు కదా! ఈ పరిస్థితులలో కట్టుడుపళ్ళు అవసరం కాదంటారా? ఈ పళ్ళు అసలు పళ్లు మాదిరిగా నూటికి నూరుపాళ్ళు తమ కార్య కలాపాలను సాగించలేక పోయినా తొంబయిశాతం పనికి న్యాయం చేకూరుస్తాయి.

తరువాత, మాట స్పష్టతకోసం, అందంగా కన్పించడం కోసం, పళ్ళు పెట్టించుకోవచ్చు. బోసి నోటికి, పళ్ళు పెట్టుకొన్ననోటికి ఎంతో తేడా కన్పిస్తుంది. ఎందరో సినిమా నటులు, నాటక రంగానికి చెంది న నటీ-నటులు, తాము వృద్ధులయి దంతాలను కోల్పోయినప్పటికి కట్టుడు పళ్ళను పెట్టుకొని, హీరోలుగా మన ముందు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే!

ఇక అసలు విషయానికొస్తే, శరీరంలో ఏ అంగం లోపించినా, దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ అంగాలను అమర్చే విధానాన్ని 'ప్రొస్థటిక్స్‌' అంటారు. దంత వైద్యపరంగా ఈ విధానాన్ని 'ప్రొస్థటిక్‌ డెంటిస్ట్రి' లేక 'డెంటల్‌ ప్రొస్థటిక్స్‌' అంటారు. వాడుక భాషలో ఈ పద్ధతినే పళ్ళు కట్టించుకోవడం అంటారు.

కృత్రిమ దంతాలను అమర్చే విధానం అనుకున్నంత సులభం కాకపోయినా, పెద్ద కష్టమయిన పనేమి కాదు. ఈ దంతాలకు మాత్రం సహజదంతాలకు తీసుకొనవలసిన జాగ్రత్తలకంటే ఎక్కువ జాగ్రత్తలనే పాటించవలసి వుంటుంది. పూర్వం స్ప్రింగు పద్ధతుల ద్వారా దంతాలనమర్చేపద్ధతి వాడుకలో వుండేది. మాజీ అమెరికా అధ్యక్షుడు స్వర్గీయ జార్జ్‌వాషింగ్టన్‌, ఇటువంటి స్ప్రింగు దంతాలనే వాడేవారట. కాని ఇలాంటి స్ప్రింగు దంతాలు నోరుకొంచెం ఎక్కువగా తెరిస్తే వూడి క్రిందపడేవట. దీనితోపాటు స్వర నిర్భంధం కూడా జరిగేదట.

తరువాత, తేనెపట్టు మైనం (వాక్స్‌) ఉపయోగించి, దంత నిర్మాణం కావలసిన ప్రాంతాన్ని అచ్చుతీసి, తద్వారా సరయిన కొలతలతో దంతాలను నిర్మించడం వెలుగులోనికి వచ్చింది. ఈ పద్ధతి వల్ల కూడా ఆకృతి మార్పిడి వంటి లోపాలు ఎదురుకావడంతో క్రమంగా ఈ విధానానికి కూడా స్వస్థి పలకవలసి వచ్చింది.

రోజురోజుకి క్రొత్త రేకులు తొడుగుతున్న నాగరికతతో పాటు, శాస్త్ర విజ్ఞానం కూడా అమితంగా విప్పారడంతో 'ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌' వంటి పొడులతో, అవసరమయిన చక్కటి ఆకృతులను తీసుకొనే అవకాశం కలిగింది. దీనికి భిన్నరూపం 'ఇంప్రెషన్‌ కాంపౌండ్‌' ఇది మామూలు పరిస్థితులలో గట్టిగా వుంటుంది. దీనిని దవుడలో ఒకటి లేక ఎక్కువ పళ్లు లేనప్పుడు వాటి స్థానంలో కృత్రిమంగా అమర్చుకొనే దంతాలను పాక్షిక దంతాలు అంటారు. పాక్షికదంతాలను తిరిగి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవసరమయినప్పుడు తీసి-పెట్టుకొనే అవకాశం కలిగి వుండ దంతాలు మొదటి రకం. వీటిని 'రిమువబుల్‌ పార్షియల్‌ డెంచర్స్‌' అంటారు దీనికి భిన్నంగా, అతి సహజంగా మళ్ళీ తీయడానికి అనువుకాకుండా, స్థిరంగా వుండే దంతాలు రెండో రకం. వీటిని 'ఫిక్స్‌ పార్షియల్‌ డెంచర్స్‌' అంటారు. ఇవి సహజ దంతాలకు అతి చేరువగా వుంటాయి.

ఇదే విధంగా 'పుల్‌ డెంచర్స్‌'లో కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం 'రిమువబుల్‌ పుల్‌ డెంచర్స్‌', రెండవ రకం 'ఫిక్స్‌డ్‌ పుల్‌ డెంచర్స్‌' వీటినే 'ఇంప్లాంట్‌ -డెంచర్స్‌' అని కూడా అంటారు. దవుడ ఎముకలో శస్త్ర చికిత్స చేసి తద్వారా ఈ పళ్ళను అమరుస్తారు. ఈనాడు ఈ చికిత్సా విధానం అధిక ప్రాధాన్యతను సంతరించుకొని వుంది. అయితే ఇది సామాన్యుడికి అందుబాటులో లేనివైద్యం. పైగా, అందరి శరీరం, ఇటువంటి కట్టుడుపళ్ళు పెట్టించుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఇది సామాన్యులకు అందుబాటులోనికి వచ్చిననాడు, మరింత ప్రాచుర్యం పొందే అవకాశం వుంది.

ఇవి కాకుండా, పంటి ముక్కలపై తయారుచేసే పంటి తొడుగులు 'జాకెట్‌ క్రౌన్స్‌' అంగుటి భాగం కోల్పోయిన వారికి అమర్చే 'ఆబ్‌డ్యురేటర్లు' కృత్రిమ దంతాల సరసనే నిలుస్తాయి.

కృత్రిమ దంతాలను ధరించేవారు, దంతధావనం విషయంలో సహజ దంతాలపై తీసుకొనే శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి వుంటుంది. లేకుంటే నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంటుంది. సరిగా అమరని దంతాల విషయంలో దంతవైద్యుల దృష్టికి తీసుకువచ్చి, త్వరగా సరిచేయించుకోవాలి. విరిగిన కట్టుడు పళ్ళను, కదిలి వదులుగా ఉన్న కట్టుడు పళ్ళను ఎట్టి పరిస్థితిలోను వాడకూడదు.

ఒకరి దంతాలు మరొకరు వాడడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఒకరి దంతాలు మరొకరికి పట్టవు కూడా.

కట్టుడు పళ్ళను కట్టుడు పళ్ళగానే చూడాలి తప్ప, తమ గత సహజ దంతాలను దృష్టిలో ఉంచుకొని చూడకూడదు. తరువాత ఒకరికి ఉన్నమాదిరిగా, తమకు ఉండాలన్నది దురాశ అవుతుంది. ఎవరి దవుడ ఆధారంగా వారి దంతాలు తయారవుతాయన్నది గుర్తుంచుకోవాలి.

- డా||కె.ఎల్‌.వి. ప్రసాద్‌(Andhrapraba Sunday magazine)

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, January 26, 2011

ఎలక్ట్రో థెరపీ , Electrotherapy



-విద్యుత్‌ పరికరాల వినియోగం, డెల్టాయిడ్‌ కండరాలను పునరుజ్జీవింపచేయడానికి వాడే గాల్వినిజం... వైద్యంలో విద్యుత్‌శక్తిని వాడడమే ఎలెక్ట్రోథెరపీ. వివిధ జబ్బులను నయం చేసేందుకు ఎలెక్ట్రోథెరపీ వినియోగి స్తారు. న్యూరోలాజికల్‌ వ్యాధులకు వాడే డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేటర్‌స వంటి విద్యుత్‌ పరిక రాలు వీటిలో ఉన్నాయి. గాయాలు త్వరగా మానడం కోసం విద్యుత్‌ వాడడానికి కూడా ప్రత్యేకించి ఈ పదాన్ని వినియోగించారు. ప్ర త్యామ్నాయ వైద్య పద్ధతులు, చికిత్సలకు కూ డా ఎలెక్ట్రోథెరపీ లేక ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ థెరపీ ని వినియోగించారు. అయితే ఎముకల చికి త్సలో ఈ చికిత్స అనుకున్నంతగా ఉపయో గపడడంలేదని తెలుస్తోంది. కానీ, మిగతా చికిత్సల్లో ఇది పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుంది.
ఎలక్ట్రోథెరపీ చరిత్ర...
కండరాల సమస్యల నివారణకు వాడే ఎల క్ట్రోథెరప్యూటిక్‌ ట్రిగ్గరింగుకు ప్రత్యక్షంగా వి ద్యుత్తు నివ్వడంకంటే ఆల్టర్నేటింగ్‌ నాణ్యమైన పద్ధతని ఎలెక్ట్రో థెరపీని రూపొందించిన గిలా మ్‌ డుషెన్‌ ప్రకటించాడు. డైరెక్టు కరెంట్ల ‘‘వా ర్మింగ్‌ ఎఫెక్ట్‌’’ చర్మానికి హాని కలిగిస్తుందం టాడాయన. బిగుసుకుపో యిన కండరాలకు హెచ్చు స్థాయి వోల్టేజీలో విద్యుత్తు ఇచ్చి నందువల్ల చర్మం పై పొక్కులు ఏర్పడతాయి. ఇంకా డిసి వల్ల ప్రతి బిగుసుకుపోయిన కండ రానికి కరెంటు ఇచ్చి నిలిపేసి మళ్ళీ ప్రారం భించాలి. కండరం పరిస్థితి ఎలావున్నా ఏసీ కరెంట్‌ వల్ల కండరాలు గట్టిగా పట్టేయడానికి దారితీయవచ్చు. గాయాలు త్వరగా మాన్ప డానికి ఎలక్ట్రోథెరపీ ఉపయోగపడవచ్చని 1999లో జరిపిన మెటా-ఎనాలిసిస్‌ నిర్థారించింది.

ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ప్రాముఖ్యం
చురుకైన ఫిజియోథెరపీ చికిత్సా విధానంలో భాగంగా విద్యుత్తును వినియోగించడమే ఎలక్ట్రోథెరపీ. రోమ్‌ కాలం నాటినుంచి ఎలక్ట్రోథెరపీ వివిధ రూపాల్లో కొనసాగుతూవస్తోంది. ఫిజియోథెరపీ వైద్యవిధానంలో ప్రతిష్టాత్మక పాత్ర పోషిస్తోంది. మర్దన, కదలికలతో కూడుకున్న వ్యాయామాలు, వేడి ఐస్‌ప్యాక్‌లను వినియోగించడం వంటి ఫిజియోథెరపీ వైద్య పద్ధతులతో పాటు ఎలక్ట్రోథెరపీ విధానాలను వినియోగిస్తారు. ఫిజియోథెరపీకి కీలకమైన అనుబంధ వైద్యంగా ఎలక్ట్రోథెరపీ వినియోగించినట్లయితే రోగికి ఫలప్రదమైన ఫలితాలు చేకూరుతాయి.

ట్రాక్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ (టెన్స్‌)...
జేబులో పట్టేంత సైజులో ఉండే ఈ పరికరం రోగి సులువుగా వినియోగించవచ్చు. చర్మం ద్వారా నరాలను కండరాలను ఉత్తేజపరిచి నొప్పినుంచి ఉపశమనం పొందడానికి ఇది తోడ్పడుతుంది. మెదడులో ఉండే సహజసిద్ధమైన నొప్పినివారకాల (పెయిన్‌ రిలీవర్స్‌-ఎండోర్ఫిన్స్‌) ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎక్కడ శక్తిమంతంగా పనిచేస్తాయో అక్కడ ఎలెక్ట్రోడ్స్‌ను ఉంచవచ్చు. నొప్పిగా ఉన్న ప్రాంతంలో లేక అక్కడ ఉండే నరం మీద లేక శరీరానికి వ్యతిరేక దిక్కున ఉంచవచ్చు. ఉత్తేజం సరఫరా తీవ్రతను (ఇంటెన్సిటీ) పేషంటు అవసరాన్ని బట్టి మార్చవచ్చు. తక్కువ స్థాయిలో ఇచ్చే విద్యుత్‌ ఉత్తేజం అసౌకర్యంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

గాల్వినిక్‌ స్టిమ్యులేషన్‌ (జిఎస్‌)...
-కండరాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కండరానికి ఏసీ సరఫరా చేసినప్పుడు కండరంలో బలమలై మెలికలు పుడతాయని ఎలక్ట్రో థెరపీ విధానాన్ని కనిపెట్టిన గులావుమ్‌ డుషనే తెలుసుకున్నాడు. ఈ చికిత్స కండరాలు క్షీణించకుండా నివారిస్తుందని గాయాలు, పుండ్లు మానిన తరువాత కండరం పెరగడానికి తోడ్పడుతుందని రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనుగొన్నారు. హైవోల్టేజి... జిఎస్‌ కండరాలు పట్టుకుపోవడాన్ని, మెత్తటికణజాలం వాపును తగ్గిస్తుంది. కనుక నొప్పి తగ్గుతుంది. ఐస్‌, వేడి, కదలికలు, బలమిచ్చే వ్యాయామాలవంటి ఇతర రూపాల్లో వున్న ఫిజియోథెరపీతో కలిపి చేసినట్లయితే వైద్యం తొలిదశలో ఇది శక్తిమంతమైందని తెలుస్తోంది.

ఇంటర్‌ఫెరెన్షియల్‌ కరెంట్‌ (ఐఎఫ్‌సి)...
ఈ విధమైన ఎలక్ట్రోథెరపీ టెన్స్‌ వంటిది. తక్కువ అసౌకర్యం కలిగిస్తూ చర్మాన్ని మరింత లోతుగా చొచ్చుకుపోతుంది. ఎండార్ఫిన్‌ ఉత్పత్తిని ఉత్తేజపరిచి నరాల ద్వారా నొప్పి సంకేతాల ప్రసారాన్ని నిలువరిస్తుంది. టెన్స్‌ వల్ల ఫలితం దక్కని తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి ఐఎఫ్‌సి తరచూ ఉపశమనం కలిగిస్తుంది.

అల్ట్రాసౌండ్‌...
ఈ విధమైన ఎలక్ట్రోథెరపీ శక్తిమంతంగా కీళ్ళనొప్పులు, కండరాల కణజాలం నొప్పుల నుంచి ఉపశమనమిస్తుంది. లోతైన వేడి మెత్తబరిచి కణజాలాన్ని విస్తరింపజేస్తుంది. ఫలితంగా కీళ్ళు పూర్తిగా బాగుపడతాయి. దిగువ వీపు నొప్పికి వెన్నెముకకు సంబంధించి అల్ట్రాసౌండ్‌ శక్తిమంతమైన చికిత్స. క్రమంగా కండరాన్ని సడలించడం, వ్యాయామానికి అనుబంధంగా దీన్ని వాడినట్లయితే ఇదెంతో బాగా పనిచేస్తుంది.

చెడు ప్రభావాలు, ముందు జాగ్రత్తలు...
చెడుప్రభావాలు అరుదే కానీ టెన్స్‌ లేక ఐఎఫ్‌సి యూనిట్స్‌ వాడిన తరువాత అప్పుడప్పుడూ తాత్కాలికంగా నొప్పి కలగవచ్చు. యూనిట్లపై వుండే అథెసివ్‌ ప్యాడ్ల వల్ల చర్మం ప్రకోపించవచ్చు. టెన్స్‌ ప్యాడ్లు కానీ ఐఎఫ్‌సి లేక జిఎస్‌ లీడులు కానీ గుండెపై లేదా పేస్‌మేకర్‌పై పెట్టకూడదు. అలా చేసినట్లయితే కార్డియాక్‌ ఎర్థిమియాకు దారితీయవచ్చు. ప్యాడ్లను గొంతుపై అమర్చినట్లయితే రక్తపోటు పడిపోతుంది. గర్భిణీ గర్భసంచీపై ఉంచినట్లయితే గర్భస్థపిండానికి హాని కలుగవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలక్ట్రోథెరపీ విధానం మంచి సత్ఫలితాలను ఇస్తుంది.

  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

హోమియోపతీ ,Homeopathy


ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి , ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తద్వారా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. . కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు చాలా మంది ఉన్నారు.

మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు. అల్లోపతి వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము. ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ. ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము. ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది. హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది , జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది. డా.హనిమాన్‌ ఈ సూత్రాన్ని " సిమిలియా సిమిలబస్ క్యురంటర్ ('similia similibus curantur)" అని నిర్వచించారు . హోమియో(homeo=similar) పతీ (pathy=suffering) రుగ్మత అని అర్ధము .
హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (Samuel_Hahnemann; 1755-1843) అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.

దరిదాపు రెండున్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. మొదట్లో హానిమాన్ ప్రవచించిన పద్ధతిని సనాతన హోమియోపతీ (classical homeopathy) అనీ, ఇప్పుడు వాడుకలో ఉన్న పద్ధతిని అధునాతన హోమియోపతీ (modern homeopathy) అనీ అందాం. కాని ఇప్పుడు వాడుకలో ఉన్నది ముఖ్యంగా సనాతన పద్ధతియే.

పూర్తి వివరాలకోసం వికిపిడియాను చూడండి - హోమియోపతి


హోమియోపతి వైద్య విధానం-- రామకృష్ణప్రసాద్‌,హోమియోవైద్యుడు .

హోమియోపతి వైద్యవిధానంలో మూలసూత్రాల గురించి విపులంగా ‘ఎఫారిసమ్‌’ రూపంలో డా. హానిమన్‌ ‘ఆర్గనాన్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ అనే పుస్తకంలో విశదీకరించారు. ఈ వైద్య గ్రంథాన్ని బైబిల్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా భావించవచ్చును. ఈ విధానం కేవలం హోమియోపతి వైద్యవిధానానికే ప్రత్యేకం. ఇందులో వ్యాధిగురించి, రోగి గురించి, వైద్యుడు పాటించవలసిన నియమాల గురించి వ్రాయబడివుంది. దీనిని సరైన విధంలో అర్థం చేసుకుని వైద్యులు చికిత్స చేసినచో సాధ్యమైనన్ని తరుణ వ్యాధులు, దీర్ఘకాలవ్యాధులను సమూలంగా నిర్మూలించవచ్చును.

డా.హానిమన్‌ దీర్ఘకాలవ్యాధుల గురించి కానిక్‌ డిసీజెస్‌ అనే బృహత్తర వైద్య గ్రంథాన్ని రచించారు.ఇందులో దీర్ఘకాలవ్యాధు లను సోరా, ెసైకోసిస్‌, సిఫిలిస్‌ అని మూడురకాలుగా వర్గీకరిం చారు. ఇందులో ‘సోరా’ను మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డిసీజెస్‌గా చెబు తారు. ఇందులో కేవలం ఫంక్షనల్‌ మార్పులు ఉన్న వ్యాధులు వస్తాయి. అంటే మానసిన ఆందోళన, సాధారణ జలుబు, చర్మవ్యాధులు, పొడిదగ్గు, నీళ్ల విరోచనాలు మొదలైనవి.

ఈ ‘సోరా’ అనే మియస్మాటిక్‌ దీర్ఘకాలవ్యాధికి సైకోసిస్‌ అనే మరో దీర్ఘకాలికవ్యాధి తోడయినప్పుడు శరీరంలోని కణాలలో ఎక్కువ వృద్ధి ఏర్పడి పాథలాజికల్‌ మార్పులు వచ్చి కణుతులు (ట్యూమర్స్‌), పులిపిరులు, గనేరియా, పైల్స్‌, టాన్సిలైటిస్‌ లాంటి జబ్బులు వస్తాయి. సిఫిలిస్‌ అనే మూడోరకం వ్యాధి కలిగిన ప్పుడు కణాలకు నష్టం వాటిల్లి ‘డెస్ట్రక్టివ్‌’ డిసీజెస్‌ (వ్యాధులు) వస్తాయి. ఇది బాగా ముదిరిన బ్రాంకైటిస్‌, న్యూమోనియా, టీబీవ్యాధి, సిఫిలిస్‌, క్యాన్సర్‌, పార్కిన్‌సన్‌ వ్యాధులు వస్తాయి. ఈ దీర్ఘకాలవ్యాధులలో ఏ రోగిలో ఏది ఉధృతంగా ఉందో తెలుసుకోవడం వలన, వారి మానసిక స్థితిని పరిగణ నలోకి తీసుకోవడం వలన వ్యాధి నిర్ధారణ కొరకు హోమియోపతి మం దు ఉపయోగపడుతుంది.
హోమియో మందు ‘ఇన్‌డివిడ్యులైై జేషన్‌’ విధానం ద్వారా మందు నిర్ధారణ జరుగుతుంది. ‘నో టూ ఇన్‌డిడ్యుయల్స్‌ ఆర్‌ సేమ్‌’ అనే సూత్రానికి లోబడి ప్రతి వ్యక్తికి శరీర లక్ష ణాలను బట్టి మందులు వేర్వేరు గా ఇస్తా రు. ఉదాహరణకు టైఫాయిడ్‌ జ్వ రంతో బాధపడుతున్న 10 మంది రోగులను పరిశీలిస్తే వారు ఒకే వ్యాధితో బాధపడుతు న్నప్పటికీ వారి వ్యాధి లక్షణాలు మాత్రం వేరుగానే ఉంటాయి. వారిలోనే ఒకరికి ఉద యం వేళలో జ్వరం వస్తే మరొకరికి రాత్రివే ళల్లో జ్వరం వస్తుంది. ఇలా వాళ్ల శరీర తత్వా న్ని బట్టి మందులు ఉంటాయి. ‘సిమిలిమమ్‌’ హోమియో మందు ను ‘మెటీరియా మెడికా’లోని ‘డ్రగ్‌ పిక్చర్స్‌’ ఆధారంగా ఎంపిక చేసి ఇచ్చినట్లయితే ఆ వ్యాధి ఒకే మందుతో సమూలంగా నిర్మూలించబడుతుంది. ఈ కార ణాలచే మామూలు శాస్ర్తీయ పరిశోధ నా పద్ధతులలో హోమియో వైద్యం యొక్క శాస్ర్తీయతను పరీక్షిం చలేము, నిర్ధారించలేము. ఈ సూత్రానికి లోబడి హోమియోపతి వైద్యం ఒక నూతన శాస్ర్తీయ వైద్యవిధానంగా చెప్పబడుతోంది.

హోమియోపతి మందుల సూక్ష్మీకరణ...
పద్ధతి (పొటెన్‌టైజేషన్‌) అనే ప్రత్యేకమైన ఫార్మాస్యూటికల్‌ పద్ధతిలో హోమియో మందు లు తయారు చేయబడతాయి. మందులు ముడి రూపంలో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించిన పుడు ఇతర దుష్ఫలితాలు ఏర్పడతాయి. బ్యాక్టీరి యా, వైరస్‌ మొదలైనవి మూలకారణంగా భావిం చబడవు. మనిషిలో మొదట రోగనిరోధకశక్తి తగ్గినపుడు మాత్రమే బాక్టీరియాగానీ, వైరస్‌గానీ దాడిచేసి రోగిలో రోగాన్ని కలుగజేస్తాయి.సాధారణంగా ఏ వైరస్‌ కూడా మనిషిని ఏమీ చేయలేవు. అందువలన ఏ మందైతే మూల ణా న్ని అనగా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుం దో అప్పుడే ఆ వ్యాధి సమూలంగా నయం చేయ బడుతుంది.

కేవలం వైరస్‌ను చంపడం వల్ల రోగం నిర్మూలించబ డదు.సరిగ్గా అదేపనిని హో మియోపతి వైద్యం వల్ల సాధ్యమవుతుంది.సూక్ష్మీకరణపద్ధతిలో తయారు చేయబడిన హో మియోపతి మందులు రోగిలోని రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి ఎలాంటి దుష్ఫలి తాలు లేకుండా వ్యాధిని నయం చేస్తాయి.ముడి రూపంలో ఉన్న మందుల మూల పదార్థాలను సూక్ష్మీకరణ పద్ధతిలో తూరు చేయడం వల్ల వాటిలో ఉన్న శక్తి పరమా ణువుల రూపంలో విడుదలై ఆ మందులో నిక్షిప్తమై ఉంటాయి. హోమియో పతి విధానం డా. హానిమన్‌ మేధోశక్తికి నిదర్శనం. శాస్ర్తీయపరంగా ఎటువంటి అభివృద్ధి చెందని 18వ శతాబ్దంలో ఆయన కనుగొన్న కొన్ని సూత్రాలకు ఇప్పటి శాస్త్రీయ విధానాలు ఇంకా అందుకోలేకపో తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ.

భౌతి కశాస్త్రంలో పేర్కొనబడినవిధంగా ‘అవగాడ్రోస్‌ లా’ ప్రకారం ప్ర పంచంలోని ఏ మూల పదార్థమైనా తీసుకుని పరిశోధన చేసినప్పుడు 1012 వరకు మాత్రమే ఆ మూలపదా ర్థంలోని అణువును గుర్తించగలుగుతారు. కానీ 18వ శతాబ్దం లోనే ఒక ముడిరూపంలో ఉన్న మందును తీసుకుని సూక్ష్మీ కరిస్తే 1012 కంటే ఎన్నో రెట్లు అధికంగా పెరుగుతుందని ఊ హించి పరిశోధనలు చేసి దశాంశపద్ధతి పొటెన్సీ, శతాంశ పద్ధతి పొటెన్సీ, 50 మిల్లీసిమల్‌ పొటెన్సీని కనుగొన్నారు. డా.హానిమన్‌ ఎవరికీ అందని మహా శాస్తవ్రేత్త. ఆయన పరిశోధనలను ఇప్పటి శాస్ర్తీయ పద్ధతిలో నిర్థారించ డానికి భౌతిక శాస్తవ్రేత్తలకు ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో వేచిచూడాల్సిందే...


  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

హిప్పోథెరపీ ,Hypnotherapy,సమ్మోహన చికిత్స (హిప్నోథెరపీ)

హిప్నోథెరపీ(సమ్మోహన చికిత్స) గురించి భారతీయులకు తెలియనిదేమీకాదు కాదు. మన పురాణాల్లో సమ్మోహన విద్య, యుద్ధాల్లో సమ్మోహనాస్త్రం మనకు తెలిసిందే. మోహిని తన అందాన్నే సమ్మోహనాస్త్రంగా ప్రయోగించి ఆమృతం దేవతలకు దక్కేట్లు చేసింది. ఆధునిక యుగంలో హిప్నోథెరపీ (సమ్మోహన విద్య) అమృత కలశంగా నేటి మానవుడికి ఉపయోగపడడమే కాకుండా... అది సత్ఫలితాలను సాధిస్తోంది.


‘హిప్నోసిస్‌’ అంటే ఏమిటి?
మైమరిచిన మానసిక స్థితిలో వైద్యం చేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న వైద్య విధానరాల్లో ఒకటి. ప్రపంచమంతటా ప్రతి సంస్కృతిలో ఏదో ఒకరూపంలో ఉంటూవస్తోంది. న్యాయసమ్మతంగానే దీన్ని మౌలికమైన మనోవైజ్ఞానిక చికిత్సగా వివరించారు. ఇటీవల ఆవిర్భవించిన మనోవైజ్ఞానిక చికిత్సావిధానాలకు ఇది ఆధారంగా వుంది. ఇది వివాదాస్పద విషయం. ఇలాంటి మారిన చైతన్య స్థితులు(ఆల్టర్డ్‌ స్టేట్స్‌) వేల సంవత్సరాలుగా తెలిసిందే అయినప్పటికీ ‘హిప్నోసిస్‌’ (గ్రీకు పదం ‘హిప్నోస్‌’ అంటే నిద్ర) పదం 1840లో స్కాటిష్‌ వైద్యుడు డా జేమ్స్‌ బ్రేడ్‌ ప్రతిపాదించాడు. కానీ ఈ పదం హిప్నోసిస్‌ అనుభవాన్ని సరిగా వర్ణించదు. సమ్మోహక దశ (హిప్నోటిక్‌ స్టేట్‌) అనేక విధాలుగా పూర్తిగా నిద్రకు భిన్నమైంది.

-మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్తజ్ఞ్రానాన్ని బట్టి హిప్నోసిస్‌ను నిర్దిష్టంగా నిర్వచించలేము. కానీ మధ్యేమార్గంగా మానసిక భౌతిక విశ్రాంతి పొందిన మానసిక స్థితిగా చెప్పుకోవచ్చు. ఈ దశలో మన సుప్తచేతన చైతన్యవంతమైన మనసుతో సంభాషించగలుగుతుంది. హిప్నోసిస్‌ ఏమిటనే దానికంటే ఏమి చేస్తుందనే దృక్కోణం నుంచి హిప్నోసిస్‌ను నిర్వచించడం మంచిది. మనలో ఉన్న సత్తాను వెలికితీయడానికి విస్తృతంగా స్వీకరించిన అద్భుతమైన పద్ధతిగా భావిస్తారు. ఈ మానసిక స్థితి వ్యక్తి తనంతటతానే గానీ (సెల్ఫ్‌ హిప్నోసిస్‌) లేక మరో వ్యక్తి సహాయం తో గానీ సాధించవచ్చు. ఈ మరో వ్యక్తి సుశిక్షితుడైన వృత్తిపరమైన నిపుణుడైతే, ిహప్నోసిస్‌ లో ఉన్న వ్యక్తిలో సత్ఫలితాలనిచ్చే విధంగా మారిన మానసిక స్థితిని వినియోగించినట్లయితే అలాంటి క్రమాన్ని ‘హిప్నోథెరపీ’ అంటారు.

హిప్నోథెరపీ - విశ్లేషణ...
మనోవైజ్ఞానిక చికిత్స, కౌన్సెలింగ్‌ (కొన్ని సందర్భాల్లో టాకింగ్‌ క్యూర్‌) భావోద్రేకపరమైన, మనోవైజ్ఞానిక రుగ్మతల చికిత్సనంటారు. దీని ద్వారా అనవసరమైన అలవాట్లు, అవాంఛనీయమైన అనుభూతులకు మనోవైజ్ఞానిక మెళకువలు మాత్రమే ఉపయోగించి చికిత్స చేస్తారు. అసంతృప్తికరమైన ఆలోచనాధోరణులు, అనుభూతులు, ప్రవర్తనల నుంచి తప్పించి అర్థవంతమైన ప్రత్యామ్నాయాలు క్లయింట్లకు అంటే ప్రజలకు అందివ్వడమే ఈ చికిత్స లక్ష్యం. వ్యక్తి వికాసం పెంపొందిం చడానికి మనలోని సత్తా సంకెళ్ళు ఛేదించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనోవైజ్ఞానిక చికిత్స (సైకలాజికల్‌ థెరపి) ఎన్నో రూపాల్లో అందుబాటులో ఉంది. వీటిలో హిప్నోథెరపీ భిన్నమైంది.

-క్లయింటు సుప్తచేతన మనసును పరిశీలించి చికిత్స చేస్తుంది. ఆచరణలో, హిప్నోథెరపిస్టు తరచూ క్లయింటును ప్రశాంతంగా ఉండండని ఆదేశిస్తుంటాడు. తరచూ క్లయింటు ఊహాశక్తిని ఉపయోగిస్తాడు, కథలు చెప్పడం మొదలుకుని ఉపమలు, ప్రతీకలు (క్లయింటును బట్టి) అతనికి సరాసరి సూచనలిచ్చి క్లయింటులో సత్ఫలితాలనిచ్చే మార్పు తీసుకువస్తారు. సమస్యలు క్లయింటు గతంలో ఉన్నాయని భావించి వాటిని ఛేదించడానికి విశ్లేషణాత్మక మెళకులను కూడా ప్రయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్లయింటు ప్రస్తుత జీవితం, ప్రస్తుత సమస్యలపై (హియర్‌ అండ్‌ నౌ) దృష్టి కేంద్రీకరించవచ్చు.

క్లయింటులో మారాలన్న పట్టుదల ఉన్నట్లయితే (థెరపిస్టు ప్రయత్నాలపై పూర్తిగా ఆధారపడకుండా), మంచికే మార్పు వస్తుందనే విశ్వాసం ఉన్నట్లయితే ఎంతో సహయపడుతుందని సాధారణంగా భావిస్తారు. ఇదే మంచి మార్పుకు శ్రీకారం. ఏ మెళకువ ఉపయోగించినా థెరపిస్టు చికిత్స చేస్తున్నపుడు క్లయింటు సౌకర్యవంతంగా వున్న అనుభూతి కలగడం బహుశా చాలా ముఖ్యమైన విషయం. హిప్నోథెరపీలో ఇది ప్రత్యేక ప్రాముఖ్యమున్న అంశం. వైద్యుడిపై విశ్వాసం వున్నట్లయితే చికిత్స నాణ్యత ఎంతగానో పెరుగుతుంది. ఈ కారణంగానే మొదటి సెషన్‌ మాత్రమే క్లయింటు బుక్‌ చేసుకోవాలి, ఆ తర్వాతి సిట్టిగులను వారి ఇష్టానికి వదిలేయాలి.

-ఇతర అనేక మనోవైజ్ఞానిక చికిత్సలకు భిన్నంగా హిప్నోథెరపీని స్వల్పకాలిక విధానంగా భావిస్తారు. ఇందులోనే సత్ఫలితాన్నిచ్చే మార్పు రావాలి. ఒకవేళ మార్పు వచ్చినట్లయితే కొన్ని సెషన్లలోనే బయటపడాలి. ఆచరణలో హిప్నాటిక్‌ పద్ధతులను ఇతర తగిన సలహా, చికిత్సాపరమైన మెళకువలతో హిప్నోథెరపిస్టులు జోడిస్తారు. ప్రత్యేక కేసుల్లో వివిధ తరహాల నైపుణ్యాలను మేళవించి ఉపయోగిస్తున్నారన్న విషయంలో ఏదైనా అనుమానం వుందా? అయితే వారుపయోగించే పద్ధతి గురించి థెరపిస్టును నేరుగా అడిగి తెలుసుకోవాలి.

ఎవరిని హిప్నొటైజ్‌ (సమ్మోహితుల్ని) చేయవచ్చు?
ఈ ప్రశ్నకు ‘ప్రతి ఒక్కరినీ సమ్మోహితుల్ని చేయవచ్చన్న’ది జవాబు. కానీ, కొందరు ఇతరులకంటే హిప్నటైజ్‌ అవడానిి ఎక్కువ సిద్ధంగా ఉన్నారు. హిప్నటైజ్‌ చేసే సమయంలో ఒకరి సానుకూలత మీద కూడా ఆధారపడివుంటుంది. ఈ సుముఖత కూడా ఇతర అనేక అంశాలపై ఆధారపడివుంటుంది. లాభదాయకమైన ఫలితం పొందడానికి ఏస్థాయి తన్మయత్వం అవసరమనేది మరో ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంపై కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ తన్మయత్వం వాస్తవ స్థాయి (లేక లోతు) సాధించాలనుకున్న సానుకూలమైన ఫలితాలకు ప్రత్యక్ష సామీప్యం లేదని చాలామంది పరిశోధకులు ఏకీభవిస్తారు.

-తగినంత సమయం ఇస్తే (ఇది ఎంతో ముఖ్యమైన అంశం) చికిత్స నుంచి ఆశించిన ఫలితం దక్కవచ్చు. మన వర్తమాన సమాజంలో సమయం ప్రత్యేక ప్రాముఖ్యమున్న విషయం. ఎందుకంటే నేటి సమాజం తమ ప్రతికోరికా చిటికెలో తీరాలని భావిస్తుంది. హిప్నోథెరపీ అనూహ్యంగా శక్తిమంతంగా పనిచేయవచ్చు. కానీ అది మాయాజాలం కాదు. కానీ సరైన దినుసులు ఉంటే, సమయం సరైనదైతే, అనువైన థెరపిస్టు దొరికినట్లయితే క్లయింటు తన లక్ష్యాలన్నీ సాధించవచ్చు.

హిప్నోథెరపీ వల్ల ఎవరికి ప్రయోజనం?
-మళ్ళీ, ఈ ప్రశ్నకు కూడా ‘అందరినీ’ అన్నదే జవాబు. ఒక వ్యక్తిలోని అంతర్గత సత్తాను వెలికితీయడానికి, ఎవరూ తమ పూర్తి సత్తాను వినియోగించడం లేదన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ జవాబు అక్షరాలా నిజమే. కానీ, నిద్రాణంగా ఉన్న సత్తా ఒక్కటే కాదు. సానుకూలమైన మార్పుకోసం లోలోపలి వనరుల్ని వాడుకలోకి తీసుకురావడానికి కూడా హిప్నోథెరపీ ఎంతో ప్రభావశాలిగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మన శరీరంలోనే స్వతహాగా ఉన్న మాన్పే సామర్థ్యాన్ని హిప్నోథెరపీతో ప్రేరేపించవచ్చు.

పర్యవసానంగా హిప్నోథెరపీతో నయమయ్యే సమస్యల జాబితా చాలా సుదీర్ఘంగానే ఉంది. కానీ, మానసిక ఒత్తిడి, ఆందోళన, తత్తరపాటు, భయాలు, అవాంఛనీయమైన అలవాట్లు, వ్యవసనాలు (సిగరెట్లు, మెక్కడం, మద్యపానం), సరిగా నిద్రలేకపోవడం, ఆత్మవిశ్వాసం కొరవడడం, ఆత్మ గౌరవం తక్కువస్థాయిలో ఉండడం, పరీక్షలంటే భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఎలర్జీలు, చర్మవ్యాధులు, మైగ్రేన్‌ తలనొప్పి, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబిఎస్‌) వీటిలో ముఖ్యమైనవి.

ఇవే కాక ఆపరేషన్లలో సాధారణ మత్తుమందులు (ఎనీస్థటిక్స్‌) పనిచేయని పరిస్థితుల్లో హిప్నోథెరపీ విలువైన ప్రత్యామ్నాయంగా రుజువైంది. నొప్పి నియంత్రణలో, క్రీడలు, కళాత్మక ప్రదర్శనలను పెంపొందించడానికి కూడా ఎంతో ఉపయోగపడేదిగా రుజువైంది. ఇతర సలహాపరమైన మెళకువలకు తోడుగా బాంధవ్యాలపరమైన సమస్యలను పరిష్కరించడానికి కూడా తోడ్పడుతుంది. కోపావేశాన్ని నియంత్రించే వ్యూహాల్లో కూడా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. హిప్నోథెరపి ఇంకా ఎన్నో రంగాల్లో మనిషి బాధను ఉపశమింపచేసే శక్తి హిప్నోథెరపీకి వున్నా ఇది వినియోగించకూడాని సందర్భాలు కూడా ఉన్నాయి. డిప్రెస్సివ్‌ ఇల్‌నెస్‌, మూర్ఛ, సైకాసిస్‌ (సీజోఫ్రీనియా) ఇంకా కొన్ని శ్వాసకు సంబంధించిన సమస్యలు ఈ కోవకు చెందినవి.

కొన్ని సర్వసాధారణమైన భయాందోళనలు...
-హిప్నోసిస్‌లో ‘తమపై నియంత్రణ’ కోల్పోతారని ప్రజలు కొన్ని సందర్భాల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ హిప్నోసిస్‌లో ఎంత లోతుల్లోకి వెళ్ళినా వారెంత నిశ్చేతనంగా ఉన్నట్లు కనిపించినా నిజానికి పరిస్థితి పూర్తిగా వారి అదుపులో ఉంటుంది. వారనుకుంటే మాట్లాడగలరు (మాట్లాడకూడదనుకుంటే అలానూ ఉండగలరు).లేచి నిల్చుని వారనుకున్నప్పుడు గదివిడిచి వెళ్ళిపోగలరు. హిప్నొటైజ్‌ చేసిన వ్యక్తి చేత వారి నైతిక నిర్ణయానికి వ్యతిరేకంగా లేక మతపరమైన నమ్మకాలకు విరుద్ధంగా ఏమీ చేయించలేరు. వేదిక మీద ప్రదర్శనలో అన్ని విధాల పనులు చేయించినందువల్ల ప్రజలకేర్పడిన తప్పుడు అవగాహన కారణంగా నియంత్రణ కోల్పోతారని అనిపిస్తుంది. కానీ, వేదిక మీద ప్రదర్శనలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛంద క్రమమని (హప్నాటిస్టుకు ‘అనుమతి’ ఇస్తారు) తెలుసుకోవాలి. కనుక తాము చేయబోతున్నదేమిటో తెలియని కార్యకర్త ఉండడు.


హిప్నోథెరపీ లక్ష్యాలు:

* నొప్పి తగ్గించే మందుల అవసరాన్ని తగ్గించడం
* శిశుజననం జీవితంలో చాలా ప్రశాంతమైన ఘట్టంగా చేయడం
* ప్రసూతి అలసటను తగ్గించడం
* తల్లి, బిడ్డ, ఇతర సిబ్బంది అందరూ కలిసి దీనిలో పాలుపంచుకోవడం
* లామేజ్ పద్దతుల కన్నా తక్కువ హైపర్ వెంటిలేషన్ ను అందించడం
* సంప్రదాయ పద్దతుల స్థానంలో శాస్త్రబద్దమైన విధానాల ద్వారా శిశుజననానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.

ఉదాహరణలు

* జనన శిక్షకులను జనన సహాయకులంటారు.
* బిడ్డను పట్టుకోవడాన్ని, శిశువును గ్రహించడం అంటారు.
* గర్భాశయ సంకోచాన్ని గర్భాశయ సర్జ్ అంటారు.

పరిమితులు

తల్లికి గాని, కడుపులోని భ్రూణానికి గాని హిప్నోథెరపీ వల్ల హాని కలుగుతుందని స్పష్టంగా ఇంతవరకు గుర్తించలేదు. కాని కొన్ని నష్టాలు మాత్రం ఉన్నాయి.

* హిప్నాసిస్ విభాగానికి చెందిన వాళ్లలో ప్రసూతి సమయం ఎక్కువగా ఉంటునట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
* హిప్నోసిస్ కోసం తగిన విధంగా తయారుచేయడానికి నొప్పి తగ్గించే ఇతర విధానాల కన్నా ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చాలా మంది ప్రసూతి వైద్యులు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
* నొప్పి భరించగలిగే స్థాయిలో ఉండే హిప్నోసిస్ వల్ల జనన ప్రక్రియ గురించిన జ్ణాపకశక్తిని తగ్గిస్తుంది.


  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

మన ఆరోగ్యాన్ని రక్షించే వైద్యపరీక్షలు , Our health protecting Medical Tests


ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూక్తి మనం నిత్యమూ పాటిస్తూ ఉండాలి . మన ఆరోగ్యము గురించి మనము తెలుసుకోలేము . అందుకు కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను . ఏ రకమైన అనారోగ్యమూ లేదు . . . నాకెందుకు వైద్యపరీక్షలు ... అనుకునేవారు చాలామంది ఉన్నారు . మన అంతర్గత ఆరోగ్యము గురించి ఒక్కొక్కప్పుడు అంత త్వరగా బయటికి తెలియకపోవచ్చు . పూర్వకాలములో కొంత పెద్ద వయసులో వచ్చే బి.పి. , సుగరు లంటి కొన్ని రోగాలు ఇప్పుడు చాలా తొందరగా చిన్న వయసులోనే బయటపడుతున్నాయి . అందువల్ల సరైన సమయమ్లో తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల పరిస్థితి చేజారిపోకుండా కాపాడుకోవచ్చును.

కొన్ని ముఖ్యమైన పరీక్షలు : ప్రతి సమంత్సరమూ చేయించుకోవలసినవి .

  • పాప్ స్మియర్ పరీక్ష :
  • బ్లడ్ ప్రెషర్ పరీక్ష ,
  • డయబిటీస్ స్క్రీనింగ్ ,
  • 25-హైడ్రాక్షి విటమిన్‌ ' డి ' టెస్ట్ ,
  • క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్‌ (CBE),
  • Hiv టెస్ట్ ,
  • హెపటైటిస్ బి టెస్ట్ ,
  • Routine Blood Tests like -- TC, DC, ESR, Hb, Group and Rh type ,


12-20 ఏళ్ళ మధ్య సామాన్యంగా చేయించు కోవాల్సిన పరీక్షలేంటో ఇప్పుడు చూద్దాం.

పాప్ స్మియర్ పరీక్ష :
స్త్రీలలో సెర్వైకల్ కాన్సర్ ను ముందుగా పసిగట్టే పరీక్ష ఇది . చాలా సింపుల్ గా చేయవచ్చును . HPV (virus) వలన ఈ కాంసర్ వస్తుంది . చైతన్యవంతమైన శృంగార జీవతం గడిపే ప్రతి స్త్రీ ఈ పరీక్ష చేసుకొని ప్రమాదకరమైన జబ్బును పూర్తిగా నివారించుకోవచ్చును .

బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌

రక్తంలో గ్లూకోజ్‌ శాతం ఎంత వుందో తెలిపే డయాబెటిస్‌ పరీక్ష ఇది. వ్యాధి ముదరకముందే తెలుసుకుని చికిత్స తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయమౌతుంది.

రక్తపోటు పరీక్ష

సామాన్యంగా ఏ డాక్టర్‌ దగ్గరికెళ్ళినా బీపీ పరీక్షిస్తారు. లో బీపీ, హై బీపీ.. ఏది ఉన్నా కష్టమే. బ్లడ్‌ ప్రెషర్‌ ఉందని తెలిసినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

రొమ్ము పరీక్ష

రొమ్ము భాగంలో ఏదైనా గడ్డ ఉన్నట్లనిపిస్తే ఆలస్యం చేయకుండా నివృత్తి చేసుకోవడం మంచిది. బ్రెస్ట్‌ కాన్సర్‌లాంటి ప్రమాదమేదైనా పొంచి వుందేమో ఒకసారి బయాప్సీ చేయించుకోవాలి. అలాంటిదేమీ లేకపోతే ఆనందమే కదా. ఒకవేళ కాన్సరైతే తొలిదశలోనే చికిత్స పొందితే తగ్గిపోతుంది.

సి.బి.సి. టెస్ట్‌ (కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌)

ఈ పరీక్ష ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎలా వుంది, ఎనీమియా ఏమైనా వుందా లాంటిది తెలుస్తుంది. అప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

25-హైడ్రాక్షి విటమిన్‌ -డి టెస్ట్ :
ఇది ఎముకల ఆరోగ్యము గిరించి తెలియజేసే పరీక్ష . ఎప్పుడు అవసరమంటే--
ఎముకలు బలహీనము గా ఉన్నప్పుడు .,
ఎముకలు కండరాలు కీళ్ళలో నొప్పులు దీర్ఘకాలం గా ఇబ్బంది పెడుతుంటే ,

బ్లడ్ గ్రూప్ టెస్స్ట్ :
ప్రతి మనిషి నేటి సమాజం లో ప్రమాదాలకు గురవుతూఉంటారు . అత్యవసరం గా బ్లడ్ ఎక్కించవలసి వస్తే బ్లడ్ గూప్ ముందుగా తెలిస్తే త్వరగా ట్రీట్ మెంట్ జరిగేందుకు అవకాశము ఉంటుంది .Rh నెగటివా ? పొజిటివా తెలుస్తుంది .

HIV టెస్ట్ :
వయసులో ఉన్న ఆడ మగ చేసే పొరపాట్లు వలన కొన్ని ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశాలు మిండుగా ఉన్న ఈ రోజుల్లో ముందు జాగ్రత్త గా ఈ పరీక్షలు చేసుకోవడం మంచిది .
Hbs Ag టెస్ట్ :
ఇది పచ్చకామెర్ల కు సంభందించిన పరీక్ష . వైరస్ వలన వచ్చే కాలేయం జబ్బులలో ఈ పచ్చకామెర్ల వ్యాధి అతి భయంకరమైనది . ఇది లైంగిక సంబంధిత వ్యాధి . ముందు జాగ్రత్త వలన పూర్తిగా నయము చేయవచ్చును .


చర్మ కాన్సర్‌ పరీక్ష

ప్రతిరోజూ శరీరం మొత్తాన్నిగమనించాలి. చర్మంపై ఎక్కడన్నా మార్పు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి. స్కిన్‌ కాన్సర్‌ లాంటిదేమైనా వుంటే తక్షణం చికిత్స పొందాలి. కుటుంబంలో ఎవరికయినా చర్మ కాన్సర్‌ ఉన్నట్లయితే ప్రతి మూడేళ్ళకోసారి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి.

క్షయ పరీక్ష

తరచు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు బాధిస్తున్నట్లయితే టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌) పరీక్ష చేయించుకోవాలి.

యూరినాలసిస్‌

మూత్రనాళం లేదా మూత్రపిండాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగితే యూరినాలసిస్‌ చేయించుకోవాలి. యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిస్‌, మూత్రపిండాల్లో రాళ్ళేర్పడం లాంటి సమస్యలు వుంటే వాటికి చికిత్స చేయించుకోవచ్చు.

ఏమీ లేదన్న ధీమాతోగానీ, ఏదో వుందన్న భయంతోగానీ టెస్టు చేయించుకోకుండా ఆలస్యం చేస్తే ఆనక వ్యాధి ప్రబలి బాధపడాల్సొస్తుంది.


  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, January 24, 2011

పిల్లల ఎదుగుదల ,Growth in children

పిల్లల ఎదుగుదల గురించి తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు . మాబాబు అందరి పిల్లల్ల ఎదగడం లేదు . సన్నగా ఉన్నాడు . పాపాయి సన్నగా పీలగా ఉంటుంది . తింది సరిగా తినడం లేదు . ఎదుగుతుందో ,లేదో ? ఇలా తల్లులు ఎంతగానో ఆవేదన చెందుతూ ఉంటారు . పిల్లలు వాళ్ళ ఆకలి ప్రకారం తింటున్నా తమ ప్రేమ వల్ల తినడంలేదని , ఎదగడం లేదని అనుకుంటారు . ఒక్కొక్కప్పుడు నిజంగానే పిల్లల ఎదుగుదల కుంటుపడవచ్చు ... ఎందుకు , వాటి నివారణ మార్గాలు గురించి కొంత జ్ఞానము , వైద్య పరిజ్ఞానము తెలుసుకునేందుకు చదవండి .


పిల్లల ఎదుగుదల ,Growth in children :

తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి హైట్‌లో మార్పులు రావడంలేదని తెగబాధపడుతుంటారు. ఇక్కడ మేము చెప్పే క్యాలిక్యులేషన్‌లతో మీరు మీ పిల్లల్లో ఎదుగుదలను మీరు గమనించగలరు.

పిల్లల ఎదుగుదల ఎలాగుర్తించడం ?

** తల్లిదండ్రుల హైట్ ఎలావుంటే పిల్లల్లోకూడా హైట్ అలాగే ఉంటుందని, దీనిని ఎవరుకూడా నియంత్రించలేరని వైద్యులు తెలిపారు. పిల్లల హైట్ దాదాపు 90శాతం తల్లిదండ్రుల హైట్‌తో సంబంధం ఉంటుంది. తల్లిదండ్రులిరువురు మంచి హైట్ ఉంటే పిల్లల్లోకూడా ఎదుగుదల బాగుంటుంది.

** పిల్లలు పుట్టినప్పుడు సహజంగా వారి పొడవు 50 సెంటీమీటర్లుంటుంది. ఒక ఏడాది తర్వాత 75 సెంటీమీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఇలా పిల్లలు కిశోరావస్థకు చేరుకునేవరకు పెరుగుదల జరుగుతుంటుంది.

** కిశోరావస్థలో పెరుగుదల చాలా వేగంగా పెరుగుతుంది. అమ్మాయిలలోనైతే 10 సంవత్సరాలు, అబ్బాయిలలోనైతే 12సంవత్సరాల తర్వాత పెరుగుదల ప్రారంభమౌతుంది.

** పుష్టికరమైన ఆహారంతోబాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని చిన్నపిల్ల-వైద్యులు తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది. ఈ తరహా పిల్లలు బడి మానివేయడం జరగవచ్చు. వీరిలో జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల తరచు వ్యాధుల బారిన పడతారు.

పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల కలిగే కొన్ని పర్యవసనాలు తిరిగి సవరించుకోలేనివిగా ఉంటాయి. పోషకాహారం లేకపోవడం అనేది పిల్లల్లో తీవ్ర ఆందోళనలు కలిగించే విషయం, పోషకాహారం తక్కువగా లభించే పిల్లలు తప్పనిసరిగా శారీరక, మానసిక లోపాలకు కూడా గురవుతారు. పిల్లలు ముఖ్యంగా విటమిన్ - ఎ ఐరన్, కాల్షియం, అయొడిన్ వంటి పోషక పదార్థాల లోపానికి గురవుతారు. ఆ లోపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అవి పిల్లల ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పై ప్రభావం చూపుతాయి

** టానిక్కులు, ప్రోటీన్ పౌడర్, ఇతర మందులపై ఆశపెట్టుకోకూడదంటున్నారు వైద్యులు. ఇవి బలహీనంగానున్న పిల్లలకు మాత్రమే పనికొస్తాయి.


బిడ్డ ఆరోగ్యం అంటే?

బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు కాకుండా ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం.

బిడ్డ ఆరోగ్య సంరక్షణలో దశలు

* గర్భస్థంగా ఉన్నప్పుడు
* నవజాత శిశువు
* శిశువు దశలో
* చిరు బాల్య దశలో
* ప్రీ – స్కూల్ దశలో

పైన చెప్పిన వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధులకు, ఇతర లోపాలకు ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఈ దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడాటానికి సరైన ఆరోగ్య సేవలు అనేవి గర్భస్థ దశ నుంచి అవసరము. అంతే కాకుండా బాల్య దశలోని ఆరోగ్య స్థితి జీవితంలోని అని్న దశలలోని ఆరోగ్య స్థితిపై ప్రభావితం చూపిస్తుంది.
పిల్లల ఆరోగ్యాని్న పిల్లల మరణాల సంఖ్య మరియు వ్యాధుల సంక్రమణను ఆధారంగా చేసుకొని నిర్ణయించవచ్చును.

పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్ష్యరాస్యత, వయస్సు, లింగం, పరిసరాలు, కుటుంబ పరిమాణం, పోషణ, మాతృశిశు సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం.

పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు
నవజాత శిశువుకు వచ్చే ఆరోగ్య సమస్యలు – కామెర్లు, ధనుర్వాతం, శ్వాస సంబంధ సమస్యలు, ఉష్ణోగ్రతను క్రమపరచకోవటం (బయటి వాతారణంలోని ఉష్ణోగ్రతను తట్టుకోకపోవటం), నోటి పూత సంబంధిత వ్యాధులతో బాధపడడం.
అంటుసోకటం మొదలగున్నవి, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు ఎక్కువగా ఒక గంటలోపు బిడ్డ బరువు చూడటం ముఖ్యమైన చర్య. మంచి ఆరోగ్యంతో పోషకాహారంతో ఉన్న తల్లులకు పుట్టే బిడ్డలు 3.5 కేజీల బరువు ఉంటారు. కానీ భారతదేశంలో పిల్లల యొక్క కనీస బరువు 2.5 నుండి 2.9 కేజీలు. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను (తక్కువ బరువుతో పుట్టిన) పిల్లలు అంటారు.

పిల్లల పెరుగుదల అభివృద్ధిని పర్యవేక్షించుట

పిల్లల పెరుగుదల, అభివృద్ధిని పర్యవేక్షించడం చాలా ముఖ్యమైనది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని వారి పోషణ స్థితిని తెలియచేస్తుంది. మరియు పిల్లల పెరుగుదలలో వచ్చే తేడాలను తెలియచేస్తుంది. దీని వలన కుటుంబ స్థాయిలో నివారణోపాయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది.

పిల్లలలో పెరుగుదల
పిల్లలలో ముఖ్యంగా ఎత్తు, బరువు, తల, ఛాతిలను కొలవటం ద్వారా తెలుసుకోవచ్చును..
పిల్లలలో పెరుగుదలను క్రమ బద్ధంగా పర్యేవేక్షించుట ద్వారా కుపోషణ వలన పిల్లల పెరుగుదలలో ఏదైనా తరుగుదల కనిపించటం తెలుస్తుంది. వెంటనే ఆరోగ్య కార్యకర్త /తల్లులు వారిని తిరిగి మామూలు స్థితికి రావడానికి చర్యలు తీసుకోవచ్చు. క్రమంగా బరువు పెరగటం అనేది ఆరోగ్యానికి సూచిక వంటిది. (భారత ప్రభుత్వం వారు) రూపొందించిన (గ్రోత్ చార్ట్ / పిల్లల పెరుగుదల పట్టికలో) పిల్లల బరువును నమోదు చేయవచ్చును. ఈ పట్టిక ఆరోగ్య కేంద్రాలలో లభ్యమవుతుంది.
సంవత్సరం వరకు పిల్లల బరువును నెలకొకసారి చూడాలి. రెండు సంవత్సరాలు వచ్చే వరకు రెండు నెలలకు ఒకసారి చూడవచ్చు. 5 సం.లు వచ్చే వరకు మూడు నెలలకు ఒకసారి చూడవచ్చును.

మంచి పోషణ కలిగి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బరువు 1వ స్థితికి కంటే పైకి ఉంటుంది.
బిడ్డ బరువు 1వ – 2 మరియు 2 – 3 మధ్య ఉండే వారికి ఇంటి వద్ధనే అనుబంధ ఆహారాన్ని సరిపోయినంత అందించవలసి ఉంటుంది.
బిడ్డ బరువు 3వ లైను కంటే తక్కువ ఉంటే వారు డాక్టరును సంప్రదించి జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. వీరు తీవ్రమైన కుపోషణను గురి అవుతుంటారు.
బిడ్డ బరువు 4వ లైను కంటే తక్కువ ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందవలసిన అవసరం లేదు.

గ్రోత్ చార్టు

* బిడ్డల పెరుగుదలను క్రమంగా పర్యేవక్షించడానికి
* పిల్లలలో కుపోషణ స్థాయిని నిర్ధారించడానికి
* తగిన చర్యలను తీసుకోవడానికి
* ఆరోగ్య కార్యకర్తలను, తల్లులను బిడ్డల బరువును తీసుకోవటం వలన ఉపయోగం గురించి అవగాహన కల్పించవచ్చు. మరియు కుపోషణను నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు.
* పిల్లలలో మొదటి సంవత్సరంలో అనూహ్యమైన పెరుగుదల కన్పిస్తుంది.

ఎటువంటి అంటుసోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరియు వారు వేసుకునే దుస్తులు, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలను కనపరచాలి. దీని వలన పిల్లలో రక్షణ భావం, నమ్మకం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుంది. సరిపోయినంత ప్రేమ, ఆప్యాయత మరియు ఇతర అవసరాలకు సరైన స్థితిలో లేకపోవడం వలన పిల్లలలో అభద్రతాభావం ఏర్పడుతుంది. దీని వలన వారి మానసిక మరియు ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి. కనుక తల్లిదండ్రులకు వారి పిల్లలు శారీరకంగా, మానసికంగా భావోద్రేకాలపరంగా రక్షణ కల్పించడం అవసరం. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని, నమ్ముకున్న విషయాలను గ్రహించే శక్తిని మరియు భద్రతాభావాన్ని కల్పిస్తుంది.

పిల్లలలో వచ్చే వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వటం
సాధారణంగా బిడ్డకు నెల రోజుల నుంచి 5 సం.ల వయస్సు వరకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటి వలన పిల్లలు వ్యాధులకు గురికావటం వలన మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. పిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధులు 4 రకాలు ఉంటాయి.

* డయేరియా
* ఏ.ఆర్.ఐ. (శ్యాస కోశ వ్యాధులు)
* వ్యాధి నిరోధక టీకాల ద్వారా నిరోధించ గల వ్యాధులు
* పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు

పై వీటన్నింటికి కూడా మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయాలు.



పిల్లలలో పెరుగుదల విధానం


పిల్లల పెరుగుదలలో ముఖ్యమైన దశలు / మైలు రాళ్ళు

ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయ గలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు. ఒక తల్లి తండ్రిగా, గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఎదగరు. కావున , పక్కింటి బిడ్డ ఫలానా పనులు చేయగలుగుతున్నాడు, కాని తన , సొంత బిడ్డ చేయలేకపోతున్నాడే అని విచారించడం నిరర్ధకం. ఫలానా వయస్సులలో పిల్లలు చేయదగ్గ పనుల కొరకు, వారిని కొంతకాలం గమనించవలెను.

కొన్ని నెలల ఆఖరున ఫలానా పని ఇంకా చేయలేని యెడల, పిల్లల నిపుణులను సంప్రదించవలెను. దీనివల్ల మనం తెలుసుకోవలసిన సత్యం ఏమనగా ఆ బిడ్డకు రుగ్మత లేక కలవరపాటు వలన భిన్నంగా ప్రవర్తించు చున్నాడని, అప్పుడప్పుడు ఆ బిడ్డ కొన్ని ప్రాంతాలలో సమాన వయస్కులైన మిగతా పిల్లల కన్నా మెల్లగా అభివృద్ధి చెందవచ్చు, కాని కొన్ని విషయాలలో మిగతా పిల్లల కంటే ముందుండ వచ్చును. బిడ్డ నడవడానికి సిధ్ధంగా లేనప్పుడు బలవంతంగా నడిపించుట సహాయపడదు

అభివృద్ధి లోని ఆలస్యమును త్వరితంగా గుర్తించుట

బిడ్డ వయసు - చేయగలగ వలసిన పనులు

* 2 నెలలు - సాంఘికమైన చిరునవ్వు.
* 4 నెలలు - మెడను నిల్పుట
* 8 నెలలు - ఆధారం లేకుండా కూర్చోనుట.
* 12 నెలలు - నిలబడుట.



పుట్టుక నుండి 6 వారాల వరకు

* బిడ్డ వీపు మీద పడుకుని తల ఒక ప్రక్కగా తిప్పిఉండును.
* అకస్మాతైన శబ్ధానికి అతడి శరీరం ఉల్లికిపడి బిఱుసుగా మారును.
* పిడికిలి గట్టిగా మూసివేయబడి ఉండును.
* అతడి హస్తానికి మోటుగా తగిలిన వస్తువును దగ్గరకు తీసుకోగలడు. దీనిని గ్రాస్ప్ రిఫ్లెక్స్ అంటారు.



6 నుండి 12 వారాల వరకు

* అతడి మెడను బాగా నిలుపుట నేర్చుకుంటాడు.
* వస్తువుల మీద చూపు నిలపగలుగుతాడు.



3 నెలలు

* వెల్లకిలా పడుకున్నప్పుడు అతడి చేతులు మరియు కాళ్ళు సమానంగా కదల్చగలడు. సమన్వయముకాని లేక తుళ్ళిపడే కదలికలు కావు. బిడ్డ ఏడుపే కాకుండా గుడుగుడు అను, ఇతర శబ్ధములు చేయును.
* బిడ్డ తల్లిని గుర్తించి మరియు ఆమె గొంతుకు స్పందించును.
* బిడ్డ చేతులు ఎక్కువగా , తెరిచే యుండును.
* బిడ్డను ఎత్తుకున్నప్పుడు, బిడ్డ తన తలను లిప్తకాలము కంటే ఎక్కువ కాలం నిలపగలడు



6 నెలలు

* బిడ్డ తన చేతులను ఒక దానితో ఒకటి అంటించి ఆడుకుంటాడు
* బిడ్డ తన చుట్టు ప్రక్కల చేయు శబ్ధములకు తలత్రిప్పును.
* బిడ్డ తన వీపు నుండి పొట్టమీదకు , పొట్టమీదనుండి వీపు మీదకు తిరుగుతాడు
* ఆధారంతో బిడ్డ కాసేపు కూర్చోగలడు.
* బిడ్డను ఎత్తుకున్నప్పుడు, అతనికాళ్ళమీద కాస్త బరువును భరించగలడు.
* అతని పొట్టమీదున్నప్పుడు, ఆ బిడ్డ తన చాపబడిన చేతులతో వాడి బరువును మోయగలడు.



9 నెలలు

* శరీరం పైకి లేపకుండా తన చేతులతో ఆధారం లేకుండా కూర్చోగలడు
* బిడ్డ తన చేతులతో మరియు మోకాలితో పాకగలడు.



12 నెలలు

* బిడ్డ నిలబడుటకు పైకి త్రోస్తాడు.
* మామ అను మాటలు అనుట ప్రారంభించును.
* సామాన్లు పట్టుకుని నడవగలుగును.



18 నెలలు

* సహాయం లేకుండా గ్లాసుపట్టుకొనగలడు మరియు వలకకుండా త్రాగగలడు.
* బిడ్డ పడిపోకుండా, తూలిపోకుండా ఒక పెద్ద గది గుండా ఆధారం లేకుండా నడవ గలడు.
* రెండు , మూడు మాటలు పలుక గలడు.
* బిడ్డ తనంతట తానే తినగలడు.



2 సంవత్సరంలు

* బిడ్డ పైజమా లాంటి బట్టలను తీసివేయగలడు.
* బిడ్డ పడిపోకుండా పరిగెత్తగలడు.
* బిడ్డ బొమ్మల పుస్తకం లోని బొమ్మల మీద ఆసక్తి కనబరచును.
* బిడ్డ తన కేమి కావాలో తెలుపగలడు.
* బిడ్డ ఇతరులు చెప్పిన మాటలు తిరిగి చెప్పగలడు.
* బిడ్డ తన శరీరం లోని కొన్ని అవయవాలను గుర్తించగలడు.



3 సంవత్సరంలు

* బిడ్డ బంతిని పైకి విసరగలడు ( ప్రక్కకు లేదా క్రిందకు కాకుండా )
* నీవు అమ్మాయివా అబ్బాయివా అనే చిన్న ప్రశ్నలకు బిడ్డ సమాధానం చెప్పగలడు.
* బిడ్డ వస్తువులను అవతలకు పెట్టడానికి సహాయపడును.
* బిడ్డ కనీసం ఒక రంగు పేరైనా చెప్పగలడు.



4 సంవత్సరంలు

* మూడు చక్రాల బండిని త్రొక్కగలడు.
* పుస్తకాలలోని పత్రికలలోని బొమ్మలను గుర్తించగలడు.



5 సంవత్సరంలు

* బిడ్డ తన బట్టలకు గుండీలు పెట్టుకొనగలడు.
* బిడ్డ కనీసం మూడు రంగుల పేర్లను చెప్పగలడు.
* బిడ్డ పాదాలను ఒకదాని కొకటి మార్చి మెట్ల కిందకు దిగగలడు.
* బిడ్డపాదాలు దూరంగా పెట్టి గెంతగలడు.


పిల్లలలో నిర్ధేశిత-ఎత్తు - బరువు



సేకరణ: Dr.Seshagirirao -MBBS.


  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, January 12, 2011

స్త్రీల పొత్తికడుపులో నొప్పి, Lower Abdominal Pain in Women



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -స్త్రీలలో పొత్తి కడుపులో నొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--పొత్తికడుపులో నొప్పి! పతి స్త్రీ.. జీవితంలో ఎప్పుడోసారి ఎదుర్కొనే సమస్యే ఇది. కానీ 12-20% మందిలో ఇది వీడకుండా దీర్ఘకాలం వేధిస్తోంది. గైనకాలజిస్టులను సంప్రదించే స్త్రీలలో 10% మంది ఇటువంటి దీర్ఘకాలిక నొప్పితోనే వస్తున్నారంటే ఈ 'నొప్పి' తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కొంతమందికైతే రిపోర్టులన్నీ నార్మల్‌, 'నొప్పి' మాత్రం బాధిస్తూనే ఉంటుంది.

సున్నితమైన పునరుత్పత్తి అవయవాలు ఉండే పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావటమన్నది... నవయవ్వనం నుంచి వృద్ధాప్యం వరకూ.. ఏ దశలోనైనా ఎదురవ్వచ్చు. నెలసరి నుంచి సంభోగం వరకూ.. ఏ సమయంలోనైనా బాధించొచ్చు. కొందరి విషయంలో ఇది దీర్ఘకాలికంగా తయారై మనశ్శాంతి లేకుండా చెయ్యచ్చు. కుటుంబ సంబంధాల్నీ దెబ్బతియ్యచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. అయినా అన్నిసార్లూ దీనికి కచ్చితమైన కారణం కనుక్కోవటం అంత సులభమేం కాదు. అందుకే దీన్ని అర్ధం చేసుకునేదెలా? ఎదుర్కొనేదెలా? ఏమిటి దీనికి పరిష్కారం?

పొత్తికడుపులో నొప్పి.. ఉద్ధృతంగా వస్తే... ఆ నొప్పికి కారణాలు చాలావరకూ స్పష్టంగానే తెలుస్తుంటాయి. వాటికి వెంటనే చికిత్స చెయ్యటం సాధ్యపడుతుంది. కానీ చాలామందికి ఈ నొప్పి దీర్ఘకాలంగా వేధిస్తుంటుంది. కొందరికి నొప్పి రోజంతా బాధిస్తుంటే.. మరికొందరికి తరచుగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. అందుకే పొత్తికడుపులో నొప్పితో బాధితులు వచ్చినప్పుడు వైద్యులు ఈ నొప్పికి కారణం ఏమై ఉండొచ్చనేది అర్థం చేసుకునేందుకు లోతుగా అన్వేషించే ప్రయత్నం చేస్తుంటారు.
చెప్పలేని బాధ
గర్భాశయం, అండాశయాలు, ఫలోపియన్‌ ట్యూబులు.. ఇలా స్త్రీ పునరుత్పత్తి అవయవాలన్నీ పొత్తికడుపులోనే ఉంటాయి. గర్భాశయ ముఖద్వారం.. యోని.. ఈ అవయవాలకు అనుసంధానంగా ఉంటాయి. వీటిలో తలెత్తే చాలా సమస్యల్లో కనబడే ప్రధాన లక్షణం.. నొప్పి! కాబట్టి ఈ 'నొప్పి' అందరికీ ఒకేతీరులో ఉండాలని లేదు. కొందరు ఈ నొప్పి కచ్చితంగా ఏ ప్రాంతం నుంచి వస్తోందో చెప్పగలుగుతారుగానీ మరికొంత మందికి.. అసలా నొప్పి ఏమిటో, ఎక్కడి నుంచి వస్తోందో కూడా చెప్పలేకపోతుంటారు. అది బొడ్డు కింది నుంచా.. యోని నుంచా.. యోనికీ-మలద్వారానికీ మధ్య ప్రాంతం నుంచా.. ఇలా ఎక్కడి నుంచి వస్తోందో చెప్పటం కూడా కష్టమవుతుంటుంది. కొందరైతే అసలది నొప్పో.. లేక ఏదైనా అసౌకర్యమో కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు. ఏదో ఇబ్బందికరమైన బాధ. చాలా అసౌకర్యంగా ఉంటుంది కానీ అది ఏమిటో, ఎక్కడి నుంచి వస్తోందో చెప్పటం కష్టం. అందుకే వైద్యులు.. ఈ నొప్పిని అర్థం చేసుకునేందుకు.. దీనికి మూలాలు ఎక్కడున్నాయో గుర్తించేందుకు బాధితులను ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు.

దారి చూపే సమాచారం
ప్రధానంగా నొప్పి ఎక్కడ, ఎప్పుడు, లేదా ఎప్పటి నుంచి వస్తోంది? ఏ సమయంలో మొదలైంది.. తర్వాత పెరుగుతోందా? లేక అలాగే ఉండిపోయిందా? లేక దానికి నెలసరితో ఏదైనా సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోందా? నెలసరికి ముందుగానీ.. తర్వాతగానీ వస్తోందా? లేక నెలసరి వెళ్లిన తర్వాత ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో వస్తోందా? నొప్పితో పాటు స్రావాల వంటివీ అవుతున్నాయా? మూత్ర విసర్జనలోగానీ, మల విసర్జనలోగానీ సమస్యలున్నాయా? నొప్పి ఎలా వస్తోంది? ఏం చేస్తే తగ్గుతోంది? దానివల్ల రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారా? లేదా? పడుకుంటే తగ్గిపోతోందా?.. ఇలా వైద్యులు రకరకాలుగా నొప్పికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తారు. దీనిని బట్టి ఆ నొప్పి ఏదైనా శారీరక సమస్య కారణంగా, లోపలి అవయవాల్లో వస్తున్న తేడాల కారణంగా వస్తోందా? లేక ఏదైనా తీవ్రమైన మానసిక సమస్యల వల్ల తలెత్తిందా? అన్నది గ్రహించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కచ్చితంగా నిర్ధారించుకునేందుకు పరీక్షలు ఉపయోగపడతాయి.

నొప్పికి మూలాలు
సాధారణంగా పొత్తికడుపులో నొప్పి అన్నది.. నెలసరి సమస్యలతో సంభోగం, దాంపత్య జీవితంతో.. ఇలా ఎన్నో కారణాలతో రావచ్చు. ఈ నొప్పి యుక్తవయస్కుల్లో నెలసరి సమస్యలు ప్రధాన కారణమైతే పెళ్త్లె, పిల్లలున్న మధ్యవయస్కుల్లో చాలా వరకూ సంభోగంతో, ఎండోమెట్రియోసిస్‌, పెల్విక్‌ ఇన్ఫెక్షన్‌.. లేదా కాన్పు సమయంలో జరిగిన గాయాల కారణంగా కూడా నొప్పి రావచ్చు. వీటి గురించి క్లుప్తంగా చూద్దాం.

నెలసరితో నొప్పి
* నెలసరితో పాటుగా పొత్తికడుపులో నొప్పి అన్నది చాలామందిలో కనబడే సమస్య. రజస్వల అయిన రెండుమూడేళ్ల తర్వాత ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ నొప్పిని 'స్పాస్మోడిక్‌ డిస్‌మెనోరియా' అంటారు. రుతుక్రమంలో భాగంగా గర్భసంచిలో ఏర్పడిన పొరను బయటకు పంపించేందుకు.. నెలసరి సమయంలో గర్భసంచి బలంగా సంకోచిస్తుంటుంది. ఫలితంగా ఆ సమయంలో తెరలు తెరలుగా నొప్పి వచ్చి పోతుండొచ్చు. వీళ్లు నెలసరి ఆరంభమైన రోజు నుంచే 'పెయిన్‌ కిల్లర్స్‌' మొదలుపెట్టి, దాన్ని ఒక కోర్సులా మూడు రోజులూ తీసుకోవాలి. మిగతా నొప్పులతో పోలిస్తే ఈ నెలసరి నొప్పి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది బాగా తీవ్ర దశకు చేరుకుంటూ.. పోతూ.. వస్తుంటుంది. ఇది లోపల జరుగుతున్న ప్రక్రియ కారణంగా వస్తున్న నొప్పి కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పోయేది కాదు. కాబట్టి అదే పోతుందిలే అని బాధపడే కంటే ముందే పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవటం ఉత్తమం. బిళ్లలకు అలవాటు పడిపోతామేమోనని భయపడాల్సిన పని లేదు. నొప్పి ఒక దశకు చేరుకుంటే.. అప్పుడు బిళ్లలు వేసుకున్నా తగ్గదు. పైగా ఆ తీవ్రమైన నొప్పికి వాంతుల వంటివీ రావచ్చు. కాబట్టి దీన్ని ముందే ఊహించి.. ముందు నుంచే బిళ్లలు వాడుకోవటం ఉత్తమం. నెలసరి అన్నది ప్రకృతి సహజమని, దానితో నెగ్గుకురావటం ఎలాగో తెలుసుకోవటం ముఖ్యమని అర్థం చేసుకోవటం అవసరం.

* పొత్తికడుపులో నొప్పి అన్నది సుఖవ్యాధుల వల్ల కూడా రావచ్చు. కాబట్టి లైంగికంగా చురుకుగా ఉన్న ఆడపిల్లలు, స్త్రీలకు నొప్పి వస్తుంటే ఆ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించటం కూడా అవసరం.

* కొందరిలో నొప్పి నెలసరికి ముందు వస్తుంటుంది, చాలాసార్లు నెలసరి రాగానే తగ్గిపోతుంది. వీరిలో చాలా వరకూ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్‌గానీ.. ఇతరత్రా మరేదైనా కారణం ఉందేమో పరిశీలించాల్సి ఉంటుంది.

* గర్భాశయంలో నెలనెలా పెరుగుతుండాల్సిన ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాకుండా.. ఇతరత్రా ప్రాంతాల్లో కూడా పెరుగుతుండటం పెద్ద సమస్య. దీన్నే 'ఎండోమెట్రియోసిస్‌' అంటారు. దీనివల్ల కూడా నెలసరి సమయంలో నొప్పి రావచ్చు. లేదా గర్భాశయంలో కణితులు (ఫైబ్రాయిడ్స్‌) పెరుగుతున్నా కూడా నొప్పి వస్తుంది.

* ఒకవేళ సంతానం కలగకుండా.. పొత్తికడుపులో నొప్పి వేధిస్తుంటే.. చాలా వరకూ 'ఎండోమెట్రియోసిస్‌'ను అనుమానించాల్సి ఉంటుంది. లేదా ఫలోపియన్‌ ట్యూబులు మూసుకుపోవటానికి కారణమైన 'క్రానిక్‌ పెల్విక్‌ ఇన్ఫెక్షన్‌' వంటివి కూడా కారణం కావచ్చు. వీటిని పరీక్షల్లో నిర్ధారించుకోవచ్చు.
.
అన్నీ నార్మల్‌.. కానీ నొప్పి!
ఎంతోమంది స్త్రీలు దీర్ఘకాలంగా పొత్తికడుపులో నొప్పితో బాధపడుతుంటారు. ఎన్నో పరీక్షలూ పూర్తవుతాయి.. కానీ నిర్దిష్టమైన కారణమేదీ కనబడదు. వైద్యులు స్పష్టమైన కారణమేదీ లేదని చెబుతున్నా.. వాళ్లకు నొప్పి మాత్రం వేధిస్తూనే ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక తీవ్ర వేదన, క్రమేపీ కుటుంబ జీవితం.. దాంపత్య జీవితం అన్నీ ప్రభావితమవటం వంటివీ మొదలవుతాయి. చివరికి ఏం చెయ్యాలో పాలుపోని అయోమయ స్థితిలో పడిపోవచ్చు. ఇటువంటి వారి విషయంలో... పరీక్షల్లో అంతా 'నార్మల్‌'గానే ఉంది కాబట్టి 'నొప్పి' లేదని కాదు. ఆ నొప్పి 'కేవలం మానసికం' అని వదిలెయ్యటానికి లేదు. వారికి 'నొప్పి' ఉన్న మాట వాస్తవం అని గుర్తించటం, దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించటం అవసరం. అయితే అన్నిసార్లూ నొప్పికి కచ్చితమైన కారణాలు గుర్తించటం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు నెలనెలా గర్భాశయంలో పెరుగుతుండే ఎండోమెట్రియం పొరలు.. అక్కడి నుంచి బయటపడి చిన్నచిన్నగా పొత్తికడుపులో అక్కడక్కడ అతుక్కుని ఉన్నా కూడా నొప్పి వస్తుంది. కానీ వాటిని సాధారణ పరీక్షల్లో గుర్తించటం అంత తేలిక కాదు. దీర్ఘకాలంగా పొత్తికడుపులో ఇన్ఫెక్షన్‌ ఉన్నా కూడా దాన్ని గుర్తించలేకపోవచ్చు. వీటికి నొప్పి ఉంటుంది గానీ ఆ కారణాలను గుర్తించటం కష్టం. వీరి విషయంలో మరింత లోతుగా పరీక్షలు చేయటం.. వాటిలోనూ ఏమీ బయటపడకపోతే నొప్పి నుంచి బయటపడేందుకు ఇతర మార్గాలను అన్వేషించటం అవసరపడొచ్చు.
కారణాలు
గర్భిణీగా ఉన్నప్పుడు
అబార్షన్‌ కావడం, గర్భాశయంలో కాకుండా అండవాహికలలో గర్భం ఏర్పడి దానికదే చెదరిపోవడం, గర్భాశయంలో ఏర్పడిన పిండం లోపలే చనిపోయినప్పుడు చాలా తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పితోపాటు ఇతర లక్షణాలు, అంటే రక్తస్రావం మొదలైనవి కనిపిస్తాయి.

బహిష్టు క్రమానికి సంబంధించి
బహిష్టు సమయంలో 2 నుంచి 3 రోజుల ముందునుంచి వచ్చే నొప్పి, బహిష్టు స్రావం ఆగిపోయే వరకూ ఉండే నొప్పి (డిస్మెనోరియా), ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌, బహిష్టు మొదలైన 12 నుంచి 14 రోజుల మధ్య అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో కొంత మందిలో పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఒకటినుంచి రెండు రోజుల వరకూ ఉంటుంది.

గర్భాశయ కారణాలు
గర్భాశయంలో కంతులు, ఎండోమెట్రియోసిస్‌, అడినోమయోసిస్‌ వంటి గర్భాశయ గోడల కణజాలంలో సాధారణ మార్పులు కలగడం, గర్భాశయ స్థానంలో మార్పు రావడం, గర్భాశయం యోనిభాగంలోకి లేదా యోని వెలుపలకు జారడం.

అండాశయ కారణాలు
నీటి బుడగలలాంటి సిస్ట్‌లు (చాకొలెట్‌ సిస్ట్స్‌) పగలడం, వొవేరియన్‌ సిస్ట్‌ ఉండటం. ఈ రెండు కారణాల్లో పొత్తి కడుపులో నొప్పితోపాటు బహిష్టు క్రమంలో తేడాలు కూడా వస్తాయి.

పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌
గర్భాశయం, గర్భాశయ వాహికలు, అండాశయాలు, దానికి సంబందఙంచిన ఇరుప్రక్కల భాగాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం

జీర్ణకోశ వ్యవస్థలకు చెందిన వ్యాధులు
- ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌, అపెండిసైటిస్‌, మలబద్ధకం, మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకడం, లేదా రాళ్లు ఏర్పడటం, ఎముకలకు సంబంధించిన, ముఖ్యంగా నడుము భాగంలోని ఎము కల, కండరాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, చిట్లడం తదితర కారణాల వల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.ఇవే కాకుండా, గర్భాశయ వాహికల స్థితిని తెలుసు కోవడానికి, ప్లిలలు పుట్టని స్త్రీలకు చేసే పరీక్ష అయిన హిస్టరో సాల్పింజోగ్రామ్‌ (హెచ్‌ఎస్‌జి) వాడే రసాయన పదార్థాల వల్ల కూడా ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు.

అంతేకాకుండా, పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలలో దేనితోనో ఒకదానితో బాధపడుతూ, మానసిక విచారం, ఆందోళన, దిగులుకు లోనైన వారిలో కూడా పొత్తి కడుపు నొప్పి అంత సులభంగా నయం కాదు. తరచుగా బాధిస్తుంటుంది కూడా.

-నొప్పితో కూడిన సమస్యలు
గర్భాశయానికి సంబంధించిన వ్యాధులతో కలిగే నొప్పి ముందు పొత్తి కడుపులో మొదలై, తరువాత కడుపు మొత్తానికి ప్రాకుతుంది.పొత్తికడుపులో నొప్పి ఉండి బహిష్టులు కాని వారిలో ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వంటివి కారణమై ఉంటాయి.
ఆకలి కాకపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం, వాంతులు కావడం మొదలైనవి జీర్ణాశయగత వ్యాధులకు సంబంధించిన పొత్తి కడుపు నొప్పితో అనుసంధానమై ఉంటాయి.
తరచుగా మూత్రం పోవడం, మూత్ర విసర్జనలో నొప్పి, అరుదుగా జ్వరంతో కూడి పొత్తి కడుపు నొప్పి మూత్రాశయ వ్యాధుల్లో ఉంటుంది.
జ్వరం, చలి, వణుకు, మూత్రం కష్టంగా ఉండటం తదితర లక్షణాలతో కూడిన పొత్తి కడుపు నొప్పి ఎక్యూట్‌ పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌లో ఉంటుంది.
కడుపు నొప్పితోపాటు మూర్ఛ వచ్చి పడిపోవడం, కళ్లు తిరిగి పడిపోవడం ఉంటే పొట్టలో రక్తస్రావాన్ని కలిగించే వ్యాధులున్నాయని అనుమానించి తక్షణమే వైద్య సహాయం పొందాలి. గర్భాశయంలో

అసాధారణ ఎదుగుదలలు ఉన్నా, కంతులు ఉన్నా నాడి కొట్టుకోవడం, బిపి, గుండె పని తీరులలోనూ తేడాలు ఉండే అవకాశా లుంటాయి.

పరీక్షలు
వ్యాధిని నిర్ధారించే పరీక్షలతోపాటుగా సాధరాణ వైద్య పరీక్షలైన హీమోగ్లోబిన్‌, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ కూడా చేయించాల్సి ఉంటుంది. అలాగే కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌, యూరిన్‌ కల్చర్‌ అవసర

మవుతాయి. గర్భిణీలలో అయితే బి సబ్‌యూనిట్‌ ఆఫ్‌ హెచ్‌సిజి నిర్ధారణ వల్ల గర్భం ఎక్కడ ఏర్పడిందనేది తెలుస్తుంది. ఉదరకోశం మొత్తం ఎక్స్‌రే, స్కానింగ్‌ మొదలైన పరీక్షలు అవసరం అవుతాయి. అరు దైన వ్యాధుల్లో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణకు లాపరోస్కోపీ అవసరం అవుతుంది. చాలా వరకూ పొత్తి కడుపులో కలిగే నొప్పికి కారణ మయ్యే వ్యాధులు సత్వరమే చికిత్స చేయాల్సినవై ఉంటాయి. వాటిలో సుమారు 50 శాతం రోగులకు శస్త్ర చికిత్సలు అవసరం కావచ్చు. మిగిలిన వ్యాధుల్లో లక్షణాను సారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

వ్యాధి రాకుండా...
పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌
పరషనల్ హైజిన్‌ పాటిస్తూ ఉండాలి . వివాహ స్త్రీలు కాపురం తరువాత నీటితో శుబ్రము గా కడుగుకోవాలి .

అండాశయంలో కంతులు
విటమిన్ల తో కూడిన పౌస్టికాహారము తీసుకోవాలి .

మూత్రాశయ వ్యాధుల్లో
ఎక్కువగా నీరు త్రాగాలి . ప్రతిరోజూ ఉదయం పరగడుపున సుమారు 1 లీటరు నీటిని తీసుకోవాలి .

మూత్రాశయ రాళ్లకు్ఎక్కువగా నీరు త్రాగాలి.

గర్భాశయం కిందకు జారితే
మంచి వైద్యుని సంప్రదించి ఆపరేషన్‌ చేసుకోవాలి .

మలబద్ధకం
మలబద్ధకం, గ్యాస్‌ చేరడం, మొదలైన వాటికి త్రిఫలాను మించిన ఔషధం లేదు. దీనిని 5 గ్రాముల చొప్పున రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.

బహిష్టు సమయంలో
dyamen మాత్రలు తీసుకోవాలి.

మెనోపాజ్‌లో
అశ్వగంధ, శతావరి ,లోద్ర ఉన్న ఆయుర్చేదిక్ మందు పాలతో రోజుకు రెండు సార్లు సేవించాలి.


పొత్తికడుపులో నొప్పితో పాటు..
** మలద్వారం గుండా రక్తం ** 50 ఏళ్లు పైబడిన వారిలో.. కొత్తగా మలవిసర్జన అలవాట్లు మారిపోవటం ** నెలసరి నిలిచిపోయిన తర్వాత కొత్తగా మొదలయ్యే నొప్పి ** పొత్తికడుపులో చేతికి గట్టిగా గడ్డలా తగులుతుండటం ** వేగంగా బరువు తగ్గిపోతుండటం ** 40ఏళ్లు దాటిన తర్వాత.. రుతుస్రావం అస్తవ్యస్తంగా అవుతుండటం ** సంభోగానంతరం రక్తస్రావం అవుతుండటం ** నొప్పి కంటే ఆత్మహత్య మేలనిపిస్తుండటం.....

నొప్పితో పాటు ఈ లక్షణాల్లో ఏవి కనబడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కొందరి విషయంలో లైంగిక వేధింపులకు గురవ్వటం, మానసిక భయాలు.. అవి కూడా పొత్తి కడుపులో నొప్పి రూపంలో బయట పడుతుండొచ్చు. కాబట్టి వీటినీ పరిశీలించాల్సి ఉంటుంది.

సంభోగంతో నొప్పి
సంభోగం సమయంలో నొప్పి చాలామందిలో కనబడే సమస్యే. దీన్ని 'డిస్పరూనియా' అంటారు. ఈ నొప్పి ఇటీవలే ఉన్నట్టుండి మొదలైందా? మొదటి నుంచీ ఇంతే బాధాకరంగా ఉన్నదా? అంగ ప్రవేశం సమయంలోనే నొప్పి ఉంటోందా? లేక సంభోగం ముగిసిన వెంటనే నొప్పి వస్తోందా? అన్నది ముఖ్యం.

* 'ఎండోమెట్రియోసిస్‌', పొత్తికడుపులో ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి.. సంభోగం సమయంలో నొప్పి ఉండొచ్చు.

* కాన్పు తర్వాత సంభోగంలో నొప్పిగా ఉందంటే కాన్పు సమయంలో పెట్టిన చిన్న కోత.. సరిగా మానకపోవటం.. లేదా మానిపోయిన గాటు ప్రాంతం మందంగా తయారవటం.. లేదా ఇన్ఫెక్షన్ల వంటివి కారణం కావచ్చు.

* ఎప్పుడూ మామూలుగానే ఉండి ఇటీవలే నొప్పిగా అనిపిస్తుంటే.. ఏవైనా కుటుంబంలో, జీవనశైలిలో వచ్చిన మార్పులు నొప్పికి దోహదం చేస్తున్నాయేమో చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు లైంగిక జీవితానికి దూరంగా ఉండాలన్న కోరిక, సంభోగం పట్ల, లైంగిక జీవితం పట్ల విముఖత.. 'నొప్పి' రూపంలో బయటపడొచ్చు. లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఈ నొప్పిని ఒక కారణంగా కూడా చూపిస్తుండొచ్చు. తాము అనుభవిస్తున్న అసౌకర్యాన్ని మరో రూపంలో, పదంలో చెప్పుకోలేక ఆ ఇబ్బందిని 'నొప్పి' అంటుండొచ్చు. అది నిజంగా నొప్పి కాకపోవచ్చు.. కానీ దానికీ పరిష్కారం గురించి చూడాల్సిందే. కొన్నిసార్లు.. భర్తల విషయంలో అనుమానాలు, భయాలు ఉన్నవారు కూడా 'నొప్పి' అంటుండవచ్చు. భర్తల నుంచి తమకు సుఖవ్యాధులు సంక్రమిస్తాయా? అన్న భయాలు కూడా నొప్పిలా తయారవ్వచ్చు. అటువంటప్పుడు పరీక్షలు చేయించుకుని ఆ భయాలు పోగొట్టుకోవటం కూడా ముఖ్యమే. కాబట్టి మనసులో ఉన్న ఈ భయాలు, అనుమానాలు సంశయాలన్నింటినీ నిస్సంకోచంగా వైద్యులతో చర్చించటం చాలా చాలా ముఖ్యం.

* నెలసరి నిలిచిపోయిన వారిలో.. ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల లోపం కారణంగా యోని పొడిబారటం, సంకోచించటం (ఎట్రోఫిక్‌ వజైనా) వంటి సమస్యల వల్ల సంభోగ సమయంలో నొప్పి ఉంటుంది. అలాగే హార్మోన్‌ లోపం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పెరిగి.. వాటివల్ల నొప్పి రావచ్చు. కాబట్టి ఈ వయసులో సంభోగం వంటి వాటి గురించి చెబితే వైద్యులు ఎలా అర్థం చేసుకుంటారోనన్న భయాలు పెట్టుకుని మౌనంగా ఉండిపోవాల్సిన పని లేదు. ఆయుర్దాయం, జీవనప్రమాణాలు గణనీయంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ వయసులో, దాంపత్య జీవితంలో ఇవేమీ అసహజం కాదు. వీటి గురించి నిస్సంకోచంగా డాక్టర్లతో చర్చించటం అవసరం, వీటికి చికిత్స చాలా తేలిక కూడా.
ఆపరేషన్ల తర్వాత
* గర్భాశయాన్ని తొలగించే 'హిస్ట్రెక్టమీ' ఆపరేషన్‌ తర్వాత.. కొందరిలో సంభోగం సమయంలో నొప్పి రావచ్చు. సర్జరీ తర్వాత లోపల యోని పైన ఉండే గోడ.. సంభోగ సమయంలో ఒత్తిడికి గురై నొప్పిగా ఉండొచ్చు.

* కొందరిలో పలుమార్లు సర్జరీలు చెయ్యటం వల్ల లోపల పేగులు అతక్కుపోయి.. వాటివల్ల (ఎడ్‌హిజన్స్‌) కూడా నొప్పి వస్తుండొచ్చు. వీటికి వైద్యులు తక్షణం పరిష్కరించలేకపోయినా నొప్పితో నెగ్గుకొచ్చే మార్గాలు సూచిస్తారు.


  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, January 11, 2011

Small things for Good health, మంచి ఆరోగ్యం కోసం చిన్న మార్గాలు

ఫుక్కలింత మేలు , Gargle is good for .....
జలుబు చేస్తే ఏ మందులూ అక్కర్లేకుండానే కొద్దిరోజుల్లో నయం అవుతుంది కాని , దాని తాలూకు ప్రభావాలు మాత్రం పనిలో చికాకు పెడుతుంటాయి. ఈ ప్రభావము నుండి కాపాడుకోవడానికి ఓ కప్పు ఉప్పునీరు శీతాకాలం జలుబులకు దివ్యఔషదం .

గొంతులో గురగుర , ఊపిరితీసుకోవడం లో ఇబ్బందులు సాధారణ జలుబులో సామాన్యం గా కనిపింఛే లక్షణాలు . ఉప్పునీటితో గార్గిల్ చేయడం వల్ల ఈ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది . ఇలాచేస్తే గొంతుతో మండే టిష్యూలకు ఉపశమనం కలుగుతుంది . చిక్కని మ్యూకస్ను కూడా పల్చబరుస్తుంది . ఎలర్జెన్స్ , బాక్టీరియా , ఫంగి వంటి వాటిని గొంతునుండి ఉప్పునీరు తొలగిస్తుంది .
ఆరోగ్యవంతమైన వలంటీర్లపై జలుబు , ఫ్లూ సీజన్‌ లో 60 రోజులు పాటు పరిశోదనలు సాగించారు . క్రమము తప్పకుండా రోజుకు మూడుసార్లు ఉప్పునీటిని గార్గిల్ చేసే వారిలో ... మిగతారితో పోల్చితే 40 శాతం అప్పర్ రెస్పిరేటరీట్రాక్ ఇన్‌ఫెక్షన్‌ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు . ఉప్పునీటితో పిక్కిలించడం వల్ల బ్రోంకైటిస్ లక్షణాలు గణనీయం గా తగ్గాయి . ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్‌ ఉప్పువేసి కలిపి కొద్ది సెకనులు గొంతులో పట్టి పుక్కలించి నీటిని ఊసెయ్యాలి . ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి . దగ్గు , గొంతులో మంట గల పెద్దవాళ్ళు గోరువెచ్చ్ని నీటిలో ఉప్పుతో పాటు నిమ్మరసం , తేనె కలుపుకొని గార్గిల్ చేయాలి . ఉప్పు తక్కువైతే ఆ నీటిని బయటికి ఊసేయాల్సిన అవసరం లేదు . . . మింగేయవచ్చును . బి.పి. ఉన్నవాళ్ళు ఉప్పునీటిని మింగకూడదు .



మంచి ఆరోగ్యాన్నిచ్చే మిత్రులు , Good health giving Friends..........
దిగులు గా , మూడీగా ఉన్నప్పుడు నచ్చినవారిని కలిస్తే మబ్బులు కమ్మేసిన మనస్సుకు హాయిగా ఉంటుంది . ఇందుకు కారణం ఏమిటి ? ... సంతోషముగా ఉన్నప్పుడు విడుదలయ్యే Endorphines అనే హార్మోనులు . అలాగే దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం కావాలనుకునే వారు కుటుంబసబ్యులు , స్నేహితులతో చక్కని సంబంద బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి .


మిత్రులతో మంచి బాంధవ్యం గలవారు , మిగతావారి కంటే 3-7 సంవత్సరాలు అధిక జీవితకాలం కలిగి ఉంటారని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేస్తున్నారు . కుటుంబసభ్యులు , స్నేహితులు , కమ్యూనిటీ తో కలిసి మెలిసి ఉండేవారు మిగతావారికంటే ఆరోగ్యముగా ఎక్కువకాలము జీవిస్తారు . అంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడములో మిత్రులది కీలకపాత్ర అన్నమాట . దాదాపు ఏదున్నర సంవత్సరాల పాటు మూడు లక్షలమందిపై విసృత పరిశోధనలు నిర్వహించాక ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు తెలియజేసారు .
తక్కువ సామాజిక పరిచయము , మద్దతుగలవారికి ఆల్కహాలిజం తొ సమానమయిన మోర్టాలిటీ రేటు ఉంటుందని , స్థూలకాయం , ఇతర శరీరక చురుకుదనం లోపం కంటే ఎక్కువ ప్రభావము కూడా కలిగి వుంటుందని ఈ పరిశో్ధనలో వివరించారు .

మూలము : Medicine updates journal .

వాదిస్తే రిలాక్సవుతారు .... We get relaxed with discussions :
ఊరికూరికె వాదనలకు దిగుతుణ్టారు అని మన చుట్టూ ఉన్నవారు అంటున్నారంటే అది మనకో హెల్త్ సర్టిఫికేట్ కింద లెక్కే. ఇలా వాదించే తత్వము మేలుచేస్తుందని మిచిగాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు . ఏ అంశాన్ని అయినా మౌనంగా చూస్తూ భరించడం మానసికంగా మేదనకు గురిచేస్తుంది . ఎదురుగా కనిపించే అంశాలకు బాగా స్పందించి వాదించే వారు బాగా రిలాక్ష్ అవుతారు . నచ్చని లేదా నచ్చిన అంశాలపై మౌనం గా సర్దుకుని ... మనస్సు లో మధనపడడం కంటే ఇలా వాదించేవారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు

వాదన జోలికి వెళ్లకుండా తప్పించుకునేవారు సదరు విషయాన్ని బుర్రనుంచి తప్పించలేరు . . . ఆలోచిస్తూనే ఉంటారు అటువంటివారికి అధిక రక్తపోటు , కార్టిసాల్ స్థాయిలు పెరగడం వలన నిద్రలోపాలు కలుగుతాయి . మనసుకు నచ్చకపోయినా వాదన ఎందుకులే అని తోసిపుచ్చుకుపోయే వారిలోతీవ్ర అనారోగ్య పరిణామాలు కొంతకాలములో తప్పవని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ ఉన్నారు . చెప్పదలచుకున్న విషయాన్ని అభిప్రాయాల్ని చెప్పేసినవారు తేలికపడిన మనస్సుతో హాయిగా ఉంటారు . ఫలితము గా రక్తపోటు , మానసిక వత్తిడి , నిద్రలేమి లకు దూరముగా ఉండవచ్చును .

ముచ్చటగా మూడే నిముషాలు వ్యాయామము ...
sincerely three minutes only exercise.


వ్యాయామము మనిషికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యముగా వయసుమల్లిన వారిలోనూ , మధుమేహము , రక్తపోటు , గుండెజబ్బులు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది . రోజంతా ఎడతెరపిలేని పనులు అని అనుకుంటూ వ్యాయామాల్ని వాయిదావేసేవారు తెలుసుకోవలసిన తీపికబురు .... ఒక్క మూడు నిముషాలు ఎక్సర్ సైజ్ చేస్తే గుర్తించదగ్గ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని స్కాటిష్ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి .

ఎక్సరసైజ్ బైక్ పై పెద్దవాళ్ళు 30 సెకన్లు స్ప్రింట్స్ ను ఆరుసార్లు చేసినా (మద్యలో నాలుగేసి నిముషాలు విశ్రాంతి)చాలంటున్నారు . దీనివల్ల రక్తం లోని చెక్కెర స్థాయిలు ఎంతోమేరకు నియంత్రించబడతాయంటున్నారు . డయబిటీస్ , గుండెజబ్బుల రిస్కును తగ్గించుకోవడానికి ఇది సరిపొతుంది . ఫేవరెట్ టెలివిజం షో చూస్తూ ఈ వ్యాయామము చేయవచ్చు . ప్రతి రోజూ రెగ్యులర్ గా చేయాలి . Regularity is more important.

సామాజిక ఒత్తిడితో రోగనిరోధకవ్యవస్థ బ్లహీనము ...
Day to Day pressure weaken the body immunity(resistance )


ఆహార పానీయాల లోపము , జీవన విధాన తీరుతెన్నులు రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేయగలవని అందరికీ తెలుసు కాని సామాజిక సంబంధిత ఒత్తిడులూ అందుకు కారణం కాగవని అనేక మందికి తెలియదు . ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కలిగే నెర్వస్నెస్ ఏవిధంగా ప్రభావం చూపుతుందో, పార్టీలలో ఇతర వ్యక్తుల్ని కలవడలో క్లిష్టత , వేదీకపై మాట్లాడల్సి వచ్చినప్పుడు కలిగే ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను ఏ విధంగాప్రభావితం చేస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యము కలుగుకమానదు . సామాజిక విషయాలకు మెదడు ప్రతిస్పందించే తీరు శారీరక రోగనిరోధక వ్యవస్థ ను ప్రతికూలము గా ప్రభావితం చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధనలో తెలిపారు . సామాజిక తిరస్కారము వల్ల కలిగే ఒత్తిడి ఇన్‌ఫ్లమేటరీ యాక్టివిటీని పెంచుతుందని కూడా పేర్కొన్నారు .

దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ ఆస్మా, రుమటాయిడ్ ఆర్త్రైటిస్ , కార్డియోవ్యాస్కులార్ రుగ్మతలు , కొన్ని రకాల క్యాన్‌సర్లు , డ్రిప్రషన్‌ జబ్బులు మొదలగు వాటికి దారితీస్తుంది . మానసిక , శారీరక్ అంశాలు ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ. తరచూ తేదా దీర్ఘకాలిక ఒత్తిడి యాక్టివేషన్‌ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై విభిన్న రుగ్మతలు కలిగే అవకాశం ఉంది .


బి.పి. తో జ్ఞాపకశక్తి సమస్యలు , Memory Troubles with B.P.

అధిక రక్తపోటుకు , జ్ఞాపక శక్తికి సమస్యలకు సంబంధం ఉంటుందా? అంటే ఖచ్చితం గా ఉంటుందంటున్నారు 20 వేల మంది పై పరిసోధనలు నిర్వహించిన న్యూరాలజీ పరిశోధకులు. మధ్య వయస్సు ఆరంభం లో ఈ లక్షణాల్ని గుర్తించారు . మధ్య వయస్కుల్లో డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ( రక్తపోటు రీడింగ్ లో బాటమ్‌ రీడింగ్ ) లో ప్రతి 10 ఎమ్‌.ఎమ్‌ హెచ్.జి. పెరుగుదలలో 7% జ్ఞాపకశక్తి సమస్యలు పెరిగినట్లు కనిపించాయని వారు పేర్కొన్నారు .

ఈ సమస్యల్ని అషిక రక్తపోటుకు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా లేదా అరికట్టడం ద్వారా నివారించవచ్చనని పేరోన్నారు . హైపర్ టెన్‌షన్‌ విషయానికి వస్తే ఒక రకం వ్యక్తుల్లో ఒత్తిడికి రక్తపోటుతో పెద్ద జంప్స్ కనిపించాయని , మిగతా వారిలో అవిలేవని తెలిపారు . ఒత్తిది తో కూడిన ఉద్యోగాలవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఈ హైపర్ యాక్టివిటీకి దారితీయవచ్చని న్యూరాలజిస్ట్లు పేర్కొన్నారు .

శతాధిక ఆయుస్సుకు అలవాట్లే కారణము , Long life depends on our habits :

దీర్ఘాయుష్షు విషయానికి వస్తే పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ ఆయుష్షు ఉంటుంది . శతాధిక వృద్దులలో మహిళలదే ఆధిక్యం . అయితే వందేళ్ళు కు చేరిన మగవారు శారీరక దారుఢ్యం తో , మానసిక చురుకుదనం తో ఉంటారు .. . చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉంటారు . ఇలా ఆడవారి ఆయుస్సు వెనుక స్పష్టమైన కారణాలు తెలియవు కాని మహిళల శరీరం దీర్ఘకాలిక అనారోగ్యాల్ని , లోపాల్ని తట్టుకోగలదని మాత్రం తేలుతోంది . ఆరోగ్యవంతమైన జీవన విధానాలవల్లే మహిళలకు దీర్ఘాయుస్సు పెరుగుతోంది . ప్రధాన అనారోగ్యాలకు సంబందించి ఆడవాళ్ళు తమకు తాము సరైన జాగ్రత్త వహిస్తారని జపాన్‌ లోని ఒకినావా అంతర్జాతీయ విశ్వవిద్యాలయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి .

" స్మోకింగ్ , డ్రింకింగ్ , ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం లాంటి అలవాట్లు స్త్రీలలో తక్కువ . రోజువారి సంపాదన , ఆతృత . పనిలోఒత్తిడి , హింసాత్మక కారణాలు , ప్రమాదాలు , ఆత్మహత్యలు కూడా స్త్రీలలో తక్కువ . తమ ఫిజీషియన్‌ దగ్గరకు తరచుగా స్త్రీలే వెళ్తుంటారు . పురుషులు దీనికి భిన్నంగా ఉంటుంది . పురుషులు జీవితమంతా రిస్కీగానే ప్రవర్తిస్తారు . వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్యాలు పెరుగుతుంటాయి . అంటే వారి శతాధిక వయస్సు ఎక్కువ భాగము అలవాట్లు పైనే ఆధారపడి నియంత్రించబడుతుంది .

ఆహారంతో ఆయుష్షు!, Life span is linked with Food :
మనం తీసుకునే ఆహారం మీద మన ఆయుష్షు కూడా ఆధారపడి ఉంటుందంటే నమ్ముతారా? ఎందుకంటే ప్రస్తుతం ఎంతోమంది గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులతో చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ప్రధానంగా ఆహార అలవాట్లే ఈ జబ్బులకు దోహదం చేస్తున్నాయి. కాబట్టి అకాల మరణాన్ని తప్పించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఈ విషయంలో ఇటీవల అమెరికా పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. 70-79 ఏళ్లకు చెందిన 2,500 మంది వృద్ధులను ఎంచుకొని పదేళ్ల పాటు వారి ఆహార అలవాట్లను పరిశీలించారు. తీసుకునే ఆహారాన్ని బట్టి వృద్ధులను ఆరు బృందాలుగా విభజించారు.
తక్కువ కొవ్వుగల పాల పదార్థాలు, పండ్లు, ముడి ధాన్యాలు, కోడిగుడ్లు, కోడిమాంసం, చేపలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..
మాంసం, వేపుళ్లు, స్వీట్లు, అధిక కేలరీ పానీయాలు, కొవ్వు పదార్థాలు తక్కువగా తినే వారిని 'ఆరోగ్యకర పదార్థాల' బృందంలో చేర్చారు. ఐస్‌క్రీములు, వెన్న, పూర్తి కొవ్వుతో నిండిన పాలు, పెరుగు ఎక్కువగా తింటూ.. కోడిగుడ్లు, కోడిమాంసం, తక్కువ కొవ్వుగల పాల పదార్థాలు, బియ్యం, పాస్తాలు తక్కువగా తినే వారిని 'అధిక కొవ్వు పాల పదార్థాల' బృందంగా విభజించారు. వీరిలో ఆరోగ్యకర పదార్థాల బృందం వారితో పోలిస్తే అధిక కొవ్వు గల పాల పదార్థాల బృందం వారికి మరణించే ముప్పు 40 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. స్వీట్లు, తీపి పదార్థాలు ఎక్కువగా తినేవారికీ 37 శాతం ముప్పు అధికంగా ఉంటోందని బయటపడింది.

  • ఆరోగ్యానికి చిట్కాలు ,Hints for good health

ఆరోగ్యంగా వుండాలని మనలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా దానికి ఆరోగ్యం అవసరం. అందుకే పూర్వం మన పెద్దలు ఆరోగ్యమే మహభాగ్యం అన్నారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము. అవి ఏమిటంటే

  • ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్ళు త్రాగండి. అలా త్రాగటంవల్ల సుఖ విరేచనం అవుతుంది. సమస్త వ్యాధి వర్థకం మలబద్దకం అని మనవైద్యశాస్త్రం చెప్తుంది. సుఖ విరోచనం అవ్వటం అంటే అన్ని జబ్బులు నుండి విముక్తి పొందటమే.
  • రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం. రోజూ ఒకగంట వాకింగ్‌ చేయడం మూలంగా బిపి షుగర్‌ను కొంత వరకు కంట్రోల్‌ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. వాకింగ్‌ చేసేటప్పుడు మాట్లాడడం మానాలి.
  • బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనా లలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు.
  • ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి.
  • అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి.
  • ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి.
  • అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది.
  • ఆరోగ్యానికిమంచి అలవాట్లు !

ఆరోగ్యకరమైన సూత్రాలను పాటించటం అందరికీ మంచిది. కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు అందరూ పాటించాల్సి వుంటుంది. అది ఏమిటంటే
  • ఇండ్లలోని చెత్త, చెదారాన్ని రోడ్ల మీదగాని, ఇతరుల ఇంటి ముందర గాని వేయకూడదు. చెత్తను మున్సిపాలిటీ వారి కుండీలలో మాత్రమే వేయాలి. అది కూడా మనం ఆరోగ్యంగా వుండటానికి సహాయపడుతుంది. చెత్త చెదారాన్ని ఇంటిముందు వుంచుకున్నా అది మనకి అనారోగ్యకరం. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి.
  • కొంతమంది ఎక్కువగా సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పొగాకు ఎక్కువగా కాలుస్తుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటనింట్లో 'నికోటిన్‌' అనే విష పదార్థము ఉంటుంది. పొగ త్రాగటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. వాటిద్వారా నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌, క్షయ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా పొగ త్రాగటం వల్ల ఆయుష్షు క్షీణిస్తుంది.
  • కాఫీ, టీలు ఎక్కువగా త్రాగటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కాఫీలో 'కాఫిన్‌' అనే పదార్థము, టిలో 'టియాన్‌' అనే పదార్థము వుంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. దీనివల్ల జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి. కనుక కాఫీ, టీలు తాగకుండా వుంటే చాలా మంచిది.
  • కొంతమందికి మత్తు పానీయాలు సేవించటం వల్ల బుద్దిమాంద్యం ఏర్పడుతుంది. అనేకమైన ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ రోజుల్లో విద్యార్థులు గంజాయి, మార్ఫిన్‌లకు బానిసలు అవుతున్నారు. అవి మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది మన చేతుల్లోనే వుంటుంది. మన అలవాట్ల మీదే మన ఆరోగ్యం చదువు ఆధారపడి వుంటుంది.

  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, January 10, 2011

ఆకుకూరలు - ఆరోగ్యము , Green Leafy vegetables and Health


  • ఆకుకూరలు --- Green Leafy curries


మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో మరియు వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.

* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
* దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి
* ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా,గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
* కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు.




ఆకుకూరలతో కలిగే మేలు:

* ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
* భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి.వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
* ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
* ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
* విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
* విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.

పూర్తి వివరాలకోసం ... వికిపిడియాను చూడండి . -> ఆకుకూరలు
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, January 9, 2011

Gas trouble , గ్యాస్ ప్రోబ్లం - నివారణ సూచనలు



పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటంతోనే త్రేన్పులు వస్తుంటాయి. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపానం (ప్లాటస్) అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది.

ఆహార , విహారాదుల్లో నియమం తప్పకుండా వుంటే ఆరోగ్యం గా ఉంటాం . ఈ కాలం లో అంతా బిజీబిజీ ... రోజూ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడక చేరేటంతవరకూ క్షణమన్నా తీరిక లేని పనులతో గడుపుతున్నారు . కొందరికి తిండి కరువైతే మరికొందరికి తినడనికి కాఅవలసినంత ఉన్నా తగిన సమయం ఉండదు . ఈ విదం గా Hurry , Worry , Curry ల కారణం గా జీర్ణశక్తి పాడవుతుంటుంది . గ్యాస్ కడుపులో తయారవుతూ ఉంటుంది .

సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బంధింపబడి తీవ్రస్థాయిలో కడుపునొప్పిని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణావల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి.

గ్యాస్ తయారవటం అనేది సహజమైన శారీరక క్రియ. కనుక దానిని అడ్డుకోలేక పోయినప్పటికీ, కొన్ని చిన్న, చిన్న గృహ చికిత్సల ద్వారా ఆహార వ్యవహారాల్లో మార్పులు, చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

లక్షణాలు

గ్యాస్ సమస్య కలిగినవారికి సంకల్పంతోగాని, అసంకల్పితంగా గానీ గ్యాస్ విడుదలవుతుంటుంది. గ్యాస్ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్లు, ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృతం కాకుండా త్వరిత గతిన మారుతుంటుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్లు అనిపించవచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా గాని లేదా గాల్‌స్టోన్స్ నొప్పిగా గాని భ్రమకలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్లు బిర్రుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే.

కారణాలు

*మాట్లాడేటప్పుడు గాని, ఆహారాలను మింగేటప్పుడు గాని గాలిని మింగటం; ఆందోళనగా ఉన్నప్పుడుగాని ఉధ్విగ్నంగా ఉన్నప్పుడు గాని గాలిని అసంకల్పితంగా మింగటం

*ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం.

*ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.

*పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలూ, ఈసబ్‌గోల్ వంటి తంతుయుత పదార్థాలూ అరగకపోవటం.

*సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలినిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం.

*కొవ్వు పదార్థాలు తినటం కడుపు ఉబ్బరానికి దోహదం చేస్తుంది. జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది. దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.

* ఒత్తిడి, ఆందోళన, పొగ తాగటం, జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్‌, ఇరిటేబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి

*ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్, క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైస్).

*యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).

*విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గాని వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).

*మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).
పాలలోని ల్యాక్టోజ్ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్ ఇంటాలరెన్స్).

*గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం(గ్లూటెన్ ఇంటాలరెన్స్).

*ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్‌గమ్స్, సుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు గిట్టకపోవటం).

ఇవన్నీ గ్యాస్ తయారవడానికి ప్రధాన కారణాలు. వీటిమీద అవగాహన ఉంటే గ్యాస్‌ని నిరోధించుకోవచ్చు.


చికిత్సలు, సూచనలు-ఆహార విధానం

గ్యాస్‌ని కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ అందిరోనూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్ నొప్పినీ కలిగించవు. చాలా మందిలో గ్యాస్ కలిగించే ఆహారాలను అధ్యయనకారులు గుర్తించారు. అవి: చిక్కుళ్లు, ఉల్లిపాయ, క్యాబేజి, క్యాలీఫ్లవర్, యాపల్స్, జల్లించని గోధుమపిండి, కోడిగుడ్డు, శనగపిండి వంటకాలు తదితరాలు.

వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడిగాని, లేదా వేడి వేడి పుదీనా కషాయం గాని తీసుకోవాలి.

పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్‌మింట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటిగాని, రిఫ్లక్స్ గాని ఉంటే పుదీనాలోని మెంథాల్ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.

ఎసిడిటీని తగ్గింఛే మందులు వాడుతూ ఉండాలి :
tab. Aceloc RD daily one at morning ,
tab . Gelusul mps or syrup daily 3 times ,
tab. Unienzyme 1 tab 3 times/day ,
sy. Digeples 1 table spoon 3 times daily,

ఇంకా తగ్గగపోతె మంచి స్పెసలి్ష్ట్ డాకటర్ ని సంప్రదించాలి .

జీవన విధానం

ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో, ఎక్కువ సార్లు తీసుకోవాలి. బబుల్‌గమ్ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పడుగు గాని, గాభరాగా ఉన్నప్పుడు గాని, హడావిడిగా ఉన్నప్పుడు గాని తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.


హోమియో చికిత్స : by -డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌ .

వ్యక్తి శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా హోమియో మందులను ఎంపిక చేసి ఇవ్వడం వల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.

కార్పోవెజ్‌ : గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్న వారికి ముందుగా ఆలోచించదగిన మందు కార్బోవెజ్‌. పొట్ట పైభాగం గ్యాస్‌తో ఉబ్బి ఉంటుంది. పొట్ట పైభాగాన నొప్పి, మంట వస్తుంటాయి.ఆహారం తీసుకున్న తరువాత బాధలు ఎక్కువ అవుతాయి. జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో తరుచుగా బాధపడే వారికి ఈ మందు ప్రయోజనకారి. వీరికి తేన్పులు ఉపశమనం కలిగిస్తాయి.

చైనా:-కొంతమందిలో పొట్ట మొత్తం ఉబ్బరంగా ఉండి బెలూన్‌లాగా ఉంటుంది. వీరికి తేన్పులు వచ్చినా ఉపశమనం కలుగదు. కాని అపానవాయువుపోతే మాత్రం ఉపశమనం ఉంటుంది. ఈ రోగులు నీరసంగా ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారు వైద్యుని సంప్రదించి ఈ మందు వాడితే మంచిది.

నక్స్‌వామిక :-మసాలాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరకశ్రమ తక్కువగా ఉండి మానసిక శ్రమ ఎక్కువగా ఉన్న వారు సత్వరవైద్య సలహా పొందాలి. వీరు మానసిక స్థాయిలో కోపం, ఎక్కువ శబ్దాలు, వెలు తురు భరించలేరు. ఇటువంటి లక్షణాలతో పాటుగా గ్యాస్‌ సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఈ మందు పనిచేస్తుంది.

అర్జెంటు నైట్రికం : -పొట్టలో నొప్పి ఉండి, తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమై బాధకలుగుతుంది. వీరు మానసిక స్థాయిలో తేలికగా ఆందోళనకు గురవుతుంటారు.ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు. వీరికి ఈ మందు ఆలోచించదగింది.

పై మందులే కాకుండా లైకోపోడియా, పాస్పరస్‌, నైట్రమ్‌ఫాస్‌, ఎనాకార్డియం. సల్ఫర్‌, ఆర్సినికం అల్బం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్‌ సలహాతో వాడితే మంచి ఫలితముంటుంది.

జాగ్రత్తలు : మసాలాలు, వేపుళ్ళు, అయిల్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానివెయ్యాలి.

వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్ళు సరిపడినంతగా త్రాగాలి.నిల్వఉంచిన పచ్చళ్ళు తినడం మానివేయాలి.

ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించటానికి, ధ్యానం, యోగా నిత్యం చేయాలి.

ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలి.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా వెజిటెబుల్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.


  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/