Thursday, February 16, 2012

మధుమేహం... అంగస్తంభన,Diabetes and erectile dysfunction



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మధుమేహం... అంగస్తంభన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-మధుమేహం, అంగస్తంభన చదివి కొత్తవిషయాలు తెలసుకోండి. ఒక గంటసేపు సమయాన్ని విజ్ఞానదాయకంగా గడపండి. అంగస్తంభన వచ్చి నిలబెట్టుకోవడంలో అసమర్థతనే ఎరెక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ అంటారు. మధుమేహం ఉన్నవారిలో నపుంసకత్వం సర్వసాధారణం. గుండె జబ్బులను, డిప్రెషన్‌ను సూచిస్తుంది. కామపరమైన అసమర్థత జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. భాగస్వామితో సంబంధాలను ప్రభావితం చేస్తుంది. జబ్బు, మందులు, మద్యం ఇ.డి.కి దారితీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణాన్ని సరిగా అదుపుచేయనందువల్ల మధుమేహం వస్తుంది. దాంతో పురుషుల్లో ఇ.డి. సమస్య తలెత్తుతుంది. రక్తనాళాలు కూరుకుపోవడం కూడా నపుంసకత్వానికి దారితీస్తుంది.

రక్తనాళాలు గట్టిపడిపోయినపుడు రక్తం, ప్రాణవాయువు శరీరంలోని కొన్ని భాగాలకు ప్రసరించలేవు. పురుషాంగానికి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయినట్లయితే అది పెద్దగా, గట్టిగా అవడానికి మెత్తటి కండరాల కణాలు విశ్రాంతి పొందలేవు. ఇ.డి.కి మదుమేహం ఒక కారణం మాత్రమే. వయసు, గుండెకు సంబంధించిన జబ్బులు ఇతర కారణాలు. ఉత్తేజపరిచే సంకేతం మెదడుకు చేరదు. పురుష హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండడం, మందులు వాడడం, రక్తంలో కొలెస్టరాల్‌ ఎక్కువ పరిమాణంలో ఉండడం కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తాయి. మధుమేహం ఉండే పురుషులు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఇ.డి. సమస్యను అరికట్టవచ్చు లేక మరికొంత కాలం రాకుండా చూసుకోవచ్చు. అంగస్తంభన సమస్యను నియంత్రించవచ్చు, నివారించవచ్చు.

సిగరెట్లు కాల్చడం మానేయండి, బరువు తగ్గండి, రోజూ వ్యాయామం చెయ్యండి, మీ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని (బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌) ను అదుపులో వుంచుకోండి. రోజూ వ్యాయామం చేస్తూ బరువుతగ్గిన వారి అంగస్తంభన మెరుగైనట్లు ఇటీవల వెలువడ్డ పరిశోధనలు తెలుపుతున్నాయి. మధుమేహం ఉన్నవారు వాడే మందులు ఇ.డి. కి దారితీయవచ్చు. సాధారణంగా మధుమేహం వున్న పురుషులకు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా మందులు వాడుతారు. డాక్టరు చెప్పే మందుల పట్టికను జాగ్రత్తగా పరిశీలించి మందుల వాడకంలో మార్పులు చేస్తే అంగస్తంభన సమస్యను నివారించడానికి దోహదపడుతుంది. నపుంసకత్వం మూలంగా రతిలో సరిగా పాల్గొనలేని పురుషులకు తోడ్పడే కొన్ని పద్ధతులున్నాయి. రతిలో సమర్థవంతంగా పాల్గొనడానికి వయాగ్రా, లెవిట్రా, సియాలిస్‌ మందులను వాడుతారు.

కానీ మధుమేహం ఉన్న పురుషుల్లో ఇవి అంతగా ఉపయోగపడవని తెలుస్తోంది. అంగస్తంభనను నిలబెట్టే పరికరాలు (వ్యాక్యూమ్‌ కన్‌స్ట్రిక్షన్‌ డివైస్‌) సత్ఫలితాలిస్తున్నాయని తెలుస్తోంది. మధుమేహంలో 75 శాతం దాకా ఈ పరికరం విజయం సాధించింది. ఇ.డి. కారణాలేవైనా ఈ పరికరాలు పనిచేస్తాయి. దంపతులు రతికిముందు కామోత్ప్రేరకంగా కూడా వినియోగించవచ్చు. సరాసరి పరుషాంగానికి ఇంట్రాకావెర్నెసాల్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం నపుంసకత్వానికి మరో తరుణోపాయం. ఆపరేషన్‌, ఇంప్లాంన్టేషన్‌ చాలా వరకు విజయం సాధించాయి. పెనైల్‌ ప్రోస్థెసిస్‌ కానీ మధుమేహం ఉండే పురుషుల్లో ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతున్న వారికి ఈ చికిత్స సిఫార్సు చేయరు.

నపుంసకత్వం ఆరోగ్యకరమైన లైంగిక బాంధవ్యానికి పుల్‌స్టాప్‌ కాదు. ఇ.డి. పురుషుల్లో విరక్తికి దారితీయవచ్చు కానీ కామవాంఛను తీర్చుకునే ఇతర మార్గాలున్నాయన్న విషయం తెలుకుంటే మంచిది. అందులో రతి ఒక పద్ధతి మాత్రమే. కలిసి స్నానం చెయ్యడం, ఊహల్ని పంచుకోవడం, ఒకరికొకరు వ్యాయామం చేసుకోవడం ఇలా ప్రేమను అనుభవించే మార్గాలు చాలా వున్నాయి. మధుమేహం అంగస్తంభన గురించి తెలుసుకోవలసింది ఇంకా చాలానే ఉంది. ఈ రచన మీ ఇతర ప్రశ్నలకు సమాధానం అన్వేషించడానికి మంచి పునాది వేస్తుంది. ఇప్పుడు మీకు ప్రాథమిక సూత్రాలు తెలుసు. ఖచ్చితమైన వాస్తవాలు తెలుసు. మీరు ఉత్సాహంతో ముందుకు సాగవచ్చు. మీ విజ్ఞాన తృష్ణ తీర్చుకోవచ్చు.

Treatment :


  • గుండె జబ్బులు లేనివారు .. వయగ్రా మందును వాడవచ్చును . వారానికి 2 లేదా 3 రోజులు ... Tab. penegra 25 mg or 50 mg per day 2-3 hours before the act.

  • సుగరు వ్యాది ఉన్నవారు ... వాటికి సంబంధిత మందులు క్రమము తప్పకుండా వాడాలి .

  • రోజూ ఒక బి.కాంప్లెక్ష్ మాత్ర వాడితే చాలా మంచిది .
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, February 12, 2012

Crying in infants , చిన్న పిల్లల ఏడుపు

  • image : courtesy with Eenadu News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - చిన్న పిల్లల ఏడుపు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




ఒక్కోసారి పిల్లలు గుక్కలుపెట్టి ఏడుస్తుంటారు... ఏం చేసినా ఆగరు.. మన గోడు పట్టించుకోరు. ఎందుకేడుస్తున్నారో.. ఆ బాధ ఏమిటో అర్థంకాదు. ఏం చెయ్యాలో పాలుపోదు. ఆ ఏడుపు చూసి చివరికి ఇంట్లోని పెద్దలూ కళ్ల నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంతకీ పిల్లలు ఇలా గుక్కలుపెట్టి.. విడవకుండా ఏడుస్తున్నారంటే.. దానర్థం ఏమిటి..? వాళ్లెందుకలా ఎందుకు ఏడుస్తున్నట్టు? దీనికి సర్వసాధారణ కారణాలు.. కడుపు నొప్పిగానీ, తలనొప్పిగానీ అనుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యల కారణంగా ఏడుపు ఆరంభించే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే పాప ఏడిచిందంటే అర్థం ఏమిటో.. కాస్తయినా అవగాహన పెంచుకోవటం ఉత్తమం!

నొప్పి.. ప్రాణి సహజం. పెద్దలకు మాత్రమే పరిమితం కాదు.. చిన్నపిల్లల్లోనూ రకరకాల నొప్పులు రావొచ్చు. వీరిలో తరచుగా కనిపించేవి కడుపునొప్పి, తలనొప్పి. అయితే వీరిలో ఆ నొప్పి ఎందుకు వస్తోంది? దానికి మూలం ఎక్కడ? అనేవి కనుక్కోవటం చాలా అవసరమేగానీ అదంత తేలిక కాదు. కుటుంబ సభ్యులకే కాదు.. కొన్నిసార్లు డాక్టర్లకూ వీటిని పోల్చుకోవటం కష్టమవుతుంటుంది. ముఖ్యంగా 5 నెలల్లోపు పిల్లల్లోనైతే పసిగట్టటం మరీ కష్టం. ఎందుకంటే ఏడవటం తప్ప పైకి వీళ్లేమీ చెప్పలేరు. కీలకమైన సంకేతాలూ ఉండవు. కేవలం పిల్లల ప్రవర్తన, చేష్టలతోనే అంచనా వేయాల్సి ఉంటుంది.

వేధించే కడుపునొప్పి : పిల్లల్లో కనిపించే నొప్పుల్లో ప్రధానమైంది కడుపునొప్పి. దీనికి చిన్న చిన్న కారణాలతో పాటు తీవ్రమైన సమస్యలూ కారణం కావొచ్చు. మామూలుగా వచ్చే కడుపునొప్పి త్వరగానే తగ్గిపోవచ్చు. కానీ వీటికి గల కారణమేంటో నిర్ధరించుకోవటం తప్పనిసరి.

* ఇన్‌ఫెక్షన్లు: వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు కడుపునొప్పిని తెచ్చిపెట్టొచ్చు. వీటితో వాంతులు, విరేచనాల వంటి సమస్యలు మొదలవ్వచ్చు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు త్వరగానే నయమవుతాయి. అయితే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు తగు యాంటీబయోటిక్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.

* పొట్టలో పురుగులు: ఏలికపాములు, నులిపురుగుల వల్ల కూడా కడుపునొప్పి రావొచ్చు. అపరిశుభ్ర ఆహారపుటలవాట్లే దీనికి దోహదం చేస్తాయి. కొన్నిసార్లు ఈ పురుగులు పేగుల్లో అడ్డంపడి, పేగులను చీల్చుకొని కడుపులోకి ప్రవేశించే ప్రమాదమూ లేకపోలేదు. అప్పుడు ప్రాణాంతకంగా పరిణమించొచ్చు.

* కలుషితాహారం: నిల్వ చేసిన, అపరిశుభ్ర ఆహారం తినటమూ కడుపు నొప్పికి దారితీస్తుంది. సరిపడని ఆహారం, ఎక్కువగా తినటం, లేదా గ్యాస్‌ సమస్యలతో పొట్ట ఉబ్బరం, వాంతులు, విరేచనాల వంటివీ పిల్లలకు ఈ ఇబ్బందిని తెచ్చిపెడతాయి.

* డయేరియా: పిల్లల్లో కడుపునొప్పితో పాటు నీళ్ల విరేచనాలు కూడా తరచుగా కనబడే సమస్యే. ఇది చాలావరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల మూలంగానే వస్తుంది. సాధారణంగా ఇది 72 గంటల్లో (మూడు రోజులు) తగ్గుతుంది కానీ కొన్నిసార్లు చాలా రోజుల పాటు వేధించొచ్చు. కొందరిలో మలంలో రక్తమూ పడొచ్చు. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌కు చూపించాలి. తాత్సారం చేయరాదు.

* వృషణాల్లో నొప్పి: కొందరు మగపిల్లలు వృషణాల్లో వచ్చే నొప్పిని కడుపు నొప్పిగా పొరపడుతుంటారు. నొప్పి కలుగుతున్న భాగాన్ని చెప్పలేక కడుపులో నొప్పి వస్తుందని చెబుతుంటారు. వృషణాలు మడత పడటం (టార్షన్‌)తో దానికి రక్తసరఫరా జరగక ఇలాంటి నొప్పి వస్తుంటుంది. దీన్ని తర్వగా గుర్తిస్తే తేలికగా చికిత్స చెయ్యచ్చు. జాప్యమైనకొద్దీ నష్టం జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు కడుపు నొప్పి వస్తోందని అంటే వృషణాల్లో ఏమైనా నొప్పి పుడుతోందా? అని అడగటం తప్పనిసరి.

* దద్దుర్లు: కడుపునొప్పిని తెచ్చిపెట్టే కొన్ని తీవ్ర సమస్యలతో చర్మంపై దద్దుర్లు కూడా కనబడతాయి. కాబట్టి కడుపునొప్పితో పాటు దద్దుర్లు కనిపిస్తే నిర్లక్ష్యం పనికిరాదు.

* విషపూరితాలు: పిల్లలు కొన్నిసార్లు సబ్బులను తినటం, రంగులను నోట్లో పెట్టుకోవటం వంటివి చేస్తుంటారు. దీంతో అందులోని రసాయనాలు కడుపులోకి వెళ్లి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. ఐరన్‌ మాత్రలు, జ్వరానికి వాడే అసిటమినోఫెన్‌ మాత్రల వంటి వాటిని పొరపాటున మింగటం కూడా కడుపునొప్పికి దారితీయొచ్చు.

* మలబద్ధకం: పీచు తక్కువగా ఉండే ఆహారంతో పిల్లల్లో తీవ్రమైన మలబద్ధకం ఏర్పడి కడుపునొప్పి రావొచ్చు. ఇది చాలావరకు కడుపు ఎడమ భాగంలో వస్తుంటుంది.

* శస్త్రచికిత్స సంబంధమైనవి: వీటిల్లో ముఖ్యమైంది అపెండిక్స్‌ వాపు. అలాగే కడుపులో మిసెంట్రిక్‌ లింఫ్‌ అడినైటిస్‌, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, మలబద్ధకం, పేగులు మడత పడటం, పేగుల్లోని ఒక భాగం మరో భాగంలోకి చొచ్చుకొనిపోవటం, మెకల్స డైవెర్టికులైటిస్‌.. కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమమస్యలు, కడుపులో కణితులు.. వంటి సమస్యలకు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కామెర్ల వంటి వాటికీ ఆపరేషన్‌ అవసరపడొచ్చు.

* మూత్ర సమస్యలు: మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూడ్రపిండాల వాపు, మూత్రపిండాల్లో విల్మ్స్‌ కణితులు కూడా కడుపునొప్పిని కలిగిస్తాయి.

* ఇతర సమస్యలు: పెరిటినైటిస్‌, పాంక్రియాటైటిస్‌, మూత్రపిండాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, మధుమేహం, పర్పూర, ఎరిత్రోమైసిన్‌ వంటి మందులు తీసుకోవటం వల్ల వచ్చే కడుపునొప్పి.. ఊపిరితిత్తుల్లో వచ్చే నొప్పి, నిమోనియా, ప్లూరసీ, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు.. మానసిక సంబంధ నొప్పి.. వీటిలో కూడా నొప్పి ఉండొచ్చు.

నాటు వైద్యం వద్దు
చిన్నపిల్లల్లో కడుపునొప్పి, తలనొప్పి ఉన్నట్టు అనుమానం కలిగిన వెంటనే ముందు శిశు/కుటుంబ వైద్యుడికి చూపించాలి. నాటువైద్యం పనికిరాదు. కామెర్ల వచ్చాయని కళ్లల్లో ఆకురసం పోయించటం, వాతలు పెట్టించటం, తావీదులు కట్టించటం వంటివి అసలే చేయరాదు. చిన్నపిల్లలు ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు కాబట్టి నిర్లక్ష్యం అసలు పనికిరాదు. కారణాన్ని కచ్చితంగా నిర్ధారణ చేయటమూ తప్పనిసరి. అవసరమైతే ఎక్స్‌రే, రక్త పరీక్షలు, కాలేయ పరీక్షలు, అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌ వంటివీ చేయాల్సి రావొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా చిన్నపిల్లల్లో నొప్పికి తగు కారణాన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించి వెంటనే చికిత్స చేయాలని మరవరాదు.

వయసును బట్టి స్పందనలు, సంకేతాలు
* నెలలోపు పిల్లలు నొప్పిని ఏమాత్రం భరించలేరు. నొప్పికి చాలా తీవ్రంగా స్పందిస్తారు. వీరికి నొప్పి వస్తే శరీరం మొత్తాన్ని కదిలించటంతో పాటు బాగా గుక్కపెట్టి ఏడుస్తారు.
* నెలాఖరుకల్లా నొప్పిగా అనిపించినప్పుడు శరీరంలో కొంత భాగాన్ని కదిలించటం ఆరంభిస్తారు.
* 3-4 నెలల పిల్లలు నొప్పి వస్తున్న భాగాన్ని కొద్దిగా గుర్తించగలరు. కాళ్లు లాక్కోవటం, మల విసర్జన చేయటం, వెక్కిళ్లు పెట్టటం, వాంతులు చేసుకోవటం వంటివి చేస్తారు.
* 6 నెలల తర్వాత పిల్లలు నొప్పికి సంబంధించి- గత అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవటం, అందుకు తగ్గట్టుగా స్పందించటం నేర్చుకుంటారు. కాబట్టి బాగా ఎదిరించే ప్రయత్నం చేస్తారు. డాక్టర్లను చూడగానే భయంతో మరింత ఏడ్చేస్తారు. వారి నుంచి దూరంగా వెళ్లాలని చూస్తుంటారు. నర్సులు దగ్గరికి వస్తే ఏడవటం, తోసేయటం వంటివి చేస్తారు.

పెద్దపిల్లల్లో సైగలు
పాకే వయసులో పిల్లలకు నొప్పి వస్తే ఫలానా చోట నొప్పి ఉన్నట్టు సైగలు చేస్తారు. అంతకు ముందు నొప్పి కలిగిన నాటి జ్ఞాపకం, శారీరక ప్రతిఘటన, భావాల వంటి వాటిని జోడించి.. ఆ భాగాన్ని వెనక్కి లాక్కునేందుకు ప్రయత్నిస్తారు. దంతాలు బిగపట్టటం, అటూఇటూ దొర్లటం, విపరీతంగా ఏడవటం, కోపంతో ప్రవర్తించటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇంకాస్త పెద్దగా అవుతుంటే నొప్పి కలుగుతున్న భాగాన్ని స్పష్టంగా గుర్తించి, చూపించగలుగుతారు. ఎక్కడ నొప్పి కలుగుతుందో చెప్పమంటే వేలితో చూపిస్తారు కూడా. బడికి వెళ్లే వయసు వచ్చేసరికి నొప్పి గురించిన పూర్తి అవగాహన అంటూ ఉండదు గానీ.. దాని గురించి చెప్పగలిగే స్థాయికి చేరుకుంటారు.

లక్షణాలే ఆధారం
నొప్పికి కారణమేంటో స్పష్టంగా తెలియని సందర్భాల్లో కొన్ని లక్షణాలను బట్టి నిర్ధారణ చేసే అవకాశం ఉంది.
1. తల నుంచి కాళ్ల వరకు శరీరం మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించటం.
2. పిల్లాడు చిరాకు పడుతున్నాడా? అస్థిమితంగా ఉన్నాడా? శరీరంలో ఏ భాగాన్నైనా రుద్దుకుంటున్నాడా? వంటి చేష్టలను గమనించటం.
3. గుండె ఎలా కొట్టుకుంటోంది? ఎన్నిసార్లు కొట్టుకుంటోందనేవి చూడటం.
4. శ్వాస తీసుకునే విధానం ఎలా ఉందోనని పరిశీలించటం.
5. చెమట ఎక్కువగా పోస్తోందా అని గమనించటం.
6. ముఖం నల్లబడటం, కనుపాప పెద్దది కావటం వంటి ముఖ కవళికలను పరీక్షించటం అవసరం.

భయంతోనూ వెనకడుగు
మాట్లాడే వయసులో కొందరు పిల్లలు నొప్పి కలుగుతున్నా బయటికి చెప్పటానికి ఇష్టపడరు. ఎక్కడైనా దెబ్బ తగిలితే.. తల్లిదండ్రులు కోప్పడతారనో, డాక్టర్‌ దగ్గరికి వెళ్తే సూది ఇస్తారనో భయపడి ఆ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పటానికి వెనకాడతారు. ఇలాంటి సమయంలో 'వాంగ్‌-బేకర్‌ ఫేసెస్‌ పెయిన్‌ రేటింగ్‌' కొలమానం బాగా ఉపయోగపడుతుంది. దీంతో నొప్పి తీవ్రతను పసిగట్టొచ్చు. అంకెలు, పదాలు, రంగులు, ముఖ కవళికలు, నడవడి వంటి వాటితో నొప్పి స్థాయిని గ్రహించొచ్చు.
* నెలలోపు పిల్లలు నొప్పి వచ్చినపుడు కళ్లు గట్టిగా మూసుకుంటారు. నోరు వెడల్పుగా తెరుస్తారు. నుదురు చిట్లిస్తారు. ముక్కు రంధ్రాలను వేగంగా కదిలిస్తారు. చెవిలో నొప్పి పుడుతుంటే చెవులు లాక్కొంటారు. తలనొప్పిగా ఉంటే తలను ఒక వైపు నుంచి మరోవైపునకు తిప్పుకుంటారు. ఒకేవైపు పడుకొని, కాళ్లు పొట్టలోకి ముడుచుకొంటారు. నొప్పి ఉన్న భాగాన్ని కదల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.


కలవరపెట్టే తలనొప్పి : పెద్దలకు వచ్చినట్టుగానే పిల్లలకూ తలనొప్పి వస్తుంది. అయితే నొప్పి తీవ్రత, లక్షణాల్లో కొంతమేరకు తేడా కనబడుతుంది.

* పార్శ్వనొప్పి: ఇది పెద్దలకు తలకు ఒక భాగంలోనే వస్తే.. పిల్లల్లో రెండు వైపులా ఉంటుంది. వాంతులు, కడుపునొప్పి కూడా ఉంటాయి. చప్పుళ్లకు, వెలుతురుకు విపరీతంగా స్పందిస్తారు. మరీ చిన్నపిల్లలైతే అకారణంగా ఏడుస్తుంటారు కూడా. ఈ సమయంలో తల పట్టుకుంటారు. ఈ నొప్పి కొద్దిసేపే ఉండిపోతుంది.
* టెన్షన్‌ తలనొప్పి: ఇందులో రెండు కణతల దగ్గర బాగా నొక్కినట్టుగా నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి అంత తీవ్రంగా ఉండదు. వాంతులు అవకపోతే త్వరగానే తగ్గుతుంది. ఇది పార్శ్వనొప్పి కూడా అయ్యిండొచ్చు.
* క్లస్టర్‌ తలనొప్పి: రోజుకి ఐదు కన్నా ఎక్కువసార్లు.. అలా 5-8 రోజుల పాటు తలనొప్పి అనిపిస్తే క్లస్టర్‌ నొప్పి కావొచ్చు. ఇందులో అలసట, ముక్కులోంచి నీరు కారటం, చిరాకు పడటం, అస్థిమితంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* మెనింజైటిస్‌: మెదడుపైని మూడు పొరల్లో ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఇది వస్తుంది. తలనొప్పి, జ్వరంతో పాటు వాంతులు అవుతాయి. మెడ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.
త్వరగా తగ్గేవే
చిన్న చిన్న కారణాలతో వచ్చే కడుపునొప్పి త్వరగానే తగ్గిపోతుంది. గ్యాస్‌తో గానీ, విరేచనాలతో గానీ వచ్చే నొప్పి సాధారణంగా 24 గంటల్లోనే తగ్గుతుంది. ఎలాంటి కడుపునొప్పైనా 24 గంటలు దాటినా తగ్గకపోతే వెంటనే వైద్యుడికి చూపించటం తప్పనిసరి.

* మామూలు కడుపు నొప్పులు చాలావరకు కడుపు మధ్య భాగంలో కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో పిల్లలు బొడ్డు చుట్టూ చేతులను రుద్దుకుంటారు. ఇక ఇతర భాగాల్లో నొప్పి వస్తుంటే తాత్సారం చేయరాదు. ముఖ్యంగా బొడ్డు కింద కుడివైపున నొప్పి వస్తుంటే అపెండిసైటిస్‌ కావొచ్చు. అదే ఎడమవైపున ఉంటే అమీబియాసిస్‌ అయ్యిండొచ్చు. బొడ్డుకు రెండు వైపులా నొప్పి వస్తుంటే మూత్రపిండాల్లో రాళ్లు గానీ కణితి నొప్పి గానీ కావొచ్చు. పక్కటెముక కింది భాగంలో నొప్పి ఉంటే ఫ్లూరసీ గానీ కాలేయానికి సంబంధించిన నొప్పి గానీ కావొచ్చు. ఆడపిల్లల్లో బొడ్డుకు చాలా కింద కటిభాగంలో ఉంటే ఫలోపియన్‌ ట్యూబ్‌ సంబంధ నొప్పి అయ్యిండొచ్చు. కటి వలయంలో చీము కూడా ఉండి ఉండొచ్చు.
* కడుపునొప్పితో పాటు ముఖం పాలిపోవటం, చెమట పోయటం, ఎప్పుడూ నిద్రపోతుండటం లేదా నిస్సత్తువతో మందకొడిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడికి చూపించాలి. ఆడుకుంటున్న సమయంలోనూ నొప్పిని మరచిపోలేకపోవటం, చాలాసేపటి వరకు ఏమీ తినకపోవటం, తాగటానికీ ఇష్టపడకపోవటం వంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయరాదు.
* కడుపునొప్పితో పాటు పిల్లలు చాలాసార్లు వాంతులు కూడా చేసుకుంటారు. ఇది అన్నిసార్లూ తీవ్ర సమస్యలకు సంబంధించింది కాకపోవచ్చు. అయితే నొప్పి వచ్చిన తర్వాత వాంతులు అవుతుంటే తీవ్ర సమస్య ఏమైనా ఉందేమో క్షుణ్ణంగా పరీక్షించాలి. పచ్చ రంగు వాంతులతో కూడిన నొప్పి అయితే పేగుల్లో అడ్డంకులు ఉన్నాయేమోనని అనుమానించాలి. రక్తంతో కూడిన వాంతులు, కడుపునొప్పి ఉంటే పేగుల్లోని కొంత భాగం మరో భాగంలోకి పొడుచుకొని రావటం కారణం కావొచ్చు. ఇలాంటి సమస్యలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.


పరీక్షలు : నొప్పి ఉన్నట్టు అనుమానం కలిగిన వెంటనే పిల్లలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

1. ప్రధాన లక్షణాలు: జ్వరం కనబడితే ఇన్‌ఫెక్షన్‌ లేదా వాపు ఉండొచ్చు. నిమోనియా, మూత్రపిండాల్లో చీము ఉంటే వణుకుతో పాటు జ్వరం కూడా తీవ్రంగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవటం, శ్వాస వేగంగా తీసుకోవటం, రక్తపోటు ఎక్కువగా ఉండటం వంటివి ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లో సమస్యలకు సూచికలు కావొచ్చు.

2. పొట్ట పరీక్ష: పిల్లాడు మాట్లాడుతున్నట్టయితే పొట్టనిండా గాలిని పీల్చుకొని వదలమని చెప్పాలి. దీంతో పొట్టలో ఏ భాగమైనా మిగతా భాగానికన్నా తక్కువగా కదులుతుందేమోననేది తెలుస్తుంది. దీని ద్వారా ఆ భాగంలోని అవయవంలో ఏదైనా సమస్య ఉంటే బయటపడుతుంది. నొప్పి కలుగుతున్న చోట నెమ్మదిగా నొక్కుతుంటే.. 'అబ్బా నొప్పి' అని అంటే ఆ భాగంలోని అవయవంలో సమస్య ఉండొచ్చని అర్థం.

3. మలద్వార పరీక్ష: కొన్నిసార్లు మలద్వారం గుండా లోనికి వేలు పెట్టి పరీక్షించాల్సి రావొచ్చు. దీంతో లోపల పాలిప్స్‌, పేగు చొచ్చుకొని రావటం వంటివేవైనా ఉంటే తెలుస్తాయి.

4. వ్యాధి సంబంధ లక్షణాలు: కామెర్లు వస్తే రక్తం పలుచబడుతుంది. దీన్ని సికిల్‌సెల్‌ ఎరోజన్‌ అంటారు. పక్కటెముక కింద కుడివైపున కొద్దిగా నొక్కి వదిలినపుడు విపరీతమైన నొప్పి వస్తుంటే పిత్తాశయం ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉండొచ్చు. బొడ్డు నీలంరంగులోకి మారితే పొట్టలో ఎక్కడైనా రక్తస్రావం జరుగుతుండొచ్చని అనుమానించాలి.


  • Dr.Hanumantharayadu (paediatric surgen)karnulu_A.P
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, February 10, 2012

విద్యార్ధులు-పరీక్షల ఆందోళన అవగాహన , Fear of Exams in Students Awareness


  • image : courtesy with Andhra bhoomi news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విద్యార్ధులు-పరీక్షల ఆందోళన అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చాలామంది మంచి విద్యార్థులు పరీక్షల సమయంలో దెబ్బతినడానికి ఆందోళనే అసలు కారణం. పరీక్షల పట్ల పెంచుకున్న భయం, ఫోబియా ఆందోళనకు దారితీస్తుంది. పరీక్షల ఆందోళన మనసుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ దశలో మనసు, శరీరంలో ప్రతికూలతలు చోటుచేసుకుంటాయి. మనో, శారీరక ధర్మాలను గతి తప్పిస్తాయి. దీంతో విద్యార్థిలోని సామర్థ్యాలు దెబ్బతింటాయి. విద్యార్థుల్లో మానసిక అలజడి తలెత్తడానికి చదువుకునే విధానం, దృక్పథం, పరిసరాలు, పరిస్థితులు ప్రధాన కారణాలవుతాయి. ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం, అతిగా ఊహించుకోవడం, ఆందోళన మనస్తత్వం భయాన్ని కలిగిస్తుంది. అలాగే తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వారి ఆతృత, భయాలను పిల్లలపై రుద్ది, ఆందోళన రేకెత్తించడం జరుగుతుంటుంది. ఆత్మన్యూనత, మెతక స్వభావం, సెంటిమెంట్లు ఎక్కువగా వున్నవారు త్వరగా భయం, ఆందోళనకు గురవుతుంటారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేవారు, ప్రతికూలభావాలు ఆలోచనతో ఉన్నవారిలో సులభంగా ఒత్తిడి తలెత్తుతుంది. ఆహార లేమి, నిద్రలేమి, విశ్వాసలేమి, శక్తిహీనత, రక్తహీనత లాంటి పరిస్థితులు ఒత్తిడిని పెంచి పోషిస్తాయి. ఇలా రకరకాల కారణాలవల్ల పరీక్షల భయం, ఆందోళన తలెత్తి సామర్థ్యాలను దెబ్బతీస్తుంటాయి.

ఆందోళన లక్షణాలు గుర్తించాలి
పరీక్షల భయం, ఆందోళన లక్షణాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. చాలావరకు ఈ లక్షణాలను మానసిక, శారీరక, అనారోగ్య లక్షణాలుగా భావిస్తుంటారు. ఆ దృష్టితోనే వైద్యం చేయిస్తుంటారు. పరీక్షల సమయంలో వచ్చే జ్వరం, వాంతులు, విరేచనాలలో అధిక శాతం పరీక్షల భయంవల్ల అన్న విషయం గుర్తించి చికిత్స చేయాలి. సాధారణంగా పరీక్షల సమయంలో మానసిక అశాంతి మొదలవుతుంది. భయం, అసహనం, కోపం, నిరాసక్తి, నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిన భావన కలుగుతుంది. అరచేతుల్లో చెమట, పెదాలు తడారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. తలనొప్పి, జ్వరం, విరేచనాలు అవుతాయి. కడుపులో దేవినట్టు అనిపిస్తుంటుంది. కొంతమంది కళ్ళు తిరిగి క్రిందపడి పోతుంటారు. ఈ నేపథ్యంలో చదివింది మరచిపోవడం, తెలిసిన అంశాలను సరిగా రాయలేక బాధపడటం చేస్తుంటారు.

భయం వీడితే జయం
పరీక్షల భయం వీడితే తప్పకుండా జయం సిద్ధిస్తుంది. పరీక్షల భయం, ఆందోళన అధిగమించడానికి పలు మార్గాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా చదవడం మొదటి సూత్రం. ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి. బట్టీయం, కంఠస్థం చేయడం మాని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే విధానం అలవర్చుకోవాలి. అలా చేయడంవల్ల విషయ పరిజ్ఞానం పెరిగి స్వంతంగా రాయగల నేర్పు స్వంతమవుతుంది. రోజంతా పుస్తకాలకు అతుక్కుపోవడం, రాత్రంతా మేల్కొని చదవడం అసలు చేయరాదు. మధ్య మధ్యలో విరామమిచ్చి, విశ్రాంతి పొందాలి. అప్పుడప్పుడు ఒత్తిడినుంచి ఉపశమనం పొందాలి. సరైన విధంగా పునశ్చరణ చేయడం అలవర్చుకోవాలి. ప్రతి సబ్జెక్టు చదివేలాగా సమయ విభజన చేసుకోవాలి. అర్థంకాని అంశాలను గుడ్డిగా చదవడం మాని టీచర్లు, తల్లిదండ్రులు, స్నేహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పరీక్ష ఏదైనా ఒకటే అన్న విధంగా వుండాలి. మార్కులు తగ్గినా, పెరిగినా సానుకూలంగా స్పందించే స్వభావం అలవర్చుకోవాలి. చక్కటి వ్యాయామం, సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఉపశమన మార్గాలను ఆచరించాలి. తల్లిదండ్రులు, టీచర్లు తమపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేమన్న దిగులుకు చోటివ్వరాదు. పరీక్షల ముందు, అనంతరం స్నేహితులతో చర్చించడం చేయరాదు. పరీక్షల సమయంలో టెన్షన్, ఒత్తిడి తలెత్తినపుడు చదివింది కూడా మరచిపోతుంటారు. అలాంటి సమయంలో దీర్ఘశ్వాసలు తీసుకోవడం, మంచినీళ్లు తాగడంవల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పరీక్షలు రాసే సమయంలో కష్టమైన ప్రశ్నలతో కుస్తీ పట్టడం మాని తెలిసినవాటికి జవాబులు వ్రాయడం చేయాలి. పరీక్షలకు ముందు ధ్యానం, స్వీయ హిప్నాటిజం ద్వారా ఉపశమనం పొందడం చాలా ఉపయోగకరం.


డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి Psychologist
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

గొంతు(లారింక్స్) క్యాన్సర్ అవగాహన,Throat(Laryngeal) cancer Awareness


  • image : courtesy with Andhra bhoomi news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గొంతు(లారింక్స్) క్యాన్సర్ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • Introduction :
ఇటీవల పాటలపై మక్కువ కనబరిచే యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరితో పాటు నిత్యం సంగీత సరస్వతి సాధనలో కుస్తీపడుతూ అటు డబ్బింగ్ ఆర్టిస్టులు, ఇటు నేపథ్యగాయకులతో పాటు సంగీత విద్యాంసులు కూడా గొంతుకకు తమకు తెలియకుండానే అవిరళ శ్రమ కలిగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి వారి స్వరపేటిక దెబ్బతినడం, సున్నితమైన ప్రదేశాల్లో శస్తచ్రికిత్సలు ఇటీవల సాధారణమయ్యాయి. కేవలం ఈ రంగంలోని వారికే కాక ఇతరులూ ఇటువంటి గొంతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గొంతుక సమస్యలను నిర్లక్ష్యం చేసినట్లయితే అది త్రోట్(లారింక్స్) క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలూ లేకపోలేదు. లారింక్స్ అనేది శ్వాసనాళానికి ఉపరితలాన ఉంటుంది. దీనే్న తెలుగులో స్వరపేటిక అంటారు. గొంతులో అతి ముఖ్యమైన ఈ భాగం 2 అంగులాల వెడల్పు కలిగి ఉంటుంది. వోకల్ కార్డ్స్‌ను అనుసంధానం చేయడానికి ఇది తోడ్పడుతుంది. లారింక్స్‌కు ముఖ్యంగా మూడు ఉపభాగాలుంటాయి. వీటిలో పైన ఉన్నదాన్ని సుప్రాగ్లాటిస్, మధ్యలో ఉన్నదాన్ని గ్లాటిస్, కింద ఉన్నదాన్ని సబ్‌గ్లాటిస్‌గా వ్యవహరిస్తారు. లారింక్స్ వల్లనే మనం శ్వాస పీల్చడం, మాట్లాడడం, మింగడం వంటివి చేయగలుగుతాం. సహజంగా లారింక్స్ క్యాన్సర్ లక్షణాలు 55 ఏళ్ళకు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించినా ఇటీవల 30 ఏళ్ళ వారిలో కూడా అటువంటి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

  • గొంతు క్యాన్సర్ కణాలు...
సాధారణంగా కణాలు పెరిగి శరీర అవసరానికి తోడ్పడతాయి. అవి మృతకణాలుగా మారిన సమయంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే, కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా శరీరానికి అవసరం లేకున్నప్పటికీ కొత్తకణాలు పుట్టుకురావడం, దెబ్బతిన్న కణాలు అలాగే ఉండిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రదేశాల్లో గడ్డలు తయారవుతుంటాయి. ఇటువంటి వాటిలో క్యాన్సర్‌కు దారితీసేవి కూడా ఉంటాయి. లారిక్స్ క్యాన్సర్ విషయానికొస్తే లారింక్స్‌లో క్యాన్సర్ కణాలు ఇలా తయారైన గడ్డను ఛేదించుకుంటూ విస్తరిస్తాయి. ఇవి శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముంది. ఒకవేళ మీకు లారింక్స్ క్యాన్సర్ ఉన్నట్లు తేలితే, దానికి కారణాలను ఒక్కోసారి వైద్యులు కూడా నిర్ధారించలేని పరిస్థితి ఉంటుంది. పొగాకు ఉత్పత్తులను చాలా కాలం ఉపయోగించినా, అతిగా మద్యం సేవించినా ఈ వ్యాధి బారిన పడే అవకాశముంది. ఇవే కాక గొంతులో హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయా అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. గుండె నుంచి గొంతుకు ఏదైనా ద్రవం బ్యాక్‌వర్డ్ ఫ్లో కారణంగా కూడా వ్యాధి కారకాలకు ఒకటిగా భావిస్తున్నారు.

  • లక్షణాలు...
నెలరోజులకు పైబడినా తగ్గని గొంతులో గరగర, ఏది తిన్నా మింగలేనంత గొంతునొప్పి, మెడలో ముద్దలా తయారవడం వంటివి గొంతు క్యాన్సర్‌కు ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. శ్వాసపీల్చడంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక చెవిపోటు, దగ్గు వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా వ్యాధి నిర్ధారణ ప్రాథమిక దశలో జరిగితే సులువుగా నయం అయ్యే అవకాశాలున్నాయి. ఇన్‌డైరెక్ట్ లారింగోస్పోపి, డైరెక్ట్ లారింగోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధి సోకిందా లేదా అనే విషయం తెలుసుకోవడంతో పాటు వ్యాధి తీవ్రతను కూడా నిర్ధారించవచ్చు. ప్రాథమిక దశలో ఉన్న గొంతు క్యాన్సర్(స్టేజి 0, 1, 2) సాధారణంగా ఒక చిన్న గడ్డలా ఉండి క్యాన్సర్ కణాలనేవి రక్తంలో తెల్లకణాలు కలిగిన ద్రవం ద్వారా వ్యాపిస్తాయి. అలాగే, స్టేజి 3, 4గా చెప్పబడే అడ్వాన్స్డ్ క్యాన్సర్ రక్తప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపింపజేస్తుంది.

  • చికిత్స...
సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా లారింక్స్ క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు. అడ్వాన్స్డ్ దశలో ఉంటే రెండు, మూడు చికిత్సా విధానాలను కలిపి ఉపయోగిస్తారు. అయితే, ఇవి రోగి శరీర పరిస్థితి, రోగనిరోధకశక్తి, క్యాన్సర్ తీవ్రతను బట్టి ఉంటాయి. అయితే, ఇటువంటి చికిత్సలు చేయాలంటే ఒక స్పెషలిస్టుల బృందం ఉండి తీరాలి. సాధారణంగా లారిక్స్ క్యాన్సర్‌కు చికిత్స చేయాలంటే ఈఎన్‌టి సర్జన్, జనరల్ నెక్ అండ్ హెడ్ సర్జన్లు, మెడికల్, రేడియేషన్ ఆంకాలజిస్టుల అవసరం ఉంటుంది. ఒక్కోసారి డెంటిస్ట్, ప్లాస్టిక్ సర్జన్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, హెల్త్ కౌంసలర్లు అవసరం కూడా ఉంటుంది.

  • ఇవి పాటిస్తే మేలు...
గొంతు క్యాన్సర్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మద్య, ధూమపానాలు పూర్తిస్థాయిలో నియంత్రించగలగాలి. పొగాకును ఏ రూపంలోనూ సేవించకూడదు. దీంతో పాటు సమయపాలన పాటిస్తూ క్రమపద్ధతిలో పౌష్ఠికాహారం తీసుకోవాలి. భోజనంలో విటమిన్-ఎ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం వంటివి చేయాలి.

  • -డాక్టర్ నచికేత్ దేశ్‌ముఖ్ ఎం.ఎస్.(ఈఎన్‌టి)

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, February 6, 2012

నాలుక పూత ,నాలుక మీద పగుళ్ళు, Glossitis



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Glossitis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




నాలుక (Tongue) పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పు డూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పల్లు నుండి గొంతు వరకు వ్యాపించింది.

నిర్మాణము

* ఉపకళా కణజాలము: జిహ్వా మొగ్గలు కలిగి ఉండి, రుచిని తెలియజేస్తాయి.
* గ్రంధులు: వీటి స్రావాలు నాలుకను తేమగా ఉంచుతాయి.
* కండరాలు: ముఖ్యంగా చారల కండరాలు. నాలుక చలనంలో తోడ్పడతాయి.

నాలుక పూత
* నాలుక పూత ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి. నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అది నోటి మాటలకు వర్తిస్తుంది అనుకోండి. కాని నోటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రం నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది.

అపుడప్పుడు అందరికీ నోరు పూత వస్తుంటుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైనఅంతా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి. దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుభ్రతే. అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బికాంప్లెక్ లేమి వలన, వైరస్ వలన, ఫంగస్, బాక్టీరియాల ఇన్‌ఫెక్షన్ కడుపులో పురుగులు, మెటాలిక్ పాయిజినింగ్ దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అజీర్ణవ్యాధి, దంతాల వ్యాధులు, ఏదైనా మందులు తీసుకొంటే అవి
వికటించినపుడూ ఇలా నోరు పూస్తుంది. కనుక ఎంతైనా మన నోరును మన జాగ్రత్తగా ఉంచుకోవాలి .

Treatment : 

కారణాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.
నోటి శుబ్రత పాటించాలి ... మౌత్ వాస్ తో నోరు పుక్కలించాలి. (Listril Mouth wash, Dresin mouth wash)
నాలుక , నోరు ఇన్‌ఫెక్షన్‌ అయితే ... యాంటిబయోటిక్స్ (oflaxin+ornidazole), యాంటి ఫంగల్ (flucanazole+Candid oral paint)వాడాలి.
పోషకాహార లోపం ఉంటే మంచి విటమిన్లు ఉన్న ఫుడ్ తినాలి , రక్తహీనత ఉంటే ఐరన్‌ +ఫోలిక్  యాసిడ్  వాడాలి.
ఇర్రిటేషన్‌ కలిగించే ఆహారములు అనగా --- కారము మసాలా తో ఉన్న ఆహారపదార్ధములు , ఆల్కహాల్ , పుగాకు (టొబాకొ) ఉత్పత్తులు తినకూడదు .
బి.కాంప్లెక్ష్ మాత్రలు లేదా సిరప్ రెగ్యులర్ గా తీసుకుంటుండాలి.

  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/