Monday, April 30, 2012

శృంగారం-మేధస్సుకు పదును,Sex sharpen mental activity



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శృంగారం-మేధస్సుకు పదును- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మెదడును చురుకుగా ఉంచుకోవటానికి ఏం చేయాలి? పదకేళీలు, సుడోకు పూరించటం, చదరంగం ఆడటం.. ఇలా మెదడుకు పనిపెట్టే రకరకాల పద్ధతులు మనసులో మెదులుతాయి. కానీ శృంగారం కూడా మేధోశక్తి పెరగటానికి దోహదం చేస్తుందని మీకు తెలుసా? టెర్రీ హార్న్‌ అనే సైకాలజిస్టు, సైమన్‌ వూటన్‌ అనే బయోకెమిస్ట్‌ గతంలో రాసిన 'ట్రెయిన్‌ యువర్‌ బ్రెయిన్‌' పుస్తకంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రాసిన ఇందులో.. సంభోగం, చాక్లెట్‌, చేపలు, మాంసం మెదడును చురుగ్గా ఉంచుతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఓ రసాయనిక స్థితిని సృష్టించి మెదడుకు నవోత్సాహాన్ని కలిగిస్తాయి. 2003లో ప్రచురితమైన మరో అధ్యయనంలోనూ శృంగారం మేధోశక్తికి తోడ్పడుతున్న సంగతి బయటపడింది. సంభోగంతో సంబంధం గల ఒక హార్మోన్‌.. మెదడు కణాలు వృద్ధిచెందటానికి దోహదం చేస్తున్నట్టు వెల్లడైంది. కాబట్టి మెదడుకు పదును పెట్టటానికి పదకేళీ, సుడోకు వంటి వాటితో పాటు కాస్త శృంగారం పైనా దృష్టి పెట్టటం అవసరమని వీటి ద్వారా తెలుస్తోంది కదూ.

sorce : Eenadu sukhibhava
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, April 28, 2012

గవదబిళ్లలు,Mumps

  • Image : courtesy with Eenadu sukhibhava.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గవదబిళ్లలు,Mumps- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... ఉన్నట్టుండి జ్వరంతో పిల్లలకు దవడలు వాచిపోయి.. గవదబిళ్లలు మొదలైతే.. చూడటానికి చాలా భయంగా ఉంటుంది. నొప్పి వేధిస్తుంది. పెద్దల్లో వస్తే బాధలు కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి. అయినా.. ఇది మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేం ఉండవు. అసలిది రాకుండా సమర్థమైన టీకా ఉంది! చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవదబిళ్లలు ఒకటి. దీన్నే 'మంప్స్‌' అంటారు. ఆటలమ్మ, పొంగుల మాదిరిగానే ఇది కూడా వైరస్‌ కారణంగా వచ్చే సమస్య. ఇది 5-9 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లోఎక్కువ. అయితే ఇది పెద్దల్లో కూడా రావచ్చు, పైగా పెద్దలకు వస్తే బాధలు కాస్త తీవ్రంగా ఉంటాయి. ఈ గవదబిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడోచోట కనబడుతూనే ఉంటుందిగానీ ఎండకాలం నుంచి వర్షరుతువు మొదలయ్యే మధ్య అధికం. అలాగే 2-3 మూడేళ్లకు ఒకసారి ఇది విస్తృతంగా చాలామందిని చుట్టబెడుతుంటుంది!
  • ఎలా వస్తుంది?
గవదబిళ్లలు ఉన్న వారు దగ్గినా, తుమ్మినా.. లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్‌ ఇతరులకూ వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో, పిల్లలు కలివిడిగా తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే- ఈ వైరస్‌ ఒంట్లో చేరిన తర్వాత బాధలు, లక్షణాలు మొదలవటానికి 14 నుంచి 21 రోజులు పట్టొచ్చు. పూర్తిస్థాయి గవద బిళ్లలున్న వారి నుంచే కాదు, తొలిదశ లక్షణాలున్న వారి నుంచీ ఈ వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది!
  • గ్రంథులలో స్థావరం
గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ ప్రధానంగా గ్రంథుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీదా ప్రభావం చూపుతుంది. ముందుగా- మామూలు ఫ్లూ మాదిరే ఇందులోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు నలతగా ఉన్నట్టు కనిపిస్తారు. ఈ సమయంలో చెంపల దగ్గర.. చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు (పెరోటిడ్‌ సెలైవరీ గ్లాండ్స్‌) రెండువైపులా వాచి, బాధ పెడతాయి. ఈ గ్రంథులు వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావొచ్చు. దాదాపు 5-7 రోజుల్లో ఈ వాపు తగ్గుతుంది. వాపుతో పాటు జ్వరమూ తగ్గుముఖం పడుతుంది.
  • సమస్యల ముప్పు
గవదబిళ్లలు కేవలం లాలాజల గ్రంథులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతరత్రా భాగాలనూ ప్రభావితం చెయ్యచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంథుల్లోనూ వాపు రావొచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. * సాధారణంగా 12-14 మధ్యవయసు మగపిల్లల్లో వృషణాల వాపు కనబడుతుంది. ముఖ్యంగా గవదల వాపు తగ్గుతున్న సమయంలో (7-10 రోజుల మధ్య) ఒక్కసారి జ్వరం వచ్చి, వృషణాలు బాగా నొప్పి చేసి విపరీతంగా బాధపడతారు. ఇక ఆడపిల్లలు అండాశయాల వాపు మూలంగా పొత్తికడుపులో నొప్పి, జ్వరంతో బాధపడటం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి 'పాంక్రియైటిస్‌'కు దారితియ్యచ్చు.అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే- ఇవన్నీ తాత్కాలికంగా బాధ పెట్టేవేగానీ వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేమీ ఉండవు.
  • అరుదుగా ప్రమాదం
* చాలాచాలా అరుదుగా గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ మెదడుకు వ్యాపించి మెదడువాపు (ఎన్‌కెఫలైటిస్‌), మెదడు పైపొరల్లో వాపు (మెనింజైటిస్‌) తెచ్చిపెట్టొచ్చు. అయితే ఇవి అరుదు, పైగా సకాలంలో చికిత్సతో చాలావరకూ నయమైపోతాయి. * గవదబిళ్లల్లో వాపు, నొప్పి, బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇతరత్రా సమస్యలు, మరణాలు చాలా చాలా తక్కువ. * ఎంఎంఆర్‌ టీకా వేయించుకోవటం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. * గవదబిళ్లలు వచ్చి, వృషణాలు వాస్తే భవిష్యత్తులో పిల్లలు పుట్టరనుకోవటం పెద్ద అపోహ. ఇది అనవసరమైన భయమే తప్ప ఇందులో నిజం లేదు.
  • టీకాతో నివారణ
గవదబిళ్లలు రాకుండా చిన్నపిల్లలందరికీ 'ఎంఎంఆర్‌ (మంప్స్‌, మీజిల్స్‌, రూబెల్లా) టీకా ఇవ్వటం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి, బడికి వెళ్లేముందు 5 ఏళ్ల వయసులో మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. * ఒకసారి గవదబిళ్లలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడూ రాదు. ఈ వ్యాధి వచ్చినవారికి దాని నిరోధకశక్తి జీవితాంతం ఉంటుంది. * పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు, లేదా ఎవరికైనా ఒక వైపే వాపు వచ్చినప్పుడు- గవదబిళ్లలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది.
  • పెద్ద అపోహ
గవదబిళ్లల కారణంగా మగపిల్లలకు వృషణాల వాపు వస్తే.. పెద్దయ్యాక వారికి పిల్లలు పుట్టకపోవటం వంటి సమస్యలుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. గవదబిళ్లల మూలంగా పిల్లలు పుట్టకపోవటం, పటుత్వం తగ్గటం వంటి ఇబ్బందులేమీ ఉండవు.
  • పరీక్షలతో నిర్ధారణ
చాలా వరకూ లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబోడీ, ఐజీఎం, ఐజీజీ వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలూ చేసి ఈ వైరస్‌ను నిర్ధారించుకోవచ్చు. పీసీఆర్‌ పరీక్ష ద్వారా మూత్రంలో, లాలాజలంలో కూడా వైరస్‌ను గుర్తించొచ్చు. మెదడువాపు వచ్చినపుడు మాత్రం వెన్ను నుంచి నీరు (సీఎస్‌ఎఫ్‌) తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది.
  • విశ్రాంతి కీలకం

గవద బిళ్లలకు ప్రత్యేకమైన మందులేమీ లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. దవడలకు వేడినీటి కాపడం హాయినిస్తుంది. నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్‌ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం, వీరికి అవసరమైతే స్టీరాయిడ్స్‌ వంటివి ఇస్తారు. 

Courtesy with : Eeandu sukhibhava , writen by Dr.Aswanikumar -prof. of medicine , Ashram medical college-Eluru.

  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

కళ్లు నులిమితే నష్టం,కెరటోకోనస్‌,కంటి ఎలర్జీ,Keratoconus

  •  
  • image : courtesy with Eenadu sukhibhava.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కంటి ఎలర్జీ- -గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    అలర్జీ కావచ్చు.. దురద కావచ్చు.. అలవాటు కావచ్చు.. కారణమేదైనా తరచుగా, విపరీతంగా కళ్లు నులిమితే చాలా సమస్యలు మొదలవుతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కనుగుడ్డు మీద ఉండే పైపొర- కార్నియా అక్కడక్కడ బాగా పల్చబడిపోయి, సాగి బయటకు తోసుకురావటం! ఒకసారి ఈ సమస్య తలెత్తితే దాన్ని జాగ్రత్తగా నెగ్గుకురావటమేగానీ పూర్తిగా మళ్లీ తగ్గించటం చాలా కష్టం. అందుకే దీని గురించి అందరూ అవగాహన పెంచుకోవటం అవసరం. ముఖ్యంగా తరచూ కంటి అలర్జీతో బాధపడేవారు దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించటానికి వీల్లేదు!

అలర్జీ.. మనకు సుపరిచితం! తుమ్ములతో మొదలై ముక్కుకారుతూ వేధిస్తుంది ముక్కు అలర్జీ. దద్దుర్లు, బెందులతో వేధిస్తుంది చర్మం అలర్జీ. ఇలాగే మన కంటికి కూడా అలర్జీ వస్తుంది, ఇది చాలా సాధారణం కూడా! కళ్లు దురద, నీరు కారటంతో మొదలయ్యే ఈ సమస్య కొందరిని విపరీతంగా, నిరంతరం వేధిస్తుంటుంది కూడా. చాలామంది దురదకు తాళలేక కళ్లు నలుపుకుంటూ తోసేసుకు తిరిగేస్తుంటారు గానీ దీనివల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని గుర్తించటం లేదు. ముఖ్యంగా అలర్జీ కారణంగా కళ్లు విపరీతంగా రుద్దుతుండటం వల్ల.. కనుగుడ్డు మీద ఉండే 'కార్నియా' పొర బాగా పల్చగా తయారై, అక్కడి నుంచి అది ముందుకు తోసుకొస్తూ.. 'కెరటోకోనస్‌' అనే అనర్థం తలెత్తుతుంది. కంటి వైద్యులు చాలా తరచుగా చూసే సమస్యే ఇది! అసలు పరిస్థితి ఇక్కడి వరకూ రాకుండా చూసుకోవటం ఒక ముఖ్యమైన అంశం, అలాగే ఒకవేళ 'కెరటోకోనస్‌' ఆరంభమైతే దీన్ని సత్వరమే గుర్తించి చికిత్స తీసుకోవటంద్వారా పరిస్థితి మరింత ముదరకుండా చూసుకోవటం ముఖ్యం.

ఏమిటీ కెరటోకోనస్‌?
మన కనుగుడ్డు మీద రక్షణగా పట్టి ఉండే తెల్లటి పైపొరను 'కార్నియా' అంటారు. ఇదీ, దీని కిందుగా ఉండే సహజమైన లెన్సు.. రెండూ కలిసి.. మన కంటి ముందున్న దృశ్యాన్ని లోపల ఉండే రెటీనా పొర మీద కేంద్రీకృతమయ్యేలా చూస్తాయి. దీంతో మనకు దృశ్యం కనబడుతుంది. విపరీతంగా కంటిని నులమటం, నలపటం వల్ల కనుగుడ్డు మీద ఉండే ఈ కార్నియా పొర పల్చబడే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కడ పల్చబడితే అక్కడ దీని బిగువు స్వభావం తగ్గి, లోపలి నుంచి ముందుకు తోసుకురావటం మొదలవుతుంది. దీన్నే 'కెరటోకోనస్‌' అంటారు. ఇది సాధారణంగా 20, 30 ఏళ్ల వయసులో రావచ్చు. దీనివల్ల మైనస్‌ పవర్‌లో తేడాలు వస్తుంటాయి. (సిలిండ్రికల్‌ పవర్‌ తోడవుతుంటుంది) కాబట్టి ఎవరికైనా చూపు మసకగా ఉందనిపిస్తే వైద్యులతో పరీక్ష చేయించుకోవటం మంచిది. కంటి పరీక్షలో వారికి 'సిలిండ్రికల్‌ పవర్‌' ఉండి, అది క్రమేపీ పెరుగుతున్నట్టనిపిస్తే వైద్యులు కెరటోకోనస్‌ ఉందేమో అనుమానించి.. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తారు. కెరటోకోనస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమేపీ పెరుగుతూ.. చివరికి కార్నియా లోపలిపొర ఎండోథీలియం చిరిగినట్త్లెపోతోంది. దీన్నే 'కార్నియల్‌ హైడ్రాప్స్‌' అంటారు. కార్నియా పొర బాగా ముందుకు తోసుకొచ్చినప్పుడు అందులోకి నీరు తోసుకొచ్చి, వాపు వచ్చి.. వెంటనే చూపు తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా కన్నును ఎక్కువగా రుద్దటం వల్ల వచ్చే విపరిణామాలు. అయితే కళ్లు రుద్దేవాళ్లందరికీ కెరటోకోనస్‌ రాకపోవచ్చు. అందుకే వైద్యులు దీనికి జన్యుపరమైన అంశాలు కూడా తోడవుతాయని భావిస్తున్నారు. తరచూ తల్లీపిల్లల్లో, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో చూస్తుండటం జన్యువుల ప్రమేయాన్ని పట్టిచెప్పే అంశం.

కళ్లెందుకు రుద్దుతారు?
1. కొందరు ఒక్కసారి కళ్లు నులుముకొంటే చూపు బాగా కనబడుతుందని భావిస్తూ తరచూ, అప్రయత్నంగా కళ్లు నులుముకుంటుంటారు.
2. కంటి అలర్జీలున్న వాళ్లు దురదతో తరచూ కళ్లను తీవ్రంగా నలుపుతుంటారు.
3. డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలున్న వారికి కూడా ఈ సమస్య ఎక్కువ. చాలాసార్లు పిల్లలు రుద్దీ రుద్దీ.. లోపలి పొరలు చినిగిన తర్వాతగానీ తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకురారు.

4. కొందరికి నోట్లో వేలు పెట్టుకోవటం లాగే తరచూ కన్ను రుద్దుకోవటం కూడా ఒక అలవాటుగా ఉంటుంది. వీరిలో కూడా 'కెరటోకోనస్‌' ఉండొచ్చు.
-మొత్తమ్మీద దీర్ఘకాలం కంటిని రుద్దుతుంటే కెరటోకోనస్‌ వస్తుందని కచ్చితంగా చెప్పచ్చు.

నిర్ధారించుకునేదెలా?
కెరటోకోనస్‌ ఉందేమో అని అన్న అనుమానం బలంగా ఉన్నప్పుడు 'టోపోగ్రఫీ' అనే పరీక్ష చేస్తారు. దీనిలో గుండ్రంగా ఉండాల్సిన కార్నియా వంపు మారిందా? ఎక్కడ ఎలా ఉందన్నది క్షుణ్ణంగా పరీక్షిస్తారు. కెరటోకోనస్‌ తొలిదశలో ఉన్నప్పుడు సాధారణంగా కనుగుడ్డు కింది అర్ధభాగంలో ముందుకు తోసుకొచ్చినట్లు స్పష్టంగా కనబడుతుంది. కొంచెం ముదిరితే.. కంటి వైద్యులు సాధారణంగా చేసే 'స్లిట్‌ల్యాంప్‌' పరీక్షలోనే- కార్నియా పొర పల్చబడినట్లు కనబడటం, కార్నియా మీద నాడులు ప్రముఖంగా కనబడటం, బయటకు తోసుకొస్తున్న చోట ఆ చుట్టూ ఒక రింగ్‌లా కనబడటం, మచ్చలు రావటం.. వంటి లక్షణాలు కనబడతాయి. టార్చ్‌లైట్‌తో, రెటీనోస్కోప్‌లతో చూసినప్పుడు కూడా వైద్యులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయి. 'కెరటోమెట్రీ' అనే పరీక్షలో కార్నియా వంపు ఎక్కడెక్కడ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. టోపోగ్రఫీలోనే ఇప్పుడు 'అబ్‌స్కాన్‌' అనే కొత్త పద్ధతి వచ్చింది. దీనిలో మొత్తం వివరాలన్నీ తెలుస్తాయి. ఈ మూడింటిని బట్టి 'కెరటోకోనస్‌' అని నిర్ధారిస్తారు.

చికిత్స
* అలర్జీ ఉంటే దానికి చికిత్స చేసి తగ్గిస్తూనే ముందు చూపు చక్కబడేందుకు అద్దాలు ఇస్తారు. సిలిండ్రికల్‌ పవర్‌ మరీ ఎక్కువగా ఉంటే దృష్టిని సరి చేయటానికి 'కాంటాక్ట్‌ లెన్సులు' ఇస్తారు. దీనిలో కూడా 'సాఫ్ట్‌ లెన్సు'లతో ఉపయోగం ఉండదు. హార్డ్‌ లెన్సులు అవసరంగానీ వాటితో ఇతరత్రా సమస్యలు రావచ్చు కాబట్టి ఇప్పుడు 'ఆర్‌జీపీ రిజిడ్‌ గ్యాస్‌ పర్మియబుల్‌' లెన్సులు, సాఫ్ట్‌-హార్డ్‌ లెన్సులు కలిసి వచ్చే 'పిగ్గీబ్యాక్‌' లెన్సుల వంటివి ఉపయోగపడతాయి. కొత్తగా గుడ్డు మొత్తాన్ని ఆవరించి పెద్దగా ఉండే 'స్ల్కీరల్‌ లెన్సులు' వస్తున్నాయి. వీటితో ప్రయోజనం అధికమేగానీ ఇవి ఖరీదైనవి, క్రమేపీ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

* సర్జరీ: కార్నియా నుంచి తోసుకొచ్చిన ఉబ్బు భాగాన్ని సరిచేసేందుకు లోపల రింగ్స్‌ అమర్చే విధానం ఉంది, దీంతో చూపు మెరుగవుతుంది, దీనిపైన కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకోవటం కూడా తేలిక అవుతుంది. మరీ ఎక్కువగా పొడుచుకొస్తే మాత్రం కార్నియా మార్పిడి సర్జరీ చెయ్యాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సర్జరీలో మొత్తం కార్నియా అంతా మార్చకుండా కొంతభాగమే మార్పిడి చేసే 'డీఎల్‌కేపీ' తరహా ఆధునిక పద్ధతులూ వచ్చాయి, ఫలితాలు బాగుంటున్నాయి.

* ముదరకుండా: కెరటోకోనస్‌ మరింతగా ముదరకుండా చూసేందుకు తాజాగా 'కొలాజెన్‌ క్రాస్‌లింకింగ్‌' అనే విధానం అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక ప్రత్యేక పద్ధతిలో కనుగుడ్డు మీదకు అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేస్తారు. దీంతో- పొరను దృఢంగా పట్టి ఉంచే ఫైబర్స్‌ అన్నీ బలంగా ఒకదాంతో మరోటి అతుక్కొని (క్రాస్‌లింకిగ్‌) కొలాజెన్‌ దృఢంగా అవుతుంది. సాగటం కొంత తగ్గుతుంది. దీంతో కెరటోకోనస్‌ మరింత ముదరకుండా నివారిస్తుంది.

* మొత్తమ్మీద.. అసలు పరిస్థితి ఇక్కడి వరకూ రాకుండా చూసుకోవటం, కన్నును నలపకుండా, అలర్జీ తగ్గటానికి చికిత్స తీసుకోవటం అత్యుత్తమం.
అలర్జీ దశలోనే అడ్డుకట్ట మేలు!
మిగతా అలర్జీల్లాగే కంటి అలర్జీ కూడా ఎక్కువగా పుప్పొడి రాలే కాలంలో కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో ఇది ఏడాదంతా (పెరీనియల్‌) ఉంటుంది కూడా. కంటి అలర్జీల్లో వర్నల్‌ కెరటో కంజెక్టివైటిస్‌ (వీకేసీ) చాలా తీవ్రమైంది. ఇది మన దేశంలో ఎక్కువ. సాధారణంగా ఇది 8-12 ఏళ్ల వయసులో వస్తుంటుంది. ఇతర దేశాల్లో ఇది వయసుతో పాటు తగ్గిపోతుంటుంది. కానీ మన దగ్గర చాలా ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉంటుంది. కంటి అలర్జీ ముదిరిపోతే కెరటోకోనస్‌తో సహా ఎన్నో అనర్థాలు పొంచి ఉంటాయి. కాబట్టి అలర్జీని విస్మరించకూడదు. చాలామందికి దుమ్ము, ధూళి, కాలుష్యం పొగ వంటివి పడవు. దీంతో కంటిలోని వివిధ భాగాల్లో వాపు, చికాకు ఆరంభమవుతుంది. సాధారణంగా ఇది కనుగుడ్డు మీద ఉండే పారదర్శక పైపొర కార్నియా; రెప్పల్లోపల ఉండే కంజెక్త్టెవా పొర; నల్లగుడ్డు, తెల్లగుడ్డు కలిసే లింబస్‌ వంటివన్నీ అలర్జీకి ప్రభావితమవుతుంటాయి. కన్ను దురద పెట్టటం, మంట, ఎరుపెక్కటం, నీళ్లు కారటం, వెలుతురు చూడలేకపోవటం, తరచూ కళ్లు నులమటం, రుద్దటం దీని లక్షణాలు. ఈ అలర్జీకి ప్రధానంగా- తవిటి పురుగు (డస్ట్‌మైట్స్‌), పుప్పొడి, కుక్క-పిల్లివంటి జంతువుల బొచ్చు, పత్తి.. దూది వంటి ధూళి కణాలు, కొన్ని రకాల రసాయనాలు కారణమవుతుంటాయి.

పుండు పడొచ్చు
కంటి అలర్జీతో బాధపడే వారిలో కనురెప్ప లోపలి భాగం (పాల్‌పెబ్రల్‌ కంజెక్త్టెవా)లో అక్కడక్కడా ఎర్రగా అయ్యి, వాచి.. ఉబ్బినట్లుగా ఉంటాయి. వీటినే 'పాపిలే' అంటారు. అలర్జీ తీవ్రంగా ఉంటే ఇవి పెద్దపెద్దగా కూడా ఏర్పడతాయి. కళ్ల నుంచి తీగలు సాగుతూ జిగురు స్రావాలు రావటం మొదలవుతుంది. అలర్జీ దీర్ఘకాలంగా ఉంటే రెప్పలోపలి భాగంలో మచ్చలు వస్తాయి. లింబస్‌ ప్రాంతం మందంగా అవుతుంది. పైన రెప్పలోపల ఉండే పాపిలే తరచూ కార్నియా పొరను రుద్దుకుంటూ ఉండటం, వాటి నుంచి వాపు కారక రసాయనాలు విడుదల అవుతుండటంతో కార్నియా పైపొర ప్రభావితమై.. పుండ్లు కూడా పడొచ్చు. వీటినే 'షీల్డ్‌ అల్సర్స్‌' అంటారు. దీని మీద తెల్లగా పొరలు పేరుకుని పుండు మానకుండా తయారవుతుంది. దీనికి చికిత్స చేయకపోతే ఇన్‌ఫెక్షన్లూ వస్తాయి. దీనివల్ల పిల్లల్లో కార్నియా మీద మచ్చ ఏర్పడటం, 'మెల్ల' రావటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి. కంటిని అతిగా రుద్దటం వల్ల కెరటోకోనస్‌ రావచ్చు. ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలూ పొంచి ఉంటాయి.

చికిత్స
అలర్జీ తెచ్చిపెడుతున్న కారకాలకు దూరంగా ఉండటం ప్రధానం. దుమ్ము ధూళి, కాలుష్యాల్లోకి వెళ్లకపోవటం, ఇల్లు దులిపినప్పుడు దూరంగా ఉండటం, పుప్పొడి తగలకుడా చూసుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలి. చేతులతో కళ్లను అసలే రుద్దకూడదు. ఐసు, లేదా చల్లటి నీటితో కళ్లకు కాపడటం పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది.

* చికిత్సలో భాగంగా వైద్యులు అలర్జీతో అతిగా స్పందిస్తున్న కణాలనునెమ్మదింపజేసేందుకు 'క్రోమాల్‌ ఫోర్ట్‌' వంటివి ఇస్తారు. ఇప్పుడు యాంటీ హిస్టమిన్‌, మాస్ట్‌ సెల్‌ స్టెబిలైజర్లతో కూడిన ఓలోప్యాటడిన్‌ మందు కూడా అందుబాటులోకి వచ్చింది. కళ్లు పొడి బారకుండా చూసేందుకు, అలర్జీ కారకాలను బయటకు పంపించేందుకు 'ఆర్టిఫిషియల్‌ టియర్స్‌' వంటి చుక్కల మందులు ఇస్తారు. వీటితో వాపు మూలంగా వచ్చే మంట నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. అవసరాన్ని బట్టి లెవోసిట్రిజిన్‌ వంటి యాంటీ హిస్టమిన్‌ మాత్రలు కూడా ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా ఉంటే కొద్దిరోజుల పాటు స్టీరాయిడ్స్‌ చుక్కల మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీటిని ఎక్కువగా వాడితే నీటికాసులు, శుక్లాల వంటివి వచ్చే ప్రమాదముంది. కాబట్టి వీటిలో తక్కువ ప్రభావం గల వాటిని వాటిని ఇస్తారు. వీటితో ఫలితం లేకపోతే కను రెప్పల కింద స్టీరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా ఉంటే సైక్లోస్పోరిన్‌ చుక్కల మందూ బాగా ఉపయోగపడుతుంది. ఆస్థమా బాధితులకు ఇచ్చే మాంటిలూకాస్ట్‌ తరహా మందులతోనూ ప్రయోజనం ఉంటుంది. వీటన్నింటినీ వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవటం అవసరం. మరీ పెద్ద పుండ్లు పడితే- పైపొరలను తొలగించి, అక్కడ మాయ నుంచి తయారు చేసిన పల్చటి పొరలను (ఆమ్నియాటిక్‌ మెంబ్రేన్స్‌) పొరలను అమర్చుతారు. ఇవి పుండు త్వరగా మానేందుకు దోహదం చేస్తాయి.

* మందపాటి అద్దాలు ధరించాల్సిన అవసరం లేకుండా చేసే 'లాసిక్‌' సర్జరీ ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే 'కెరటోకోనస్‌' సమస్య ఉన్న వారికి లాసిక్‌ సర్జరీ చెయ్యకూడదు. అందుకే లాసిక్‌ సర్జరీకి ముందు- కార్నియా పొర తగినంత మందం ఉందా? లేదా? అన్నది చూడటంతో పాటు కెరటోకోనస్‌ లేదని కూడా నిర్ధారించుకున్న తర్వాతే లాసిక్‌ సర్జరీ చేస్తారు.

/ Dr.M.S.Shridhar -cornial specialist , Vasan Eye care hospital , Hyderabad.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, April 25, 2012

ధమనులు, సిరలు అందించే సేవలు , Services of Arteries and Veins

  •  
  •  image : courtesy with Visual Dictionary online.com.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ధమనులు, సిరలు అందించే సేవలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన శరీరంలో రక్తం రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులలో శుద్ధి అయిన తర్వాత హృదయాన్ని చేరి అక్కడ నుండి వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకుపోతుంది. ఆయా అవయవాలలో విడుదల అయిన వ్యర్థాలను స్వీకరించి తిరిగి హృదయంలోకి ప్రవేశించి అక్కడ నుండి ఊపిరితిత్తులకు పంపు చేయబడుతుంది.

శుద్ధి కాబడిన రక్తాన్ని అవయవాలకు మోసుకుపోయే రక్తనాళాలను ధమనులు అంటారు. వ్యర్థ పదార్థాధలను స్వీకరించిన రక్తాన్ని అవయవాల నుండి  హృదయానికి తీసుకుపోయే రక్తనాళాలను సిరలు అంటారు.

ధమనులు : హృదయం నుండి పంప్‌ చేయబడిన శుద్ధి రక్తాన్ని మోసుకువెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. గుండెలోని ఎడమవైపు ఉండే ఆరికల్‌, వెంట్రికల్‌ గుండె యొక్క ఎడమ ఆరికల్‌కు చేరుకుంటుంది. అక్కడ నుండి ఎడమ వెంట్రికల్‌కు చేరుకుంటుంది. అక్కడ నుండి అయోర్టాలోనికి పంప్‌ చేయబడుతుంది. అయోర్టా(బృహద్ధమని) అతిపెద్ద ధమని. ఇది గుండె నుండి బయల్దేరి కొంతదూరం తర్వాత చిన్న, చిన్న రక్తనాళాలుగా విడిపోతుంది. వీటిని  ధమనులు అంటారు. ఇవి మరింత విభజించ బడితాయి. వీటిని ఆర్టరియోల్స్‌ అంటారు. ఇవి ఆ తర్వాత మరింత సూక్ష్మనాళలుగా విభజించబడతాయి. వీటిని కెపిలరీస్‌ అంటారు.  ఈ ధమనులు కణజాలలో భాగా లోపలికి ఉంటాయి. అయితే మణికట్టు వద్ద, కణతల వద్ద,మెడ వద్ద మాత్రం పైపైకి ఉంటాయి. అందువల్లే డాక్టర్‌ మణికట్టు వద్ద పల్స్‌ చూసేది. దానిబట్టి ధమనులు పనితీరు, ఆరోగ్యస్థితి తెలుస్తుంది. ధమనులు కండరాలతో చెయ్యబడిన గోడలను కల్గి ఉంటాయి. ఈ కండరపు గోడలు మందంగా ఉండి ఎలాస్టిక్‌ తత్త్వాన్ని కలిగి ఉంటాయి. గుండె రక్తాన్ని ధమనులలోకి పంప్‌ చేసినప్పుడు, ధమనుల కండరపు గోడలపై ఒత్తిడిని కలుగజేస్తుంది.ధమనుల గోడలు లోపలకు సంకోచించి రక్తాన్ని ముందుకు తోసి మరలా యధాస్థితికి వస్తాయి. ఈ విధంగా రక్త ప్రసరణను నియంత్రిస్తాయి. కానీ, ధమనులలో రక్తం చాలా వేగంగా ప్రవహిస్తుంది.ధమనులలో ప్రవహించే రక్తం మంచి ఎరుపు రంగును కలిగి ఉంటుంది. కాలేయం శరీరానికి అతి ముఖ్యమైన పనులు చేస్తుంది. అందువల్ల బృహద్ధమని నుండి నేరుగా కాలేయానికి ఒక ధమని వెడుతుంది. దీనిని హెపాటిక్‌ ఆర్టరీ అంటారు.

సూక్ష్మనాళాలు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇవి వెంట్రుకల కన్నా చాలా సన్నగా ఉంటాయి. వీటి గుండా రక్తకణాలు స్కూలు విద్యార్థుల వలె ఒక లైనులో వెళ్ళవలసిందే. అంత సన్నగా ఉంటాయి. ధమనులలో అతివేగంగా వెళ్ళే రక్తం కెపిలరీస్‌ చాలా  నెమ్మదిగా ప్రయాణిస్తుంది.

కొన్ని కెపిలరీస్‌ కొంత దూరం తర్వాత కలిసి వెన్యూల్స్‌గా ఏర్పడతాయి. ఈ వెన్యూల్స్‌ కొంత దూరం తర్వాత కలిసి వీన్స్‌(సిర)లుగా ఏర్పడతాయి.

సిరలు : కెపిలరీస్‌ శుద్ధి రక్తాన్ని శరీర కణాలను అందజేసి అక్కడ నుండి వ్యర్థ పదార్థాలను స్వీకరించిన రక్తాన్ని వెన్యూల్స్‌లోకి పంపుతాయి. ఈ వెన్యూల్స్‌లో నుండి రక్తం సిరలలోకి ప్రవేశిస్తుంది. సిరల నుండి వ్యర్థాలతో కూడిన రక్తం బృహత్‌సిర అయిన వీనా కేవాలోనికి ప్రవేశిస్తుంది . ఈ వీనా కేవా ఈ రక్తాన్ని గుండెలోని కుడివైపు ఉండే ఆరికల్‌లోకి పంప్‌ చేస్తుంది. సిరల యొక్క గోడలు మూడు పొరలను కలిగి ఉంటాయి. కాని, ధమనుల గోడల కన్నా సిరల గోడలు మందం తక్కువ ఉంటుంది. సిరలలో రక్తం అంత వేగంగా   ప్రవహించదు. దీనికి కారణం రక్తంలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా ఉండడం. సిరలు చర్మానికి దగ్గరగా ఉంటాయి.

చిన్న ప్రేవుల వద్ద ఆహారం రక్తంలోని గ్రహించబడుతుంది. అక్కడ నుండి హెపాటిక్‌ పోర్టల్‌ వీన్‌ ద్వారా కాలేయానికి చేరుతుంది. కాలేయం నుండి రక్తం హెపాటిక్‌ వీన్‌ ద్వారా హృదయాన్ని చేరుతుంది.

చేతుల లోను, కాళ్ళలోను ఉన్న వీన్స్‌(సిరల)లో వాల్వ్స్‌ శక్తికి లోబడి వెనుకను వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని సిరలలోని వాల్వ్స్‌ నివారిస్తాయి.కొంతమంది కాళ్ళమీద ఉబ్బిన లేదా, సాగదీయబడిన రక్తనాళాలు కనిపిస్తాయి. వీటిని వెరికోస్‌ వీన్స్‌ అంటారు. ఇవి ఎక్కుగా ముసలి వారిలోను, వ్యాయామం చేసే వారిలోను, ఎక్కువగా నడిచే వారిలోను కనిపిస్తాయి. సిరలలోని రక్తం తక్కువ వత్తిడిని కలుగజేస్తూ ప్రవహిస్తుంది.

పల్మనరీ ఆర్టరీ : వీనా కేవాలోని రక్తం గుండెలోని కుడి ఆరికల్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి కుడి వెంట్రికల్‌లోనికి ప్రవేశిస్తుంది. అక్కడ నుండి పల్మనరీ ఆర్టరీలోనికి ప్రవేశించి ఊపిరి తిత్తులకు చేరుతుంది. అక్కడ రక్తం ఆక్సిజన్‌ను స్వీకరించి, కార్బనడైఆక్సైడ్‌ను వదిలివేస్తుంది. పల్మనరీ వీన్‌ : ఊపిరితిత్తులలో శుద్ధి చెయ్యబడిన రక్తం పల్మనరీ వీన్‌లోకి ప్రవేశిస్తుంది. పల్మనరీ వీన్‌లో నుండి గుండె యొక్క ఎడమ ఆరికల్‌లోకి ప్రవేశిస్తుంది.

సాధారణంగా సిరలు చెడు రక్తాన్ని మోసుకుపోతాయి. కాని, పల్మనరీ వీన్‌లో శుద్ధి రక్తం ప్రవహిస్తుంది. మన శరీరంలో ఒక రక్తపు కణం గుండెనుండి ఊపిరితిత్తులకు, అక్కడ నుండి తిరిగి గుండెకు, అక్కడ నుండి వివిధ అవయవాలకు, మరలా తిరిగి గుండెకు చేరుకోవడానికి ఇరవై మూడు సెకన్ల కాలాన్ని తీసుకుంటుంది. రోజులో ప్రతీ రక్తపు కణం మూడువేల సార్లు శరీరమంతా తిరిగి వస్తుంది. అతిపెద్ద మార్గంగా మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థను చెప్పుకోవచ్చు. మన శరీరంలోని రక్తనాళాలను అన్నింటిని ఒక వరుసలోకి చేర్చి వంపులు లేకుండా సాగదీస్తే దాని పొడవు దాదాపుగా అరవై వేలమైళ్ళు ఉంటుంది.

ఏ అవయవానికి సంబంధించిన రక్తనాళాలను ఆ అవయవం పేరును జత చేసి పిలుస్తారు. ఉదాహరణకు కాలేయానికి సంబంధించిన ధమనిని హెపాటిక్‌ ఆర్టరీ అంటారు. సిరను హెపాటిక్‌ వీన్‌ అంటారు. కాలేయానికి ఆహారాన్ని మోసుకువచ్చే రక్తాన్ని కాలేయానికి అందించే సిర కాబట్టి దాన్ని హెపాటిక్‌ పోర్టల్‌ వీన్‌ అంటారు. అలాగే మూత్ర పిండాలకు సంబంధించి రీనల్‌ ఆర్టరీ, రీనల్‌ వీన్‌ అంటారు.

రక్త వేగంలో మార్పులు ఎప్పుడు వస్తాయి?

ఆరోగ్యవంతుని శరీరంలో రక్తం వేగంలోనూ, అనారోగ్యవంతుని శరీరంలోని రక్తం వేగంలోనూ తేడా ఉంటుంది. అలాగే తటస్థంగా కదలకుండా కూర్చున్నప్పుడు రక్త  ప్రసరణ వేగంలోనూ, బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు రక్త ప్రసరణ వేగంలోనూ తేడా ఉంటుంది.

జ్వరపడిన వారిలో రక్తప్రసరణ, వేగం, పనివల్ల రక్తప్రసరణ వేగం రెట్టింపవుతుంది. పని చేసినప్పుడు మన శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి రక్తం త్వరగా ఆక్సిజన్‌ నింపుకుని వేగంగా శరీర కణాలకు చేరుతుంది. దీనికి కావలసిన ఆక్సిజన్‌ను అందించడానికి ఊపిరి తిత్తులు కూడా వేగంగా పనిచేస్తాయి. అందుకే మనం త్వరత్వరగా ఊపిరిపీలుస్తాం. ధమనులు, సిరలు హృదయం అన్నింటినీ కలిపి రక్త  ప్రసరణ వ్యవస్థ అంటాం. ఇది ఏ మాత్రం అస్తవ్యస్థమైనా మనిషి పని అయినట్లే.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

శారీరక రుగ్మత తెలిపే వాంతి,Vomiting is a warning signal


  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - వాంతి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...





జ్వరంలాగే వాంతులు కూడా శరీరంలో ఏదో సమస్యతలెత్తిందని తెలియజేసే లక్షణం. వాంతి కావటమనేది ఒక రోగం లేదా అస్వస్థత కాకుండా, శరీరం ఏదో ఇబ్బందిని చెబుతోందని తెలియజేసే వార్నింగ్‌ సిగ్నల్‌ మాత్రమే.వాంతులు ఎంత తీవ్రంగా ఉన్నాయి? ఎప్ప టినుంచి జరుగుతున్నాయి? వాంతి చేసుకున్న  పదార్థం ఏ రంగులో ఉంది? వాంతితోపాటు కని పిస్తున్న మిగిలిన లక్షణాలు ఏమిటి? అనే అంశా లనుబట్టి వాంతులకు కారణమేమిటో చూచా యగా  పసిగట్టవచ్చు.

వాంతి--బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు. వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా  వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.

శరీరం తనకుతానుగా వెలువరించే వాంతులు నిజమైన వాంతులు లేదా ట్రూ వామిటింగ్స్‌లోకి వస్తాయి. శరీరంవెలువరించే వాంతులు నాలుగు దశలలో  జరుగుతాయి. మొదటగా వాంతి రావ డానికి సూచనగా వికారంగా ఉంటుంది. తరు వాత నోటిలో నీరు ఊరడం జరుగుతుంది. ఈ దశను వాటర్‌బ్రాష్‌ దశ అంటారు. మెదడులో లాలాజల ఉత్పత్తి కేంద్రం, వాంతిని ప్రేరేపించే కేంద్రం పక్కపక్కనే ఉండటం దీనికి కారణం. ఆ తరువాత దశను డోక్కోవడం అంటారు. వాంతి చేసుకోవాలనే తపన గొంతునుంచి వస్తుంటుంది. ఎంత డోక్కున్నప్పటికీ వాంతి కాదు. చివరగా వాంతి చేసుకోవడం జరుగుతుంది. లోపలినుంచి  పదార్థాలు వాంతి ద్వారా బైటకు వస్తాయి.
వాంతిని ప్రేరేపించే కేంద్రం మెదడు అడుగు భాగాన ఉండే బ్రెయిన్‌ స్టెమ్‌లో ఉంటుంది. రక్త ప్రవాహంలో శరీరానికి సరిపడని పదార్థాలు ఉన్నప్పుడు మెదడులోని వాంతిని ప్రేరేపించే కేంద్రంలోని రిసెప్టార్స్‌ వాటిని తట్టుకోలేక జీర్ణా శయం, అన్నవాహిక కండరాలు సంకోచ వ్యాకో చాలు జరిగేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా వాంతి జరుగుతుంది. వాంతి మరొక రకంగా కూడా జరుగుతుంది. జీర్ణాశయం, ప్రేవుల్లో కొన్ని రకాల అప్‌సెట్స్‌ సంభవించినప్పుడు మెదడులోని వామిటింగ్‌ కేంద్రం  ప్రేరణకు గురవుతుంది.


కలుషిత ఆహారంకలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు కొన్ని గంటల తరువాత లోపల అసౌకర్యాన్ని  ఫీలవుతాము. వాంతులు మొదలవుతాయి. ఎన్ని గంటలలోపల వాంతులు  మొదలవుతాయనేది మన శరీరంలో ప్రవేశించిన సూక్ష్మక్రిములు లేదా వాటి తాలూకు విషం ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు మూడు గంటలు పట్టవచ్చు. కొన్నిసార్లు 24 గంటలు కూడా పట్టవచ్చు.  సాధారణంగా వికారం, వాంతులు అతి తీవ్రంగా ఉంటాయి. అప్పుడప్పుడూ పొత్తికడుపులో పోట్లు, చెమట పట్టడం ఉంటుంది. అయితే ఇవి కొద్దిసేపు మాత్రమే. లోపలికి చేరిన కలుషితాహారాన్ని బైటకు పంపడానికి శరీరం చేసే ప్రయత్నమే వాంతి. ఈ ప్రయత్నంలో వికారంగా ఉండటం, వాంతులు కావడంతోపాటు విరేచనాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని రకాల వైరస్‌ల వలన కూడా వికారం, వాంతులు కావడం జరుగుతాయి. దీనికి ఉదాహరణ అతిసార వ్యాధి. ఈ వ్యాధిలో జీర్ణాశయం, ప్రేవులు వాపునకు గురి కావడం జరుగుతాయి. వాంతులు, నీళ్ల విరేచనాలు మొదలవుతాయి. బస్సుల్లో,  రైలులో ప్రయాణించే కొందరిలో వాంతులు కావడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. మన శరీరపు బ్యాలెన్స్‌ మెకానిజమ్‌ తలకు పక్క భాగంలో శబ్దాలను మెదడుకు చేరవేసే చెవి లోపి భాగానికి పక్కన పుర్రె తాలూకు ఎముకలలో నిర్మితమై ఉంటుంది. ఇక్కడ నిండుగా ఉన్న ద్రవంతో కూడిన మూడు అర్థ చంద్రాకారపు కాలువలు ఉంటాయి. తలను పక్కకు తిప్పినప్పుడల్లా కాలువ లైనింగ్‌ మీద ఉండే సూక్ష్మ కేశ నాళికలు ప్రేరణ చెందుతుంటాయి. ఈ కేశనాళికల చలనానికి సంబంధించిన ఈ ప్రేరణ అధికమైనప్పుడు వికారంగా అనిపిస్తుంది. దానినుంచి వాంతులు అవుతాయి. దీనిని మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు.
కొన్ని రకాల మందులకు వాంతి కలిగించే గుణం ఉంటుంది. చేపనూనెతో చేసిన కాప్సూల్స్‌, యాంటీబయాటిక్స్‌లో అత్యధిక భాగం, ఆస్తమాకు వాడే థియోఫిలైన్‌, నొప్పిని తగ్గించడానికి వాడే మాత్రలు, ఎక్కువ మోతాదులో తీసుకునే పొటాషియం, జింక్‌ మాత్రలు, కేన్సర్‌ నివారణకు వాడే మందులు మొదైలనవి వాంతులు తెప్పిస్తాయి.


కొన్ని కారణాలు :
  •  జీర్ణ వ్యవస్థ,

    * జీర్ణాశయం వాపు (ఆహార సంబంధమైనవి, వైరస్),
    * పైలోరిక్ స్టెనోసిస్ (చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది),
    * ప్రేగులో అడ్డంకి
    * విపరీతమైన కడుపు నొప్పి,
    * పిత్తాశయము(gall blader), క్లోమము(pancreas), ఉండుకము(Appendix), కాలేయము(Liver) వాటికి సంబంధించిన వాపులు,
    * ఆహర సంబంధిత అలర్జీ (పిల్లలకు పట్టే పాలలోని లాక్టోజ్ పడకపోవడం),

  • మెదడు మరియు జ్ఞానేంద్రియాలు,

    * ఎక్కువగా కదలిక వలన లోపలి చెవిలోని జ్ఞానేంద్రియాల మూలంగా,
    * తలకు దెబ్బ తగలడం,
    * మెదడులో రక్తస్రావం,
    * మైగ్రేన్ అనే ప్రత్యేకమైన తలనొప్పి,
    * మెదడులో ట్యూమర్లు,
    * మెదడులోని పీడనం ఎక్కువగా ఉండటం.,

  • జీవ క్రియలు,

    * రక్తంలో కాల్షియమ్ ఎక్కువ కావడం,
    * యురీమియా (రక్తంలో యూరియా ఎక్కువ కావడం, మూత్రపిండాల వైఫల్యం కారణంగా,
    * అధివృక్క గ్రంధి(Adrenal gland) వైఫల్యం,
    * రక్తంలో గ్లూకోజ్ తక్కువ కావడం,

  •  గర్భానికి చెందినవి,

    * ముత్యాల గర్భం,
    * Hyperemesis, Morning sickness,

  • మందులు, ఇతర పానీయాలు,

    * ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం,
    * ఓపియమ్ తీసుకోవడం,
    * కాన్సర్ వైద్యంలో వాడుతున్న మందులు,

  • మానసినమైనవి,

    * మానసిక కారణాల మూలంగా వారంతట వారే వాంతి చేసుకోవడం,
    * అసహ్యమైన వాటిని చూచినా, వాసన చూసినా, ఆలోచించినా కొందరిలో వాంతవుతుంది.
    * ఎక్కువ మోతాదులో రేడియేషన్,
    * ఫిట్స్ మొదలైన తీవ్రమైన క్రియలు,
    * అతిగా భయం,


చికిత్స :
  • సాధారణము గా వాంతిని కలిగించే కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. డోకులకు , వాంతులకు యాంటి ఎమెటిక్స్ వాడుతారు . యాంటి ఎమిటిక్స్ ... మెదడు లోని కీమోరిసెప్టార్ ట్రిగ్గర్ జోన్‌ (chemo receptor trigger zone) ని అదుపు చేయడము వలన ఈ ప్రక్రియ జరుగుతుంది . కొన్ని యాంటి ఎమిటిక్స్ రిసెప్టార్ బిందువులను inhibit చేయడము వలన వాంతి ప్రక్రియ అదుపులో ఉంటుంది . ఉదా : anticholinergics, antihistamines, dopamine antagonists, serotonin antagonists, and cannabinoids are used as anti-emetics.

మార్కెట్ లో దొరికే కొన్ని మాత్రలు పేర్లు :
  • Tab . Domperidone (Domestal) one tab three time / day.
  • Tab. Doxylamaine succinate (Doxynate) 1 tab 2-3 time / day
  • Tab . (Avomine) 2-3 tabs / day.
  • Tab . Stemtil 2-3 tabs / day

చిన్నపిల్లల విషయము లో వైద్యుని సంప్రదించాలి . 

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, April 24, 2012

దద్దుర్లు,బెందులు,Urticaria

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దద్దుర్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 దద్దుర్లు వ్యాధి చర్మ వ్యాధుల్లో ఒక రకమైన తరుణ వ్యాధి. దీనిలో అకస్మాత్తుగా, తెల్లగా, గులాబిరంగులో చిన్న చక్రాల వలె చర్మంపై వస్తాయి. ఇవి కొన్ని నిముషాలు, లేదా గంటలు లేదా కొన్నిరోజుల వరకూ ఉండవచ్చును. ఇవి వస్తూ, తగ్గుతూ ఉంటాయి. దురద, మంట ఉంటుంది. పలు సైజులలో కనబడుతుంటాయి.

ఎక్కువగా అలా పదేపదే వస్తూ పోతున్నప్పుడు వాటిని తీవ్రంగానే పరిగణించాలి. ఒక్కోసారి ఈ దద్దుర్లు లేదా బెందులు సొరియాసిస్‌కు దారి తీయవచ్చు. తొలిదశలోనే సమస్యను గుర్తించి చికిత్సలు తీసుకుంటే సొరియాసిస్ రాకుండా ముందే అరికట్టవచ్చు. నిజానికి దద్దుర్లు వల్ల సొరియాసిస్ రాదు. దద్దుర్లులతో చర్మం వ్యాధినిరోధక శక్తి కోల్పోయిన కారణంగా సొరియాసిస్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి శరీరంలో ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా యాంటీ-హిస్టామిన్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ యాంటీ-హిస్టామిన్‌లు మరీ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ తరహా చర్మ సమస్యలు మొదలవుతాయి.

వ్యాధి కారణాలు
జీర్ణకోశ సంబంధ వ్యాధులతో వస్తాయి. కొన్ని రకాల ఆహారపదార్థాలు పడక, ఎలర్జీ కారణంగా వస్తాయి. కొంత నర్సస్‌గా ఉన్న వారిలో ఎక్కు వగా కనబడుతాయి. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు కూడా రావచ్చును.
లక్షణాలు
జీర్ణకోశ సంబంధమైన లక్షణాలతో, నీరసంగా, వికారంగా ఉంటుంది. వాంతులు అవవచ్చును. మలబద్ధకం లేదా విరేచనాలు కావచ్చును. చర్మంపై వివిధ సైజుల్లో దద్దుర్లు, దురదలు వస్తాయి. కొన్ని నిముషాలునుండి కొన్ని గంటల వరకూ కనపడి పూర్తిగా మాయ మవుతాయి. మళ్లీ ఇంకొకచోట మళ్లీ కొత్తగా వస్తాయి.  రుద్దినప్పుడు ఎక్కువవుతాయి. చిన్న పిల్లలలో వచ్చే దద్దుర్లను హైవ్స్‌ అని అంటారు. సాధారణంగా ఈ దద్దుర్లు పూర్తిగా నయమ వుతాయి. కాని కొన్నిసార్లు చాలా పసితనంలోనే కనిపిస్తాయి. తీవ్ర అనారోగ్యంతో బాధ పడు తున్న పిల్లల్లోనూ ప్రమాదకరంగా మారవచ్చు.

చికిత్స :
ఇలాంటి స్థితిలో 'అవిల్' మాత్రలు గానీ,' సెట్రజిన్' మాత్రలు గానీ వేసుకుంటే తాత్కాలికంగా తగ్గుముఖం పడతాయి. ఆ తరువాత ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వస్తూనే ఉంటాయి.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

అనొరె క్సియా నెర్వోసా,Anorexia Nervosa,తినకపోవడం రుగ్మతే





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అనొరె క్సియా నెర్వోసా,Anorexia Nervosa,తినకపోవడం రుగ్మతే- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...






మనందరమూ జీవించడానికి ఆహారం తీసుకుంటాం. మనం తినే ఆహారాన్ని ఎంతో ఆనందంగా భుజిస్తాం. అయితే మనుష్యుల ప్రవర్తనలలో కనిపించే వైవిధ్యాలలాగా వారి ఆహార విషయాల్లోనూ వైవిధ్యాలు ఉండవచ్చు. కొంతమంది ఎక్కువగా భుజించవచ్చు. మరికొందరు తక్కువగా తినవచ్చు. కొంతమందిత్వరగా స్థూలకాయులు కావచ్చు. ఇంకొంతమందిలో ఎంత తిన్నా స్థూలకాయం వారి దరిదాపులకు రాకపోవచ్చు.
అయితే, కొంతమంది సన్నగా ఉండాలనే భావనతో శరీరా వసరాలకు కూడా సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహా రాన్ని తీసుకుంటారు. ఇటువంటి వారి విషయంలో వైద్య సహాయం అవసరం కావచ్చు. ఎందుకంటే వీరు అనొరె క్సియా నెర్వోసా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వారై ఉండవచ్చు. ఈ పరిస్థితి మహిళలలో సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది మరింత ఎక్కువ.

లక్షణాలు
- స్థూలకాయం వస్తుందనే భయం
- అతి తక్కువగా తినడం
- తీవ్రస్థాయిలో బరువు కోల్పోవడం
- స్థాయిని మించి వ్యాయామం చేయడం
- మహిళల్లో రుతుక్రమంలో లోపాలు

అనొరెక్సియా నెర్వోసా అనే పరిస్థితి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకు కనిపిస్తుంది. ఇదిసాధారణంగా ఉన్నతాదాయ వర్గాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాల అమ్మాయిల్లో డైటింగ్‌ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొంతమంది అమ్మాయిలు త్వరితగతిన బరువు కోల్పోవాలనే ఉద్దేశ్యంతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తారు. ఇదే వారి ప్రధాన కార్యక్రమంగా మారుతుంది.
తమ వయస్సు, ఎత్తులతో పోల్చినప్పుడు ఉండాల్సిన స్థాయికంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ, కొంతమంది అమ్మాయిలు డైటింగ్‌చేయడం, తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం చేస్తుంటారు. లేదా డైటింగ్‌తోపాటు బరువు తగ్గడానికి ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటారు. వీరిలో ఆహారం పట్ల స్థిరమైన అవాంఛిత ఆలోచనలు (అబ్సెషన్స్‌) ఉంటాయి. ఇటువంటి వారు ఆహారం తీసుకున్న తరువాత బరువు పెరగకూడదనే ఆలోచనతో తిన్న ఆహారాన్ని వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

అనొరెక్సియా వలన దుష్ఫలితాలు
- ఆహారం తీసుకోకపోవడం వలన కుద్బాధకు గురవుతారు. ఫలితంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.
- వ్యాకులతకు గురవుతారు. ఏకాగ్రత దెబ్బ తింటుంది. నిద్ర సరిగ్గా పట్టదు.
- శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక బలహీనతకు లోనవుతారు.
- వాంతుల కారణంగా మూర్ఛ వ్యాధికి గురి కావచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు. గుండె కొట్టుకోవడంలో లోపాలు సంభవించవచ్చు.
- హార్మోన్లలో అసమతుల్యతలు సంభవించి రుతుక్రమంలో మార్పులు వస్తాయి. రుతుక్రమం పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి.

అనొరెక్సియాకు కారణమేమిటి?
కొంతమంది అమ్మాయిలు ఇలా అనొరెక్సియా నెర్వోసాకు గురికావడానికి కారణమేమిటి? అని పరిశీలిద్దాం.
వీరిపై సామాజికపరమైన వత్తిడి ప్రధాన కారణం. సన్నగా ఉంటే అందంగా ఉంటారనే భావన ఒక కారణమైతే, మీడియాలో వస్తున్న ఫ్యాషన్‌ షోలు వీరిపై ప్రభావం చూపడటం మరొక కారణం. అలాగే 'బరువు తగ్గండి అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో వెలుస్తున్న 'క్లినిక్‌లు కూడా అమ్మాయిఉల అనొరెక్సియా నెర్వోసాకు గురవడానికి ఇంకొక కారణం.
సన్నగా ఉన్నవారికి సమాజంలో లభించే ప్రత్యేక గుర్తింపు కూడా అమ్మాయిలలో బరువు తగ్గాలనే ఆలోచన కలుగజేసి డైటింగ్‌ చేయడానికి తద్వారా అనొరెక్సియాకు గురి కావడానికి దోహదం చేస్తున్నది.
నియంత్రణ : డైటింగ్‌ చేయడంవలన ఏదో సాధించామనే భావన కలుగుతుంది. డైటింగ్‌, బరువు తగ్గడాలు రెండూ శరీరం నియంత్రణలోనే ఉందనే భావనను కలిగిస్తాయి.
కుటుంబం: తల్లిదండ్రులు పిల్లలడైటింగ్‌ను ఆమోదించడమో, లేదాపిల్లలు భోజనం వద్దనడమో అనేక కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులపై కోపాన్ని భోజనం మానివేయడం ద్వారా ప్రదర్శిస్తారు.
వ్యాకులత: ఏ కారణంగా కలిగే వ్యాకులత అయినా ఆహారంపట్ల అభిరుచిని తగ్గించవచ్చు. అయితే వ్యాకులత కలగడానికిగల కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే వారిలో ఆహారం పట్ల ఉన్న నిరాసక్తత తొలగిపోతుంది.
ఎలాంటి సహాయం అందించాలి?
ఈ సమస్య తక్కువ స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేకమైన చికిత్స అవసరమవుతుంది. అమ్మాయిలు కొంత బరువు తగ్గిన తరువాత సరైన పద్ధతిలో సలహాలివ్వడం ద్వారా వారిలో ఉండే అబ్సెషన్‌ను తొలగించవచ్చు.
వయస్సు, ఎత్తులకు తగిన బరువు ఉన్న ప్పటికీ అమ్మాయిల్లో బరువు తగ్గాలనే ఆలోచన ఇంకా స్థిరంగా ఉండి, డైటింగ్‌, వ్యాయామాలు మొదలైనవి చేస్తుంటే తప్పని సరిగా వారికి వైద్య సహాయం అవసరమవుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే నొరెక్సియా కారణంగా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అనొరెక్సియాను తొలిదశలోనే గుర్తిస్తే పిల్లలను తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం అంత కష్టమేమీ కాదు.
అనొరెక్సియా సమస్యతో బాధపడే వారికి చికిత్సలో మొదటి మెట్టు వారు తమ వయస్సు, ఎత్తుకు సరిపోయే బరువు ఉండేలా చూడటం. పిల్లలు కూడా ఇతర కుటుంబ సభ్యులతోపాటు తమ శరీరావసరాలకు సరిపోయిన స్థాయిలో ఆహారాన్ని తీసుకునేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. అనొరెక్సియా నెర్వోసాతో బాధపడుతున్న రోగికి మానసిక వైద్య నిపుణులతో చికిత్స చేయించడం అవసరం. రోగి సమస్యను మానసిక వైద్య నిపుణుడు సమగ్రంగా తెలు సుకుని, తగిన కారణాలను కనుగొంటారు. అలాగే రోగిలో అంతర్లీనంగా వ్యాకులత ఉందేమో పరిశీలిస్తారు. తదనుగుణంగా చికిత్స చేయడానికి అవకాశముంటుంది.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్‌ (సిపిఆర్‌),హృదయ శ్వాస పునరుద్ధారణ .Cardio-pulmonary Resuccitation(CPR),కృత్రిమ శ్వాస

  •  
  •  image : courtesy with Naadi Vartha News paper.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Cardio-pulmonary Resuccitation(CPR),కృత్రిమ శ్వాస- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండె ఆగినట్లు తెలుసుకోవడమెలా?
హఠాత్తుగా Heart ఆగిపోయినప్పుడు మనిషిని బ్రతికించడానికి చేసే ప్రక్రియను కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్‌ (సిపిఆర్‌) అంటారు. తెలుగులో దీనిని హృదయ శ్వాస పునరుద్ధారణ అనవచ్చు. సిపిఆర్‌ చేయడానికి ప్రత్యేక విద్యార్హతలేమీ అక్కరలేదు. అందరూ నేర్చుకోవచ్చు. ప్రమాదా నికి గురైన వ్యక్తిని కాపాడటానికి ఆ మనిషి పక్కన ఎవరుంటే వారు సిపిఆర్‌ చేయవచ్చు. గుండె హఠాత్తుగా ఆగిపోయినట్లు తెలుసుకోవ డానికి ఈ కింది సూచనలు గమనిస్తే చాలు.
స్పృహ కోల్పోవుట--అంతవరకూ స్పృహలో ఉన్న మనిషి అమాం తంగా స్పృహ కోల్పోతే గుండె ఆగిపోయినట్లు అనుమానించాల్సిందే.
నాడీ స్పందన కోల్పోవడం--నాడిని శరీరంలోని వివిధ భాగాల్లో పరీక్ష చేయవచ్చు. కాని సామాన్య ప్రజానీకానికి వీలయినది ఎడమచేయి మణికట్టు దగ్గర బొటన వేలు వైపు ఉన్న నాడి. దీనిని పరీక్షించవచ్చు.

ప్రక్రియలోని ముఖ్యాంశాలు
వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టాలి. వీలుంటే గట్టిగా ఉండే మంచంమీద కాని, నేలమీద కాని పడుకోబెట్టాలి. లేదా వీపు కింద బోర్డును కూడా దూర్చవచ్చు. ప్రత్యేకంగా వీటికోసం కాలాన్ని వృధా చేయడం అసలుకే ముప్పు వస్తుంది. ఈ సమయంలో ప్రతీ సెకనూ విలువైనదే.
శ్వాస ద్వారాల శుభ్రత---ముక్కు, నోరు, గొంతులో ఏమైనా అడ్డుకుని ఉంటే తీసివేసి శుభ్రపరచాలి.

కృత్రిమ శ్వాస, గుండె పునరుద్ధరణ
ఈ రెండు ప్రక్రియలు కలిపి ఒక్కసారే జరపాలి. కృత్రిమ శ్వాస ఉద్దేశ్యం ఊపిరితిత్తుల్ని గాలితో నింపడమూ, తద్వారా గాలిలోని ప్రాణవాయువు రక్తంలో లీనమవడమూ. ప్రాణవాయువుతో నిండిన రక్త ప్రసరణ లేకపోతే మెదడు కణాలు జీవించడం కష్టం. ప్రమాదానికి గురైన వ్యక్తి నోటి ద్వారా శాసనందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి ముక్కును మూసి ఉంచాలి. రెండవ విధానంలో నోటి ద్వారా ప్రమాదానికి గురైన వ్యక్తి ముక్కుద్వారా శ్వాసనందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి నోటిని మూసి ఉంచాలి.
గుండె వత్తిడి---గుండె, రొమ్ము ఎముకకు, వెన్నెముకకు మధ్య ఛాతీలో ఉంటుంది. అందుకే రొమ్ము ఎముక కింది భాగం మీద ఒక అరచేతి మీద ఇంకొక అరచేతిని ఆనించి గట్టిగా వెన్నెముకవైపు వత్తితే గుండెకు వత్తిడి కలిగి ఆ కారణంగా గుండెలో ఉన్న రక్తం శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ప్రసరణమవుతుంది. ఈ ప్రక్రియను నిముషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. గుండె వత్తిడి, కృత్రిమ శ్వాస ప్రక్రియలు విడి విడిగా వివరించినా, రెండూ ఒకే సమయంలో చేయాలి. సిపిఆర్‌ ప్రక్రియ విజయవంతమైందని తెలుసుకోవడానికి వ్యక్తి కోల్పోయిన నాడి మళ్లీ అందుతుంది. వ్యక్తి కనురెప్పలు మన చేతివేళ్ల తాకిడికి స్పందిస్తాయి.
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

కళ్లెలో రక్తం పడుతుంటే?,Blood in the expectoration(sputum)

  •  image : courtesy with Vartha news paper.





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కళ్లెలో రక్తం పడుతుంటే?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




Cancer
కళ్లెలో రక్తం పడటానికి ప్రధాన కారణం గడ్డ కట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయాణించటం. ఊపిరితిత్తులకు Cancer‌ సోకటం వలన కూడా కళ్లెలో రక్తం కనిపిస్తుంది. అయితే ఈ రెండు కారణాలూ చాలా అరుదు. మీరు దగ్గినప్పుడు కళ్లెపడుతూ రక్తంలో కనిపిస్తే ఈ కింది కారణాల్లో ఏదో ఒకటి కారణమై ఉండవచ్చునని భావించాలి. అయితే కళ్లె ఏ రంగులో ఉంది? ఏ సందర్భంలో రక్తం పడింది అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జ్వరం లేకుండా ఉండటం, దగ్గీ దగ్గీ ఉమ్మిలో నెత్తురు పడటం - ఇవి ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలు. కేన్సర్‌ తాలూకు గడ్డ ఊపిరితిత్తుల నిండా వ్యాపిస్తున్న కొద్దీ మీకు ఊపిరి అందక పోవడం, గాఢంగా శ్వాసను తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి ఉంటాయి.

అయితే ఇది 40యేళ్ల వయస్సు పైబడిన వారివిషయంలో.40యేళ్లలోపు వయస్సులో ఉండి, మిగతా విషయాలలో ఆరోగ్యంగా ఉండి, అంతకు మునుపు ఊపిరితిత్తుల మార్గంలో ప్రమాదకరం కాని పులిపిరులు ఉన్నవాళ్లయితే అది లంగ్‌ కేన్సర్‌ కాకపోయే అవకాశం ఉంది.

ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డ
మీరు స్త్రీలై ఉండి, 25-35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండి, గర్భనిరోధ మాత్ర లను వాడుతున్నవారైతే గాఢంగా శ్వాస పీల్చుకో బేయే సరికి మీకు అకస్మాత్తుగా ఛాతీ పక్క భాగంలో చురుక్కుమనే పోటు కలుగుతుంది. జ్వరం ఉండదు. ఒక కాలిపిక్క అప్పుడప్పుడూ నొప్పి చేస్తుంటుంది. ఉమిసినప్పుడు ఉమ్మి లేత ఎరుపు రంగులో ఉంటుంది.
రోజులు గడుస్తున్న కొద్దీ ఉమ్మి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంటుంది. అప్పుడ ప్పుడూ స్వల్పంగా ఊపిరి అందకపోవడం, గుండెదడ ఉంటాయి. ఒక కాలు వాచి, తాకితే నొప్పి పెడుతుంది. ఇవన్నీ మీకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉండటానికి సూచనలు. ఈ గడ్డను పల్మొ నరీ ఎంబాలిజమ్‌ అంటారు.
మీరు మధ్య వయస్సులో ఉన్న మహిళ అను కుందాం. గర్భ నిరోధక మాత్రలను వాడుతూ ఉండరు. కాని, పైన చెప్పిన లక్షణాలు కనిపి స్తున్నాయనుకోండి. అప్పుడు ఒకసారి ఈ కింది అంశాలు ఆలోచించండి.
ఈమధ్య మీకు ఏదైనా ఆపరేషన్‌ అయిందా? సుస్తీ వలన చానాళ్లపాటు పడక మీద ఉన్నారా? ఈ మధ్య చాలా దూరం విమాన ప్రయాణం చేశారా? మీకు వెరికోస్‌ వీన్స్‌ సమస్య ఉండి, అవి నొప్పి చేస్తున్నాయా? ఇవన్నీ ప్రయాణ సందర్భంలో ఊపిరితిత్తులలో రక్తపు గడ్డను ఏర్పరిచే అంశాలు.

క్షయ
వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే ఒకప్పుడు దానిని డాక్టర్లు టిబిగా సందేహించేవారు. సమాజంలో ఇప్పుడు టిబి చాలా వరకూ తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ లక్షణం కనిపిస్తే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించడం జరుగుతుంది.
బ్రాంకిఎక్టాసిస్‌లో ఊపిరితిత్తుల తాలూకు శ్వాస గొట్టాలు ఏ భాగంలోనైనా విశాలం కావడమో, బలహీనపడటమో జరుగుతుంది. ఈ రోగులకు సైనస్‌సమస్య కూడా ఉంటుంది. మనిషికి ఒకసారి బ్రాంకిఎక్టాసిస్‌ వచ్చిందంటే ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. దీర్ఘకాలం పాటు యాంటి బయాటిక్స్‌ వాడటం, ఛాతీకి ఫిజియోథెరపీ చేయించడం అవసరమవుతాయి.
ఈ రోగులు దగ్గినప్పుడు దుర్వాసనతో కూడిన కఫం పడుతుంది. కఫంలో నెత్తురు ఉండవచ్చు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్పుడు. టిబి రోగులు ఉండే నర్సింగ్‌ హోమ్‌ లలో పని చేసేవారికి కఫంలతోపాటు క్రమం తప్పకుండా రక్తం పడుతుంటే దానిని టిబిగా సందేహించవచ్చు.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌
ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా లేదా వైరస్‌ వలన ఏ ఇన్‌ఫెక్షన్‌ సోకినా కఫంలో రక్తం కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసనాళ వ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ సోకే క్రానిక్‌ బ్రాంకైటిస్‌. ఈ వ్యాధిలో కఫానికి రక్తం చారికలు కనిపిస్తాయి. లంగ్‌ కేన్సర్‌లో రక్తం కలగలిపి ఉంటుంది.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, April 23, 2012

Varicose Veins, వెరికోస్ వీన్స్ , సిరలు ఉబ్బిపోవడం


  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Varicose Veins, వెరికోస్ వీన్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 జీవితం లో ముందికు సాగేందుకు కాళ్ళు ఆరోగ్యము గా ఉండడము ఎంతో అవసరము . కాళ్ళకు సంబంధించిన ఓ సాధారణ వ్యాధి వెరికోస్ వీన్స్ . కాళ్ళలో సిరరు (వాడుక భాషలో నరాలు) వాచి అసాధారణము గా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వీన్స్ గా పరిగణిస్తారు . వెరికోస్ వీన్స్ వ్యాది ఎక్కువగా 30 నుండి 70 సం . మధ్య వయసుండే వ్యక్తులలో కనిపిస్తుంది . దీర్ఘకాలము పాటు నిలబడి లేదా కూర్చొని పనిచేసే వారికి కాళ్ళలో వెరికోస్ వీన్స్ తలెత్తే ప్రమాదం ఉంటుంది . మహిళలలో .. ముఖ్యము గా గర్భిణీ సమయము లో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడే అవకాశము ఉన్నది .

రోగ లక్షణాలు :
  • కాళ్ళలో నొప్పి ,
  • కాళ్ళు బరువెక్కిన భావన ,
  • కాళ్ళలో మంట ,
  • కండరాలు బిగుసుకోవడం వంటి సమస్యలు ,
  • చాలాసేపు కూర్చున్నా , నిలబడినా నొప్పి మరింత తీవ్రమవుతుంది ,
  • ఏదైనా సిర లేదా సిరలచుట్టూ దురద పుట్టి చర్మపు రంగు మారి (నలుపు) పుండ్లు ఏర్పడడము ,
  • అరుదుగా ఈ సూక్ష్మ రక్తనాళాలు పగిలి హఠాత్తుగా రక్తం బయటకు చిమ్ముకొస్తుంది . మడమల చుట్టూ, పాదాల మీద వాపు రావచ్చు. ఈ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి రావాలనే లేదు. 20 ఏళ్ళుగా వెరి కోస్‌ వీన్స్‌ ఉండి కూడా ఇప్పటికి ఎలాంటి నొప్పి లేకుండా ఉన్నవారు కనిపిస్తారు. కొందరికి ఏడాదిలోపు పుండ్లు పడొచ్చు కూడా. కాబట్టి సమస్య తీవ్రత ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉంటుంది.

కారణాలు :
  • వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. రెండోది ఈ సమస్య స్త్రీలలో అధికం. ముఖ్యంగా గర్భిణుల్లో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వారిలో సిరల్లోని కండర కవాటాలు వదులుగా తయారవుతాయి. ఫలితంగా రక్తం కిందకి జారిపోతుంటాయి. ఇవి వచ్చే అవకాశం మొదటి మూడు నెలల్లో ఎక్కువ. మళ్ళీ కాన్పూ తర్వాత మూడు నెలల్లోపు వాటంతట అవే తగ్గిపోతాయి. వయసుతో పాటు వెరికోస్‌ వీన్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

  • అలాగే ఎక్కువసేపు నిలబడే వృత్తుల్లో వారికి ఈ రిస్కు ఎక్కువే. ముఖ్‌యంగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, సర్జన్ల వంటి వారలో ఎక్కువే. సహజంగానే ఈ సమస్య వచ్చే ముప్పు  ఉన్నవారికి ఈ వృత్తులు మరింత అజ్యం పోస్తాయి. చాలాసార్లు కాళ్ల మీద సిరలుపైకి ఉబ్బి స్పష్టంగానే కనిపిస్తుంటాయి. వీటిని చూస్తూనే గుర్తించవచ్చు. అయితే అందరిలోనూ ఇలాగే ఉండాలనేం లేదు. కొందరిలో ఇవి పైకి కనిపించవు. చర్మం రంగు మారటం, పుండ్లు పడటం, వాపు వంటివి మాత్రం ఉంటాయి. మరికొందరిలో చీలమండల ప్రాంతంలో దురదతో ఎండు గజ్జిలా కూడా వస్తుంది. దాన్ని కేవలం చర్మ సమస్యగా పొరబడి, సకాలంలో సరైన చికిత్స తీసుకొని వారూ ఉంటారు. కాబట్టి కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బినట్లు కనబడినా లేకున్నా, ఈ లక్షణాల ఆధారంగా సమస్యను పట్టుకోవటం కీలకమైన అంశమని గుర్తించాలి. వెరికోస్‌ వీన్స్‌ని గుర్తించటానికి చాలా తేలికైనదీ, సులువైనదీ కలర్‌ డాప్లర్‌ పరీక్ష, దీనిలో నాళాలు లోపల రక్తప్రవాహం ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఈ పరీక్షను పడుకున్నప్పటి కంటే నిలబడి ఉన్నపుడే చేయటం మేలు. దీనిలో సమస్య నిర్థారణ కావటమే కాదు, ఒకవేళ ఆపరేషన్‌ అవసరమైతే అదెలా చేయాలో నిర్ణయించేందుకూ తోడ్పడుతుంది.

ఏయే సిరలు ప్రభావితం అవుతాయి ?
  • కాళ్ళల్లో - చర్మం కిందే ఉండే సూపర్‌ ఫిషయల్‌ సిరల్లో కూడా ప్రధానంగా రెండు సిరలుంటాయి. ఒకటి మోకాలు నుండి తొడలు ద్వారా గజ్జల వరకుండేదాన్ని ''లాంగ్‌ సఫెనస్‌ వీన్‌'' అంటారు. రెండోది కాలు వెనుక భాగంలో మడమ నుంచి మోకాలు కీలు వరకు ఉండే ''షార్ట సఫెనస్‌ వీన్‌'' సాధారణంగా వెరికోస్‌ వీన్స్‌ సమస్య ఎక్కువగా ఈ రెంటిలోనే తలెత్తుతుంది. అయితే చర్మం కిందే ఉన్నా సాధారణంగా ఇవి బయటకు కనబడేవి కావు. కాలి మీద మనకు ఉబ్బి కనిపించేవి నిజానికి వీటికి చెందిన సూక్ష్మ శాఖలే.

చికిత్స :
  • నిత్యం వ్యాయామం చెయ్యటం వల్ల కండరాల పనితీరు మెరుగై, విరికోస్‌ వీన్స్‌ సమస్య ముదరకుండా ఉంటుంది. జాగింగ్‌, ఈత, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలన్నీ మేలు చేసేవే గాని  దీనికి నడక మరింత మంచిది. బిగుతైన మేజోళ్ళు వేసుకుని నడపటం అవసరం. కూర్చున్నపుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకోవడం, పడుకునేటపుడు కాళ్ళ కింద ఎత్తు పెంచుకోవటం మేలు. ఊబకాయం, అధిక బరువు వెరికోస్‌ వీన్స్‌ బాధలను మరింత పెంచటమే కాదు. వాటివల్ల చికిత్స కూడా కష్టంగా తయారవుతుంది.
  • సర్జరీ :పురాతన కాలము నుండీ శస్త్ర చికిత్సావిధానము వాడుకలో ఉన్నది. ఎన్నోపద్దతులు ఉన్నాయి. ముఖ్యమైనవి . సెఫనస్ స్ట్రిప్పింగ్ (saphenous stripping) , అంబులేటరీ ఫ్లెబెక్టమీ (Ambulatory Phlebectomy) , వీన్‌ లిగేషన్‌ (Vein ligation) , క్రయోసర్జరీ(Cryosurgery).
  • ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ : శరీర ఆకృతి చెడకుండా కాలిపై శస్త్ర చికిత్స గుర్తులు కేకుండా చేయగలగడమే దీని ప్రత్యేకత . హాస్పిటల్ లో ఉండవసైన అవసరము , ఎనస్థీసియా అవసరము ఉండవు .


  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, April 21, 2012

Ulcer and Cancer difference,అల్సర్ కి క్యాన్సర్ కి తేడా ఏమిటి?




  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhYDosWLDN-aXmyIlI1zHQSR8a1tgm_Y-U_u-br-3vnOiIhnGNz9MTJca5WrMNgK3ZSSiFb7TPq0nBb-5_wcxIBUDRcoduRN85g_g5XPcFHCxSjLUvSmDAVkzLiJ4Ys4WTF_lxK_7tUfGo/s1600/peptic+ulcer.jpg
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు 
జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అల్సర్ కి క్యాన్సర్ కి తేడా - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • నీరు తక్కువ తాగడము వల్లనో , లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి   ఒక్కరు జీవిత కాలములో ఏదో ఒక దశలో అల్సర్ కు గురి అవడము జరుగుతుంది . అందుకనే విద్యార్ధులలో పరీక్షల సమయములో ఎక్కువగా నోటిపూత గమనిస్తూ ఉంటాము . సాదారనము గా మూడు , నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్లు అంతకంటే ఎక్కువకాలము ఉండి తరుచుగా భాధిస్తూ ఉంటే ఎవ్వరికైనా అనేక అనారోగ్య అనుమానాలు వేధిస్తు ఉంటాయి. అల్సర్ లకు సంబంధించి నోటి పూతతో పాటు , పెప్టిక్ అల్సర్ , గ్యాస్ట్రిక్ అల్సర్ , ఈసోపేగల్ అల్సర్ , కదలలేని పరిస్థితి లో మంచానికి పరిమితమైనపుడు ఏర్పడే పుండ్లు , సిఫిలిస్ , హెర్పిస్ వలన జెనిటల్ మర్మావయవాలలో అల్సర్లు , డయాబెటిక్ న్యూరోపతిక్ తో కాళ్ళలోవచ్చే అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 

జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్ ను పెప్టిక్ అల్సర్ అంటాము . జీర్ణకోశము , చిన్నప్రేగులలొ ఇవి పుడతాయి. జీర్ణ కోశములో ఉంటే ;;; గ్యాస్ట్రిక్ అల్సర్ గాను , చిన్నప్రేగులో ఉంటే డియోడినల్ అల్సర్ గానూ పిలుస్తారు . జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత 1% వరకు క్యాన్సర్ గా మారే ప్రమాధము ఉంది . గ్యాస్ట్రిక్ అల్సర్ ఎక్కువగా క్యాన్సర్ గా మారే ప్రమాదము ఉంది  .

1980 వరకు అల్సర్ కు , పూతకు మసాలా ఆహారము , కారము , ఒత్తిడి , ఆల్కహాల్ తాగడము , పొగాకు సంబంధిత మత్తుపదార్ధాలు నమలడము , తిన్డము అనుకునేవారు . దాదాపు వంద సంవత్సరాలు అల్సర్ కు కారణము అవే అనుకొని వీలైనంత వరకు వాటికి దూరం గా ఉండమని సలహాలు ఇచ్చేవారు వైద్యులు . 1982 లో " టారీమార్షల్ మరియు రాబిన్‌ వారెన్‌ " అనే ఇద్దరు డాక్టర్లు  జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పూత , అల్సర్ లకు కారణము " హెలికోబాక్టర్ పైలోరి (Helicobactar pylori) ... హెచ్.పైలోరి .. అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు . దీనికి వారికి నోబెల్ బహుమతి వచ్చింది .  మన జనాభాలో 90% మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బాక్టీరియాకు గురి అవుతారు .ఇవి డియోడినం లో నిరరంతరము ఉండి  జీవిస్తూ ఉంటాయి.  ఒత్తిడి , ఎసిడిటి , స్మోకింగ్ , ఆల్కహాల్ తాగడము వంటి కారణాలవల్లనో  లేక శరీర తత్వమువల్లనో జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఈ బాక్టీరియా వలన అల్సర్ ఏర్పడడము జరుగుతుంది .

వ్యాధి లక్షణాలు

జీర్ణాశయం అల్సర్‌ : బాగామంటతో కూడిన నొప్పి. అన్నం తింటూనే ఎక్కువై, 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం. ఆకలి మందగించడం. వాంతుల వడం. బరువు తగ్గడం. వాంతి అయితే నొప్పి తగ్గడం. ఇవి దీని సాధారణ లక్షణాలు. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగితే, కాఫీ, డికాక్షన్‌ లాగ వాంతులవడం, మనిషి నీరసిం చిపోవడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

డ్యుయోడినల్‌ అల్సర్‌ : కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి. ఖాళీ కడుపు వున్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న రెండు, మూడు గంటలు దాటిన తర్వాత, అర్థరాత్రి, తెల్లవారు జామున అధికనొప్పి రావడం. అప్పుడేమైన తిని నీళ్లు తాగితే తగ్గుతుంది. ఇవి ముఖ్య లక్షణాలు. దీని లోపల, పుండు నుండి రక్తస్రావం జరిగితే వాంతితో పాటు, తారులాగా నల్లగా విరేచనమవుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

విపరీతలక్షణాలు : అల్సర్‌ నుండి రక్తస్రావం అవుతుంది. గ్యాస్ట్రిక్‌ అవుట్‌లెట్‌ అవరోధం. పుండు వున్న చోట రంధ్రం పడడం. పైలోరిక్‌ స్టినోసిస్‌ ఏర్పడడం. పుండు క్యాన్సర్‌గా మారటం.

వ్యాధి / బాదలను ప్రేరేపితము చేసే కారకాలు : 


*వంశపారంపర్యంలో ఒక రకమైన జన్యువుల వల్ల.

*పొగతాగే వారిలో అవకాశం అధికం.

*గాస్ట్రినోమ అనే క్లోమగ్రంథిలో పెరిగే గడ్డ వల్ల.

*కొంతమందిలో గ్యాస్ట్రోజెజునాష్టమి ఆపరేషన్‌ చేసిన తర్వాత ఏర్పడొచ్చు.

*ఎక్కువ ఆందోళన చెందేవారిలో.

*మద్యం అపరిమితంగా సేవించేవారిలో.

*ఎక్కువ కారం, పులుపు, మసాల దినుసులు వాడే వారిలో.

*జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్‌ తయారవటం వల్ల.

*'హెచ్‌.పైలోరి' అనే సూక్ష్మజీవుల కడుపు లో చేరడము వలన .

వొళ్లు నొప్పులు తగ్గించే (పెయిన్‌కిల్లర్స్‌) కొన్ని మందుల వల్ల.ఈ పెప్టిక్‌ అల్సర్‌ ఏర్పడుతాయి.

ఎలా మొదలవుతుంది ?

*జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణరసం ఉత్పత్తి.

*జీర్ణాశయం లోపలి వుండే పల్చటి పొర (గ్యాస్ట్రిక్‌ మ్యూకోజ) దెబ్బతిన్నప్పుడు (మద్యం అతిగా సేవించే వారిలో ఆస్పిరిన్‌ మొదలైన మందులు *వాడేవారిలో ఆ పొర దెబ్బ తింటుంది.)

*పెస్సిన్‌ ఆమ్లం ఎక్కువ ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్‌ మ్యూకోజా దెబ్బతిన్నప్పుడు.

*చర్మం కాలినప్పుడు, కొన్ని రక్త ప్రసరణ రోగాలు వచ్చినప్పుడు.

వ్యాధి నిర్ధారణ

జిఐ ఎండోస్కోపి, బేరియం ఎక్సరే, రాపిడ్‌ బయాప్సి‌ (హెచ్‌.పైలోరి కనుక్కోవడానికి)

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్ లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. చాలా కాలము గా వస్తూ , పోతూ ఉండే అల్సర్లే ... కాన్సర్ గా మారిపొతాయి. అల్సర్ చుట్టూ దలసరిగా కణితి లా తయావుతుంది . .ట్రీట్మెంట్ కూడా కణితి వచ్చిన ప్రదేశము , స్టేజ్ , వయస్సు , ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటుంది . లింఫ్ నోడ్స్ క్యాసర్ కు గురి అయితే చికిత్స కష్టమవుతుంది . జీర్ణ కోశాన్ని కొంతబాగము , చిన్నపేగులలో కొంతభాగాన్ని లింఫ్ నోడ ను వీలైనంతవరకు తీసివేయడము , . .చేస్తారు . కీమోథెరఫీ కూడా అవసరము ఉంటుంది . ఈ సర్జరీ తర్వాత సప్లిమెంటరీ ట్రీట్మెంట్ ... విటమిన్‌ - డి  , కాల్సియం , ఐరన్‌ , విటమిన్‌ బి.కాంప్లెక్ష్ అవసరము ఉంటుంది.

మంచి గ్యాస్ట్రోఎంటిరాలగిస్ట్ / గాస్ట్రిక్ సర్జన్‌ ని సంప్రదించాలి.

స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి  దశలో అంత ప్రస్పుటంగా ఉండవు . అనుమానించేంత  స్థాయిలో లక్షణాలు బయటపడ్డాయంటే అప్పటికే క్యాన్సర్ స్టేజీ ఎక్కువగా ఉంటుంది . ప్రతిసంవత్సరము ప్రపంచవ్యాప్తం గా సుమారు 8,00,000 మంది ఈ క్యాన్సర్ వ్యాది కి బలైపోతున్నారు .  హెలికోబాక్టర్ పైలోరి  ఈ క్యాంసర్ కు దాదాపు 70% - 80% వరకు కారణము . వీటికి చెడు అలవాట్లు ... మద్యము , పొగ , మసాలా పదార్ధాలు దోహదపడతాయి. హెలికోబాక్టర్ పైలోరి మనము తీసుకునే నీటిలోనే ఉంటుంది. అందుకే పరిశుభ్రమైన నీటిని , ఆహారాన్ని తీసుకోవాలి. పాస్ట్ ఫుడ్స్ తినరాదు . తిన్నవారందరికీ ఈ వ్యాధి వస్తుందనుకోవడమూ పొరపాటే . అనేకానేక కారణాలు , కారకాలు సమ్మిలిత ఫిలితంగా ఈ అల్సర్ / క్యాన్సర్ వస్తుంది . ప్రజలలో అవగాహన కోసమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశము . ----డా .వండాన శేషగిరిరావు . శ్రీకాకుళం ,
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, April 6, 2012

నొప్పి మందులు సొంతంగా వద్దు అవగాహన - Use of Painkillers Awareness

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Use of Painkillers Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



నడుంనొప్పి, ఒళ్లునొప్పుల వంటి వాటిని చాలామంది తేలికగా తీసుకుంటారు. డాక్టర్‌ దగ్గరకి వెళ్లకుండానే మందుల దుకాణాల్లో ఏదో ఒక నొప్పి నివారణ మాత్ర కొని తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు అసలు మంచిది కాదు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశమూ ఉందని మీకు తెలుసా? ఈ మాత్రలతో చర్మంపై దద్దుర్ల దగ్గర్నుంచి పేగుల్లో పుండ్లు పడటం వరకు రకరకాల దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. ముఖ్యంగా అల్సర్లు, కాలేయం, గుండె, కిడ్నీ సమస్యలు గలవారికి ఒక్క మాత్రతోనూ తీవ్ర ప్రమాదం ముంచుకురావొచ్చు. ఇలాంటి సమయాల్లో సరైన చికిత్స అందకపోతే ప్రాణాలకూ ముప్పు కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి మామూలు నొప్పి నివారణ మందులు (నాన్‌ స్టీరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) వేసుకునేప్పుడు ఛాతీలో మంట రాకుండా ఓమేజ్‌ వంటి ప్రోటాన్‌-పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కానీ దుకాణాల్లో సొంతంగా మందులు కొనుక్కొని వేసుకునేవారికి ఈ విషయం తెలియకపోవటం వల్ల చేజేతులా ముప్పును 'కొని' తెచ్చుకుంటున్నారు. నొప్పి మందులను విచక్షణ లేకుండా వాడితే వాటి ప్రభావం అప్పటికప్పుడు మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలం కొనసాగొచ్చు కూడా. ఎందుకంటే అన్నిరకాల నొప్పి మందులతోనూ ఏవో కొన్ని దుష్ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. అందువల్ల డాక్టర్‌ రాసిచ్చిన నొప్పి మందులు వేసుకునేప్పుడూ దుష్ప్రభావాలు కనబడితే జాగ్రత్త పడటం తప్పనిసరి. మళ్లీ ఆసుపత్రికి వెళ్లినపుడు చెబుదాములే అనుకొని సరిపెట్టుకోకుండా వెంటనే ఆ విషయాన్ని డాక్టర్‌కు చెప్పటం ఉత్తమం. నొప్పి అనేది ఏదో ఒక సమస్య మూలంగా బయటకు కనిపించే లక్షణం. కాబట్టి ఆ సమస్యను తగ్గించే చికిత్స అవసరమనే సంగతిని మరవరాదు. అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వేసుకునేవారైతే నొప్పి మందుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఆయా మందులతో జరిపే ప్రతిచర్య మూలంగా తీవ్ర ప్రమాదకర ముప్పులు దాడిచేయొచ్చు కూడా. కాబట్టి నొప్పి మందులతో సొంత ప్రయోగాలు కూడదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

బ్రెయిన్‌ ట్యూమర్స్‌-మెదడులో కణుతులు అవగాహన-Brain Tumours awareness

  • image : Courtesy with Eenadu sukheebhava .

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బ్రెయిన్‌ ట్యూమర్స్‌-మెదడులో కణుతులు అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • కణితి ఎక్కడ కనిపించినా కంగారే! జీవకణాలు క్రమం తప్పి.. అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్టు కణుతులు పుట్టుకొస్తుంటే.. ప్రాణభయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక ఆ కణితి.. పైకేమీ కనబడకుండా తలలో.. అదీ మెదడులో పెరుగుతుంటే...??- ఇక ఆ భయానికి అంతుండదు. ఈ మెదడులో కణుతులు అంత అరుదేం కాదు. పైగా ఇందులో ఎన్నో రకాలు. మెదడులో నుంచి పుట్టుకొచ్చేవి కొన్నైతే... మెదడు పైపొరల మీది నుంచి.. ఇలా రకరకాల ప్రదేశాల నుంచి రావచ్చు. ఇందులో క్యాన్సర్‌ కణుతులు కొన్నైతే.. క్యాన్సర్‌ కాకపోయినా మెదడును నొక్కేసి ప్రాణాల మీదికి తెచ్చేవి కొన్ని. తరచుగా భయపెట్టే ఈ కణుతుల గురించి అవగాహన చాలా అవసరం.

అధునాతమైన సీటీ స్కాన్‌, ఎమ్మారై పద్ధతులు.. ఎండోస్కోప్‌, మైక్రోస్కోప్‌ల మూలంగా శస్త్రచికిత్స.. అధునాతన రేడియేషన్‌ చికిత్స.. మెరుగైన కీమోథెరపీ మందులు, న్యూరో అనస్థీషియాల మూలంగా మెదడు కణుతుల చికిత్సతో గతంలో కన్నా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆపరేషన్‌ అనంతరం సంరక్షణ పద్ధతులు కూడా మెరుగుపడ్డాయి. 40, 50 ఏళ్ల క్రితం మెదడులో కణితి అనగానే భయపడిపోయేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ట్యూమర్‌ను గుర్తించి, నిర్ధారించటం దగ్గర్నుంచి ఆపరేషన్‌ అవసరమైన వారిని పసిగట్టటం.. సర్జరీ, చికిత్సల్లో కొత్త కొత్త పద్ధతులు, మందులు అందుబాటులోకి రావటం వంటివన్నీ మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయి.

సాధారణంగా మనం 'మెదడులో కణుతులు'.. 'బ్రెయిన్‌ ట్యూమర్స్‌'.. అంటుంటాంగానీ వీటిలో ఎన్నో రకాలు! ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రకాల గురించి! ఒకటి- మెదడు లోపల్నుంచి పుట్టుకొచ్చే రకం. వీటిని 'గ్లయోమాస్‌' అంటారు. రెండోది- మెదడుపై భాగాల్లో ఏర్పడి మెదడును నొక్కుతుండేవి! మళ్లీ వీటిల్లో కూడా చాలా రకాలున్నాయి. ముఖ్యంగా మెదడు పైన చుట్టూతా రక్షణగా ఉండే పొరల (మినింజెస్‌) నుంచి పుట్టుకొచ్చే వాటిని 'మినింజియోమాస్‌' అంటారు. ఇక మెదడుకు అనుసంధానంగా ఉండే నాడులపై కూడా కణుతులు వస్తుంటాయి, వీటిని ఆయా భాగాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు. వీటిల్లో ఎక్కువగా కనిపించేది శ్రవణనాడి మీద వచ్చే 'అకూస్టిక్‌ న్యూరోమా' కణుతులు. ఇక మెదడు మధ్యలో ఉండే 'పిట్యూటరీ' గ్రంథి మీదా కణుతులు వస్తాయి, వీటిని పిట్యూటరీ కణితులంటారు. మెదడుకు వెలుపల ఉన్నప్పటికీ వీటినీ 'బ్రెయిన్‌ ట్యూమర్ల'నే అంటారు. ఇవి మెదడుకు సమీపంలోనే ఉంటాయి, ఇవి పెరిగిన కొద్దీ మెదడును నొక్కుతూ, దెబ్బతీస్తుంటాయి. ఇవే కాకుండా.. శరీరంలోని ఇతరత్రా భాగాల్లో తలెత్తే క్యాన్సర్‌ గడ్డల నుంచి ఆ కణాలు మెదడుకు పాకి.. మెదడులో క్యాన్సర్‌ కణుతులు పెరిగేలా చెయ్యచ్చు. వీటిని 'మెటాస్టాటిక్‌' లేదా 'సెకండరీ' కణుతులంటారు. ఇవి ఎక్కువగా మెదడు లోపలే వస్తుంటాయి.
  • లక్షణాలేంటి?
ప్రధానంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి! మెదడులో ఏ రకం కణితి పెరుగుతున్నా ప్రధానంగా కనిపించే లక్షణం ఇది. మన పుర్రె ఎముక చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి లోపల ఏదైనా కణితి పెరుగుతుంటే కపాలంలో ఒత్తిడి పెరిగి... తలనొప్పి మొదలవుతుంది. నెమ్మదిగా పెరిగే కణుతులైతే అవి బాగా పెద్దగా అయ్యే వరకూ తలనొప్పి రాకపోవచ్చు. వేగంగా పెరిగేవైతే వెంటనే తలనొప్పి మొదలవుతుంది. అయితే తలనొప్పి అనేది జలుబులా సర్వసాధారణమైన సమస్య కాబట్టి.. ప్రతి తలనొప్పినీ అనుమానించటం, అది కణితి వల్లనే వస్తోందని గుర్తించటం అంత తేలిక కాదు. కాకపోతే... తలనొప్పి వస్తున్న తీరును బట్టి మెదడు కణుతులున్నాయేమో అనుమానించే అవకాశం ఉంటుంది.

సాధారణంగా పార్శ్వనొప్పి వంటి వాటిల్లో తలనొప్పి వస్తూ, పోతూ ఉంటుంది. మధ్యలో కొంతకొంత సమయం తలనొప్పి అస్సలుండదు. టెన్షన్‌ రకం తలనొప్పిలో బ్యాండు పట్టేసినట్టు, తల పైన పోటు వచ్చినట్టుగా నొప్పి ఉంటుంది. కానీ... మెదడులో కణుతుల మూలంగా వచ్చే తలనొప్పి వస్తూతగ్గుతుంటుందిగానీ పూర్తిగా తగ్గటమన్నది ఉండదు. నిరంతరం కొంత నొప్పి ఉంటూనే ఉంటుంది. పైగా ఒకసారి కంటే మరోసారి నొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. రోజంతా ఎప్పుడూ ఎంతోకొంత తలనొప్పి ఉండటం, క్రమేపీ తలనొప్పి తీవ్రతా పెరుగుతుండటం అనుమానించాల్సిన లక్షణం! తలలో పెరుగుతున్న ఒత్తిడి మూలంగా తల ఎప్పుడూ బరువుగా ఉన్నట్టూ అనిపిస్తుంటుంది.

*వాంతులు: తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వాంతులు కూడా కావొచ్చు. వాంతి కాగానే తలనొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్లీ కొద్దిసేపట్లోనే నొప్పి పెరిగినట్లనిపిస్తూ వేదన మొదలవుతుంది.

*చూపు తగ్గటం: తలలో ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ప్రభావం చూపు మీదా పడుతుంది. దృశ్యనాడి కూడా మెదడులోని ముఖ్య భాగం కాబట్టి దీని మీద ఒత్తిడి పడినప్పుడు చూపు మసక బారుతుంది. కళ్లను నియంత్రించే నాడులు కూడా ప్రభావితమై ఒకటి రెండుగా (డిప్లోపియా) కనబడొచ్చు.

*భాగాన్ని బట్టి లక్షణాలు: మెదడులో కణితి పెరుగుతున్న భాగం.. ఏయే శారీరక అవయవాలను నియంత్రిస్తుందో ఆ భాగాల్లో లక్షణాలు కనబడొచ్చు. ఉదాహరణకు ఫాల లంబికల్లో కణితి పెరుగుతుంటే ఉత్సాహం తగ్గి, స్తబ్ధుగా ఉండొచ్చు. ఎడమవైపు కణితి పెరుగుతుంటే మాట తడబడొచ్చు. అలాగే ప్రదేశాన్ని బట్టి చెయ్యీకాలూ కదలికలు దెబ్బతినొచ్చు. ఇలా ఆయా భాగాలను బట్టి లక్షణాలు కనబడతాయి.

*ఫిట్స్‌: మెదడులో కణుతులు తెచ్చే చికాకు కారణంగా ఫిట్స్‌ కూడా రావొచ్చు. ఈ సమయంలో స్పృహ కోల్పోవచ్చు.

*తెలివి తగ్గటం: తలలో ఒత్తిడి మరింతగా పెరిగిపోతే మెదడు పనితీరు, తెలివితేటలు, ప్రజ్ఞ తగ్గిపోవచ్చు.

  • గుర్తించేదెలా?
తలనొప్పి వచ్చిన అందరికీ మెదడు స్కానింగులు చెయ్యటం అసాధ్యం, అనవసరం కూడా. కాబట్టి ముందు లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనుమానం బలంగా ఉంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో కణితి ఉంటే తెలియటమే కాదు, అది మెదడు లోపల ఉందా? బయట ఉందా? ఎంత సైజులో ఉంది? వంటి వివరాలూ తెలుస్తాయి.

* మెదడులో కణితి ఉంటే ఆ విషయం హఠాత్తుగా తెలుసుకోవటం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. అందుకే కౌన్సెలింగ్‌ ఇచ్చి మెల్లగా విషయాన్ని వివరిస్తారు. ముఖ్యంగా అంతా తెలుసుకోవాల్సిందేమంటే ఒకప్పుడు మెదడు కణుతులకు చికిత్స కష్టమేగానీ.. ఇప్పుడున్న అధునాతన చికిత్సా పద్ధతులతో మరీ అంతగా భయపడాల్సిన పనిలేదు! చాలా రకాల కణుతులకు సమర్థంగా చికిత్స అందించవచ్చు.

  • గ్లయోమాలు
మొత్తం మెదడు కణుతుల్లో.. మెదడు లోపలి నుంచి పుట్టుకొచ్చే ఈ గ్లయోమాలు సుమారు 40-45% వరకూ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ సంబంధమైనవే కానీ అన్నీ ప్రమాదకరమైనవి కాదు. వీటిల్లో 1, 2, 3, 4 అని నాలుగు గ్రేడులుంటాయి. దేనికైనా కణితి నుంచి ముక్క తీసి పరీక్షించి.. అది ఏ గ్రేడు కణితో నిర్ధారించటం ముఖ్యం. ఈ కణుతుల స్వభావం ఎలా ఉంది? ఇవి వేగంగా పెరిగే రకమా? వీటికి రక్తసరఫరా ఎక్కువగా ఉందా? తదితరాలన్నీ పరిశీలించే గ్రేడ్‌ ఇస్తారు. 1, 2 గ్రేడు కణితులు అంత ప్రమాదకరమైనవి కావు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. సాధారణంగా ఇవి ఫిట్స్‌తో బయటపడుతుంటాయి. కాబట్టి మందులతో ఫిట్స్‌ను అదుపులో పెడుతూ జాగ్రత్తగా గమనిస్తుంటారు. అప్పుడప్పుడు స్కానింగ్‌ చేస్తూ, కణితి వేగంగా పెరుగుతున్నట్టు గ్రహిస్తే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. ఈ 1, 2 గ్రేడు కణితులున్న వారికి చికిత్సతో మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్దాయమూ పెరుగుతుంది. ఇక గ్రేడ్‌ 3, 4 మాత్రం ప్రమాదకరమైనవి. 3వ గ్రేడు రకానికి కీమోథెరపీ ఇస్తూ జీవన కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే గ్లయోమాలను పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఆపరేషన్‌ ద్వారా ట్యూమర్‌ను తొలగించి, రేడియేషన్‌ ఇచ్చినా ఇవి కొంత కాలానికి మళ్లీ పెరగటం మొదలుపెట్టొచ్చు.

  • చికిత్స:
సర్జరీలో ఎంత వీలైతే అంత వరకూ కణితిని తొలగించేస్తారు. దీంతో రేడియేషన్‌ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కొంత భాగం తొలగించటం కష్టమైనా కీమోథెరపీతో అదీ అదుపులో ఉంటుంది. మామూలు క్యాన్సర్‌ సర్జరీల్లో- కణితి మొత్తాన్ని తొలగించే వీలుంటుందిగానీ మెదడు కణుతుల విషయంలో అది అన్నిసార్లూ అంత సాధ్యం కాదు. కణితి ఉన్న భాగాన్నంతా తొలగించాలంటే కొన్నిసార్లు మాట పడిపోవటం, కదల్లేకపోవటం వంటి ఇతరత్రా సమస్యలూ రావొచ్చు. అందుకని ఈ సర్జరీల్లో ఆయా వ్యక్తులు జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా చూస్తూనే.. సాధ్యమైనంత ఎక్కువ తొలగించటానికి ప్రాధాన్యమిస్తారు. పైగా సాధారణంగా గ్లయోమాలు క్రమంగా మెదడులోకి చొచ్చుకొని పోయే రకం. కాబట్టి ఎంత తొలగించినా కొంత మిగిలి ఉండే అవకాశం ఉంది, ఏ మాత్రం కణాలు మిగిలిపోయినా మళ్లీ పెరుగుతుంటాయి.

* గ్రేడును బట్టి కేవలం రేడియేషనే ఇవ్వాలా? కీమోథెరపీ ఇవ్వాలా? అనేది నిర్ధరిస్తారు. మెదడు దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ల మీదనే పనిచేసే రేడియోథెరపీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్‌-1 ట్యూమర్లకు రేడియేషన్‌ ఇవ్వరు. గ్రేడ్‌-2కు ఆయా పరిస్థితులను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. 3వ గ్రేడ్‌ కణుతుల వారికి రేడియేషన్‌, కీమోథెరపీలతో ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. 4 గ్రేడ్‌ విషయం పరిస్థితిని బట్టి ఏం చెయ్యాలో వైద్యులు నిర్ధారిస్తారు. రేడియేషన్‌, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్లీ కణుతులు పెరుగుతుంటే మరోసారి ఆపరేషన్‌ చెయ్యచ్చు.

మినింజియోమాలు
మెదడు కణుతుల్లో ఈ పైపొరల నుంచి వచ్చే మినింజియోమాలు 16-18% వరకూ ఉంటాయి. వీటిల్లో కేవలం 1-2% కణితులు మాత్రమే క్యాన్సర్‌ కణతులు. మిగతావన్నీ క్యాన్సర్‌ రకం కాదుగానీ ఇవి పెరుగుతూ, మెదడును నొక్కుతుండటం వల్ల సమస్యలు పెరుగుతుంటాయి. ఈ పొరలు మెదడు చుట్టూ, పైనంతా ఆవరించి ఉంటాయి కాబట్టి ఈ కణుతుల కూడా మెదడు పైన రావచ్చు, మెదడు అడుగు వైపున కూడా రావొచ్చు. ఉపరితలం మీద ఏర్పడే కణితులను ఆపరేషన్‌ ద్వారా పూర్తిగా తొలగించొచ్చు. ఆపరేషన్‌ చేశాక పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు కూడా. అయితే మెదడు అడుగున వచ్చే వాటిని చేరుకోవటం కష్టం. కీలకమైన నాడులు ఉంటాయి కాబట్టి వీటిని పూర్తిగా తొలగించటం సాధ్యం కాదు. అందువల్ల మళ్లీ మళ్లీ పెరగటమన్నది వీటిల్లో ఎక్కువ. అందువల్ల ఆపరేషన్‌ తర్వాతా క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.

అకూస్టిక్‌ న్యూరోమాలు
చెవి నుంచి మెదడుకు వెళ్లే శ్రవణనాడి, ముఖానికి సంబంధించిన (ఫేసియల్‌) నాడి ప్రాంతంలో ఇవి ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్లు కావు. పుట్టుకొచ్చే ప్రదేశాన్ని బట్టి వీటివల్ల- వినికిడి తగ్గటం, లేదా నోరు వంకర పోవటం, తూలిపోతుండటం వంటి లక్షణాలు కనిపించొచ్చు. సాధారణంగా వినికిడి పూర్తిగా తగ్గిపోయేంత వరకూ కణితి పెరుగుతున్నట్టు బయటపడదు. మొదట్లో తలనొప్పి ఉండకపోయినా.. కణితి పెరుగుతున్న కొద్దీ అది చుట్టుపక్కల నిర్మాణాలను నొక్కుతూ, మెదడులో ద్రవాల ప్రసారం ప్రభావితమై కపాలంలో నీరు చేరుతుంది. అప్పుడు తలనొప్పి వస్తుంది. ఈ ట్యూమర్‌ కిందే మనం మాట్లాడటానికి, మింగటానికి తోడ్పడే నాడులుంటాయి. వీటిపై ప్రభావం పడితే ముద్ద మింగలేకపోవటం, మాటలు తడబడటం వంటి లక్షణాలు కనబడొచ్చు. కొన్నిసార్లు స్పర్శ, నమలటానికి తోడ్పడే కండరాలు దెబ్బతినొచ్చు. మొద్దుబారటం, నడకలో తడబాటు, సమన్వయం లోపించటం, ఒకవైపు తూలిపోవటం కనిపిస్తాయి. చాలాసార్లు ఈ లక్షణాలను- వయసుతో పాటు వచ్చే సహజ మార్పులుగా పొరబడుతుంటారు కూడా. మిగతావాటి కన్నా ఈ ట్యూమర్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అయితే వీటిని పూర్తిగా తీసేయొచ్చు. ఈ క్రమంలో కొన్నిసార్లు వినికిడిని పూర్తిగా కాపాడటం సాధ్యం కాకపోవచ్చు. ముఖనాడి కొంచెం దెబ్బతినే అవకాశమూ ఉంది. అందువల్ల ఈ ట్యూమర్ల పరిమాణం 3 సెం.మీ. కన్నా తక్కువగా ఉంటే.. ప్రస్తుతం 'గామా నైఫ్‌'తోనూ చికిత్స చేస్తున్నారు. దీంతో ఇవి లోపలే కుచించుకుపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు 70 ఏళ్ల వయసులోనూ ఈ ట్యూమర్లు బయపడుతుంటాయి. వీరికి వినికిడి లోపంతో పెద్దగా ఇబ్బంది లేకపోతే కణితిని వెంటనే తొలగించకుండా జాగ్రత్తగా గమనిస్తారు. ఒకవేళ పెద్దగా అవుతుంటే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది.

* సెల్‌ఫోన్ల వాడకం వల్ల ఈ రకం శ్రవణనాడి కణుతులు ఎక్కువగా వస్తున్నాయన్న ప్రచారం బాగా ఉందిగానీ.. వాస్తవానికి ఇదేదీ శాస్త్రీయంగా ఇంకా నిరూపణ కాలేదు.

పిట్యూటరీ కణుతులు
పిట్యూటరీ గ్రంథి మీద వచ్చే కణుతుల్లో హార్మోన్లను స్రవించేవి, స్రవించనివి.. అని రెండు రకాలున్నాయి. హార్మోన్‌ స్రవించని ట్యూమర్లు కళ్లు, నాడుల మీద ఒత్తిడి కలజేస్తాయి. దీంతో ఒక కంట్లో గానీ రెండు కళ్లల్లో గానీ పక్కల దృశ్యాలు కనబడటం తగ్గిపోతుంది. ఈ కణుతులు మరీ పెద్దగా ఐతే మెదడులోని ద్రవాల ప్రసరణ దెబ్బతిని తలనొప్పి రావొచ్చు. గతంలో పిట్యూటరీ ట్యూమర్లను మెదడును తెరచి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎండోస్కోపీ లేదా మైక్రోస్కోపీ ద్వారా ముక్కులో నుంచి లోనికి వెళ్లి తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్యూమర్లలో కొంత భాగాన్ని (డీబల్క్‌) గానీ పూర్తిగా గానీ తొలగించొచ్చు. కొంత కణుతులు లోపలే ఉండిపోతే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండొచ్చు. లేకపోతే రేడియేషన్‌ చికిత్స చేయొచ్చు. చిన్న కణుతులైతే పూర్తిగా తొలగించొచ్చు. పెద్ద కణుతులైతే ఆపరేషన్‌ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి రక్తనాళాలు అంటుకొని ఉంటాయి కాబట్టి తొలగించేటప్పుడు హైపోథలమస్‌ దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల తీవ్ర సమస్యలు వచ్చే ముప్పు ఉండొచ్చు.

* ఇక హార్మోన్లను స్రవించే ట్యూమర్లలో ప్రధానంగా కనిపించేది ప్రోలాక్టినోమాలు. ఈ కణుతులు పెరగటమే కాదు, వీటి నుంచి ప్రోలాక్టిన్‌ అనే హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం వల్ల- మగవారిలో పటుత్వం తగ్గటం, రొమ్ములు పెద్దకావటం.. ఆడవారిలో నెలసరి నిలిచిపోవటం, పాలు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే వెంటనే ప్రోలాక్టిన్‌ మోతాదు పరీక్ష చేయించాలి. అది ఎక్కువగా ఉన్నట్టు బయటపడితే ప్రోలాక్టిన్‌ తగ్గించే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కణితి పరిమాణం కూడా తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే తిరిగి మామూలుగా అవుతారు. ఈ ప్రోలాక్టినోమాలు చాలా పెద్దగా అయితేనే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడే లక్షణాలు బయటపడతాయి కాబట్టి ముందే జాగ్రత్త పడటానికి అవకాశముంది. చిన్నగా ఉంటే గ్రోత్‌ హార్మోన్‌ ట్యూమర్లునూ మందులతోనే నయం చేయొచ్చు.

  • చికిత్సల్లో విప్లవం: గామానైఫ్‌
మెదడులోని ఇతరత్రా భాగాలేవీ ప్రభావితం కాకుండా కేవలం కణితి మీదే రేడియేషన్‌ తీక్షణంగా పనిచేసేటట్లు చేయటంలో 'గామానైఫ్‌' అద్భుతంగా వెసులుబాటునిస్తుంది. ముందు సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కానింగులతో కణితి కచ్చితంగా ఎక్కడుందో గుర్తించి, స్టీరియో టాక్టిక్‌ ఫ్రేమ్‌ను రూపొందిస్తారు. దానిపైకి రేడియేషన్‌ ఇచ్చినప్పుడు- రేడియేషన్‌ వివిధ కోణాల నుంచి తక్కువ డోసుల్లోనే వస్తూ.. ఒక్కచోట కేంద్రీకృతమై అంతా కలిసి తీక్షణంగా మారుతుంది. ఇలా మిగతా భాగాలు పెద్దగా ప్రభావితం కాకుండా కణితి కణాలు మాడిపోయేలా చేస్తారు. ఇదిఇటీవలికాలంలో విస్తృతంగా వాడకంలోకి వస్తోంది. ఇలాగే లీనియర్‌ ఆక్సిలేటర్‌ యంత్రాలూ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. మెదడు అడుగు భాగంలో ఏర్పడే చిన్న మినింజియోమాలకు శస్త్రచికిత్స కష్టం. ఇలాంటి వాటికి గామానైఫ్‌ బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిట్యూటరీ ట్యూమర్లు.. అకూస్టిక్‌ ట్యూమర్లు.. ఇతరత్రాచోట్ల నంచి వచ్చిన క్యాన్సర్‌ కణాలు రెండు మూడు పెరుగుతున్నప్పుడు.. చికిత్సలో ఇది బాగా పనికివస్తుంది.

  • వేరే చోటి నుంచి పాకేవి.. మెటాస్టాసిస్‌
శరీరంలో ఇతరత్రా భాగాల్లో పెరిగే క్యాన్సర్‌ గడ్డల నుంచి ఆ కణాలు మెదడును చేరుకుని ఇక్కడ పెరగటం మొదలుపెట్టచ్చు. ముఖ్యంగా మూత్రపిండాలు, రొమ్ములు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం నుంచి మెదడుకు వ్యాపించటం ఎక్కువ. ఇవి గ్లయోమాల్లా మెదడు లోపలి నుంచే ఏర్పడతాయి. వీటిల్లోనూ మామూలు మెదడు కణుతుల్లో కనిపించే లక్షణాలు కనిపిస్తాయి. పైగా వీటిల్లో 25% ఆపరేషన్‌ చేసి చూసిన తర్వాతే... అవి వేరేచోటి నుంచి వచ్చిన రకాలనీ, శరీరంలో మరోప్రాంతంలో ఎక్కడో క్యాన్సర్‌ ఉందన్న విషయం తెలుస్తుంది. కొన్నిసార్లయితే అసలు ప్రధాన క్యాన్సర్‌ ఎక్కడుందో తెలియదు. అయినా దాని ప్రభావంతో మెదడులో కణితి ఏర్పడుతుంది. ఇలాంటి ట్యూమర్‌ ఒకటే.. అదీ పెద్దగా ఉంటే సర్జరీ చేస్తారు. రెండు మూడు ట్యూమర్లు ఏర్పడితే, చిన్నగా ఉంటే ముందు ముక్క తీసి నిర్ధరిస్తారు. తర్వాత రేడియేషన్‌ ఇస్తారు. ప్రధాన కణితి ఊపిరితిత్తుల్లో, కాలేయంలో, జీర్ణకోశంలో.. ఎక్కడైనా ఉందని తెలిస్తే అలాంటి వారికి మెదడు కణితి తొలగించే సర్జరీతో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దాన్ని తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది.


--Dr.K.V.R.sastry (Neuro-surgeon,Medwin hos Hyd)
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/