Tuesday, January 22, 2013

Awareness of complications of Diabetes-మధుమేహం వల్ల వచ్చేఅనర్థాలు అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Awareness of complications of Diabetes-మధుమేహం వల్ల వచ్చేఅనర్థాలు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన శరీరంలో అనేక వ్యవస్థలున్నాyi . . ఇవన్నీ వాటి పనుల్ని అవి నిర్వహించుకుంటూ ఉన్నా, అన్నీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాyi. ఒక వ్యవస్థ పనిలో ఆటంకం ఏర్పడితే ఆ ప్రభావం మిగతా వ్యవస్థల మీద కూడా ఉంటుంది. మధుమేహంలో ఈ ప్రభావం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. శరీరంలో జరిగే జీవచర్యలో భాగంగా తయారయ్యే రక్తంలో ప్రవేశించిన గ్లూకోజ్‌ను శరీరం సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం వలన కలిగే స్థితిని మధుమేహం అంటారు.

-ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోని వాళ్లే! 35 మిలియన్లకి పైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారినపడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా. 30 శాతం మంది ప్రి-డయాబెటిక్‌ స్టేజ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో 40కి పైబడ్డ ప్రతీ ఇద్దరిలో ఒకరికి మధుమేహం పీడిస్తుండి. డయాబెటిస్‌ అనే వ్యాధి కాదు, కాని అనేక వ్యాధులకు మూలం. ఇలా విస్తృతంగా పెరిగిపోతున్న డయాబెటిస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫెడరిక్‌ బ్యాంటింగ్‌, చార్లస్‌ వెస్ట్‌తో కలిసి 1922లో ఇన్సులిన్‌ని కనుక్కున్నారు.

పాంక్రియాజ్‌ గ్రంథి లోపం వల్ల ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపించడంతో ఈ డయాబెటిస్‌ వస్తుంది. రక్తంలో షుగర్‌ పెరిగిపోతుంది. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగు తాయి. నరాలు దెబ్బతింటాయి. త్వరగా మరియు తీవ్రంగా వచ్చే కాంప్లికేషన్స్‌ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్‌ లేదా నాన్‌కీటోటిక్‌ హైపర్‌ ఆస్మొలార్‌ కోమా... వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు . తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు, మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్‌ రెటి నోపతి, డయాబెటిక్‌ న్యూరోపతి, గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. అభివృద్ధి చెందిన దేశాల్లో యుక్త వయసులోనే అంధత్వానికి, మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్‌ అవసరమయ్యే డయాబెటిక్‌ నెఫ్రోపతికి ప్రధాన కారణం డయాబెటిక్‌.

రక్తనాళాలు దెబ్బతింటే వాస్కులోపతి. ముఖ్యంగా నరాల మీద ‘మైలీన్‌’ అనే సన్నని పొర ఉంటుంది. ఇది దెబ్బతింటే లోపల సంకేతాల్ని అందచేసే ‘యాక్సాన్‌’ దెబ్బతింటుంది. దాంతో మెదడు నుంచి శరీరభాగాల్లోకి, శరీరం నుంచి మెదడులోకి సంకేతాలు సరిగ్గా అందవు. ఈ సమస్య పాదాలు, అరిచేతుల్లో ప్రారంభమవుతుంటుంది. ఎందుకంటే పొడవాటి నరాలు శరీరం కోసల్లో ఉండే నరాలు ముందుగా దెబ్బతింటాయి. కాబట్టి దాంతో అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిర్లు, మొద్దు బారటం లాంటివి జరుగుతాయి.

మెదడులోని కణాలు సక్రమంగా పనిచేయడానికి బ్లడ్‌ షుగర్‌ చాలా అవసరం. అందుచేత తక్కువ బ్లడ్‌ షుగర్‌ ‘మైకం, గందరగోళం, నీరసం, వణుకు’ మొదలైన సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌కి సంబంధించిన అనారోగ్య లక్షణాలను కలిగిస్తుంది. ఈ లక్షణాలు కలిగే బ్లడ్‌ షుగర్‌ ప్రమాణం డెసీలీటర్‌కి 65 మి.లీ.కు పడిపోతే కలుగుతాయి. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణం మరీ పడిపోయి 40. మి.లీ. కిందికి చేరితే కోమాలోకి దారి తీస్తుంది. మధుమేహం ఒక వ్యాధి కాదు, షుగర్‌ జీవచర్య  సరిగ్గా జరగకపోవడం వల్ల కలిగే శారీరక స్థితి.

దీనిని సకాలంలో గుర్తించడం చాలా అవసరం. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి నెలకు ఒక్కసా రైనా పొద్దున్నే ఆహారం తినకముందు, ఆహారం తిన్న గంటన్నర తర్వాత రక్తపరీక్ష చేయించు కోవాలి. దాని ద్వారా రక్తంలోని షుగర్‌ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అలాగే లిపిడ్‌ ప్రొఫైల్‌ అనే రక్త పరీక్ష చేయించుకోవడం కూడా అవసరం. సంవత్సరానికి ఒకసారి కళ్ళు, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాల పనితీరు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి.

మధుమేహ పరీక్షలు చేయించుకునే ముందు శరీరానికి అధిక శ్రమ కలిగించకూడదు. పరీక్షల కోసం ఎక్కువ దూరం నడవకుండా, పరీక్షా కేంద్రం ఇంటి పక్కనే ఉండేటట్లు చూసుకోవాలి. లేదా వెళ్ళ డానికి ఏదైనా వాహనాన్ని ఆశ్రయించాలి. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోని ఉన్నా, ప్రయాణం చేసి వచ్చినా, ఎక్కువ శ్రమ పడినా ఉదయాన్నే రక్తపరీక్షలు చేయించుకోకూడదు. చేయించుకుంటే రక్తంలో ఎక్కువ గ్లూకోజ్‌ కనబడుతుంది.

డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం, దీనిలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమం. రోగి గాని రోగి యొక్క కుటుంబంలోని వారుగాని అలవాటుగా తినే ఆహారాన్ని కొన్ని నియమాలతో తీసుకోవాలి. సమయం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవాలి.

-పప్పు దినుసుల నుండి లభించే ప్రొటీన్లు, మాంసాహారం నుండి లభించే ప్రొటీన్లు కంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం ప్రొటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయినప్పటికీ కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మధుమేహాన్ని నివారించటం లోనూ, రక్తంలో కొవ్వు పదార్థాలను తగ్గించ డంలోనూ ఉపయోగపడతాయి. ఆకు కూరలు, కూర గాయల్లో పీచు అధికంగా ఉంటుంది. మెంతుల్లో పీచు పదార్థాం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని, చికిత్సను సహాయకారిగా తీసుకోవచ్చు. మీ పాదాలకి సౌకర్యంగా ఉండే అనువైన పాదరక్షలను వాడాలి.

-ధూమపానం అలవాటు పూర్తిగా మానేయాలి. ఎక్కువ కొలస్ట్రాల్‌ ఉండే నూనెలు గాని, మాంసా హారాలు గాని, నూనే అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం పూర్తిగా తగ్గించాలి.రోజు తగినం తగా వ్యాయామం చేస్తూ ఉండాలి. తక్కువగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నడుస్తూ ఉండాలి. మీ రక్తపోటు, శరీర బరువు, నడుము చుట్టుకోలత - ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోగలం.

- డా అశోక్‌-కుమార్‌ డాష్‌-జనరల్‌ ఫిజీషియన్‌, డయాబెటిక్‌ స్పెషలిస్ట్‌,-గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకాపూల్‌, హైదరాబాద్‌@surya Telugu daily,Nov12, 2012
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, January 20, 2013

If bad happence to pancreas...awareness-క్లోమం చెడిపోతే...అవగాహన




  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -If bad happence to pancreas...awareness-క్లోమం చెడిపోతే...అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు .. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విష పదార్థాలు క్లోమ కణజాలంపెై ప్రభావం చూపును దీని వల్ల సజీవ కణజాల శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిలమైన పదార్థాలు రాళ్ల మాదిరిగా ఏర్పడవచ్చును. ఈ రాళ్లు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చును. హెప్టైటిస్‌ బీ, సైటోమెగాలో వెైర్స్‌, హెర్పస్‌ సింప్లెక్స్‌ వంటి వెైర్స్‌ లు.., లెజియోనెల్లా, లెప్టోస్పైరా, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు..., ఆస్కారిస్‌, క్రిప్టో స్పోరిడియ్మ్‌ వంటి పరాన్న జీవులు కూడా తోడినప్పుడు ఈ చెడు ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. అంతిమంగా ఈ అనర్థం మరింతగా పెరిగిపోతుంది.

మద్యం తాగే అలవాటు గతం లో అంత ఎక్కువగా ఉండేది కాదు. రాను రాను పరిస్థితి బాగా మారుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా మద్యం తాగేందుకు అలవాటు పడుతున్నారు. మద్యం తాగడం మోడర్న్‌ సొసైటీ లక్షణమని కొందరిలో అపోహ ఉంది. ఒకసారి తాగుడు అలవాటు మొదలెైతే దాన్ని వదులుకోవటం చాలా కష్టం. శరీరంలోని అన్ని భాగాలను మద్యం నాశనం చేస్తుంది. లిక్కర్‌ తాగితే ఆరోగ్యాన్ని పణంగాపెటా ్టల్సిందే. మానవ దేహంలోని ప్రధాన గ్రంధుల్లో ఒకటైన క్లోమం- మద్యంతో చెడిపోయే ప్రమాదం ఉంది. శరీరంలో నాళ గ్రంథిగా, వినాళ గ్రంధిగా సేవలు అందించే క్లోమాన్ని ఆల్కహాల్‌ తీవ్రంగా నాశన చేస్తుంది. క్లోమంలో ఏర్పడే సమస్యల్ని ఎక్యుట్‌ ప్యాంక్రియాటిటిస్‌గా, క్రానిక్‌ ప్యాంక్రియాటిటిస్‌ గా, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ గా చెబుతారు.

శ్రీరంలో క్లోమ గ్రంధికి చాలా ప్రాధాన్యం ఉంది. జీర్ణ వ్యవస్థలో ముఖ్య మైన గ్రంథిగా చెబుతారు. శరీరంలోని జీర్ణాశయం దిగువ భాగంలో దీన్ని గమనించవచ్చు. నాళ గ్రంథి హోదాలో ఇది క్లోమరసాన్ని స్రవి స్తుంది. ఈ క్లోమ రసాన్ని స్రవించే కణాల్ని రెండు రకాలుగా చెబుతా రు. డక్టల్‌ కణాలు, ఎసినార్‌ కణాలు అని చెప్పవచ్చు. ఇందులో డక్టల్‌ కణాల నుంచి విడుదలయ్యే బెైకార్బనేట్‌ పదార్థాలు... పాక్షికంగా జీర్ణ మైన ఆహారంలోని ఆమ్లత్వాన్ని అదుపు చేయగలుగుతుంది. ఎసినార్‌ కణాలు ముఖ్యంగా క్లోమరసంలోని ఎంజెైమ్‌ ల చెైతన్యానికి దోహద పడతాయి. ఇక క్లోమరసంలోని ఎంజెైమ్‌ లు వాటి పని తీరును పరిశీలి ద్దాం. ఇందులో ఉండే ట్రిప్సినోజిన్‌ అనే ఎంజెైమ్‌ చెైతన్య రూపం పొంది ట్రిప్సిన్‌ గా మారుతుంది. అప్పుడు అది మాంసకృత్తుల పెైన పనిచేసి అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. కైమో ట్రిప్సినోజిన్‌ కూడా చెైతన్యవంతం అయినప్పుడు మాంసకృత్తుల్ని జీర్ణం చేసేందుకు ఉప కరిస్తుంది. ఆహారంలోని ఎలాస్టిన్‌ లను జీర్ణం చేసే ఎలాస్టియేజ్‌, కేంద్ర కామ్లాలను జీర్ణం చేసే న్యూక్లియేజ్‌ లను క్లోమం స్రవిస్తుంది. ఇక్కడ స్రావితం అయ్యే అమైలేజ్‌ ..

పిండి ప్దార్థాల్ని జీర్ణం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇక, కొవ్వుల్ని సరళ రూపంలోకి మార్చే లెైపేజ్‌ అనేది ప్రధానమైన ఎంజెైమ్‌ గా చెప్పవచ్చు. అంతేగాకుండా కొవ్వుల్ని ప్రధానంగా జీర్ణం చేసేది క్లోమరసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారంలోని అన్ని రకాల ప్రధాన పదార్థాల్ని క్లోమరసం సంశ్లేషణ చేస్తుంది. వినాళ గ్రంధి హోదాలో క్లోమం అనేక హార్మోన్‌లను స్రవించును. ఇవి నేరుగా రక్తంలో చేరిపోయి, ఆయా భాగాల మీద ప్రభావం చూపుతుం ది. క్లోమంలోని ద్వీప కణాలు హార్మోన్‌ ల స్రావకానికి మూలంగా నిలుస్తాయి. ఇందులో నాలుగు రకాల హార్మోన్‌ లను గుర్తిస్తారు. ఆల్ఫా కణాలు గ్లూకాన్‌ అనే హార్మోన్‌ ను స్రవిస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ ను స్రవించును. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించును. ఇక డెల్టా కణాలు స్రవించే సొమాటో స్టాటిన్‌ అనే హార్మోన్‌.. పెైన చెప్పిన ఆల్ఫా, బీటా కణాల పనితీరును ప్రభావితం చేయును. గామా కాక ణాలు క్లోమ పెప్టైడ్‌ అనే హార్మోన్‌ ను స్రవించును. క్లోమానికి తలెత్తే సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. వీటిని ప్రధానంగా నాళ గ్రంథి హోదాలో కొన్ని సమస్యల్ని గుర్తించవచ్చు. పాన్‌క్రియాటిటిస్‌ (క్లోమంలో గాయాలు చోటుచేసుకోవటంతో పాటు,

ఎంజెైమ్‌ లు ఆహార పదార్థాలకు బదులుగా క్లోమ కణాల్ని శిథిలం చేస్తాయి), క్లోమ క్యాన్సర్‌ (క్లోమంలో అవాంఛనీయ కణజాలం పేరుకొని పోయి, మిగి లిన సజీవ కణజాలాన్ని పాడు చేస్తుంది), సిస్టిక్‌ ఫెైబ్రోసిస్‌ ( అనవసరపు మ్యూకస్‌నిలిచిపోయి క్లోమరసం స్రావానికి అడ్డు తలుగును) అనే ప్రధాన సమస్యలుగా గుర్తిస్తారు. వినాళ గ్రంథి హోదాల్లో తలెత్తే ప్రధాన సమస్య అయిన మధుమేహ వ్యాధి కి మూలం క్లోమ గ్రంథియే. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ నిల్వల్లో తేడాలు తలెత్తి అనేక శరీర భాగాలకు అందాల్సిన శక్తి అందకుండా పోతుంది. ఫలితంగా దీర్ఘకాలికంగా నిస్సత్తువతో బతకాల్సి ఉంటుంది.
ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు .. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విషపదార్థాలు క్లోమ కణజాలంపెై ప్రభావం చూపును దీని వల్ల సజీవ కణజాల శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిలమైన పదార్థాలు రాళ్ల మాదిరిగా ఏర్పడవచ్చును. ఈ రాళ్లు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చును. హెప్టైటిస్‌ బీ, సైటోమెగాలో వెైర్స్‌, హెర్పస్‌ సింప్లెక్స్‌ వంటి వెైర్స్‌ లు.., లెజియోనెల్లా, లెప్టోస్పైరా, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు..., ఆస్కారిస్‌, క్రిప్టో స్పోరిడియ్మ్‌ వంటి పరాన్న జీవులు కూడా తోడినప్పుడు ఈ చెడు ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. అంతిమంగా ఈ అనర్థం మరింతగా పెరిగిపోతుంది.

పాన్‌ క్రియాటిటిస్‌ లక్షణాల్ని తీవ్ర మైన కడుపునొప్పితో గుర్తించవచ్చు ను. వాంతులు కూడా ఉంటాయి. అంతర్గతంగా స్రావం ఉండటం మరో లక్షణం. రక్తపోటును కూడా గుర్తించవచ్చు. కడుపు నొప్పి ఒక ప్రాంతంనుంచి వేరొక ప్రాంతానికి వ్యాపిస్తూ ఉంటుంది. జ్వరంతో కూడిన వాంతులు ముఖ్య సూచిక. కామెర్లు కూడా గమనించదగిన లక్షణం. శ్వాసలో ఇబ్బందుల్ని గుర్తించవచ్చు. విరోచనంలో నూనె చుక్కలు కనిపిస్తాయి. ఇది ప్రధాన మైన సంకేతం. ఎందుకంటే ఆహారంలో నూనెల్ని సంశ్లేష్ణ చేసే లెైపేజ్‌ ఎంజెైమ్‌ ప్రధానంగా క్లోమం నుంచే స్రావితం అవుతుంది. క్లోమం చెడిపోయినప్పుడు ఈ ఎంజెైమ్‌ పనితీరు దెబ్బతింటుంది. దీంతో నూనెలు జీర్ణ క్రియకు నోచుకోకుండా నేరుగా ఆమ్లం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందుచేత విరోచనం లో నూనె వంటి జిగురు కనిపిస్తుంది. దీన్ని బట్ట్టి తేలిగ్గా పాన్‌క్రియా టిటిస్‌ను గుర్తు పట్ట వచ్చు.

ఈ సమస్యతో తలెత్తే అనర్థాల్ని రెండు రకాలుగా గర్తించవచ్చు. క్లోమ రసం సరిగా స్రవించకపోవటంతో ఎంజెైమ్‌ ల వినియోగం తగ్గిపోతుం ది. అమైలేజ్‌, ట్రిప్సిన్‌, లెైపేజ్‌ వంటి ఎంజెైమ్‌ లు తగినంతగా అందు బాటులో లేకపోవటంతో జీర్ణక్రియ మందగించిపోతుంది. సరిగ్గా జీర్ణం జరగక పోవటంతో ప్రధాన పదార్థాల సంశ్లేష్ణ నిలిచిపోతుంది. అటు, హార్మోన్‌ ల స్రావం కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్‌, గ్లూకాగాన్‌ వంటి హార్మోన్‌ ల స్రావం లేకపోవటంతో రక్తంలో గ్లూకోజ్‌ మట్టం సక్రమంగా ఉండదు. ఇన్ని అనర్థాలకు మూలం క్లోమంలో సమస్య ఏర్పడటమే.పాన్‌క్రియాటిటిస్‌ను సాధారణ కడుపునొప్పి, విరోచనంలో నూనె జిగు రుతో గుర్తించవచ్చు. కడుపునొప్పి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాం తానికి మారుతుండటాన్ని గుర్తించవచ్చు. ఎమైలేజ్‌, లెైపేజ్‌ శాతం 4-5 రెట్లు పెరిగిపోతుంది. అల్ట్రా సౌండ్‌ పరీక్షలతో సాధారణంగా గుర్తిస్తా రు. గ్యాల్‌ స్టోన్‌, ఫాటీ లివ్‌ లను పరిశీలించవచ్చు. వీటితో పాన్‌ క్రియాటిటిస్‌ ఆచూకీ బటయపడుతుంది. సీటీ స్కాన్‌, ఎమ్‌ ఆర్‌ ఐ పరీక్షలతో సరెైన నిర్ధారణ లభించును.

ఎక్యుట్‌ పాన్‌క్రియాటిటిస్‌ దశలోనే వ్యాధిని గుర్తించటం మంచిది. సరెైన మందులు వాడితే అక్కడితో పరిష్కారాన్ని సాధించవచ్చు. రోగం ముదిరితే మాత్రం చికిత్స కష్టం అవుతుంది. రాళ్లు ఏర్పడినప్పుడు వాటిని మందులతో కరిగించేందుకు ప్రయత్నిస్తారు. లేనిపక్షంలో వాటిని తొలగించడమే ఉత్తమ మార్గం అనుకోవచ్చు. ఈ ఆర్‌ సీ పీ వంటి విధానాల్ని అవలంభించటం చూస్తుంటాం. ఎండోస్కోపీ విధానాలు పని చేయక పోతే సంక్లిష్టమైన చికిత్స అవసరం అవుతుంది.క్లోమ క్యాన్సర్‌ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఈ క్యాన్సర్‌ కు చికిత్స చేయవచ్చును. వ్యాధిని ప్రారంభ దశలో గర్తించటం చాలా ముఖ్యం. కీమో థెరపీ, రేడియో థెరపీ, శస్తచ్రికిత్స లతో సమన్వయంగా చికిత్స చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. అన్ని పరిస్థితుల్లోనూ మద్యం తాగడం మానివేస్తేనే చికిత్స ఫలితాలు ఇవ్వవచ్చును. నిపుణులెైన వెైద్యుల్ని సంప్రదిస్తే సమర్థమైన చికిత్స అందించటం సాధ్యం అవుతుంది. లేని పక్షంలో పాన్‌ క్రియాటిటిస్‌ ముదిరిపోయి డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తవచ్చును. రోగం తీవ్రం అయిపోతే రోగి మరణానికి కూడా దారి తీయవచ్చు. ఏది ఏమైనా చికిత్స కన్నా నివారణ ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.

courtesy with : Surya Telugu daily news paper(Nov 26, 2012)

  • -=========================
Visit my website - > Dr.Seshagirirao.com/

గర్భధారణ..ప్రసవం..వ్యాయామం అవగాహన -Awareness of exercise in pregnancy and delivery

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గర్భధారణ..ప్రసవం..వ్యాయామం అవగాహన -Awareness of exercise in pregnancy and delivery
--
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్ర్తీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. స్ర్తీ గర్భం దాల్చినప్పటి నుంచి నవమసాలు కొనసాగే వరకు అనేక అనుభూతులు పొందుతారు. యువతీ నుంచి మాతృమూర్తిగా మారే ఈ సమయంలో, బరువు పెరగడం, భంగిమల్లో మార్పులు చేకూరడం, కీళ్లలో కదిలికలు పెరగడం, కండరాల బలం క్షీణించడం వంటి మార్పులు స్ర్తీ యొక్క శరీరంలో సహజబద్ధంగా జరుగుతాయి. ఇవి కాకుండా చాలా వరకు సర్వసాధారణంగా నడుము నొప్పి, కాళ్ళ వాపులు వంటి చిన్న చిన్న సమస్యలతో కూడా బాధపడుతుంటారు.

-గర్భిణుల్లో అనేక అపోహలు తలెత్తుతాయి. ముఖ్యంగా వాళ్లు చేసే పనుల విషయంలో. కొందరేమో ఎంత ఎక్కువ పని చేస్తే కాన్పు అంత సులువుగా అవుతుంది అని ఆలోచిస్తారు. మరి కొందరేమో దీనికి పూర్తి విరుద్ధం. తల్లి, బిడ్డ ఇద్దరి ఆహారం తినాలని ఎక్కువెక్కువ తింటుంటారు. మరి మంచం అసలు దిగరు. రెండు ధోరణులు సరికాదు. సమపాల్లలో వ్యాయామం చేయడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా వ్యాయామం అనగానే అందం కోసం అనే అపోహలో ఉంటారు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత ఇంకా పెద్దగా అందానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం అనుకుంటారు. నిజానికి అందమే కాకుండా, వారి ఆరోగ్యం, జీవనశెైలి చురుకుగా మల్చడానికి వ్యాయామం తోడ్ప డుతుంది.గర్భిణిల్లో కాన్పుకు ముందు తరువాత సహజంగా జరిగే మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యకు సమర్థవంతంగా ఎదురుకొనుటకు వ్యాయామం  తోడ్పడుతుంది

గర్భధారణ మార్పులు-సమస్యలు
భంగిమలో మార్పు జరగడానికి అతి ముఖ్యమైన కారణం బరువు. నెలలు నిండే కొద్ది గర్భం పెరగడంతో పొట్ట పెరుగుతుంది. ఎత్తుగా కడుపు పెరిగే కొద్దీ స్ర్తీలు సమతుల్యం కోసం కొద్దిగా వెనక్కి వంగి నడవడం అవాటు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వెర్టిబ్రె (వెన్నెముక)పెైన తీవ్ర ఒత్తడి పడుతుంది. పెద్ద పొట్ట ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి కేంద్రం ముందుకు జరుగుతుంది. దీనిని వెనక్కి తీసుకురావడానికి కొద్దిగా వెనక్కి వాలటం అలవాటు చేసుకుంటారు. అందుచేత నడుము దగ్గర ఉండే కండరాలు అధిక శ్రమకు లోనవుతాయి. ఫలితంగా అవి బిగుసుపోవడం, నడుము నొప్పి రావడం జరుగుతుంది. రిలాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవ్వడం చేత కీళ్ల యొక్క కదలికలు మామూలుకంటే ఎక్కువ ఉండటంతో, సులువుగా బ్యాలెన్స్  అవుట్‌ అవ్వడం, చిన్న చిన్న ప్రమాదాలకు గురవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాళ్లలోని రక్తనాళాల్లో నిరోధకత తగ్గ డం, ఇంకా పొట్ట వద్ద ఉండే ప్రధానమైన సిరల మీద ఒత్తిడి పడటం వంటి రక్త సరఫరా లోపాల చేత ఎక్కువ శాతం గర్భిణుల్లో కాళ్ళ వాపులు కనిపిస్తుంటాయి.

వ్యాయామం కీలకపాత్ర
నొప్పి నివారణ: సాధారణంగా నొప్పి తగ్గడానికి ఐ.ఎఫ్‌.టి., అల్ట్రాసౌండ్‌ వంటి కరెంట్‌ పరికరాలతో చికిత్స చేస్తారు. అయితే గర్భిణీ స్ర్తీలకు వాటితో చికిత్స చేయకూడదు. అందుకు వ్యాయామమే కీలకం. నొప్పి వేధిస్తున్నప్పుడు, ఏ ఏ కండరాలు సమస్యకు కారణమవుతున్నాయో గుర్తించి, బిగుసుకు పోయిన కండరాలకు (సెలెక్టివ్‌ స్ట్రెట్చింగ్‌) క్షీణించిన కండరాలను బలోపేతం చేసేందుకు వ్యాయామం సూచిస్తారు.

వాపుల నియంత్రణ
ఎక్కువ సమయం నిల్చోవడం, కాలు కిందకు పెట్టి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం చేయకూడదు. ప్రతి గంటకు 309 సెకండ్లు పాదాలను పెైకి కిందకి వీళెైనంతవరకు కదిలించడం చేత మంచి ఉపయోగం ఉంటుంది.

సులువెైన ప్రసవం
పెల్విక్‌ ఫ్లోర్‌ అవసరమైన కండరాలను సురక్షితమైన వ్యాయామంతో బలోపేతం చేయడంతో కాన్పు సులువుగా జరుగుతుంది. విసర్జన సమస్యలు కూడా నివారించవచ్చు.

చురుకు, ఆరోగ్యకరమైన బిడ్డ
పూర్వం గర్భిణులు వ్యాయామం చేస్తే గర్భానికి జరగవలసిన రక్త సరఫరా, వ్యాయామం చేసే గర్భిణి కండరాలకు జరుగుతుందని వ్యాయామాన్ని నిర్దేశించేవాళ్లు. అయితే ఆధునిక పరిశోధన, వారానికి 5 రోజులు, 30 నిమిషాల పాటు నడక (వాకింగ్‌), సైక్లింగ్‌, కుదిరితే ఈత (స్విమ్మింగ్‌) వంటి సులువెైన ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం చేత గర్భిణికి ఎటువంటి హానీ జరగదు అంతే కాకుండా పరిమిత బరువు, చురుకు, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవిస్తారని తేల్చి చెప్పారు.

కంగుబాటు
కొందరు అనవసరంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి రిలాక్సేషన్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు ఉపయోగపడతాయి.

సలహాలు-సూచనలు
కాన్పు తరువాత బిడ్డ యొక్క ఆలనా పాలనా చూసుకునే సమయంలో తల్లి తన భంగిమలపెైనం పెద్దగా దృష్టి వహించదు. వీటికి సంబంధించిన సలహాలు-సూచనలు పాటించడం వల్ల అనేక ఇబ్బందులను నివారించవచ్చు.

ముఖ్య గమనిక
స్ర్తీలు గర్భం దాల్చినప్పుడు లేక ప్రసవం తరువాత వ్యాయామం మొదలుపెట్టే ముందు... ఫిజీయోథెరపిస్ట్‌ని సంప్రదించి వారి సలహా మేరకు పాటించడం మంచిది. స్ర్తీ యొక్క శారీరక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించి వారికి సురక్షితమైన వ్యాయామం సలహాలు సూచించగలరు.

Courtesy with - డా ఎ. సుష్మజ--సీనయర్‌ ఫిజియోథెరపిస్ట్‌, గమన్‌ ఫిజియోకేర్‌@Surya Telugu Daily-Dec3,2012
 

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, January 12, 2013

Dry Cough-పొడి దగ్గు

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Dry Cough-పొడి దగ్గు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సాధారణంగా ఋతువులు మారుతున్నప్పుడు అంటే ఒక సీజన్‌ నుండి మరో సీజన్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణం గా సర్దుబాటుకాక, తేలికగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశముంటుంది. ఇలా సీజన్‌ మారుతున్న సందర్భంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో పాటు చాలా మంది పొడి దగ్గుతో వేధించబడుతుంటారు.

-వెైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, పరాన్న జీవుల వలన కలిగిన ఇన్‌ఫెక్షన్‌ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్‌ఫెక్షన్‌, ఊపిరితిత్తుల వరకూ ప్రయాణించి, శ్వాసమా ర్గాల లోపల ఉండే ‘మ్యూకోసా’ పొరను దెబ్బ తిస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలెై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి, దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.

జాగ్రత్తలు:

    వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి, చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌, స్వీట్స్‌ తీసుకోకూడదు. చల్లటి గాలికి వెళ్లే ముందు మాస్క్‌ ధరించాలి.
    ఆల్కహాలు, పొగతాగే అలవాటు ఉన్న వారు వెంటనే మానేయాలి.
    బ్రీతింగ్‌, ఎక్సర్‌సైజ్‌, ప్రాణాయామం, యోగ నిత్యం చేయాలి.

    చికిత్స:
    వ్యాధి లక్షణాలను, ఉద్రేక, ఉపశమనాలనీ, వ్యక్తి శరీరతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, చికిత్స చేసిన పొడిదగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Antibiotics : Azithromycin 250 mg 6 th hourly for 3-4 days

Decongestents : Tab. cetrazine + paracetamol + phenephrine hel ( sucet plus or Nozee) 1 tab three times / day for 3-4 days ,

cough syrups : sy. codistar Dx or zeet or zedex  ... 5 ml three times /day for 3-4 days.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Heart Valves-గుండెకు తలుపులు...






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Heart Valves-గుండెకు తలుపులు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


--నదీ ప్రవాహానికి ఆనకట్టలు కావాలి. వాటి ద్వారా నీరు వృథా కాకుండా అవసరమైనప్పుడు, తగినంత మేర ప్రవహించేందుకు వీలుంటుంది. అదేవిధంగా శరీరంలో రక్తం ఇష్టం వచ్చినట్టు ప్రవహించకుండా క్రమ పద్ధతిలో పంపింగ్ చేయడానికి గుండెలో ఉన్న తలుపుల లాంటి నిర్మాణాలనే కవాటాలు లేదా వాల్వులు పనిచేస్తాయి. వాటిలో లోపం ఎదురైతే రక్తవూపసరణ అస్తవ్యస్తం అవుతుంది.

శరీరంలో నిరంతరం ఎటువంటి విశ్రాంతి లేకుండా పనిచేసే పంపింగ్ యంత్రం గుండె. నాలుగు గదులతో కూడిన గుండెలో ఒకవైపు నుంచి చెడు రక్తం, మరోవైపు నుంచి మంచి రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక గది నుంచి మరో గదికి రక్తం ప్రయాణించడాన్ని కంట్రోల్ చేసేదే కవాటం. రక్తం తిరిగి వెనక్కి రాకుండా ముందుకే ప్రయాణించడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీర భాగాల నుంచి సేకరించిన రక్తం గుండె గదుల నుంచి రక్తనాళాలకు, రక్తనాళాల నుంచి గదుల్లోకి నిరంతరం ఒక క్రమ పద్ధతిలో ప్రయాణించడానికి తోడ్పడేవే కవాటాలు.

కవాటాలు.. రక్తసరఫరా..
- గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్, ఆయోర్టిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్.
- మిట్రల్, ట్రైకస్పిడ్ కవాటాలు కర్ణిక, జఠరికల మధ్య ఉంటాయి. కర్ణికల నుంచి జఠరికల్లోకి రక్తం ప్రయాణించడానికి ఇవి సహకరిస్తాయి. మిట్రల్ కవాటం ఎడమ కర్జిక, జఠరికల మధ్య ఉంటే, ట్రైకస్పిడ్ కవాటం గుండె కుడివైపు కర్ణిక, జఠరికల మధ్య ఉంటుంది.
- ఆయోర్టిక్ కవాటం ఎడమ జఠరిక, ఆయోర్టా మధ్య ఉంటుంది. ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం ఆయోర్టాలోకి వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది.
- పల్మనరీ కవాటం కుడి జఠరిక, పుపుస సిరల మధ్య ఉంటుంది. జఠరిక నుంచి  చెడు రక్తం పుపుస సిరలోకి వెళ్లడానికి ఇది తోడ్పడుతుంది.
- ఆ నాలుగు వాల్వ్‌లోనూ ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్), వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్‌)
  •  కారణాలు
- కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్.
- రుమాటిక్ హార్ట్ డిసీజెస్.
- జన్యుపరమైన కారణాలు. కొందరిలో పుట్టుకతోనే (కంజెనిటల్) కవాటాలలో లోపాలు ఏర్పడవచ్చు.
- కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజనరేటివ్) వచ్చే సమస్యలుగా కూడా రావచ్చు.
  • లక్షణాలు
రక్త ప్రసారానికి ద్వారాలు తెరిచే కవాటాల్లో సమస్యలు వస్తే శరీరానికి తగినంత రక్తాన్ని తగిన సమయంలో అందించే పనిలో గుండె ఫెయిల్ అవుతుంది. అందుకే రకరకాల సమస్యలు వస్తాయి.
- గుండె వైఫల్యం వల్ల ఆయాసం
- పొడి దగ్గు
- పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం
- గుండెదడ.
- బలహీనంగా అయిపోవడం, ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
- సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దుష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.
- ట్రైకస్పిడ్ కవాటం లీక్ సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది.
- మిట్రల్ వాల్వ్ సన్నబడితే రక్తపు వాంతులు కావచ్చు.
- ఆయోర్టిక్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు.

కొత్త నిర్ధారణలు...
కవాటాల సమస్యలను కచ్చితంగా నిర్ధారించడానికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పద్ధతి ట్రాన్స్ ఈసోఫిజియల్ కార్డియోక్షిగామ్. ఇప్పుడు ట్రాన్స్ ఈసోఫిజియల్ ఎకో కార్డియోక్షిగామ్ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం కవాటాన్ని మార్చవచ్చు.

కవాట మార్పిడి
కవాటాల్లో ఏర్పడిన సమస్యలకు చాలావరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మిట్రల్ వాల్వ్ సన్నబడ్డపుడు బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారినా లేదా లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్వ్‌లోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటపుడు వాల్వ్ రీప్లేస్‌మెంట్ అన్నదే పరిష్కారం. కవాటాన్ని రీ ప్లేస్ చేసే క్రమంలో మెటల్‌వాల్వ్, టిష్యువాల్వ్ అనే రెండు రకాల వాల్వ్‌లను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వ్‌ను ఉపయోగించినపుడు ''ఎసివూటోమ్'' అనే మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. దీన్ని జీవితాంతం వాడాల్సిందే. ఈ మందులు రక్తాన్ని పలుచబరుస్తాయి. టిష్యు కవాటాలు జంతువుల కండరాలతో చేసినవి. టిష్యు వాల్వ్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబర్చే మందు ఎసివూటోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కవాటం 15 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

ఆధునిక చికిత్స
ప్రస్తుతం కవాట సమస్యలకు సర్జరీ మంచి పరిష్కారాన్నే చూపిస్తుంది. కానీ సర్జరీ కంటే కవాటాన్ని మరమ్మత్తు చేసే చికిత్సకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గుండెలోని కవాటాన్ని మార్చి కొత్తదాన్ని అమర్చడం కన్నా ఉన్నదాన్ని మరమ్మత్తు చేయడం ఎక్కువ సులువైన, మెరుగైన పద్ధతి.
అందుకే వైద్యనిపుణులు రిపేర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా సహజమైన కవాటాన్ని మరమ్మత్తు చేసినప్పుడు ఎసివూటోమ్ లాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మిట్రల్, ట్రైకస్పిడ్ కవాటాలకు సంబంధించిన సమస్యలైతే వాటిని మరమ్మత్తు చేయడమే కరెక్ట్. దీనివల్ల ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతాయి.


Source : Harrison Text book of Medicine
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, January 11, 2013

Albumin in Urine - మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Albumin in Urine - మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 మూత్రం (Urine) జంతువుల శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే ద్రవం. ఇది రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. మన  శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది.

మూత్రాన్ని రకరకాల మూత్ర పరీక్షల ద్వారా దాని లోని వివిధ పదార్ధాలను గుర్తించి విశ్లేషించవచ్చును. సాధారణము గా మూత్రము లో ప్రోటీన్‌ పోవడము జరుగదు .

 మూత్రంలో అల్బుమిన్‌ : అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం  తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. శరీరాన్ని  ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శుద్ధి యంtraaలు కిడ్నీలు. అలాంటి కిడ్నీలు పనిచేయడం మానేస్తే.. మన శరీరమే విషతుల్యం అయిపోతుంది.

మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వీళ్లలో చాలామందికి తమ కిడ్నీలో సమస్య ఉందన్న  విషయమే తెలియదు. కిడ్నీ జబ్బులకి సవాలక్ష కారణాలు. కారణం తెలిస్తే కిడ్నీజబ్బులను ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు.

మూత్రంలో ఏమాత్రం ప్రోటీన్‌ పోతున్నా మధుమేహులు జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహుల్లో కిడ్నీ సమస్యలూ తలెత్తే అవకాశముంది. దీంతో మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ పోవటం కనిపిస్తుంది. ఇలాంటివారికి గుండెపోటు, పక్షవాతం, గుండెవైఫల్యం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా 90% మంది మధుమేహుల్లో మూత్రంలో అల్బుమిన్‌ స్థాయులు  మామూలు మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ వీరికి కూడా గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందా? అనేదానిపై ఇటలీ పరిశోధకులు  తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ ప్రోటీన్‌ మోతాదు కొద్దిగా పెరిగినా గుండె సమస్యల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఇక  దీని మోతాదు పెరుగుతున్నకొద్దీ ముప్పూ ఎక్కువవుతూ వస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహులు మూత్రంలో  అల్బుమిన్‌ పోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రము లో ప్రోటీన్‌ పోవడాన్ని ఈ క్రింది రకాలుగా చెప్పవచ్చు :
  • మైక్రోఆల్బుమినూరియా,
  • మాక్రో ఆల్బుమినూరియా,
  • ప్రొటినూరియా లేదా ఆల్బుమినూరియా
  • యూరిన్‌ - క్రియాటినిన్‌ రేషియో,

మూత్రములో ప్రోటీన్‌ పరీక్ష . . సుమారు 5-10 మి.లీ. మూత్రము ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని పై భాగము వేడిచేయగా ప్రోటీన్‌ కాగులేట్ అయి తెల్లని పొర(టర్బిడ్) గా యేర్పడును. ఇది మనకు ప్రోటీన్‌ ఉన్నదీ .. లేనిదీ తెలుసందే తప్ప ఖచ్చితముగా ఎంత మోతాదులో పోతుందో తెలియదు. 1+, 2+, 3+,4+ అని అంచనా పై రిపోర్ట్ చేయుదురు. నార్మల్ గా 0-8/100 మి.లీ. ఉంటుంది .

మూత్రము లో ప్రోటీన్‌ కనిపించే కొన్ని ముఖ్యమైన వ్యాధులు :
  •  మధుమేహము --diabetes
  •  రక్తపోటు --hypertension,
  • కాలేయ వ్యాధులు --liver cirrhosis,
  • గుండె జబ్బులు --heart failure ,
  • ఒకరకమైన చర్మ వ్యాది --systemic lupus erythematosus.
  • మూత్రపిండాల వ్యాధులు ..Glomerulo nephritis , nephrotic syndrome,
  • గర్భిణీ లలో మూత్రము లో ప్రోటీన్‌ ఉంటే గుర్రపు వాతవ (eclampsia) అనే సీరియస్ వ్యాధికి దారితీయును,
-----------------------------------------------------------------------------------------------


Albumin in Urine-మూత్రంలో అల్బుమిన్‌ - Ayurvedhic Treatment / Dr.chirumamilla muralimanohar

మన రక్తంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. రక్తం తాలూకు ద్రవాభిసరపీడనం (ఆస్మాటిక్ ప్రెషర్)ని నిర్దేశిత స్థితిలో ఉంచటం దీని ప్రధాన విధి. దీనికోసం శరీరంలో రక్తంతోపాటు ప్రొటీన్ కూడా సంచరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్‌తోకూడిన రక్తం మూత్ర పిండాలను చేరుకుంటుంది. కిడ్నీలు రక్తంలో అదనంగా ఉండే ప్రొటీన్‌ని వడపోత ద్వారా వేరుపరిచి వెలుపలకి విసర్జిస్తాయి. ఇది శారీరక క్రియలో భాగంగా కనిపించే సహజ ప్రక్రియ. అయితే ఏదైనా  కారణం చేత మూత్రపిండాలు విసర్జించాల్సిన స్థాయి కంటే ఎక్కువ ప్రొటీన్‌ని లేదా ఆల్బుమిన్‌ని మూత్రం ద్వారా వెలువరిస్తే దానిని ఆల్బుమినూరియా అంటారు. దీనినే  మైక్రోఆల్బిమునూరియా అని కూడా పిలుస్తారు. మామూలు డిప్‌స్టిక్ పద్ధతుల ద్వారా మూత్రంలో ఉండే ప్రొటీన్‌ని కొలవటం సాధ్యం కానప్పుడు మైక్రో ఆల్బిమునూరియా అంటారు. గ్లోమరూలర్ ప్రొటినూరియా, నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి పేర్లతో కూడా ఈ వ్యాధి స్థితిని వ్యవహరిస్తారు.

ఆల్బుమినూరియాను పోలిన వ్యాధి స్థితిని ఆయుర్వేదం ''లాలామేహం'' అనే పేరుతో వివరించింది. ఇది 10 రకాలైన కఫజ ప్రమేహాల్లో ఒక భేదం. జొల్లులాగా తీగలుగా, జిగటగా వెలువడే మూత్రాన్ని లాలామేహం అంటారు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో ప్రభావవంతమైన చికిత్స ఉంది. మన శరీరాల్లో ప్లాస్మా ప్రొటీన్లనేవి ఉండటం అవసరం. ఈ ప్రొటీన్లు వెలుపలకు  వెళ్లిపోకుండా చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. గ్లోమరూలర్ ఫిల్టరేషన్ బ్యారియర్ ద్వారా ప్రొటీన్లు వెళుతున్నప్పుడు కిడ్నీలలోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే నిర్మాణాలు
ఈ ప్రొటీన్లను తిరిగి శరీరంలోకి గ్రహిస్తాయి. ఆరోగ్యవంతుల్లో రోజు మొత్తం విసర్జించిన మూత్రంలో 150 మిల్లీ గ్రాముల వరకూ (లేదా 100 మిల్లీలీటర్ల మూత్రంలో 10 మిల్లీ గ్రాముల వరకూ) ప్రొటీన్ కనిపించడం సహజం. ఇంతకంటే ఎక్కువ మొత్తాల్లో ప్రొటీన్ మూత్రంతోపాటు వెళుతుంటే దానిని అసాధారణంగా భావించాలి. కిడ్నీ వ్యాధులుగాని లేదా ఇతర సాధారణ
సంస్థాగత (సిస్టమిక్) వ్యాధులు గాని దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. శారీరక శ్రమ, తీవ్రావస్థలో కనిపించే వ్యాధులు, హెచ్చు స్థాయి జ్వరాలు, నెలసరిలో అపక్రమం, గర్భధారణ,
అసాధారణమైన యోనిస్రావాలు, ఆహారంలో తేడాలు, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరగటం వంటి అనేక అంశాలు మైక్రో ఆల్బునూరియాకి కారణమవుతాయి రాత్రి మొత్తం కాలం పగటి మొత్తం కాలం రెంటినీ పోల్చి చూస్తే రాత్రి కంటే పగటిపూట ఆల్బుమిన్ విసర్జన 25 శాతం అధికంగా ఉంటుంది. టైప్ 1 మధుమేహం (ఇన్సులిన్ మీద ఆధారపడే
మధుమేహం)లో ఆల్బుమినూరియా కనిపిస్తే మూత్ర పిండాల వైఫల్యాన్ని పరిగణించాలి. కాగా టైప్ 2 మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటంవల్ల ఉత్పన్నమయ్యే ఇస్కీమిక్ గుండె జబ్బులను దృష్టిలో ఉంచుకోవాలి. రోగ వికృతి విధి విధానం త్రివిధమైన కారణాలవల్ల మూత్రంలో అసాధారణ స్థాయిలో ఆల్బుమిన్
కనిపించే అవకాశం ఉంది. మూత్రపిండాల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ ప్రొటీన్లను తిరిగి గ్రహించనివ్వకుండా చేసే వివిధ సంస్థాగత వ్యాధులవల్ల ఈ స్థితి రావచ్చు. ఇది మొదటి కారణం.
రక్తంలోని ప్లాస్మా ప్రొటీన్లు అధికంగా ఉత్పత్తి కావటమే కాకుండా మూత్రపిండాలు వడపోయగలిగే స్థాయిని మించిపోయి ప్రొటీన్లు మూత్రపిండాలను చేరుకోవటం రెండవ కారణం.
మూత్ర పిండాల్లోని గ్లొమరులర్ బ్యారియర్స్ అనే నిర్మాణాలు తమ పరిమితులను కోల్పోయి అసాధారణ స్థాయిలో మధ్యమ స్థాయి అణుభారం కలిగిన ప్రొటీన్లను అనుమతించటం అనేది
ఆల్బూమినూరియాకు మూడవ కారణం.

స్ర్తి పురుష భేదాన్ని పరిగణిస్తే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. వ్యాధి ఇతివృత్తం ఈ సమస్య ఎక్కువమందిలో
యాదృచ్ఛికంగా బయటపడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే రొటీన్ పరీక్షల్లో ఆల్బూమినూరియా ఉన్నట్లు బయటపడుతుంది.
ఆల్బూమినూరియా ఉన్నంత మాత్రాన దానిని ప్రమాదభరితమైన మూత్రపిండాల వ్యాధులకు ముడిపెట్టాల్సిన పనిలేదు. మామూలు వ్యాధుల్లో సైతం ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది కనుక ముందుగా ఈ కోణంలో దర్యాప్తు చేయటం అవసరం. ఆల్బూమినూరియా ఉన్నదని తేలినప్పుడు మూత్రంలో ఎరుపుదనం, నురగ వంటి లక్షణాలతోపాటు  సకోశవ్యవస్థకు
చెందిన సమస్యలు అనుబంధంగా కనిపిస్తున్నాయేమో తెలుసుకోవాలి. అలాగే మడమల్లోను వాపు, కంటిచుట్టూ వాపు, వృషణాలూ, యోని పెదవుల్లో వాపు వంటివి అనుబంధంగా ఉన్నాయేమో చూడాలి. గతంలో అధిక రక్తపోటు కనిపించిన ఇతివృత్తం ఉండటం, రక్తంలో కొలెస్టరాల్ అధికంగా ఉండటం, గర్భధారణలో కిడ్నీలు వ్యాధిగ్రస్తమైన సందర్భాలు ఉండటం, మధుమేహం ఉండటం, కుటుంబంలో ఇతరులకు మధుమేహం ఉండటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులుండటం, రేనాడ్స్‌వ్యాధి (చర్మంపైన దద్దురు, కళ్ళుఎర్రబారటం, కీళ్లు పట్టేయడం) వంటి వ్యాధుల ఇతివృత్తం గురించి తెలుసుకోవాలి. అలాగే మం దుల వాడకం గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం. కా ర్లు, క్షయ,
మలేరియా, సిఫిలిస్, ఎండోకార్డైటిస్ వంటి వ్యా ధుల బారిన పడిన సందర్భాలున్నాయేమో తెలుసుకోవాలి. హెచ్‌ఐవి, హెపటైటిస్-బి వంటి వైరల్ వ్యాధులబారిన పడే అవకాశం
(రిస్కు) ఉన్నదేమో తెలుసుకోవాలి. జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టటం, బరువు తగ్గటం, ఎముకలనొప్పి వంటి లక్షణాలను అడిగి తెలుసుకోవాలి. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్‌ని సూచించే ఉపద్రవాలున్నాయేమో గమనించాలి. గజ్జల్లో నొప్పి, కడుపునొప్పి, ఆయాసం, ఊపిరితో ఛాతినొప్పి రావటం, వణుకు వంటి లక్షణాలకు ప్రాముఖ్యతనివ్వాలి. వ్యాధి నిర్థారణ, విశే్లషణ తాత్కాలికంగా కనిపించే ప్రొటినూరియా వ్యాధిలో రీనల్ ఫంక్షన్ పరీక్షలో తేడా ఉండదు. పొడుగ్గా సన్నగా ఉండే వ్యక్తుల్లో, అందునా 30 ఏళ్ళలోపు వ్యక్తుల్లో కనిపించవచ్చు. ఈ స్థితితోపాటు సాధారణంగా వెన్ను వంపు కనిపిస్తుంది. శాశ్వతంగా మూత్రంలో  ప్రొటీన్ పోతుండటం, మూత్రంతోపాటు విసర్జితమయ్యే ప్రొటీన్ మొత్తాలు 500 మిల్లీ గ్రాముల ఉండటం అనేది అంతర్గత కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది. మూత్రంలో రక్తకణాల మేట కనిపించటం, రక్తంలో ఆల్బుమిన్ తగ్గటం (హైపోఆల్బిమునీమియా), మూత్రంలో కొవ్వు కనిపించటం (లిపిడూరియా), వాపు, కిడ్నీల పనితీరుని చెప్పే రీనల్ ఫంక్షన్ టెస్టు అసాధారణమైన ఫలితాలను ప్రదర్శించటం, రక్తంలో కొవ్వు ఎక్కువ మొత్తాల్లో ఉండటం (హైపర్ లిపిడిమియా), రక్తపోటు అధికంగా ఉండటం వంటివి అన్నీ కిడ్నీలు వ్యాధిగ్రస్తం కావడం మూలాన ప్రాప్తించే ఆల్బిమినూరియాలో కనిపిస్తాయి.

సూచనలు, ఆయుర్వేద చికిత్స 
* చంద్రప్రభావటి, శిలాజిత్తు, యశదభస్మం, చంద్రకళారసం, స్వర్ణమాక్షీక భస్మం, త్రివంగ భస్మం, యోగేంద్ర రసం, గుడూచిసత్వం, నాగభస్మం వంటివి ఈ వ్యాధిలో ప్రయోగించదగిన ఆయుర్వేద ఔషధాలు.
* ఆల్బుమినూరియా (లాలమేహం) వ్యాధి స్థితిలో ప్రత్యేకంగా వాస (అడ్డసరం ఆకులు), హరీతకి (కరక్కాయ పెచ్చులు), చిత్రక (చిత్రమూలం వేర్లు), సప్తపర్ణి (ఏడాకులపొన్న) వీటితో కషాయం తయారుచేసుకొని తాగితే హితకరంగా ఉంటుంది.
* ఉసిరికాయల రసం (20 మిల్లీలీటర్లు), పసుపు (5 గ్రా.) లను రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పుచ్చుకోవాలి.
* త్రిఫలాలు, పెద్దపాపర (విశాల), దేవదారు, తుంగముస్తలు వీటిని సమాన భాగాలు తీసుకొని కషాయ రూపంలో 30 మిల్లీ లీటర్ల మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
* అడవి మల్లె పుష్పాలు (కుటజ), కపిత్థ పుష్పాలు (కపిత్థ), రోహితక పుష్పాలు, విభీతకి పుష్పాలు, సప్తపర్ణ పుష్పాలు (ఏడాకులపొన్న)వీటిని ముద్దగా  నూరి ఉసిరిపండ్ల రసానికి కలిపి తీసుకోవాలి.
* వేప, రేప, ఏడాకుల పొన్న, మూర్వ, పాలకొడిశ, మదుగ వీటి పంచాంగాలను కషాయం రూపంలో అవసరమైతే తేనె చేర్చి తీసుకోవాలి.
* చంద్రప్రభావటి అనే మందు జాంబవాసవం అనుపానంగా వాడాలి.
* శిలాజిత్తు (500 మి.గ్రా.), వసంత కుసుమాకరరసం (100 మి.గ్రా) మోదుగపువ్వుల కషాయంతో పుచ్చుకోవాలి.
* చిల్లగింజలను మజ్జిగతో గంధం తీసి మూత్రవిరేచన క్వాథంతో 20మిల్లీ లీటర్ల మోతాదులో రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. ఆహారం ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పు చేర్చకూడదు. ముఖ్యంగా వాపు కనిపిస్తున్న సందర్భాల్లో ఈ సూచన బాగా గుర్తుంచుకోవాలి.
* ఈ వ్యాధి స్థితిలో ప్రొటీన్ (మాంసకృతులు) పదార్థాల వాడకం గురించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. మధుమేహంతో కూడిన కిడ్నీ వ్యాధుల్లోనూ, గ్లొమరూలర్ వ్యాధుల్లోనూ కనిపించే
ఆల్బూమినూరియాలో ప్రొటీన్‌ని తగ్గించటం ద్వారా వ్యాధి కొనసాగే వేగాన్ని తగ్గించవచ్చునని తేలింది. అయితే ప్రొటీన్‌ని తగ్గిస్తే పోషకాహార లోపం (మాల్‌న్యూట్రిషన్)వల్ల ఇక్కట్లు వచ్చే చిక్కు ఉంది కాబట్టి రోజుకు ఒక కిలో శారీరక బరువుకు ఒక గ్రాము చొప్పున లెక్కకట్టి ప్రొటీన్ వాడకుంటే మంచిది. అంటే, 70 కిలోల బరువుండే వ్యక్తులు రోజుకు 70గ్రాముల ప్రొటీన్
తీసుకోవాలన్నమాట.

--డా.చిరుమామిళ్ల మురళీమనోహర్@Andhrabhoomi news paper

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Guillain Barre Syndrom-గులియన్‌ బారి సిండ్రోమ్

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Guillain Barre Syndrom-గులియన్‌ బారి సిండ్రోమ్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ శరీరం యొక్క రక్షణ (వ్యాధినిరోధక) సిస్టమ్ తప్పుగా నాడీ వ్యవస్థపై  దాడి జరుగుతుంది. ఒక తీవ్రమైన రుగ్మత. ఈ కండరాల బలహీనత మరియు ఇతర లక్షణాలు కలిగిస్తుంది నాడీ వాపుకు దారితీస్తుంది.

కారణాలు, సంఘటనలు మరియు ప్రమాద కారకాలు

గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ స్వీయరక్షిత లోపము (శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ దాడి) వలన కలుగుతుంది . కాని అసలు కారణము సరిగ్గా  తెలియదు. సిండ్రోమ్ ఏ వయస్సులో వారికైనా రావచ్చును , కానీ వయస్సు 30 మరియు 50 మధ్య రెండు లింగాల ప్రజలు అత్యంత సాధారణ ఉంటుంది. ఇది తరచూ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అనగా  ఒక లంగ్ ఇన్ఫెక్షన్ లేదా జఠర వ్యాధి వంటి వాటిని  అనుసరిస్తుంది. చాలా కాలం, అసలు  సంక్రమణ చిహ్నాలు, గులియన్‌ బారి సిండ్రోమ్ ప్రారంభం లక్షణాలు ముందు కనుమరుగవుతాయి . ఒక్కొసారి  ఇది  ఒక శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు తరువాత కనిపిస్తుంది.

1976 లో స్వైన్ ఫ్లూ టీకా వల్ల వచ్చిన  గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్  అరుదైన సందర్భాలలో జరిగి ఉండవచ్చు. అయితే, స్వైన్ ఫ్లూ మరియు  సాధారణ ఫ్లూ టీకాలను ఉపయోగించడము , కొన్ని  అనారోగ్యం కేసులు ఫలితంగా రాలేదు.

 గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ నష్టానికి నరాల భాగాలు, నరాలు దెబ్బతిని  తిమ్మిరి, కండరాల బలహీనత, మరియు పక్షవాతం నకు కారణమవుతుంది. గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ ఎక్కువగా నరం యొక్క కవరింగ్ (మైలిన్ తొడుగు) pai ప్రభావితం చేస్తుంది. అటువంటి నష్టం demyelination అని, మరియు ఇది నరాల సంకేతాలు చాలా నెమ్మదిగా కదలకపోవడం వల్ల జరుగుతుంది. నరాల యొక్క ఇతర భాగాలకు నష్టం , నరాల పూర్తిగా పని ఆపడానికి కారణం కావచ్చు.

గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ కింది  వైరల్ సంక్రమణ tO పాటు సంభవించవచ్చు:

  •   AIDS
  •   సలిపి
  •  మోనోన్యూక్లియోసిస్
  •  దైహిక ల్యూపస్ ఎరిథెమాటసస్ లేదా
  • హాడ్జికిన్స్ వ్యాధి వంటి ఇతర వైద్య పరిస్థితులు కూడా సంభవించవచ్చు.
  • కొందరు బాక్టీరియల్ ఇంఫెక్షన్ తర్వాత గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ పొందుతుంది.


-మానవుని కదలికలకు మెదడు, వెన్నుపూస ఎంత ముఖ్యమైనవో, నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుంచి వచ్చే సంకేతాలు నరాల ద్వారానే కండరాలకి వెళ్ళి కదలికలు జరుగుతాయి. ఎప్పుడైతే నరాలు దెబ్బతింటాయో స్పర్శలో తేడా రావడం, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం జరుగుతాయి. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళు గుంజుతూ ఉండడం, స్పర్థ కోల్పోవడం, కింద నుంచి పైకి లేవలేకపోవడం, చెప్పులు జారిపోవడం, నడకలేకపోవడం నరాల జబ్బు లక్షణాలు. సాధారణంగా షుగరు జబ్బువారిలో, పూర్తి శాఖాహారుల్లో, మద్యం సేవించేవారిలో నరాలు దెబ్బతింటాయి. అయితే వీటన్నింటితో పాటు జ్వరాల వలన, ప్రత్యేకంచి వైరస్‌ జ్వరం తరువాత కొంతమందిలో నరాలు దెబ్బతింటాయి. ఒకటి నుంచి రెండు వారాల్లోనే పెరిగిపోయే నరాల జబ్బునే ‘గులియన్‌ బారి సిండ్రోమ్‌’ అంటారు.

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మనిషిలోని రోగనిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ అనే పదార్థాలను తయారుచేస్తుంది. ఇవి వైరస్‌ని చంపడంతో పాటు, మనిషి నరాలని కూడా దెబ్బతీస్తాయి. ఇవి తయారైన పరిమాణాన్ని బట్టి జబ్బు తీవ్రత ఉంటుంది. 70 శాతం మందిలో ఈ జబ్బు రెండువారాల్లో ముదిరి మనిషిని నడవలేని దశకి తీసుకెవెళుతుంది. తర్వాత అలా నిలబడిపోయి ఒక నెల తరువాత క్రమంగా కండరాలు పనిచేయడం మొదలుపెడతాయి. మిగిలిన 30 శాతం మందిలో జబ్బు ముదిరి, శ్వాస తీసుకోవటానికి అవసరమైన కండరాలు కూడా చచ్చుబడిపోయి, ఊరిపి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి వారు మింగే శక్తి కూడా కోల్పోతారు, మెడలు నిలుపలేరు. ఈ దశలో వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందిచవలసి ఉంటుంది.

నిర్ధారణ ఎలా? : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు నిపుణుడైన న్యూరాలజీస్టును కలిసి, ఎన్‌.సి.ఎస్‌. పరీక్షను చేయింకోవాలి. ఈ పరీక్షతో జబ్బును నిర్ధారంచవచ్చు. ఇటువంటి లక్షణాలే కలగజేసే వేరే జబ్బుల గురించి తెలుసుకోవటానికి కొన్ని రక్తపరీక్షలు అవసరంపడతాయి.

వైద్యం ఎలా? : నరాలు కొంచెం మాత్రమే దెబ్బతిని, రోగి నడవగలుతున్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు, ఫిజియోథెరపీతోనే నెమ్మదిగా రెండుమూడు నెలల్లో పూర్తిగా జబ్బు తగ్గిపోతుంది. అయితే జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాసకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు లేక రోజురోజుకీ బలం బాగా తగ్గిపోతున్న రోగిని ఐసియులో చేర్చి జాగ్రత్తగా వైద్యం అందించాలి. ఐవిఐజి అనే మందును 5 రోజులు ఇవ్వవచ్చు. అయితే ఇది బాగా ఖరీదైన మందు రోగి బరువుని బట్టి, మందు ఖరీదే 2-3 లక్షల వరకు ఉంటుంది.

ప్రత్యామ్నాయం ఎలా : పైన మందు పెట్టుకోలేకపోతే, ప్లాస్మాథెరపీ అనే పద్ధతి ద్వారా ఈ జబ్బు ముదరకుండా చేయవచ్చు. ఈ పద్ధతి వలన తొందరగా రోగి కోలుకోగలుగుతాడు. అయితే మూడు నుంచి ఐదుసార్లు ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. లక్ష రూపాయలలోపే ట్రీట్‌మెంట్‌ చేయవచ్చు. 70-80 శాతం మంది ఈ ప్రక్రియ తర్వాత కొన్ని వారాల్లోనే సొంతంగా నడవగలుగుతారు. 20 శాతం మందిలో అంతకన్నా ఎక్కువ సమయమే పట్టవచ్చు.

-అయితే పైన పేర్కొన్న రెండు పదార్థాలు కూడా ఎంత తొందరగా మొదలుపెడితే అంత తొందరగా ఫలితం ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాలు ఫిజియోథెరపీ సక్రమంగా చేస్తూంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎవరిలోనైనా కానీ, జర్వంతో పాటుకానీ, జర్వం తగ్గిపోయిన తర్వాత కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతున్నా, తిమ్మిర్లు వచ్చి నడవలేకపోతున్నా వెంటనే దగ్గరలో డాక్టరుని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేసుకొని వెంటనే వైద్యం మొదలుపెడితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు.

Courtesy with : Ayush@Surya Telugu Daily
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, January 9, 2013

working women Stress and illness-వర్కింగ్‌ విమెన్‌ను వణికించే ఒత్తిడి

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -working women Stress and illness-వర్కింగ్‌ విమెన్‌ను వణికించే ఒత్తిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




అష్టావధానం అన్న మాట వర్కింగ్‌ విమెన్‌ కు అక్షరాలా సరిపోతుంది. ఒంటి చేత్తో ఎన్నో పనులు ఏక కాలంలో ఏ విధంగా చేయవచ్చో వర్కింగ్‌ విమెన్‌ కు తెలిసినట్లుగా ఎవరికీ సరిపోదంటే అతిశయోక్తి కాదు. సూపర్‌ ఫాస్టు ఎక్సుప్రెస్‌మాదిరిగా పరుగులు తీయాల్సిందే. ఇన్ని పనుల మధ్య ఎదురయ్యే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఈ ఒత్తిడిని జయించకపోతే అనారోగ్యం పాలు కాక తప్పని సరి.

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే వర్కింగ విమెన్‌ కు ఇంటి పని స్వాగ తం పలుకుతుంది. పిల్లలు స్కూల్సు లేక కాలేజీలకు వెళ్లడానికి అవసర మైనవన్నీ సమకూర్చటం తల్లిబాధ్యతే అవుతుంది. ఈ లోగా భర్త ఆఫీసుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకొంటూనే, తాను ఆఫీసుకు చేరుకోవటానికి సర్దుకో వాల్సి ఉంటుంది . ఇందుకో సం ఉరుకులు, పరుగులు తప్పనిసరి.ఆ తర్వాత అందుబాటులో ఉన్న వాహనాన్ని అంది పుచ్చుకొని కార్యాలయానికి పరుగులు తీస్తారు. అక్కడ పని మీద కాన్‌ సంట్రేషన్‌ చేయకపోతే సమస్యలు తప్పవు. సాయంత్రం ఇంటికి వస్తూనే మళ్లీ పని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మొత్తం స్ట్రక్చర్‌ లో ఎక్కడ తేడా వచ్చినా ఒత్తిడిని ఫేస్‌చేయాల్సిందే.

శరీరంలో ఒత్తిడి ఏర్పడితే వెంటనే దానికి సంబంధించిన ర్యాడికల్సు శరీరంలో తయారు అయిపోతాయి. ఇవి ఎప్పటికప్పుడు శ రీరంలో నెగటివ్‌ పనుల్ని మొదలు పెడతాయి. ఇవి క్రమంగా నాడీ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అందుచేత ఈ పరిస్థితి తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
ఒత్తిడిని జయించేందుకు కొన్ని సూత్రాలు తెలుసుకొందాం...

బ్రేక్‌ఫాస్టును మానవద్దు...
చాలా మంది వర్కింగ్‌ విమెన్‌ బ్రేక్‌ ఫాస్టును పక్కన పెట్టేస్తారు. ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకొంటారు. శరీరానికి నిరంతరాయంగా శక్తి అందుతూ ఉండాలి. అప్పుడే సజావుగా అది తన పనులు తాను చేసుకో గలుగుతుంది. రాత్రి 8-9 గంటల సమయంలో భోజనం చేసి పడుకొంటే ఉదయం బ్రేక్‌ ఫాస్టు ను పక్కన పెట్టేస్తారు. లేదంటే ఆఫీసుకి వెళ్లాక 10-11 అయ్యాక అప్పుడు తింటారు. అంటే రోజులో 24 గంటలు ఉంటే అందులో సగం సేపు అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల దాకా ఏమీ తీసు కోరు అన్నమాట. తర్వాత సగం సేపులోనే మొత్తం ఆహారాన్ని తీసుకొంటారు.

దీని వలన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అంతే గాకుండా ఉదయం పూట శరీరానికి కావలసిన శక్తి ఏమాత్రం అందదు. పైగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చెపిన మాట వినక పోవచ్చు. దీంతో చిరాకు పెరిగి పోయి.. అరుపులు, ేకలతో ఇల్లు ప్రతిధ్వనిస్తుంది. దీన్ని అధిగమించాలంటే ఉదయాన్నే బలమైన బ్రేక్‌ ఫాస్టు తీసుకోవాల్సి ఉంటుంది.

రోజు వారీ పనుల్ని ప్రణాళికా బద్దం...
ప్రతీ రోజు చేసే పనులు అయినప్పటికీ వాటి కోసమే చాలా సేపు వెదకులాట సాగుతుంది. ఉదయం పూట టీ మగ్‌కనిపించ లేదనో, ఆఫీసుకి వెళ్లేప్పుడు ఫైల్స కనిపించ లేదనో వెదకులాట తప్పదు. అయితే పనుల్ని క్రమబద్దం చేసుకొంటే ఈ చికాకుల్ని తప్పించుకోవచ్చు. వాస్తవానికి ఒకే దాని కోసం అదే పనిగా వెదకుతుంటే నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక అంశంలో మిస్‌ అయ్యామన్న ఇండి కేషన్‌ అదే పనిగా వెళితే .. ఇది మరో నాడీ కేంద్రాన్ని డిస్టర్బ చేస్తుంది. దీని ఫలితంగా ఒత్తిడి పెరిగి మరో విషయంపై ఏకాగ్రత లోపిస్తుంది. చివరకు ఈ చికాకు మిగిలిన వాటి మీద పడుతుంది. దీన్ని అధిగమించాలంటే ప్రణాళికా బద్దంగా సాగుట మేలు. అంటే ఉదయం చేసుకోవాల్సిన పనుల్ని ఒక చోట నమోదు చేసుకొని సరి చూసుకోవాలి.

ఖాళీ సమయంలో ఆయా పనుల్ని ఎలా చేసుకోంటునామో బేరీజు వేసుకొంటే నియమబద్దంగా సాగిపోతాయి. పనులు చేసే సమయాన్ని తగ్గించుకోవటం... అవకాశం ఉన్నప్పుడు ఈ పనుల జాబితాను సరిచూసుకోవాలి. అటువంట ప్పుడు ఎక్కడ సమయం వేస్టు అవుతోందో అన్నది అర్థం అయిపోతుంది. అటువంటప్పుడు కొద్దిపాటి సమయాన్ని ఎక్కడ మిగుల్చుకోవచ్చో ఆలోచిం చాలి. ఈ సమయాన్ని మిగిలిన పనులు ప్రశాంతంగా చేసుకొనేందుకు కేటా యించాలి. లేని పక్షంలో హడావుడి పెరిగినప్పుడు దీని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. తొందర పాటుతో పని చేస్తే గుండెల్లో దడ రావటం, తల నొప్పి వస్తుండటం వంటివి జరుగుతుంటాయి. ఈ పరిస్తితిని అధిగమించటా నికి కొందరు టాబ్లెట్లు వాడేస్తుంటారు. దీని వలన మరిన్ని అనర్థాలు వచ్చిపడు తుంటాయి.

కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవటం...
పనులు చేసుకొనే క్రమంలో పనుల్ని డిస్ట్రిబ్యూట చేసుకోవాలి. ద సిక్సు కీస్‌టూ పెర్‌ ఫామ్‌ లొ యువర్‌ ప్రోడక్టివ్‌ బెస్టు అనే గ్రంథంలో నియమబద్ద ప్రణాళిక గురించిన వివరాలు వర్ణించి ఉన్నాయి. ఈ ప్రణాళిక ను అమలు పరిస్తే ఒత్తిడి ని బాగా తగ్గించుకోవచ్చు. ఇందులో ప్రధానమైన అంశం పనుల్ని అప్పగించటం. ఇంటికి కావలసిన వస్తువుల్ని తెప్పించుకోవటం, ఇంట్లో సర్దుకొనే పని, హోమ్‌ వర్కు చేయించటం, బ్యాంకింగ్‌ లావాదేవీలు వంటి పనుల్ని భర్తతో కలిసి ప్లాన్‌ చేసుకోవటం మేలని గ్రంథకర్త సూచిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు పనులు ఆర్డరు చేసినట్లుగా కాకుండా సమన్వయం చేసుకొంటున్నట్లుగా పనుల్ని ఆర్డరు చేసుకోవాలి.

రోజు వారీ విశ్రాంతి...
-ఆహారం, పనులకు సమయం కేటాయిస్తుంటారు. కానీ, విశ్రాంతి గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వలన శరీరం పగటి పూట పూర్తిగా పని చేయటం, రాత్రి పూర్తిగా నిద్రించటం అనే ట్రెండ్‌ సాగుతుంది. ఇది పూర్తిగా సరి కాదు. ఎందుచేతనంటే పని లో మెరుగైన ఫలితాలు రావాలన్నా, క్వాలిటీ పరంగా బెస్టుగా ఉండాలన్నా కొద్ది పాటి విరామం అవసరం. వీలుంటే మధ్యాహ్నం లంచ్‌ తర్వాత కొద్ది సేపు కనులు మూసుకొని విశ్రాంతి తీసుకోవటం ఒక పరి ష్కారం. లేదంటే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కొద్ది సేపు విశ్రాంతి తీసు కోవాలి. దీని వలన ఆ తర్వాత నుంచి రాత్రి వరకు పనులన్నీ చక చకా సాగు తాయి. ఇలా కాకుండా కంటి న్యూగా పనిచేసుకొంటూ వెళితే మెదడు, ఇతర ముఖ్య అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి అంటే గాఢమైన నిద్ర అవసరం లేదు. కాస్తంత కనులు మూసుకొని రిలాక్సు అయినా సరిపోతుంది.

సొంతానికి కొంత సమయం...
ఇంటి కోసం, ఆపీసు కోసం చాకిరీ చేస్తుంటారు చాలామంది. కుటుంబ సభ్యుల కోసం, ఆఫీసు కోసం సమయాన్ని వెచ్చించక తప్పదు. ఇదంతా ఒక ఎత్తయితే, సొంతానికి కొంత సమయం ఉండాలంటారు పరిశోధకులు. ఎందుచేతనంటే జీవితం ఏ విధంగా సాగిపోతోంది, మెరుగ్గా నడుపుకోవాలంటే ఏమి చేయాలి అనే విషయాల్ని ఆలోచించుకోవాలని చెబుతారు. ఇందుకోసం అప్పుడప్పుడు కొంత సేపు ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్న సమయంలో మెదడు చురుగ్గా మారి, మరింత ఉత్తేజాన్ని పొందుతుంది. అంతిమంగా ఆనందం వైపు అడుగులు పడతాయి.


courtesy with - చిట్టా రమాదేవి, . M. Sc., M.Phil.., సీనియర్‌ ఫ్యాల్టీ, హైదరాబాద్‌@Surya Telugu daily news paper.

  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Health awareness in Winter - శీతాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు అవగాహన

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Health awareness in Winter - శీతాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



డిసెంబర్‌నెల చివరిలోనే చలిగాలులు విజృంభిస్తున్నాయి. రాష్టమ్రంతా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అనేక చోట్ల సాయంత్రానికే చలిగాలులు కమ్మేస్తున్నాయి. ఉదయం బారెడు పొద్దెక్కితే తప్ప చలిపులి వదలట్లేదు. ఈ నేపథ్యంలో మహిళలు, ముఖ్యంగా వర్కింగ్‌ ఉమెన్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ‚వర్కింగ్‌ ఉమెన్‌ అంటే తప్పనిసరిగా బయటకు వెళ్లి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందరికీ ఆఫీసు టైమింగ్సు ఒకేలా ఉండవు. ఉదయం 10 గంటలకు వె ళ్లి సాయంత్రానికి తిరగి వచ్చే వెసులుబాటు ఉంటే పరవాలే దు. ఈ టైమింగ్సు లో కూడా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చలికి గురయ్యే అవకాశం ఉంది. అదే షిప్టు వేళల్లో అయితే తప్పనిసరిగా చలిగాలులు వీచేటప్పుడే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో చలి పంజా బారిన పడక తప్పని పరిస్థితి.

మానసిక ఉద్వేగాలతో జాగ్రత్త..!
-శీతాకాలంలో మానసిక ఉద్వేగాలు కొందరిలో ఎక్కువ ప్రభావం చూపు తాయి. వర్కింగ్‌ఉమెన్‌కు ఇంటా బయట ఒత్తిళ్లు వెంటాడుతాయి. వీటిని ఎదుర్కొంటూ పనులు చక్క బెట్టుకోవాలి. మెదడులో ఉండే మెలటోన్‌ రిసెప్ట ర్లు చురుకుదనానికి మూలంగా నిలుస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకోవాలి. చలి కాలంలో ఇవి నిస్తేజంగా మారిపోతాయి. అటువం టప్పుడు మనుషులు మూడీగా మారిపోతారు. ఈలోగా చలి కారణంగా పనులు చేసుకొనేందుకు కుటుంబ సభ్యులు ఏమాత్రం సహకరించక పోయి నా వాళ్ల మీద విరుచుకు పడే చాన్సు ఉంటుంది. దీన్నే సీజనల్‌ మూడీ డిజార్డర్‌ అని చెబుతారు. సమస్య మూలాల్ని గుర్తించి, దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఈ సమస్య ఊబిలో మరింత కూరుకొని పోయే ప్రమాదం ఉంది. నలుగురిలో కలిసిపోతూ, ఉత్సాహాన్ని తెచ్చి పెట్టుకోవటం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చు.

జ్వరాలతో జర భద్రం..!
సీజన్‌మారే సమయంలో వాతావరణం ఒక్క సారిగా మారుతుంటుంది. ఈ మార్పుని శరీరం ఒక్కసారిగా గుర్తించి సర్దుబాటు చేసుకోవటం కాస్త కష్టం. వాతావరణంలో ఒక్కసారిగా చలిగాలులు విజ్రంభిస్తాయి. కేవలం ఈ సమయంలోనే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌ లు చురుగ్గా మారతాయి. చలిగాలిలో తిరుగుతుంటే ఈ సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశిస్తాయి. సాధారణంగా క్రిములు అందరి శరీరంలోకి చేరతాయి. తగినంత రోగ నిరో ధక శక్తి ఉన్నట్లయితే ఈ క్రిములు ఏమీ చేయలేవు. లేని పక్షంలో ఈ క్రిము లు వ్యాధుల్ని కలగచేస్తాయి. ఈ క్రమంలో సూక్ష్మ క్రిములకు వ్యాధి నిరోధక కారకాలకు శరీరం లోపల ఘర్షణ చెలరేగుతుంది. దీని ఫలితంగా జ్వరం, నొప్పులు బయట పడతాయి.

శ్వాసకోశ సమస్యలు..!
చలికాలం అంటేనే శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి కష్ట కాలం. చలిగాలులు తగిలాయంటే లోపల దాగి ఉన్న అనారోగ్య సమస్యలు బయట పడతాయి. చలిగాలిలో ఉండే తేమ.. ముక్కు ద్వారా శ్వాస కోశాల్లోకి ప్రవేశిస్తుంది. ఆయా నాళాల్లోని లోపలి పొరలు ఈ తేమకు ప్రభావితం అవుతాయి. ఫలి తంగా ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది. కొన్ని సార్లు సమస్య వెంటనే, మరికొన్ని సార్లు అర్ధరాత్రి దాటాక సమస్య బయట పడవచ్చు.

ముఖ సౌందర్యానికి ముప్పు..!
చలికాలంలో చర్మానికి సమస్యలు తలెత్తుతాయి. ముఖం, మెడ, చెవులు, చేతులు వంటి భాగాల్లో చర్మం పొడిగా అవుతుంది. పెదవులు పగలటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలను నివారించటానికి కోల్డు లోషను వాడటం తప్పనిసరి. నాణ్యత లేని లోషనులను వాడితే బయట దుమ్ము... ఈ క్రీము వలన చర్మానికి అంటుకొని మరింత చేటు తెస్తాయి. శీతాకాలం లో ఏర్పడే సమస్యలు వచ్చాక బాధ పడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. చాలా సమస్యలకు చలిగాలులే కారణం. సాధ్యమై నంత వరకు చలిగాలులు వీచేటప్పుడు బయటకు వెళ్ల కుండా ఉండటం మేలు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాత్రం స్కార్ఫు, స్వెటరులు ధరించాలి. అరచేతులు, అరికాళ్లకు తొడుగులు వేసుకోవాలి. నడక తేలిక పాటి వ్యాయామం తప్పనిసరి అని ఈ పరిశోధనలు నిర్ధారించాయి. తాజా గాలి, వ్యాయామంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నాయి.

ఒత్తిడి నిరోధించటం ముఖ్యం..!
అనారోగ్యానికి ఒతిడికి సంబంధం ఏమిటని చాలా మంది అనుకొంటారు. శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు టెన్షన్లు చుట్టుముట్టినప్పుడు గ్లూకో కార్టికాయిడ్సు వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వేస్తాయి. ఫలితంగా సూక్ష్మక్రిములు విజ్రంభించి రొంప, జ్వరం వంటి వ్యాధులు పేట్రేగుతాయి. ఒత్తిళ్లు లేకుండా ప్రశాం తతను పాటిస్తేనే వ్యాధుల్ని నిరోధించవచ్చు.

నిద్ర పరమౌషధం..!
వినటానికి వింతగా ఉన్నా ఇది చాలా వాస్తవం. తగినంత నిద్ర లేని వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోజుకి 7-8 గంటల నిద్ర తప్ప నిసరి అని చెబుతారు. రాత్రిళ్లు తరచు మేలుకొనే వారికి నిద్ర లేమి సమస్య ఉంటుంది. చక్కటి నిద్ర తో జీవన క్రియలు సజావుగా జరిగి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. రొంప, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు నిద్ర చాలా అవసరం. నిద్ర ద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి దొరికి వ్యాధుల్నఇధిగమించటానికి వీలవుతుంది.

Courtesy with :
- చిట్టా రమాదేవి, M.S.,M.Phil.,-- హైదరాబాద్‌.@surya Telugu daily(Dec31, 2012)
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Liver Transplantation - కాలేయ మార్పిడి


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Liver Transplantation - కాలేయ మార్పిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



జీర్ణ వ్యవస్థ లో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడి వైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలక పాత్ర పోషించటంతో పాటు.. ప్రోటీన్‌ సంశ్లేషణ, ఔషధ వినియోగం, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగ పడుతుంది . అందుచేత దీన్ని శరీరంలోని ఒక క్రియా అశ్వంగా చమత్కరిస్తారు. నిరంతరాయంగా పనిచేసే క్రమంలో ఇది వ్యాధి గ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కార ణాల్ని గుర్తించారు. వైరల్‌ఇన్‌ఫెక్షన్‌, మద్యపానం, డ్రగ్సు తీసుకోవటం, క్యాన్సర్‌, పుట్టుకతో వచ్చే లోపాలు వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. సాధారణమైన వ్యాధుల్ని మందులతో నయం చేయవచ్చు. కొన్ని సార్లు మైనర్‌ ఆపరేషన్‌ అవసరం అవుతుంది.
కానీ రోగం ముదిరితే మాత్రం కాలేయం పూర్తిగా పనికి రాని స్థితికి చేరిపోవచ్చు. అటువంటప్పుడే అసలు సమస్య ఏర్పడుతుంది. కనీసం పది శాతం పని చేసినప్పటికీ ఫర్వాలేదు. 30 శాతం పనిచేయగలిగితే కాస్తంత కుదుట పడవచ్చు. పూర్తిగా కాలేయం చెడిపోతే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా మార్చటం ఒక్కటే పరిష్కారం. దీన్నే కాలేయ మార్పిడిగా చెప్పవచ్చు. తుది దశకు చేరిన కాలేయ వ్యాధుల్లో (ఈఎస్‌ఎల్‌డి) ఇది ఒక్కటే అంతిమ పరిష్కారం గా చెప్పవచ్చు. కానీ, ఈ కొత్త కాలేయాన్ని క్రత్రిమంగా తయారుచేయటం సాధ్యం కాదు. రక్తం మాదిరిగానే కాలేయాన్ని కూడా వేరే ఒక వ్యక్తి నుంచి సేకరించాల్సి ఉంటుంది. అందుచేత కాలేయం ఇచ్చే వ్యక్తిని దాతగా, తీసుకొనే వ్యక్తిని గ్రహీత గా వ్యవహరిస్తారు.

కాలేయ మార్పిడిలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయి.
మ్రత దాత కాలేయ మార్పిడి (డీసీజెడ్‌ డోనార్‌ లివర్‌ ట్రాన్సు ప్లాంటేషను)
-ఈ విధానాన్ని కాడెవెరిక్‌ కాలేయ మార్పిడి అని కూడా అంటారు . మెదడు పనిచేయటం ఆగిపోయిన వ్యక్తుల్లో కొన్ని సార్లు ఊపిరితిత్తులు, గుండె వంటి అవ యవాలు పనిచేయవచ్చు. సాధారణంగా ఊపిరి ఆగిపోయి, గుండె కొట్టుకోవటం నిలిచిపోతేనే ఒక వ్యక్తి చనిపోయి నట్లుగా చెబుతారు. కొన్ని సందర్భాల్లో అంటే స్ట్రోకు, కపాలంలో తీవ్ర స్రావం, ట్రామా వంటి కారణాల చేత మెదడు నిర్జీవం అయిపోతుంది. దీన్నే బ్రెయిన్‌ డెడ్‌ అని అంటారు. తర్వాత 48 లేక 72 గంటల్లో మిగిలిన అవయవాలు కూడా స్తంభించి పోతాయన్న మాట. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోమా లోకి వెళ్లిపోవటం అంటే అది వేరే సంగతి. స్ప్రహ కోల్పోయినప్పటికీ, వారి మెదడు చక్కగా పనిచేస్తుందన్న మాట.

ఈ రెండు విషయాల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించేందుకు క్లినికల్‌, డయాగ్నస్టిక్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా చట్టాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంది. బ్రెయిన్‌ డెడు జరిగినట్లుగా కనీసం ఇద్దరు స్వతంత్ర న్యూరాలజిస్టులు సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంది . ఆ తర్వాత సదరు వ్యక్తి కుటుంబానికి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తి.. కాలేయ దానానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేహానికి నిర్ధారిత పరీక్షల్ని అత్యవసర సేవల వార్డులో జరిపించాల్సి ఉంటుంది. ఇతర దే శాల్లో అవయవాల మార్పిడికి సంబంధించిన ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. భారత దేశంలో మాత్రం ఈ విషయంలో లోటు ఉందనే చెప్పుకోవాలి.

హైదరాబాద్‌ లోని మోహను ఫౌండేషను వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చొరవ తీసుకొంటు న్నాయి. తప్పితే పూర్తి స్థాయిలో నిర్దిష్ట విధానం కనిపించటం లేదు. రక్తం, కాలేయ ఉప అంగాలు సక్రమంగా లేని పరిస్థితుల్లో అంటే కాన్సరు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న పరిస్థితులు కాలేయ మార్పిడికి అనుకూలం కాదనే గుర్తుంచుకోవాలి.

సన్నిహితుల నుంచి సేకరించటం (లివింగ్‌ రిలేటడ్‌ లివర్‌ ట్రాన్సుప్లాంటేషన్‌)
ఇటువంటి కేసుల్లో కుటుంబ సభ్యులు లేదా దగ్గర సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరిస్తారు. తూర్పు దేశాల్లో ఈ విధానాన్ని ఎక్కువగా గమనించవచ్చు. ఈ ప్రాంతాల్లో సన్నిహితులు చనిపోతే వారి అవయవాల దానానికి కుటుంబసభ్యులు సాధారణంగా అంగీకరించరు. అదే సమయంలో కుటుంబ సభ్యుల కోసం ప్రధాన మైన అవయవాన్ని దానం చేయటాన్ని గొప్ప గా భావిస్తారు. దీన్ని అంతా ఆదర్శనీయమైన విషయంగా చెబుతారు. కాల క్రమేణా.. ఇటువంటి శస్త్ర చికిత్సలు బాగా మెరుగ్గా జరుగుతున్నాయి.దాతలకు ఎటువంటి అపాయం లేకుండా శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. చాలా తక్కువ సంక్లిష్టత తోనే ఈ శస్త్ర చికిత్సలు ప్రస్తుతం చేయగలుగుతున్నారు. కాలేయాన్ని దానం చేసిన దాతలో కొన్ని నెలల వ్యవధిలోనే.. కాలేయం సాధారణస్థితికి చేరుకోగలుగుతుంది.

కొన్ని వారాల వ్యవధిలోనే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. చట్ట ప్రకారం కుటుంబంలోని సన్ని హితుల దగ్గర నుంచి మాత్రమే అంటే రక్త సంబంధీకుల నుంచి మాత్రమే సేకరించాల్సి ఉంటుంది.కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక..అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతర జీవ అంగాలు ప్రవేశిస్తే .. దేహం దాన్ని తిరస్కరిస్తుంది. ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో సప్రెస్సివ్‌ మందులు వాడాల్సి ఉంటుంది. తక్కువ ఇమ్యూనోజెనిక్‌ సామర్థ్యం గల అవయవంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువకాలం ఈ మందుల్ని వాడుతున్నా...

-చౌకగానే సాధ్యం అని గుర్తు ఎరగాలి. ఇటువంటి శస్త్ర చికిత్సల్లో తరచుగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట గా ఇన్‌ ఫెక్షన్‌ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడి కి ముందే వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్‌ సోకకుండా టీకాల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆపరేషన్‌ ల విజయవంతం అవుతున్నట్లుగా అర్థం అవుతోంది. అయితే ఇటువంటి రోగులు మాత్రం జీవితాంతం అవసరం అయినప్పుడల్లా వైద్య సాయం తీసుకొంటుండాలి. మొత్తం మీద కాలేయ మార్పిడికి సంబంధించిన అవగాహన సమాజం లో బాగా పెరగాల్సి ఉంది. కాలేయ వ్యాధుల చికిత్సలో అనేక మెడికల్‌, సర్జికల్‌ విధానాలు ఉన్నాయని గుర్తించాలి. వీటిలో కాలేయ మార్పిడి కీలకమైందని తెలుసు కోవాలి.

దీనిపట్ల ఉన్న అపోహలు తొలగించాల్సి ఉంది. మరణం తర్వాత అవయవాలు దానం చేసే కల్చర్‌పెరగాలి. ఇందుకు స్వచ్చం దంగా ముందుకు రావాలి. అదే సమ యంలో సరైన చట్టాలు చేయటం ద్వారా ప్రభుత్వాలు కూడా ఇందుకు అనుమతించాలి. సుదీర్ఘ రోగాల్ని నయం చేసే క్రమంలో అవయవ మార్పిడి అనేది ఒక సమర్థమైన విధానంగా ప్రభుత్వాలు ప్రాచుర్యం లోకి తీసుకొని రావాలి.

హృదయ స్పందన లేని దాతలు
( నాన్‌ హార్టు బీటింగ్‌ డోనార్సు)
పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి (అంటే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధానాంగాలన్నీ నిర్జీవం అయిపోయిన స్థితి) కాలేయాన్ని సేకరించ టం అన్నమాట. ఇటువంటప్పుడు చనిపోయన వెంట నే అంటే దాదాపు 20 నిముషాల్లోపే అవయవాన్ని సేకరించాలి. వెంటనే ఆ అవయవాన్ని భద్రపరచగలగాలి. స్పెయిన్‌వంటి దేశాల్లో మనిషి చనిపోతే, సదరు వ్యక్తి అవయవాలన్నీ జాతీయ సంపద గా మారిపోతాయి. మరణాన్ని వైద్యులు ధ్రవీకరించని వెంటనే ఆపరేషన్‌ థియోటర్‌ కు తరలించి సదరు అవయవాలన్నీ సేకరించటం చక చకా జరిగిపోతాయి. ఇతర దేశాల్లో మాత్రం చట్ట బద్దమైన విధానాల ద్వారా అంటే సాధికారిక వ్యక్తుల సమ్మతి తో మాత్రమే అవయవాల్ని సేకరించే వీలుంటుంది.

--Courtesy with - డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,--M.S., M.Ch., (sgpgi)F.H.P.B., F.L.T.,(snuh)
సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌--హైదరాబాద్‌ @Surya Telugu daily news paper.

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

piles problem in pregnant - గర్భిణుల్ని బాధించే పైల్స్‌

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -piles problem in pregnant - గర్భిణుల్ని బాధించే పైల్స్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పైల్స్‌ సమస్య స్త్రీలల్లో గర్భం దాల్చిన తరువాత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భం దాల్చాక ముందు లేని సమస్యలు గర్భం దాల్చిన తరువాత రావటానికి గల కారణం హార్మోనుల ప్రభావం పెరుగుట, గర్భాశయం పరిమాణం పెరగడమే. గర్భిణీల్లో సాధారణంగా ప్రొజెస్టోజెన్‌ హార్మోన్‌ ఎక్కు వగా ఉండి శరీరంలోని రక్తనాళాలు కొద్దిగా వ్యాకో చం చెంది ఉంటాయి. ఇలాగే మల ద్వారం వద్ద ఉన్న రక్త నాళాల పరిమాణం పెరిగి అవి ఉబ్బినట్లు అయి పైల్‌ (మొలలు)కు దారి తీస్తుంది. గర్భిణిల్లో గర్భాశయం పరి మాణం పెరుగుటవలన అంతర్గత వత్తిడి మూలాన మలబద్ధకం ఏర్పడుతుంది. దీంతో మల విసర్జనకు బలవంతగా ప్రయత్నం చేయట వలన కూడ పైల్స్‌ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇంతగా బాధించే పైల్స్‌ సమస్యను బయటకు చెప్పకోలేక చాలా మంది లోలోన మదన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఫైల్స్ (హీమరామడ్స్‌)లను సాధారణంగా అర్షమొలలు అంటారు. పైల్‌ అంటె గడ్డ అని హీమరాయిడ్‌ అంటే రక్త స్రావం కావడం అని అర్ధం. మొలలు చూడటానికి పిలకలుగా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలం ద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చి నట్లుగా కనిపిస్తాయి.

లక్షణాలు : మల విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రకతం పడుతూ ఉంటుంది. మలవిసర్జన అనంతరంకూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జ సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

జాగ్రత్తలు:
 పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు)
రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లు చూసుకోవాలి.
ఫాస్ట్‌ ఫైడ్స్‌ వేపుల్లు, మాంసాహరం, చిరుతిళ్ళు  తినటం మానుకోవాలి.
సాత్విక ఆహారం తీసుకోవాలి.

ట్రీట్మెంట్ :

    pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
    Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
    Duolaxin or  Smulax or  gutfree  ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
    Hedensa or pilex  ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి

ఈ సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :

    నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .

    పొడిగా ఉండే ఆహారమే తీసుకుని  పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.

    గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .

ఆహార నియమాలు :

    మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం అన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
 
 కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
    వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Gastritis - గ్యాస్ట్రిటిస్‌

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Gastritis - గ్యాస్ట్రిటిస్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

జీర్ణాశయంలో నిశ్శబ్దంగా ఉండి పొంచి ఉండే ముప్పు గ్యాస్ట్రిటిస్‌. జీర్ణాశయా నికి లోపల వైపున అనేక మ్యూకస్‌ పొరలు ఉంటారుు. వీటిలో వాపు, మంట, తాపం ఏర్పడితే దీన్ని గ్యాస్ట్రిటిస్‌ గా పరిగణిస్తారు. ఇది ముదిరితే అల్సర్‌లు, కణితిలు వంటివి ఏర్పడటంతో పాటు కొన్ని సార్లు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. జీర్ణాశయ కుఢ్యం నుంచి ఎంజైము లు, ఆమ్లాలు స్రావితం అవుతాయి . ఈ కుఢ్యం లేక గోడ కు గ్యాస్ట్రిటిస్‌ కారణంగా ఇబ్బంది ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఎంజైము లు, ఆమ్లాల విడుదలలో ఆలస్యం జరిగి జీర్ణప్రక్రియ కుంటు పడుతుంది. అదే సమయంలో ఇక్కడ మెుదలైన ఇన్‌ ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు పాకుతుంది. చిన్నదిగా మెుదలై పెద్దదిగా మారటం గమనించదగిన లక్షణం. అందుచేత గ్యాస్ట్రిటిస్‌ను  ప్రాథమిక సమయంలోనే గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. లేని పక్షంలో ఈ సమస్య కారణంగా జీర్ణ కోశం లోనే కాక ఇతర ప్రాంతాల్లోని ఆరోగ్య సమస్యలకు కారణ భూతం కావచ్చు. వయస్సు మళ్లిన వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది.

-సమస్య కొంత కాలం పాటు ఉండి తగ్గిపోతే ఎక్యుట్‌ గ్యాస్ట్రిటిస్‌అనీ, ఎక్కువ కాలం బాధిస్తుంటే క్రానిక్‌ గ్యాస్ట్రిటిస్‌ అనీ వ్యవహరిస్తారు. గ్యాస్ట్రిటిస్‌కు స్పష్టమైన లక్షణాలు లేనందున దీన్ని ప్రత్యేకంగా గుర్తించటం కష్టం. పొత్తి కడుపులో నొప్పి ద్వారా దీన్ని చెబుతారు. ఈ నొప్పి కూడా పొడుస్తున్నట్లుగా, నిలిపివేసి నట్లుగా, ఒక్క చోటే మెలిపెట్టినట్లుగా ఉంటుంది. కడుపులో కాస్త పై భాగంలో మధ్యగా ఈ నొప్పి కేంద్రీ క్రతమై ఉంటుంది. కొన్ని సార్లు ఎడమ వైపుకి విస్తరించినట్లుగా కూడా అనిపించవచ్చు. దీంతో పాటు వాంతులు, ఆకలి లేక పోవటం, బరువు  తగ్గటం వంటి లక్షణాలు తోడుగా ఉంటాయి. కొంతమందిలో నలుపు రంగులో విరోచనం కావటం, రక్తపు వాంతులు వంటి లక్షణాల్ని గమనించవచ్చు. కొంత మందిలో ఇన్‌ ఫ్లమేషన్‌ కనిపించకుండానే గ్యాస్ట్రిటిస్‌ బయట పడుతుంది. జీర్ణాశయ కుఢ్యపు అంచుల్లో ఇన్‌ ఫెక్షన్‌ సోకుతుంది. దీన్ని ఎరోసివ్‌గ్యాస్ట్రిటిస్‌ గా వ్యవహరిస్తారు. ఇది
బ్లీడింగ్‌, అల్సర్‌ లకు కారణ భూతం అవుతుంది. మొత్తం మీద కడుపు నొప్పి, వాంతులు, నొప్పితో కూడిన జ్వరం, మూత్రం, మలంలో రంగు మారటం, కడుపు నిండుగా ఉండటం వంటి  లక్షణాల్ని ప్రాథమికంగా చెబుతారు. వాంతి అయినప్పుడు రక్తం జీర కనిపించినా, మలంలో రక్తం పడుతున్నా గ్యాస్ట్రిటిస్‌ గా అనుమానించవచ్చు. ఈ లక్షణాల్ని ఒకేసారి  గమనించవచ్చు. లేదా క్రమంగా పెరుగుతూ వెళ్లవచ్చు.

గ్యాస్ట్రిటిస్‌ కు కారణాల్లో మందుల వాడకం, రసాయనాల వినియోగం, సర్జికల్‌ ఇన్‌ ఫెక్షన్‌ తో పాటు ఆల్కహాల్‌ వినియోగాన్ని చెప్పవచ్చు. మద్యం ఎక్కువగా తాగే వారిలో దీన్ని గమనించవచ్చు. మద్యం లో ఉండే ఆల్కహాల్‌.. శరీరంలోకి ప్రవేశించాక విష ఉత్పన్నకాలుగా విడిపోతుంది. ఈ విష పదార్థాలు జీర్ణాశయ పొరలపైప్రభావం చూపుతాయి. తక్కువ మోతాదులో ఆల్కహాలు చేరినప్పుడు అది హైడ్రో క్లోరిక్‌ ఆమ్ల స్రావితానికి ప్రేరేపించును అధిక మోతాదులో అయితే మాత్రం దీనికి భిన్నంగా విష పదార్థాలే నేరుగా ప్రభావితం చూపుతాయి. దీంతో పాటు ఎక్కువ కాలం ఆస్పిరిన్‌, ఐ బూప్రొఫిన్‌ వంటి మందుల్ని వాడినా కానీ సమస్య ఏర్పడవచ్చు.

హెలికోబాక్టర్‌ పైలోరి వంటి బ్యాక్టీరియాల వలన ఇన్‌ ఫెక్షన్‌ తలెత్తినప్పుడు కూడా గ్యాస్ట్రిటిస్‌కు దారి తీయవచ్చు. వాస్తవానికి ఈ బ్యాక్టీరియా చాలామంది లో దాగి ఉంటుంది. ఇన్‌ ఫెక్షన్‌ కు గురైనప్పుడు మాత్రం అనేక జీర్ణాశయ సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణాశయ పొరల్లో ఉండే కణాలతో కలిసి ఈ బ్యాక్టీరియా కాలనీలుగా ఏర్పడినపుడు మాత్రం గ్యాస్ట్రిటిస్‌ ఏర్పడుతుంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో శానిటేషన్‌ జాగ్రత్తలు సరిగ్గా లేని కారణంగా ఒకరి నుంచి ఒకరికి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. విష పదార్థాలు తాగినప్పుడు, పైత్య రసం వెనక్కి స్రావితం అయినపుడు, స్వయం భక్షణ (ఆటో ఇమ్యూన్‌ డిసార్డర్‌) పరిస్థితులు తలెత్తినపుడు కూడా గ్యాస్ట్రిటిస్‌ ఏర్పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పాటు జీర్ణాశయ గ్రంథి కణాలు ప్రత్యేక పరిస్థితుల్లో మెటా ప్లాసియా స్థితికి లోనవుతాయి. అంటే తిరిగి మార్పు చెందలేని రీతిలో ఆ కణాలు రూపాంతరం చెందుతాయి. అప్పుడు జీర్ణాశయ గోడలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎండో స్కోపీ ద్వారా జీర్ణాశయాన్ని మొత్తంగా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే గ్యాస్ట్రిటిస్‌ను గుర్తించేందుకు వీలవుతుంది. లేదా బయోప్సీ ద్వారా పరిశీలించవచ్చు. ఎక్సురే పరీక్ష ద్వారా కడుపులోని ఇన్‌ ఫెక్షన్‌ ను శోధిస్తారు. రక్త పరీక్ష చేసి రక్త కణాల సంఖ్యను చూడటంతో పాటు రక్తం లో పైలోరీ బ్యాక్టీరియా ఉన్నదీ లేనిదీ గమనించవచ్చు. ఎనీమియా, బ్లీడింగ్‌ కండీషన్‌ ను నిర్ధారించుకొనేందుకు సైతం రక్త పరీక్ష అవసరం. మూత్ర పరీక్ష, మల పరీ ల ద్వారా కూడా ఇన్‌ ఫెక్షన్‌ను నిర్ధారించుకోవచ్చు. వీటి ఆధారంగా గ్యాస్ట్రిటిస్‌ ను గమనించవచ్చు.

చికిత్స

సాధారణంగా గ్యాస్ట్రిటిస్‌ చికిత్సలో సమస్య ఏ కారణంగా ఉద్భవించిందో గమనించి దీనికి తగినట్లుగా చికిత్స చేయిస్తారు. ఐ బూ ప్రొఫిన్‌, ఆస్ప్రిన్‌ వంటి మాత్రల వినియోగాన్ని నిలిపివేయమని సూచిస్తారు. రాంటి డిన్‌, ఫెమటిడిన్‌ వంటి మందులు జీర్ణాశయంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి వేస్తాయి. ఒమెప్రజోల్‌, లాన్సో ప్రజోల్‌, పెంటాప్రజోల్‌, రాబెప్రజోల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటర్సు లను అవసరానికి అనుగుణంగా వైద్యులు సూచిస్తారు. పైలోరి బ్యాక్టీరియా ను గుర్తించినట్లయితే ఈ మందులతో పాటు ఆమాక్సిలిన్‌, క్లారిత్రో మైసిన్‌వంటి
యాంటి బ్యాక్టిరియాలను లుపుతుంటారు. గ్యాస్ట్రిటిస్‌ సమస్య చిన్నదిగా కనిపించినా, దీని నుంచి ఉద్భవించేఇతర సమస్యలు బలమైనవి కావటంతో ప్రాథమికస్థాయిలోనే చికిత్స తీసుకొంటే మేలు.

Courtesy with : డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,--సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌-హైదరాబాద్‌@Surya Telugu daily-Jan-7-2013

  •  ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, January 7, 2013

Rhematoid Arthritis-రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం)

  •  
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhlX2x3NtHvd-D-i4BlJeyDaQxyfgYtfzpOWXy7d0HEdVFNZAtrB7QHW8xJLjev0LYvZS7I5ttKdIwcvjPRKI0WJe4wjNmaw6ZAunvqH7wNwIArTFd87KVdL-DrYqAw3aQpqj_JP21Mjss/s1600/Arthritis.jpg

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Rhematoid Arthritis-రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!  ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్‌! అంటే కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో ఓ విపత్తు తలెత్తటమన్న మాట.
కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి .

  • ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌--కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు.ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ,
  • ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌--ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌--సొరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌---మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌---చికున్‌గన్యా వంటి వైరల్‌ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.
  • రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌! కీళ్లవాతం--స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద  కీళ్ల నొప్పులు సమస్య.

రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం) :

ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకూ తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే.. కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరక ప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య! దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

   

మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. దీని పేరు 'రోగ నిరోధక వ్యవస్థ'. మనం వ్యాధుల బారినపడకుండా.. ఎటువంటి సూక్ష్మక్రిములూ మనపై దాడి చెయ్యకుండా నిరంతరం పహారా కాస్తుందీ వ్యవస్థ. రేయింబవళ్లు ఈ బాధ్యతలను ఇది అద్భుతంగా నిర్వర్తిస్తుంటుంది. కానీ.. ఒక్కోసారి ఇది పొరబడుతుంది! ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతూ.. ఏకంగా మన శరీర భాగాల మీదే దాడి చేసేస్తుంది. ఫలితమే రకరకాల 'ఆటో ఇమ్యూన్‌' సమస్యలు. కీళ్లవాతం.. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ కూడా ఇలా తలెత్తే సమస్యే!

ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువైన 'సైనోవియం' పొరను చూసి.. దాన్ని హానికారక శత్రువుగా పొరబడి... దానిపై దాడి చేసి దెబ్బతీయటం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పుల వంటి బాధలన్నీ ఆరంభమవుతాయి. అయితే ఇది ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఎవరిలో ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతుందో చెప్పటం కష్టం. ఇప్పుడిప్పుడే దీని వెనక ఉన్న జన్యుపరమైన, జీవనశైలీ పరమైన కారణాలను అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి దీన్ని ఎంత త్వరగా.. వీలైతే ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవటం, సాధారణ జీవితం గడపటం సాధ్యమవుతుంది.

నిర్ధారణ ఎలా?
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో రక్త పరీక్షల వంటివాటి కంటే కూడా వైద్యుల విచక్షణకే ప్రాధాన్యత ఎక్కువ. లక్షణాల తీరు, కొన్ని పరీక్షల సహాయంతో వైద్యులే కచ్చితంగా నిర్ధారిస్తారు.

* రక్తపరీక్ష: రక్తంలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌) ఎలా ఉందో చూస్తారు. ఆరంభ దశలో ఇది 75% మందిలో పాజిటివ్‌గా ఉంటుంది. నెగిటివ్‌గా వచ్చినవారికి కొన్నాళ్ల తర్వాత మళ్లీ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
* సీసీపీ యాంటీబాడీస్‌: వ్యాధి లక్షణాలు స్పష్టంగానే కనబడుతున్నా రక్తంలో 'ఆర్‌ఏ ఫ్యాక్టర్‌' నెగిటివ్‌ ఉన్న వారికి ఈ పరీక్ష అవసరం. ఇది పాజిటివ్‌ వస్తే కీళ్లవాతం ఉన్నట్టు బలంగా భావించాల్సి ఉంటుంది.
* ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ: ఇవి కీళ్లవాతం బాధితుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ తక్కువ ఉండొచ్చు.
* వీటికి తోడు వాచిన కీళ్లకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటివీ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.

నాలుగంచెల మందులు
కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. కానీ దీనికి సమర్థమైన చికిత్స ఉంది. దీనికి ఇచ్చే మందులను నాలుగు రకాలుగా విభజించొచ్చు.

1. నొప్పి నివారిణి మందులు: 'నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ' రకం నొప్పి నివారణ మందుల్లో బ్రూఫెన్‌, నేప్రోసిన్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటివి కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్‌, ట్రెమడాల్‌ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు.

2. కార్టికో స్టిరాయిడ్స్‌: ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే (అంటే కీళ్లవాతం తగ్గేందుకు ఇచ్చే దీర్ఘకాలిక మందుల ప్రభావం మొదలయ్యే వరకూ) ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో రెండు మూణ్నెల్లు మాత్రమే సిఫార్సు చేస్తారు.

3. వ్యాధి నియంత్రణ మందులు: 'డిసీజ్‌ మోడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'గా పిలిచే ఈ మందుల్లో ముఖ్యమైనది- 'మిథోట్రెక్సేట్‌'. ఇది వాస్తవానికి క్యాన్సర్‌కు వాడే మందు కావటంతో దీనిపై ఎన్నో అపోహలున్నాయి. కానీ.. ఇది కీళ్లవాతం చికిత్సల్లో బాగా పనికొస్తుంది. క్యాన్సర్‌ బాధితులకు దీన్ని పెద్దమోతాదులో ఇస్తే వీరికి చాలా స్పల్ప మోతాదుల్లో, అదీ వారానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మెథోట్రెక్సేట్‌ను జాగ్రత్తగా వాడితే ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు.

* సల్ఫాసలజైన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, లిఫ్లునోమైడ్‌, ఎజెతోయాప్రిన్‌ వంటివి కూడా కీళ్లవాతం చికిత్సలో ఉపయోగపడతాయి.

* ఈ మందులు వాడేటప్పుడు పరిస్థితి మెరుగవుతోందా? లేదా? దుష్పరిణామాలేమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు పరీక్షిస్తుంటారు. సాధారణంగా 4-6 నెలల్లో వ్యాధి చాలావరకూ నిదానిస్తుంది.

* కీళ్లవాతం ఎలా తగ్గుముఖం పడుతోందన్నది ఎప్పటికప్పుడు 'డాస్‌ 28 స్కోర్‌' ఆధారంగానూ, ఈఎస్‌ఆర్‌, 'పేషెంట్‌ జనరల్‌ గ్లోబల్‌ స్కోర్‌' ఆధారంగా తరచూ అంచనా వేస్తుంటారు.

4. బయోలాజికల్స్‌ చికిత్స: కొత్తతరం ఖరీదైన మందులివి. ఎంబ్రెల్‌, రెమికేడ్‌, ఒరన్షియా, రిటుక్సిమబ్‌ వంటి ఈ బయోలాజికల్‌ మందులను ఇంజక్షన్‌ రూపంలో చర్మం కిందకు గానీ, రక్తనాళంలోకి గానీ ఇస్తారు. దీంతో సమస్య నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఫలితాలు చాలా బాగుంటాయి. గానీ వీటికి అయ్యే ఖరీదు చాలా ఎక్కువ. ఒకవేళ వీటిని వాడాక కొన్నాళ్ల తర్వాత వ్యాధి తిరిగి విజృంభిస్తే మళ్లీ 'డిసీజ్‌ మోడిఫికేషన్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'తో చికిత్స చేస్తారు.
కీళ్లవాతం అంతా ప్రత్యేకమే

* సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పులైతే శరీరంలోని ఏదో ఒకవైపు కీలుకు మాత్రమే వస్తాయి. కానీ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమచేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు.

* కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారిలోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. ప్రతి నలుగురు కీళ్లవాతం బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు.

* కీళ్లవాతం.. సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవుతుంది.అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీమోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. (అదే కీళ్లు అరిగిపోవటం వల్ల వచ్చే ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ సాధారణంగా మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లతో మొదలవుతుంది)

* కీళ్లవాతం కొంతకాలం ఉద్ధృతంగా ఊపేస్తుంది. బాధలు తీవ్రతరమవుతాయి. మరికొంత కాలం నెమ్మదిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. మధుమేహం, హైబీపీల్లాగా ఇదీ దీర్ఘకాలిక సమస్య, దీనికి చికిత్స కూడా దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది.

* కీళ్లవాతంలో ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఇలా కనీసం గంటకు పైగా బాధపడాల్సి ఉంటుంది. మిగతా కీళ్ల నొప్పులకూ, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌కూ ఇదే ప్రధానమైన తేడా. అలాగే వీరిలో రాత్రి నొప్పులూ ఎక్కువ. కదులుతూ కాస్త అటూఇటూ తిరుగుతుంటే నొప్పి తగ్గినట్టుంటుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి, బాధ ఎక్కువ అవుతాయి.
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ దీర్ఘకాలిక సమస్య. కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు, చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉద్ధృతంగా ముంచుకొస్తుంది. మందులు తీసుకుంటుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు.
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో ఎటువంటి పథ్యాలూ లేవు. విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది.

* వ్యాయామం కీలకం కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బాధలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్‌, యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. బరువులు ఎత్తటం మాత్రం చేయకూడదు.

* రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు.

* లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు. మందులు వాడుకుంటూ పూర్తి సాధారణ జీవితం గడపొచ్చు. కాకపోతే 'మిథోట్రెక్సేట్‌' తరహా మందులు వాడుతున్నప్పుడు గర్భం మాత్రం ధరించకూడదు. ఆ మందు ఆపేసిన తర్వాత.. 3 నెలలు ఆగి అప్పుడు మాత్రమే గర్భధారణకు ప్రయత్నించాలి. అవసరమైతే గర్భిణీ సమయంలో తక్కువ డోసులో స్టిరాయిడ్లు వాడొచ్చు.
కీళ్లవాతం లక్షణాలేమిటి?
* జాయింట్లు ఎర్రగా వాచిపోయి నొప్పి
* ముట్టుకుని చూస్తే వేడిగా ఉండటం
* కీలు కదలికలు కష్టంగా తయారవటం
* ఉదయం లేస్తూనే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండటం
* ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు.

వీటికి తోడు...
* చాలామందిలో రక్తహీనత
* ఆకలి సరిగా లేకపోవటం
* నిస్సత్తువ, బరువు తగ్గిపోతుండటం
* బాధలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కొద్దిపాటి జ్వరం
* మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బుడిపెలు (రుమటాయిడ్‌ నాడ్యూల్స్‌) ఉండొచ్చు. ఇవి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
* ఎక్కువ కీళ్లు వాచటం, రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావటం, నొప్పి.. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువకాలం ఉంటే దాన్ని కీళ్లవాతం అని అనుమానించాలి.

వదిలేస్తే... విష వలయం!
కీళ్లవాతాన్ని అరుదైన సమస్యగా భావిస్తుంటారు గానీ ఇది చాలామందిలో కనిపిస్తుంది. మన జనాభాలో సుమారు ఒక శాతం మంది దీంతో బాధపడుతున్నారు. కానీ చాలామంది దాన్ని కీళ్లవాతంగా గుర్తించలేక.. ఏదో మామూలు కీళ్లనొప్పులేనని భావిస్తూ.. సమస్య ముదిరిపోయే వరకూ తాత్సారం చేస్తున్నారు. దీన్ని సత్వరం గుర్తించి చికిత్స చేయటం ఎంతో అవసరం. లేకపోతే పరిస్థితి ప్రాణాంతక సమస్యలకూ దారి తీస్తుంది.

* కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్నకొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.

* రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ముంచుకొచ్చే అవకాశమూ ఎక్కువే. కీళ్లవాతాన్ని సరిగా నియంత్రించుకోకపోతే- వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. కీళ్లవాతాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే ఈ దుష్ప్రభావాల బెడద ఉండదు. లాలాజల గ్రంథులు దెబ్బతింటే నోరు ఎండిపోతుంది. దీంతో పిప్పిపళ్లు వచ్చి, త్వరగా దంతాలు వూడిపోతాయి. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవటం వంటివీ మొదలవుతాయి. చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతిని న్యూరోపతీ రావొచ్చు.

* వ్యాధి ఉద్ధృతంగా ఉన్నప్పుడే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి ఉద్ధృతి తగ్గితే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే వీడకుండా చికిత్స, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం.. ఉత్తమం!

Courtesy with -డా.శరత్‌చంద్రమౌళి రుమటాలజిస్ట్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ సికింద్రాబాద్‌ @ఈనాడు సుఖీభవ

  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Iodine,అయోడిన్‌





  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అయోడిన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆరోగ్య రక్షణలో అయోడిన్‌ పాత్ర ఎంతో కీలకమైంది. అయోడిన్‌ లోపం వల్ల గర్భస్రావాలు, మృత శిశువుల జననాలు, బరువు తక్కువ పిల్లల జననాలు, బుద్ధి మాంద్యం, తెలివి తక్కువగా ఉండటం, నేర్చుకోవడంలో ఇబ్బంది, శక్తిహీనత, కండరాల సమస్యలు, వినికిడి లోపాలు, అలసట, గాయిటర్‌ వ్యాధి వస్తాయి. మనకు రోజుకు 150 మైక్రో గ్రాముల అయోడిన్‌ మాత్రమే అవసరం. అయోడిన్‌ సముద్రం నుంచి లభించే ఆహార పదార్థమైన నాచు, గుళ్ల చేపల్లో ఉంటుంది. మన దేశంలో అయోడిన్‌ లోపం సమస్యలకు నివారించడానికి 'అయోడైజ్డ్‌ ఉప్పు' పంపిణీ చేస్తున్నారు. అందరూ ఈ ఉప్పు ఉపయోగిస్తే మంచిది.

అయోడిన్ ఒక మూలకం. ఇది సూక్ష్మ ఆహార పదార్థం. సముద్రం నుంచి లభించే ఆహార పదార్థాలయిన సముద్రపునాచు, గుళ్ళ చేపల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాలలో అయోడిన్ ఆయా ప్రాంతాలలో భూమిలో ఉండే అయోడిన్‌ను బట్టి ఉంటుంది. కొండ ప్రాంతాలలో, ఎక్కువగా వరదలు వచ్చే మైదాన ప్రాంతాలలో భూమిలో అయోడిన్ తక్కువగా ఉంటుంది. మన దేశంలో హిమలయాల నుంచి నాగా కొండల వరకు విస్తరించిన జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచలప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్‌లను వాతావరణ అయోడిన్ కొరత రాష్ట్రాలు అంటారు. మిగతా రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో అయోడిన్ కొరత వాతావరణముంది. మన దేశంలో 197 జిల్లాలలో ఎక్కువగా అయోడిన్‌లోపపు వ్యాధులతో బాధపడుతున్నారు. మన దేశంలో 16.7 మిలియన్ల ప్రజలు అయోడిన్ లోపపు వ్యాధులతో బాధపడుతున్నారు.

అయోడిన్ లోపం- ఆరోగ్య సమస్య---
* గర్భవతులలో: వీరిలో అయోడిన్ లోపముంటే గర్భస్రావాలు, మృతశిశువుల జననాలు, బరువు తక్కువ పిల్లల జననాలు, పుట్టిన పిల్లలలో శిశు మరణాలు, పుట్టిన పిల్లలో బుద్ధిమాంద్యం, క్రెటిన్స్‌గా పుట్టడం (అంటే థైరాయిడ్ హార్మోను తక్కువగా ఉండుట), మెల్లకన్నుతో పిల్లలు పుట్టడం జరుగుతుంది.
* చిన్నపిల్లలలో: వీళ్లల్లో అయోడిన్ లోపముంటే, పిల్లలలో తెలివి తక్కువగా ఉండటం, నేర్చుకోవడంలో ఇబ్బంది, పెరుగుదల లోపాలు, శక్తిహీనత, కండరాల సమస్యలు, పక్షవాతం, వినికిడి లోపాలు, మాట్లాడటంలో లోపం సంభవించవచ్చు.
* పెద్దవాళ్ళలో: వీరిలో కూడా అయోడిన్ లోపముంటే శక్తిహీనత, అలసట, వంధ్యత్వంతో బాధపడతారు.

మనిషికి రోజుకెంత అయోడిన్ కావాలి?---
ప్రతి మనిషి అయోడిన్ లోపం లేకుండా జీవించాలంటే, రోజుకు 150 మైక్రోగ్రాముల అయోడిన్ మాత్రమే అవసరం. అంటే మనకు రోజూ కావలసిన అయోడిన్ గుండుసూది తలపై పెట్టేంత మాత్రమే. ఈ లెక్కన జీవితాంతం ఒక స్పూను అయితే సరిపోతుంది.

గాయిటర్ వ్యాధి---
మనం కొందరిలో గొంతుపై బంతిలాంటి గడ్డ ఉన్నవారిని చూస్తుంటాం. దీనినే గాయిటర్ అంటారు. ఈ గాయిటర్‌కు కారణం అయోడిన్ లోపమే.
మన దేశంలో క్రీ.శ.1962లో జాతీయ గాయిటర్ నియంత్రణ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రస్తుతం దీనిని జాతీయ అయోడిన్ లోప వ్యాధుల కార్యక్రమంగా నడుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మన దేశంలో అయోడిన్ లోపం తగ్గించటానికి మన ప్రభుత్వం ఉప్పు ద్వారా అయోడిన్ అందరికీ అందిస్తోంది. ఇప్పుడు మన దేశంలో అయోడిన్ కలిపిన ఉప్పు ప్రతి చోటా దొరుకుతుంది. దీనికి ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉంది.అందరూ అయోడిన్ కలిపిన ఉప్పు వాడండి. మీరు ఉత్సాహంగా ఉండండి. చురుకుగా, ఉత్సాహంగా, తెలివిగా ఉండే భావితరాలు మన దేశంలో జన్మించేలా చూడండి. ఇది మనందరి బాధ్యత.

Courtesy with --- డాక్టర్ ఆరవీటి రామయోగయ్య @ఆంధ్రభూమి దిన పత్రిక  అద్దివారం 15 ఏప్రిల్ 2012
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/