Friday, January 11, 2013

Guillain Barre Syndrom-గులియన్‌ బారి సిండ్రోమ్

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Guillain Barre Syndrom-గులియన్‌ బారి సిండ్రోమ్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ శరీరం యొక్క రక్షణ (వ్యాధినిరోధక) సిస్టమ్ తప్పుగా నాడీ వ్యవస్థపై  దాడి జరుగుతుంది. ఒక తీవ్రమైన రుగ్మత. ఈ కండరాల బలహీనత మరియు ఇతర లక్షణాలు కలిగిస్తుంది నాడీ వాపుకు దారితీస్తుంది.

కారణాలు, సంఘటనలు మరియు ప్రమాద కారకాలు

గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ స్వీయరక్షిత లోపము (శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ దాడి) వలన కలుగుతుంది . కాని అసలు కారణము సరిగ్గా  తెలియదు. సిండ్రోమ్ ఏ వయస్సులో వారికైనా రావచ్చును , కానీ వయస్సు 30 మరియు 50 మధ్య రెండు లింగాల ప్రజలు అత్యంత సాధారణ ఉంటుంది. ఇది తరచూ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అనగా  ఒక లంగ్ ఇన్ఫెక్షన్ లేదా జఠర వ్యాధి వంటి వాటిని  అనుసరిస్తుంది. చాలా కాలం, అసలు  సంక్రమణ చిహ్నాలు, గులియన్‌ బారి సిండ్రోమ్ ప్రారంభం లక్షణాలు ముందు కనుమరుగవుతాయి . ఒక్కొసారి  ఇది  ఒక శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు తరువాత కనిపిస్తుంది.

1976 లో స్వైన్ ఫ్లూ టీకా వల్ల వచ్చిన  గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్  అరుదైన సందర్భాలలో జరిగి ఉండవచ్చు. అయితే, స్వైన్ ఫ్లూ మరియు  సాధారణ ఫ్లూ టీకాలను ఉపయోగించడము , కొన్ని  అనారోగ్యం కేసులు ఫలితంగా రాలేదు.

 గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ నష్టానికి నరాల భాగాలు, నరాలు దెబ్బతిని  తిమ్మిరి, కండరాల బలహీనత, మరియు పక్షవాతం నకు కారణమవుతుంది. గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ ఎక్కువగా నరం యొక్క కవరింగ్ (మైలిన్ తొడుగు) pai ప్రభావితం చేస్తుంది. అటువంటి నష్టం demyelination అని, మరియు ఇది నరాల సంకేతాలు చాలా నెమ్మదిగా కదలకపోవడం వల్ల జరుగుతుంది. నరాల యొక్క ఇతర భాగాలకు నష్టం , నరాల పూర్తిగా పని ఆపడానికి కారణం కావచ్చు.

గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ కింది  వైరల్ సంక్రమణ tO పాటు సంభవించవచ్చు:

  •   AIDS
  •   సలిపి
  •  మోనోన్యూక్లియోసిస్
  •  దైహిక ల్యూపస్ ఎరిథెమాటసస్ లేదా
  • హాడ్జికిన్స్ వ్యాధి వంటి ఇతర వైద్య పరిస్థితులు కూడా సంభవించవచ్చు.
  • కొందరు బాక్టీరియల్ ఇంఫెక్షన్ తర్వాత గ్విల్లియన్-బార్రె సిండ్రోమ్ పొందుతుంది.


-మానవుని కదలికలకు మెదడు, వెన్నుపూస ఎంత ముఖ్యమైనవో, నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుంచి వచ్చే సంకేతాలు నరాల ద్వారానే కండరాలకి వెళ్ళి కదలికలు జరుగుతాయి. ఎప్పుడైతే నరాలు దెబ్బతింటాయో స్పర్శలో తేడా రావడం, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం జరుగుతాయి. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళు గుంజుతూ ఉండడం, స్పర్థ కోల్పోవడం, కింద నుంచి పైకి లేవలేకపోవడం, చెప్పులు జారిపోవడం, నడకలేకపోవడం నరాల జబ్బు లక్షణాలు. సాధారణంగా షుగరు జబ్బువారిలో, పూర్తి శాఖాహారుల్లో, మద్యం సేవించేవారిలో నరాలు దెబ్బతింటాయి. అయితే వీటన్నింటితో పాటు జ్వరాల వలన, ప్రత్యేకంచి వైరస్‌ జ్వరం తరువాత కొంతమందిలో నరాలు దెబ్బతింటాయి. ఒకటి నుంచి రెండు వారాల్లోనే పెరిగిపోయే నరాల జబ్బునే ‘గులియన్‌ బారి సిండ్రోమ్‌’ అంటారు.

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మనిషిలోని రోగనిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ అనే పదార్థాలను తయారుచేస్తుంది. ఇవి వైరస్‌ని చంపడంతో పాటు, మనిషి నరాలని కూడా దెబ్బతీస్తాయి. ఇవి తయారైన పరిమాణాన్ని బట్టి జబ్బు తీవ్రత ఉంటుంది. 70 శాతం మందిలో ఈ జబ్బు రెండువారాల్లో ముదిరి మనిషిని నడవలేని దశకి తీసుకెవెళుతుంది. తర్వాత అలా నిలబడిపోయి ఒక నెల తరువాత క్రమంగా కండరాలు పనిచేయడం మొదలుపెడతాయి. మిగిలిన 30 శాతం మందిలో జబ్బు ముదిరి, శ్వాస తీసుకోవటానికి అవసరమైన కండరాలు కూడా చచ్చుబడిపోయి, ఊరిపి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి వారు మింగే శక్తి కూడా కోల్పోతారు, మెడలు నిలుపలేరు. ఈ దశలో వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందిచవలసి ఉంటుంది.

నిర్ధారణ ఎలా? : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు నిపుణుడైన న్యూరాలజీస్టును కలిసి, ఎన్‌.సి.ఎస్‌. పరీక్షను చేయింకోవాలి. ఈ పరీక్షతో జబ్బును నిర్ధారంచవచ్చు. ఇటువంటి లక్షణాలే కలగజేసే వేరే జబ్బుల గురించి తెలుసుకోవటానికి కొన్ని రక్తపరీక్షలు అవసరంపడతాయి.

వైద్యం ఎలా? : నరాలు కొంచెం మాత్రమే దెబ్బతిని, రోగి నడవగలుతున్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు, ఫిజియోథెరపీతోనే నెమ్మదిగా రెండుమూడు నెలల్లో పూర్తిగా జబ్బు తగ్గిపోతుంది. అయితే జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాసకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు లేక రోజురోజుకీ బలం బాగా తగ్గిపోతున్న రోగిని ఐసియులో చేర్చి జాగ్రత్తగా వైద్యం అందించాలి. ఐవిఐజి అనే మందును 5 రోజులు ఇవ్వవచ్చు. అయితే ఇది బాగా ఖరీదైన మందు రోగి బరువుని బట్టి, మందు ఖరీదే 2-3 లక్షల వరకు ఉంటుంది.

ప్రత్యామ్నాయం ఎలా : పైన మందు పెట్టుకోలేకపోతే, ప్లాస్మాథెరపీ అనే పద్ధతి ద్వారా ఈ జబ్బు ముదరకుండా చేయవచ్చు. ఈ పద్ధతి వలన తొందరగా రోగి కోలుకోగలుగుతాడు. అయితే మూడు నుంచి ఐదుసార్లు ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. లక్ష రూపాయలలోపే ట్రీట్‌మెంట్‌ చేయవచ్చు. 70-80 శాతం మంది ఈ ప్రక్రియ తర్వాత కొన్ని వారాల్లోనే సొంతంగా నడవగలుగుతారు. 20 శాతం మందిలో అంతకన్నా ఎక్కువ సమయమే పట్టవచ్చు.

-అయితే పైన పేర్కొన్న రెండు పదార్థాలు కూడా ఎంత తొందరగా మొదలుపెడితే అంత తొందరగా ఫలితం ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాలు ఫిజియోథెరపీ సక్రమంగా చేస్తూంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎవరిలోనైనా కానీ, జర్వంతో పాటుకానీ, జర్వం తగ్గిపోయిన తర్వాత కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతున్నా, తిమ్మిర్లు వచ్చి నడవలేకపోతున్నా వెంటనే దగ్గరలో డాక్టరుని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేసుకొని వెంటనే వైద్యం మొదలుపెడితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు.

Courtesy with : Ayush@Surya Telugu Daily
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.