Sunday, November 24, 2013

Coronary heart disease,కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండాసలహాలు,కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటే?

  •  



  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Coronary heart disease,కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

Q : కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటే ఎమిటి ?
A : మనశరీరంలోని ప్రతీ అవయవానికి రక్తం సరఫరా చేయ డానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాలు ఉంటాయి వాటి ద్వారా ఆయా అవయవాలకి రక్తప్రసరణ జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా అన్ని కణాలకు జరుగు తుంది. రక్తం చేరని ప్రాంతానికి ఇవి చేరక ఇబ్బంది పడతాం. రక్తం అంతా గుండె ద్వారా ఇతర అవయవాలకు చేరుతున్నా, గుండె తనకు రక్తం సరఫరా చేసే నాళాలైన ‘కరొనరి ఆర్టెరీ’ శాఖల ద్వారా వచ్చే రక్తాన్నే తనకోసం ఉపయోగించుకుంటుంది. ఈ కరొనరి ఆర్టెరీ శాఖలలో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకి రక్తం సరిగ్గా సరఫరా కాదు. దాంతో కండరాలు నీరసించి గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. గుండె రక్తనాళాలైన కరొనరి ఆర్టెరీ శాఖలలో ‘ఎథిరోస్ల్కీరోసిస్‌’తో పూడుకు పోవడం జరిగి తద్వారా గుండె రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటారు. గుండె రక్తనాళాల్లో ఈ మార్పు ఎలా వస్తాయంటే ముందు కొవ్వు కొద్ది కొద్దిగా రక్తనాళాలలోపలివైపు పేరుకుపోతుంది. ఆ తరువాత లిపిడ్‌, పైబర్‌ కూడా పేరుకుపోయి గట్టిపడతాయి. ఇవి సాధారణంగా రక్తనాళాలు మలుపుతిరిగేచోట కానీ, చీలేచోటగానీ ఏర్పడతాయి.

ఈ ప్లేక్స్‌ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాల్తో పెద్దగా ఏర్పడి సన్నటిక్యాప్‌ కప్పినట్లు పెరుగుతాయి. ఇవి చిదిమిపోవచ్చు. ఇలా రక్తనాళాల్లో అడ్డంకులేర్పడతాయి. పూర్తిగా రక్తనాళాల్లో అడ్డంకిగా ఏర్పడి ‘మయోకార్డియల్‌ఇన్‌ఫె‘న్‌’ ఏర్పడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఈ ప్లేకు ఫైబ్రస్‌ ప్లేక్‌ అవుతాయి. ఆర్టరీ శాఖలలో విస్తరిస్తాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50శాతం కన్నా ఎక్కువ పేరుకుపోతే అక్కడినుంచి రక్తసరఫరా తగ్గి ఆప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అంతకన్నా ఎక్కువ పేరుకుపోతే గుండె కండరాలు ఇంకా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కరొనరి ఆర్టరీ డిసీజెస్‌ వస్తాయి. దీన్ని ప్రారంభదశలో గుర్తించి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మామూలు కన్నా పొగతాగే వాళ్ళలో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ రెండు లేక మూడు రెట్లు ఎక్కువ. సిగరెట్లు తాగడం మానేస్తే ఈ రిస్క్‌ కూడా క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ధూమపానం అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

కరొనరి హార్ట్‌ డిసీజ్‌కి మరో రిస్క్‌ కొలెస్ట్రాల్క్త్రంలో పెరగడం. కొలెస్ట్రాల్‌ వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన శరీరంలో లోడెన్సిటి లైపోప్రొటీన్‌ (ఎల్‌.డి.ఎల్‌) తక్కువగా ఉండాలి. రక్షణ కల్పించే హై డెన్సిటి లైపోప్రొటీన్‌ (హెచ్‌.డి.ఎ) ఎక్కువగా ఉండాలి. అలా కాకుండా ఎల్‌డిఎల్‌ పెరిగినా, హెచ్‌డిఎల్‌ తగ్గినా కూడా రిస్క్‌ఎక్కువే! ట్రెగ్లిజరైడ్స్‌ ఎక్కువై వాటితోపాటు ఎల్‌డిఎల్‌ పెరిగి హెచ్‌డిఎల్‌ తగ్గడంతో రిస్క్‌ ఎక్కువవుతుంది. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కొలెస్ట్రాల్‌ స్థాయిని తట్టుకోగలరు. ఎందుకంటే బహిష్టు ఆగేవరకు ప్రత్యేక హార్మోన్లు రక్షణ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్‌ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయి. 1) వంశపారంపర్యంగా వచ్చేవి. 2) ఆహారం ద్వారా వచ్చేవి. చిన్న వయస్సులో కూడా కొన్ని జీన్స్‌ దెబ్బతినడం వల్ల వంశపారపర్యంగా ‘హైపర్‌-లిపిడిమియా’ బారినపడుతుంటారు.

దీంతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ చిన్న వయస్సులో వచ్చే రిస్క్‌ ఉంది. ‘సేచురేటెడ్‌’ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అధిక బరువు, డయాబెటిస్‌, అధికరక్తపోటుల వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో ఎథిరోస్ల్కీరోసిస్‌తో గుండెరక్తనాళాలు మూసుకుపోయే రిస్క్‌ ఎక్కువ. అధిక రక్తపోటు వల్ల కరొనరి డిసీజెస్‌ ఎక్కువ. రక్తపోటును తగ్గిస్తే ఆరిస్క్‌ తగ్గుతుంది.ఊబకాయం గుండె జబ్బులు రావడానికి ప్రధాన రిస్క్‌ ప్యాక్టర్‌గా గుర్తించారు. ఊబకాయాల వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఎల్‌.డి.ఎల్‌ పెరిగి హెచ్‌.డి.ఎల్‌ తగ్గుతుంది. కాబట్టి బాడీమాస్‌ ఇండెక్స్‌ చెప్పిన దానికన్నా ఎక్కువ బరువు ఉండకుండా చూడటం అవసరం. బి.ఎం.ఐ అంటే బాడీమాస్‌ ఇండెక్స్‌ ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును చెప్పడం. బి.ఎం.ఐ = బరువు కిలోగ్రాముల్లో /ఎత్తు మీటర్లలో అలాగుణించినప్పుడు 25కన్నా తక్కువ ఉండాలి.

ఛాతి చుట్టుకొలతని పిరుదుల చుట్ట కొలతతో పొల్చినప్పుడు ఆడవాళ్ళల్లో అయితే. 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. మగవాళ్ళల్లో అయితే. 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ రేషియో పెరిగిన కొద్దీ కరొనరి డిసీజెస్‌ రిస్క్‌ ఎక్కువ. సరైన ఎక్స్‌సర్‌సైజ్‌ లేకపోవడం కూడా కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ను పెంచుతుంది. వారంలో అయిదు రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు ఎక్స్‌సర్‌సైజులు చేయాలి. నడకైనా మంచిది. ఆల్కాహాల్‌ ఎక్కువ తీసుకున్నా ‘ట్రెగ్లిజరైడ్స్‌’ఎక్కువై లివర్‌ డిసీజ్‌తో పాటు కరొనరి డిసీజెస్‌ రావచ్చు. ఎక్కువగా స్ట్రాంగ్‌ కాఫీ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రాంగ్‌ కాఫీ వల్ల సైనస్‌ టేకికార్డియా లేకపోతే ఎరిథ్మియా కలగవచ్చు. కాబట్టి కాఫీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.

సాధారణంగా మెనూపాజ్‌ పీరియడ్‌ వచ్చేంతరకు వరకు ఆడవాళ్ళల్లో హార్మోన్స్‌ భద్రతను కలిగిస్తాయి. జీవనవిధానం మారడంతో ఇలాంటి లక్షణాలు దెబ్బతిని ఆడవాళ్ళల్లో చిన్నతనంలోనే కరొనరి హార్ట్‌డిసీజ్‌ వస్తుంది. కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే కారణాలు తెలుసుకున్నాం. వీటిని బట్టి మనం జీవన విధానం ఎలా మార్చుకోవాలో తెలుసుకోవచ్చు. ధూమపానం, ఆల్కాహాల్‌, కాఫీ లాంటి అలవాట్లను మానేయటం మంచిది. కొలెస్ట్రాల్‌ పెరగని విదంగా ఆహారపు అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి. ఊబకాయం, డయాబెటిస్‌, అధిక రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి. ఇలా జీవన విధానాన్ని మార్చుకొంటే కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుకోవచ్చు.

మానసిక ఒత్తిడితో కూడా కరొనరి హార్ట్‌డిసీజ్‌ రిస్క్‌ల్లో ఒకటి. టైప్‌-ఎ పర్సనాల్టీలో ఒత్తిడి ఎక్కువ. దీనితో వాళ్ళకి కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. టైప్‌-ఎ  పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో పోటీతత్వం ఎక్కువ. వాళ్ళు అనుకున్న పని పూర్తికాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. యోగ, మెంటల్‌ రిలాక్సేషన్‌లతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌తో వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

  • courtesy with : Dr.Ravikuma Aluri (cardiotogist) Hyd@surya Telugu news paper.October 7, 2013
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

HIB,హిబ్,Haemophilus influenzae type B vaccine,హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --HIB,హిబ్,Haemophilus influenzae type B vaccine,హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్. ఈ వాక్షిన్‌ వేయడము వలన పసికందులలో వచ్చే early childhood meningitis ను పూరిగా నివారించవచ్చును.

చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం. ఈ కార్యక్రమ వ్యూహాలు అమలు చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిల్లల్లో వచ్చే వ్యాధులను అరికట్టి సత్ఫలితాలు సాధించవచ్చు. అది పిల్లలకు మౌలిక అవసరం కూడా.

హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్... ఇది ఒక కాంజుగేట్ వాక్షిన్‌. developed for the prevention of invasive disease caused by Haemophilus influenzae type b bacteria. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్సన్‌ (CDC) చిన్నపిల్లకు రొటీన్‌ టీకాల పట్టీలో సిఫార్స్ చేసినది. అమెరికా లో ఈ వాక్షిన్‌ వాడడము వలన హిబ్ బాదితులు 40-100 / 100,000 నుండి 1-3 / 100,000 వరకు తగాయని రికార్డ్స్ ద్వారా తెలుస్తూ ఉంది.

హిబ్ వాక్షిన్‌ వేయవలసిన వయసు వివరాలు :

06 వారాలు -- హిబ్ 1,
10 వారాలు -- హిబ్ 2,
15-18 వారాలు -- హిబ్ బూష్టర్ ,

  • హిబ్ చరిత్ర వివరాలు :
1985 లో అమెరికాలో Polysaccharide vaccine మొదట తయారుచేయబడింది . దీని చర్య(రెస్పాన్స్ ) 18 నెలలలోపు పిల్లలో అంతగా కనబడలేదు . అందుకే దీనీ మరింత అభివృద్ది చేసి Conjugate vaccine ను తయారుచేసారు. ప్రస్తుతానికి దీనినే వాడుతూ ఉన్నారు. దీనిలో హిబ్ పాలీసాక్కరైడ్ కి ఒక పోటీన్‌ ని కాంజుగేట్ చేయబడినది.
దీనిలో అభివృద్ధి దిశగా Multiple combinations of Hib and other vaccines తయారీ వాడుకలోనికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో హిబ్ వాక్షిన్‌ తో diphtheria-tetanus-pertussis–polio vaccines and Hepatitis B vaccines మిలితం చేసి అమెరికాలో వాడుతూ ఉన్నారు.
హిబ్ -Haemophilus influenzae type b వాక్షిన్‌ non-type B disease పనిచేయదు (రక్షణ నివ్వ్దు).. ఈ నాన్‌ బి. ఇన్‌ఫ్లూయంజా చాలా అరుదుగా మానవాళి లో కనబడుతూ ఉంది. . . కావున ప్రమాదమేమీ లేదు .

పసిపిల్లలు పూవులాంటి వారని అంటారు. తేమ కాస్త ఎక్కువైతే పువ్వులు కుళ్లి పోతాయి, కాస్త తగ్గితే వాడిపోతాయి. పసివాళ్లు కూడా అంతే. ఏది ఎంత అవసరమో వారికి అంతే అందించాలి. ఏది ఎక్కువతక్కువలైనా సమస్యే. అందుకే వాళ్లని మల్లెపూవులా పదిలంగా చూసుకోవాలి.
------------------------------------------------
సంక్షిప్త పదాలు:
------------------------------------------------
బి .సి .జి = బేసిలస్ కాల్ మేట్ గ్యారిన్,
ఒ .పి. వి = ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అనగా నోటిలో వేసే పోలియో చుక్కలు,
డి .టి.డబ్ల్యుడి = డిఫ్తిరియా,టెటనెస్, హొల్ సెల్ పెర్టుసిస్,
డి .టి = డిఫ్తిరియా మరియు టెటనెస్ టాక్సాయిడ్,
టి, టి = టెటనెస్ టాక్సాయిడ్,
హెప్ ,బి = హెపటైటీస్ బి వ్యాక్సిన్,
ఎమ్ .ఎమ్ .ఆర్ = మిజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్.
హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్.
ఐ .పి .వి = ఇన్ యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్.
టి .డి = టెటనెస్,డిఫ్తిరియా టాక్సాయడ్ తగ్గించిన మోతాదు.
టి. డి.ఆప్ = టెటనెస్,డిఫ్తిరియా యొక్క తగ్గించిన మోతాదు మరియు యేసెల్యులర్ పెర్టుసిస్.
హెచ్ .పి .వి = హ్యుమన్ పెపిల్లోమా వైరస్ వ్యాక్సిన్.
పి .సి .వి = న్యూమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్.
డిటాప్ = డిఫ్తిరియా, టెటనస్, యేసెల్యూలర్ పెర్టుసిస్ వ్యాక్సిన్.
పి.పి.వి 23 = 23 వేలంట్ న్యూమోకోకల్ పోలీ సేకారైడ్ వ్యాక్సిన్.

కొత్తగా వాడుకలోకి వచ్చిన రోగ నిరోధక మందులు అనగా హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ (నీటి ద్వారా సంక్రమించే పచ్చకామెర్లు), హెమ్ బి వ్యాక్సిన్ మరియు వెరిసెల్లా (ఆటలమ్మ / చికెన్ పాక్స్) రోగ నిరోధక మందులు పిల్లల వైద్యనిపుణులు వాడుటలో ఒక వైద్యునికి మరో వైద్యునికి చాలా వైరుధ్యం వుంటుంది. పిల్లల తల్లిదండ్రులతో పిల్లల వైద్యనిపుణులు చర్చించి వీటిని వాడాలి. ప్రస్తుతం దేశంలో ఇప్పుడు అమలులో వున్న రోగ నిరోధక మందుల కార్యాచరణ ప్రణాళికలో పైన పేర్కొన్న రోగ నిరోధక మందులను ఇంకా చేర్చలేదు. ఈ రోగ నిరోధక మందుల ఖరీదు, పిల్ల వాని వయస్సు, తల్లి దండ్రుల ఇబ్బందులు, వీటి వాడకంలో పిల్ల వానికి వచ్చే ప్రమాదాలు మరియు వైద్యుడు, పిల్లవాని తల్లిదండ్రుల మధ్య చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం మొదలైన అంశాల ఆధారంగా వివేచనతో వీటిని వాడాలి.
  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, November 23, 2013

Heart transplantation,గుండె మార్పిడి




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండె మార్పిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఇవాళ ఒక మనిషి చనిపోతూ, పది మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అంటే... ఒక వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించి, అతను లేక ఆమె బంధువులు అవయవ దానం చేస్తే - ఈ అవయవాల్ని అవతల పూర్తిగా చెడిపోయిన వాళ్ళకి అమరుస్తున్నారు. ఇలా ఒక బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి రెండు కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, కాలేయం లాంటి అవయవాల్ని దానం చేయవచ్చు. అంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి పదిమందిలో బ్రతుకుతాడన్నమాట! ఎంతో మంది అవయవాలు దెబ్బతిని మార్పిడి ద్వారా ప్రాణరక్షణకి ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు మనదేశంలాంటి దేశాల్లో దాతల కన్నా స్వీకర్తల సంఖ్య ఎక్కువ ఉంది. కొంత కాలం వారికి అవయవాలు లభించకపోతే తీవ్రస్థాయిలో బాధపడుతూ మరణిస్తున్నారు. అందుకని బ్రెయిన్‌ డెడ్‌ అయిన మనిషిని వెంటిలేటర్‌ సహకారంతో శ్వాసించేట్లు చేస్తారు. ఈ వెంటిలేటర్లు తొలగిస్తే ఆ వ్యక్తి చనిపోతాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చనిపోయి, వాళ్ళ అవయవాలు బూడిద అవడం, మట్టిలో కలిసిపోవడం బదులు మరికొందరిలో బ్రతికి ఉండటం గొప్పేకదా! దాతలుగా తమను తాము రికార్డు చేసుకోవాలి. తమ కోరికను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి. అప్పుడే కోరిక నెరవేరుతుంది. దాతలమని రిజిస్టర్‌ చేసుకున్నంత మాత్రాన దాతలం కాలేం. మన అవయవాలన్నీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ఏ కారణంగానైనా యాక్సిడెంటుకు గురికావడమో, తలలోని రక్తనాళాలు చిట్లిపోవడం లాంటివి జరుగుతేనే మనం దాతలం కాగలం.

ఇక గుండె విషయానికొస్తే చాలామంది గుండె కండరాలు పూర్తిగా దెబ్బతినో, కరొనరి డిసీజ్‌ తీవ్రంగా ఉండో ప్రాణం పోతోందని బాధపడుతుంటారు. అటువంటి వారికి గుండె మార్పిడి ఒక్కటే మార్గం. గుండె బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. బ్లడ్‌గ్రూప్‌ లాంటివి మ్యాచ్‌ అవడంతో పాటు గుండె పరిమాణం కూడా దాతకి, స్వీకర్తకి ఒకటేలా ఉండాలి. లింపోసైట్‌ క్రాస్‌మ్యచ్చింగ్‌ కూడా సరిపడాలి. ఆడ, మగ భేదం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఇలా గుండె మార్పిడి జరిగిన వాళ్ళు మిగతా వాళ్ళలాగా అన్ని పనులూ చేసుకోగలరు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనీసం15 సంవత్సరాలు బ్రతకగలరు. ప్రపంచంలో మొట్టమొదటి గుండె మార్పిడి 1967లో డా క్రిష్టియాన్‌ బర్నార్డ్‌, లూయిస్‌ వాష్‌కాన్స్‌స్కీకి చేశారు.

మన దేశంలో మొదటి సారి గుండె మార్పిడి శస్తచ్రికిత్స 1994 ఆగష్టు 3న ఎయిమ్స్‌లో డా’’ పి.వేణుగోపాల్‌ చేశారు. మన రాష్ట్రంలో మొదటిసారి గుండెమార్పిడి శస్తచ్రికిత్స డా.ఆళ్ళగోపాలకష్ణ గోఖలే రమేష్‌ అనే వ్యక్తికి 2004లో లక్డీకాపూల్‌ గ్లోబల్‌హాస్పిటల్‌లో విజయవంతంగా నిర్వహించారు.
గుండె మార్పిడి చేసిన తరువాత ఇన్‌ఫెక్షన్స్‌ రావచ్చు. సెప్సిస్‌ రావచ్చు. ఆర్గాన్‌ రిజక్ట్‌ కావచ్చు. శస్తచ్రికిత్స తరువాత ఇమ్యునో సప్రసివ్‌ డ్రగ్స్‌ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి కొన్ని ఇన్‌ఫెక్షన్స్‌ లాంటివి రావచ్చు. వీటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది అవయవదానం అన్నప్పుడు కళ్ళు, మూత్రపిండాలు, లివర్‌ లాంటివే అనుకుంటారు. గుండెను కూడా దానం చేయవచ్చు. అలాగే గుండె జబ్బు చివరి దశ (ఎండ్‌ స్టేజ్‌)కి వచ్చినా కంగారు పడాల్సిన పనిలేదు. మన రాష్ట్రంలో గుండె మార్పిడి శస్తచ్రికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

గుండె మార్పిడిలో ముందు దాత శరీరాన్ని ఓపెన్‌ చేసి గుండె ఆరోగ్యం ఎలా ఉందో, గుండె పరిమాణం - చూసి సంతప్తి చెందిన తరువాత స్వీకర్త శరీరాన్ని ఓపెన్‌ చేయడం జరుగుతుంది. ఒక శరీరంలో గుండె ఆగిన నాల్గు గంటల్లోపల రెండో శరీరంలో అది కొట్టుకోవడం ప్రారంభించాలి. మూత్రపిండాల, ఊపిరితిత్తుల, లివర్‌ జబ్బులున్నవాళ్ళు, ఇన్సులిన్‌ తీసుకుంటున్న డయాబెటిస్‌ వ్యక్తులు, మెడప్రాంతంలో, కాళ్ళ ప్రాంతంలో రక్తనాళాల జబ్బులున్న వాళ్ళు, థ్రోంబో ఎంబాలిజం ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, తీవ్రంగా ఆల్కాహాల్‌, ట్యుబాకో, డ్రగ్‌ఎబ్యూజ్‌ వాళ్ళకి గుండె మార్పిడి చేయడం కష్టమవుతుంది.

  • --courtesy with : Dr .Alla  Gopalakrishna Ghokle,Hyderabad@surya Telugu news paper.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, November 21, 2013

Causes for more weight,అధిక బరువుకి కొన్ని కారణాలు








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Causes for more weight,అధిక బరువుకి కొన్ని కారణాలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    అవగాహనాలేమితో చేసే కొన్ని పనులు.. సమస్యల్ని తెచ్చిపెడతాయి. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది వర్తిస్తుంది. కేవలం తక్కువగా తినడం.. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్లే సన్నబడరు. ఆ క్రమంలో జరిగే కొన్ని లోపాల్నీ సరిదిద్దుకోవాలి.

నిద్రలేమి జీవక్రియల వేగాన్ని తగ్గిస్తుంది. ఆకలి హార్మోన్లుగా పరిగణించే లెప్టిన్‌, గ్రెలిన్‌పై ప్రభావం చూపుతుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు లెప్టిన్‌... తినడం ఆపమంటూ మెదడుకి సంకేతాలనిస్తుంది. గ్రెలిన్‌ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది. అధ్యయనాల ప్రకారం నిద్రలేమి వల్ల లెప్టిన్‌ పనితీరు తగ్గుతుంది. అదే బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందుకే వేళకు నిద్రపోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి.

చక్కెర తీసుకుంటున్నారా: కాఫీ, టీల్లో చక్కెర ఎక్కువగా వేసుకోకపోవచ్చు. మిఠాయిలు మానేయొచ్చు. కానీ చాలా పదార్థాల్లో తీపి శాతం కనిపించకుండా ఉంటుంది. అలాంటి వాటిల్లో హెల్దీ బార్స్‌, శీతల పానీయాలూ, సాస్‌లూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పళ్ల సమస్యలూ, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి దాడిచేస్తాయి. బరువూ పెరుగుతారు. కాబట్టి వాటిని కొనేముందు పదార్థాలపై రాసున్న వివరాలను చదవాలి. చక్కెర శాతం ఎక్కువ అని రాసి ఉన్న వాటిని మానేయాలి. నేరుగా చక్కెర అని రాయకపోవచ్చు కానీ.. సుక్రోస్‌, గ్లూకోజ్‌, ఫ్రక్టోస్‌, మాల్టోస్‌, ఫ్రూట్‌జ్యూస్‌ కాన్‌సన్‌ట్రేట్‌ అని రాసి ఉంటాయి. వీటి శాతం కాస్త ఎక్కువగా ఉన్నా చక్కెర ఉన్నట్టే.

కెలొరీలు లెక్కిస్తున్నారా: బరువు తగ్గాలంటే ఆహారం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.. తక్కువ కెలొరీలు అందుతాయి. కానీ దానివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందువు. వాస్తవానికి ఏదయినా పదార్థం తీసుకునే ముందు మోతాదు కన్నా నాణ్యత గురించి ఆలోచించాలి. కేవలం కెలొరీలనే పరిగణించకుండా.. ఒక పదార్థం తినడం వల్ల అందే పోషకాలపై దృష్టిపెట్టాలి. సమృద్ధిగా పోషకాలనందించే వాటినే ఎంచుకోవాలి. ముఖ్యంగా విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ యాక్సిడెంట్లూ అందించే పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాల్ని తీసుకోవాలి. ఇంట్లో వండిన పదార్థాలను తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్‌ఫుడ్‌ బరువు పెరిగేందుకు కారణం అవుతుందని గుర్తించాలి.

హార్మోన్ల సమస్యలు: హైపోథైరాయిడిజం, పీసీఓడీ... లాంటివన్నీ హార్మోన్ల పనితీరులో మార్పుల వల్లే ఎదురవుతాయి. వీటివల్ల త్వరగా బరువు పెరుగుతారు. తిరిగి తగ్గడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యను నిర్ధరించుకునే ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ఏ ఒక్క సమస్య ఉందని తేలినా... శుద్ధిచేసిన పిండిపదార్థాలను మానేసి మేలుచేసే ప్రొటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కూరగాయలూ, అత్యవసరమైన ఫ్యాటీ ఆమ్లాలూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

  • ============================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Wednesday, November 20, 2013

How far x-ray is needed?,ఎక్ష్-రే ఏమేరకు అవసరము ?

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎక్ష్-రే ఏమేరకు అవసరము ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఎక్ష్-రే ఏమేరకు అవసరము ?

వ్యక్తి ఆరోగ్యము నిర్ధారించడానికి , లేదా వ్యాధిని గుర్తించడానికి  వైద్యులు సంప్రదించే వైద్యుడు రేడియాలజిస్ట్ . ఆధునిక వైద్యము అందించే ప్రతి హాస్పిటల్ నందు రేడియాలజీవైద్యులు కీలక భూమిక నిర్వహిస్తారు . అత్యవసర కేసులలో స్కానింగ్ పరీక్షలు చేయకుండా  వ్యాధి చికిత్సాపద్దతులను అనుసరించడము కత్తిమీద సాములాంటిదే . అవససరమైన స్కానింగ్ పరీక్షలు చేయకుండా , రోగనిర్ధారణ లేకుండా ట్రయల్ -ఎర్రర్ పద్దతిలో వైద్యము చేయడాన్ని న్యాయాస్థానాలు మెడికల్ నెగ్లిజెన్స్ గా పరిగణిస్తాయి. వైద్య శాస్త్రం   అభివృద్ధిచెందిన క్రమాన్ని పరిశీలిస్తే అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనల సముదాయం ద్వారానే మనము పురోగమించాము అని గ్రహించవచ్చు . అలాంటి ఒక సంఘంటం 08 నవంబర్  1895 లో జర్మనీలోని వొర్జ్-బర్గ్ అనే నగరములో జరిగింది .

విళెమ్‌ కొనరాడ్ రాంట్జన్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త క్రూక్స్ ట్యాబ్ లో జనియించిన కంటికి కనబడని కాంతిని గుర్తించాడు . ఆల్ జీబ్రా సాంప్రదాయం ప్రకారము అర్ధము గాని ఆ శక్తిని x-ray అని నామకరము చేశారు . అంకితభావము కలిగిన ఆ శాస్త్రవేత్త ఆ కిరణాలను క్షుణ్ణము గా పరిశోధించి , డిశంబరు 28 - 1895 నాడు ప్రపంచానికి వెల్లడి చేశారు. ఈ ఆవిష్కరణ పెనుసంచలనము సృష్టించినది . మొదటి నోబెల్ బహుమతి రాంట్ జెన్‌ ను వరించినది. ఆయన ఎక్ష్-రే కు పేటెంట్ తిరస్కరించి వాటిపై అనేక పరిశోధనలు జరిగేందుకు అవకాశము కల్పించాడు . అట్టి నిశ్వార్ధ శాస్త్రవేత్తకి గుర్తుగా అన్ని రేడియాలజీ సంస్థలు నవంబర్ 08 ను అంతర్జాతీయ రేడియోలజీ దినోత్సవముగా జరుపుకుంటారు.  ఎక్ష్-రే ఆవిష్కరణకు పూర్వము వైద్యుని హస్తం మాత్రమే వ్యాధి నిర్ధారణ పరికరము . ఎక్ష్-రే వైద్యులకు దృష్టిని అందించినది అంటే అతిశయోక్తి కాదు . వ్యాధిగ్రస్తుడి పొట్టకోసి వ్యాధి నిర్ధారణ చేయుట ఎక్ష్-రే ముందు సధారణమైన  వైద్యనిర్ధారణ పద్ధతి.ఎక్ష్-రే కనిపెట్టిన వంద ఏళ్ళ తరువాత , ఇప్పుడు ఆ విధమైన సర్జరీలు అరుదైపోయాయి.

రేడియోలజీ విభాగములో ఎక్ష్-రే , ఫ్లోరోస్కోప్ , ఆల్ట్రాసౌండ్ , డాప్లర్ , మమ్మోగ్రఫీ, సిటి , ఎం.ఆర్.ఐ, PETCT , Cathlab , మొదలైన పరికరాలు వాడుతూ ఉన్నారు. స్థూలముగా ఆవలోకిస్తే ఈ పరికరాలు ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడాన్ని " డయాగ్నోస్టిక్ " రేడియోలజీ అనీ , ఇవే పరికరాలు వాడి చికిత్సచేసే పద్దతిని " ఇంటర్ వెన్సనల్ " రేడియోలజీ అంటారు. ఎక్ష్-రే చాతి, వ్యాధులకు , ఎముకలు , కీళ్ళవ్యాధులకు వినియోగిస్తారు. అత్యంత చవకైన ఈ పరీక్ష ద్వారా అత్యంత విలువైన సమాచారము లభిస్తుంది. అంతేకాక విరిగిన ఎకుకలు అతికించడానికి వాడే "C-arm "  పరికరము కూడా ఎక్ష్-రే కిరణాల ఆధారము గానే పనిచేస్తుంది. ఫ్లోరోస్కోపి అనే పద్దతి ద్వారా అన్నవాహిక , ప్రేగు, గర్భాశయం , మూత్రశయం వ్యాధులను తెలుసుకోవచ్చు. ఆల్ట్రాసౌండ్ ద్వారా పిండము గర్భాశయములోనే వుంది అన్న ప్రాధమిక అంశము , కడుపునొప్పి ,బహిష్టు సమస్యలు , ఆగని విరేచనాలు గురించి , కొన్ని రకాల క్యాన్సర్లు గుర్తించవచ్చును .గుండె వ్యాధులు అర్ధముచేసుకోవడానికి ఎకోడాప్లర్  పరీక్ష నిర్వహిస్తారు .

ప్రతి చిన్న అవయవాన్నీ , రక్తనాళమును , సిటి స్కానింగ్ ద్వారా , ఎం.ఆర్.ఐ. స్కానింగ్ ద్వారా ఏ విధమైన రేడియేషన్‌ ఎఫెక్ట్ లేకుండా అత్యంత సంక్లిష్టమైం మెదడు పనితీరును అంచనావేయవచ్చును. ఎక్ష్-రే లో సైతము కనపడని ఫ్రాక్చర్ లను , ఎం.ఆర్.ఐ. పరికరము ద్వారా గుర్తించవచ్చును . సున్నితమైన , కీళ్ళ లోపల వుండే లిగమెంట్ల గురించి అంచనా వేయవచ్చును . MRS PECTVOSCOPY  పద్దతి ద్వారా మెదడులో ఉండే కెమికల్స్ నిష్పత్తిని విశదీకరించవచ్చును . మెదడులో క్లిప్పులు ఉన్నవారు , పేస్ మేకర్ ఉన్నవారు ఎం.ఆర్.ఐ స్కానింగ్ కు దూరంగా ఉండడము మేలు.

అవయవాల స్థాయినుంచి కణాల స్థాయికి ఇమేజింగ్ ప్రక్రియను (molecular imaging) సాధించిన అత్యంత న్యూతన పరికరము " PECT స్కానర్ . . . అతి చిన్న కణుతులు గుర్తించడానికి , క్యాన్సర్ స్టేజింగ్ లోనూ ఈ పరికరము ప్రముఖ స్థానము ఆక్రమించి ఉన్నది. మమ్మోగ్రఫీ స్కానింగ్ ద్వారా  చేతికి అందని అత్యంత చిన్న కణుతులను గుర్తించవచ్చు. ప్రాధమిక దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే పూర్తి చికిత్స సాధ్యమవుతుంది. 40 ఏళ్ళ పైబడిన స్త్రీలందరు ప్రతి సం. ఈ పరీక్ష చేయించుకోవడము ద్వారా రొమ్ము క్యాన్సర్ గుర్తించి మంచి చికిత్స పొందవచ్చు . కోతలేకుండా చిన్న చిన్న సూదులద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులను నయము చేయవచ్చు. రక్తనాళం ద్వారా సూదిని పంపీంచి చేసే పద్దతిని vascular intervention రేడియోలజీ అంటారు. చర్మము ద్వారాచేసే విధానాన్ని Non - vascular intervention రేడియోలజీ అంటారు . జనబాహుళ్యము లో వున్న యాంజియోప్లాస్టి , స్టెంటింగ్  మొదలైనవి ఈ విభాగము నకు చెందినవే.

స్కానింగ్ సహాయము తో చేసే బయాప్సీలు , వెన్నుపూస ఇంజక్షన్లు , పైత్యరసనాళాలు & మూత్రపిండాల అడ్డంకులను తొలగించవచ్చు . చర్మము ద్వారా సూదుని పంపి కణుతుల్ని నాశనముచేసే పద్దతులు అందుబాటులోకి వచ్చనవి . రేదియేషన్‌ ప్రమాదకరమైనదని ... ఆ తీవ్రతను అతిగా అంచనా వేస్తున్నారు. రేడియేషన్‌ మన జీవితం లో అంతర్భాగమైపోయింది. భూమిలో నుండి , అంతరిక్షములో నుండి రేడియేషన్‌ సదా మనపై ప్రసరిస్తూనే ఉంది. తర్ఫీదు పొందిన రేడియోలజిస్ట్ లు అత్యంత నైపుణ్యము తోనే ఈ పరీక్షలన్ని తక్కువ రేడియేషన్‌ ఉండేటట్లు వాడుతున్నారు.

రేడియోలజీ పరీక్షల వలన ఆడశిశువులను గర్భములో విచ్చిన్నము చేస్తూ ఉన్నారు . ప్రతి మంచి పనికీ కొన్ని చెడు ప్రబావాలు , నష్టాలు ఉంటాయి. మానవులు కొత్త ప్రయోగ పరికాల మంచినే వాడుకోవాలి. చెడు కి దూరముగానే ఉండాలి. 100 సం.లు పైబడే రేడియోలజీ వైద్యశాస్త్రములో ఒక చిన్న భాగము .

 Courtesy with : Dr.varaprasad vemuri and Dr.Srinivas Dandamudi@swati weekly magazine 15-11-2013.

  • =========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Do not postpone exercise,వ్యాయామము విషయమమలలో రేపు అనేది రాదు-ఈ రోజే మనకుంది








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వ్యాయామము విషయమమలలో రేపు అనేది రాదు- ఈ రోజే మనకుంది- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



శరీర ఆరోగ్యం కోసం కొందరు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కొందరు పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు. కొందరు వ్యాయామం గురించి తెలుసుకుంటున్నారు. కానీ నేర్చుకున్నవి వారు ఆచరిస్తున్నారా? ఆ విషయం వారిని అడిగితే, ‘ఈ రోజు మరీ అలసటగా ఉంది. రేపటి నుండి తప్పకుండా చేస్తాను’ అంటూ సమాధానం వస్తుంది.

 నిజంగా రేపు మీరు మార్నింగ్ వాక్‌కి వెళ్తారా? శరీర వ్యాయామం చేస్తారా? ఛాన్స్ లేదు.
 మీకు ఇష్టమైనది చేయకుండా, నీరసంగా కూర్చుంటే, ‘అదేమిటి? బద్దకంగా కూర్చున్నావ్? లే!’ అంటూ మీ మనసే మిమ్మల్ని నిలదీస్తుంది.

 ‘బాధ్యతా రహితంగా ఉన్నాను!’ అనడానికి మీ అహంకారం ఒప్పుకోదు.
 ‘నేను సోమరిపోతును కాదు. రేపు మొదలెడతా’నని అహంకారం మనసుకు నచ్చజెప్పి వంచన చేస్తుంది.కర్నాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ఒక మూఢవిశ్వాసం ఉంది.చీకటిపడ్డాక అక్కడ దెయ్యాలు, పిశాచాలు ఇళ్లలోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయట!

 ఆ భూత పిశాచాలను పారదోలాలని ప్రయత్నిస్తే, వాటికి కోపం వస్తుందట! ఘోరమైన ఫలితాలను చూడాల్సి వస్తుందని అక్కడి ప్రజలకు భయం.అందుకే ఊరి వారంతా ఒక పన్నాగం పన్నారు. దెయ్యాలకు, పిశాచాలకు రక్తపు రంగు ఇష్టం కాబట్టి, ఎర్ర రంగుతో ప్రతి ఇంటి వీధి తలుపు మీద ‘రేపు రా’ అని రాసి పెడతారు.దెయ్యాలు, పిశాచాలు వచ్చి, గుమ్మానికున్న ఆ ప్రకటన చూసి వెళ్లిపోతాయని వారి నమ్మకం.ఈ రోజు అన్నా, ఇప్పుడన్నా, ఫరవాలేదు కాని, ‘రేపు’ అనేది ఎప్పటికీ రాని రోజు కూడా.ఆరోగ్యమూ, జయమూ, ఆనందమే కదా మీకు కావలసినవి. ‘రేపు రా’ అంటే అవి పక్కకు పోతాయి. జాగ్రత్త!

 ‘రేపటి నుంచి’ అనేది మనసుకు మత్తెక్కించే తంత్రం. మీ జీవితంలో, అనేకసార్లు ఈ మాయాతంత్రానికి మీరే స్థానం కల్పించారు. చెయ్యలేనివారికి, రేపు అనేది ఎప్పుడూ మంచిరోజే. రేపు అనే సరికి వారి బాధ్యత ముగిసినట్లే. ప్రారంభించిన పనులను ఏదోలా వాయిదా వేయడం, పార్లమెంట్‌కు కూడా అలవాటు కావడమే, బాధాకరం! గుర్తుంచుకోండి. రేపు అనేది రాదు. ఈ రోజే మనకుంది.

 మరి ఇంతకూ ఈ పరిస్థితినెలా మార్చాలి?
 ఇంటి పనైనా, ఆఫీస్ పనైనా, మన ఆరోగ్యానికి కావలసిన వ్యాయామమైనా, ముందు దానికి అనువైన సందర్భాన్ని సృష్టించుకోవాలి.రాత్రి పది దాటిన తర్వాత, కడుపు నిండా దోసెలు తిని, పొద్దున్న ఆరు ఏడు గంటలలోపు లేచి యోగా చేయాలంటే, వాకింగ్‌కి వెళ్లాలంటే, శరీరం ఎలా సహకరిస్తుంది? తెల్లవారుఝామున నాలుగ్గంటలకే మెలకువ వచ్చేలా, కాస్త తక్కువ తిని చూడండి. మెలకువ వస్తుంది. యోగా చేయగలరు. ‘వాకింగ్ వెళ్దాం రా’ అంటూ శరీరమే పిలుస్తుంది. కొన్ని రోజులిలా చేసి చూస్తే ఫలితం కనబడుతుంది. తర్వాత ఎవరూ చెప్పనక్కరలేదు.మనసులో దృఢమైన సంకల్పం, బయట అనుకూలమైన పరిస్థితి, ఈ రెంటినీ కలిపితే, అనుకున్నవి వాయిదా వేయకుండా చేసుకునే మనోబలం దానికదే వస్తుంది.

 సమస్య - పరిష్కారం
 ఎంత ప్రయత్నించినా సిగరెట్ తాగే అలవాటును వదలలేకపోతున్నాను. దీన్ని వదిలించుకోవడం ఎలా?

 సద్గురు: ఏదైనా విషయాన్ని బలవంతంగా మరచిపోవాలని దృఢంగా నిశ్చయించుకుంటే అదే విషయం మనసంతా ఆక్రమిస్తుంది. ఐదు నిమిషాల పాటు కోతుల గురించి ఆలోచించకూడదని అనుకుంటే, లక్షల కోతులు మీ ఆలోచనలను ఆక్రమిస్తాయి. దురలవాట్లను వదలాలని దృఢంగా అనుకునేవారు కొత్తగా వేరే అలవాట్లకు బానిసలైపోతారు. పొగ తాగడం, మద్యం సేవించడం మరచిపోవాలని ప్రయత్నించడం కాదు. పొగ తాగినా, మద్యం సేవించినా మీ శరీరంలో ఎన్నెన్ని మార్పులొస్తాయో తీవ్రంగా తలచుకోండి. దానితో దురలవాట్లు వాటంతట అవే మిమ్మల్ని వదిలిపోవడం ఖాయం.

Courtesy with : Sakshi news paper November 17, 2013

  • ===========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

colon cancer-పెద్దపేగు క్యాన్సర్‌.








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -colon cancer-పెద్దపేగు క్యాన్సర్‌.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...
హైదరాబాద్ : పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని ‘కోలన్ క్యాన్సర్’ అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు.

 క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది.

 లక్షణాలు / గుర్తించడం ఎలా...
 కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

 సాధారణ లక్షణాలు:
 మలద్వారం నుంచి రక్తస్రావం
 మలం, మలవిసర్జనలో మార్పులు
 అజీర్తి లేదా విరేచనాలు
 పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ పోవడం
 జిగురుతో మలం రావడం
 అకారణంగా నీరసం, బరువు తగ్గడం
 ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)... అయితే ఇక్కడ పేర్కొన్న లక్షణాల్లో అజీర్తి, మలబద్ధకం, నీళ్ల విరేచనాల వంటివి మనలోని చాలామందిలో కనిపించేవే. ముఖ్యంగా మల విసర్జనలో రక్తస్రావం అన్నది పైల్స్ (మూలశంక) వ్యాధి ఉన్నవారిలో చాలా సాధారణం. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, తగిన పరీక్షలు చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అని తేలితే, ముందుగానే గుర్తిస్తారు కాబట్టి నయమయ్యే అవకాశాలు ఎక్కువే. అయితే ఆలస్యం చేసిన కొద్దీ క్యాన్సర్ ఒకచోటి నుంచి మరోచోటికి (అంటే కాలేయం వంటి కీలక భాగాలకు లేదా లింఫ్ గ్రంథులకు) పాకుతుంది. దీన్నే మెటస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ గనక కాలేయానికి లేదా లింఫ్ గ్రంథులకు చేరితే అది చాలా ప్రమాదం. కాబట్టి లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు.

 రిస్క్ ఫ్యాక్టర్లు :
 పెరిగే వయసు
 స్థూలకాయం
 డయాబెటిస్,
 ఫాస్ట్‌ఫుడ్, రెడ్‌మీట్ ఎక్కువగా తీసుకోవడం
 పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం
 పొగతాగడం
 మద్యపానం తల్లిదండ్రుల్లో ఎవరికైనా అంతకుమునుపే కోలన్ క్యాన్సర్ వచ్చి ఉండటం...ఇవీ సాధారణ రిస్క్ ఫ్యాక్టర్లు. సాధారణంగా కోలన్ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడ్డాకే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పైన పేర్కొన్న రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు చిన్న వయసులోనైనా రావచ్చు.

 నిర్ధారణ ఇలా...
 పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పడు వెంటనే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. అప్పుడు డాక్టర్లు రోగిని భౌతికంగా పరీక్షించడంతోపాటు ఫ్యామిలీ, మెడికల్ హిస్టరీని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొలనోస్కోపీ, బేరియమ్ అనీమా, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కొలనోస్కోపీ అంటే సన్నటి గొట్టాన్ని మలద్వారంనుంచి లోపలికి ప్రవేశపెట్టి లోపల ఏవైనా కణుతులు ఉన్నాయేమో చూడటం. ఒకవేళ కణుతులు కనిపిస్తే వాటినుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అక్కడ అవి క్యాన్సర్ కణాలా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. బేరియమ్ మింగించి ఎక్స్‌రే తీస్తే క్యాన్సర్ ఉన్న ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. ఇక స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనే చిన్న పరీక్ష ద్వారా కూడా దీన్ని సులువుగా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ రెక్టమ్ (మలద్వారం)లోనే సమస్య ఉంటే దాన్ని వేలి ద్వారానే డాక్టర్లు చాలా సులువుగా గుర్తించగలరు. ఒకవేళ క్యాన్సర్ సోకినట్లు తెలిస్తే అప్పుడది ఏ మేరకు విస్తరించి ఉందో చూడటానికి పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

 చికిత్స : పెద్దపేగు క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ అనే ప్రక్రియతో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు. ఈ తరహా శస్త్రచికిత్సను ఇప్పుడు కీ-హోల్ (ల్యాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా నిర్వహించవచ్చు. ఇలా చేసిన శస్త్రచికిత్సలో పూర్తిగా కోత అవసరం లేకుండా చిన్న గాటు మాత్రమే ఉంటుంది కాబట్టి రోగి వేగంగా కోలుకుంటాడు. ఒకవేళ కోలన్ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులకూ పాకితే వాటినీ తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ గనక మలద్వారాన్ని గట్టిగా బిగుసుకుపోయేలా ఉంచి, మలాన్ని బయటకు రాకుండా చేసే స్ఫింక్టర్‌కూ వ్యాప్తిస్తే దాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు మలవిసర్జనకు వీలుగా పేగును బయటకు అమర్చాల్సిన శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఇక క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఈ రెండూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తే, కీమోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని గణనీయంగా పెంచవచ్చు.

 నివారణ: దీని నివారణకు చేయాల్సిన పనులు చాలా సులభం. ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు అంటే... రోజూ క్రమబద్ధంగా మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటివి లేకుండా చూసుకోవడం మంచిది. వేళకు సాఫీగా మలవిసర్జన జరగాలంటే శరీరానికి తగినంత వ్యాయామం, కదలికలు ఉండాలి. అందుకే తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. ఇది కేవలం కోలన్ క్యాన్సర్‌కు మాత్రమే కాదు... అన్ని రకాల క్యాన్సర్లకూ నివారణ.

 ఇప్పుడు కోలన్ క్యాన్సర్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా కనుగొంటే  చికిత్స ద్వారా చాలా వరకు నయమవుతుంది. ఒకవేళ ఆలస్యంగా కనుగొన్నా జీవితకాలాన్ని చాలావరకు పొడిగించడం సాధ్యమవుతుంది.

 ఆహారం - ప్రాధాన్యం
 ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే.
 ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే...  కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.


  •  డాక్టర్ సిహెచ్.మోహనవంశీ- చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,- ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్@Sakshi | news paper-October 27, 2013 



  • ========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Monday, November 18, 2013

Care after abortion,గర్భస్రావం తరవాత జాగ్రత్తలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Care after abortion,గర్భస్రావం తరవాత జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    గర్భం దాల్చి అంతా సజావుగా సాగుతోందనుకుంటోన్న సమయంలో.. అబార్షన్‌ జరిగితే కొందరు శారీరకంగానే కాదు.. మానసికంగా నూ డీలా పడిపోతారు. మళ్లీ గర్భం ఎప్పుడు దాల్చొచ్చు? గర్భస్రావం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు..? అంటూ మహిళలకు రకరకాల సందేహాలు కలగడం సహజం. అలాంటి వాటికీ సమాధానాలున్నాయి.

జీవన విధానం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు... ఇంకేదయినా కారణం కావచ్చు... ఈ రోజుల్లో గర్భస్రావం అనేది సాధారణం అయింది. దానంతట అదే జరిగినా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వచ్చినా.. అధ్యయనాల ప్రకారం చెప్పాలంటే ప్రతి ఆరుగురిలో ఒకరికి గర్భస్రావం అవుతోంది. కొందరు దీన్ని తేలిగ్గా తీసుకుంటే, మరికొందరు ఓ సమస్యగా భావిస్తారు. దాన్నుంచి బయటపడేందుకు ఎక్కువ సమయమే తీసుకుంటారు. ఏదేమైనా... ఇలాంటప్పుడే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. .

నొప్పీ.. రక్తస్రావం
..
గర్భస్రావం అనేది సహజంగా జరిగినా, మందులూ లేదా శస్త్ర చికిత్స రూపంలో అయినా... కొద్దిగా నొప్పి సహజం. నెలసరిలో వచ్చినట్లుగా రక్తస్రావం కూడా అయ్యే అస్కారం ఉంది. అయితే ఈ రెండు మార్పులూ రెండు వారాల్లోపల ఆగిపోవాలి. సాధారణంగా వైద్యులు గర్భస్రావం తరవాత వచ్చే నొప్పిని తగ్గించడానికి నొప్పి నివారణ మందుల్ని ఇస్తారు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉండి, రక్తస్రావం కూడా తీవ్రంగా అవుతున్నా, అదే సమయంలో దుర్వాసనతో కూడిన డిశ్చార్జి కనిపించినా, జ్వరంగా ఉన్నా తేలిగ్గా తీసుకోకుండా సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఇన్‌ఫెక్షన్‌కి సంకేతం కావచ్చు. ఈ సమయంలో... రక్తస్రావం పూర్తిగా ఆగిపోయి, సౌకర్యంగా అనిపించేంత వరకూ కలయికలో పాల్గొనకూడదు. రక్తస్రావం కనిపిస్తున్నా కూడా మామూలుగా స్నానం చేయొచ్చు. కొందరు మహిళలు గర్భస్రావమే కదా అన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల్లోనే ఏవో ఒక పనులు చేయడం మొదలు పెడతారు. అయితే సౌకర్యంగా అనిపించేంత వరకూ విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వ్యాయామం చేసే అలవాటు ఉండి... చేయాలీ అనుకుంటే ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

మానసికంగా కుంగిపోకుండా..
గర్భం దాల్చాక, నవ మాసాలూ కొనసాగుతుందనే ఆనందంలో ఉండే మహిళలకు అనుకోకుండా అబార్షన్‌ జరిగితే మానసికంగా కుంగిపోవడం సహజం. దాంతో ఆలోచనలూ, ఉద్వేగాల పరంగా కొంత మార్పు కనిపిస్తుంది. ఇవి కొందరిని తాత్కాలికంగా ఇబ్బందిపెడితే.. మరికొందరిని చాలాకాలం పాటు, తీవ్రంగా వేధిస్తాయి. ఒకవేళ అబార్షన్‌ తాలూకు ఆలోచనల నుంచి ఎంతకీ బయటపడకపోయినా, కుటుంబం లేదా స్నేహితుల నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా, అంతా గందరగోళంగా అనిపిస్తున్నా, దేనిమీదా ఏకాగ్రత కుదరక, నిద్రపట్టక, ఆకలి వేయక ఇబ్బందిపడుతున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే కొందరు ఈ సమయంలో చాలా ఒత్తిడికి లోనవుతారు. మళ్లీ గర్భం దాల్చినా అదే పరిస్థితి ఎదురవుతుందేమో అని భయపడతారు. దాంతో ఏ పనులూ చేసుకోక, ఉద్యోగానికీ వెళ్లక, ఎవరికీ చెప్పుకోకుండా లోలోన మథనపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కాబట్టి అవసరాన్ని బట్టి మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి.

మళ్లీ గర్భం ఎప్పుడంటే..
చాలామంది వెంటనే గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అన్నిసార్లూ అది మేలు చేయకపోవచ్చు. జరిగిన గర్భస్రావం నుంచి ముందు శరీరం పూర్తిగా కోలుకోవాలి. కొన్నిసార్లు అది కొన్ని గంటల్లో జరిగితే, మరికొన్నిసార్లు రోజులూ, వారాలూ పట్టొచ్చు. ఏదేమయినా గర్భస్రావం జరిగి, రక్తస్రావం ఆగిపోయి, మళ్లీ నెలసరి వచ్చిన తరవాత గర్భం దాల్చడం మంచిది. నెలసరి అనేది గర్భస్రావం జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల తరవాత మొదలవుతుంది. అంతకన్నా ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే...

ఒకసారి గర్భస్రావం జరిగాక ఆర్నెల్లలోపు మళ్లీ గర్భం దాల్చితే... అది కూడా మొదటి గర్భధారణ అయితే ఆలోచించవచ్చు. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే.. ఏ మాత్రం ఆలోచించకుండా అంతకన్నా త్వరగా కూడా గర్భం దాల్చవచ్చు. ఆలస్యంగా గర్భం దాల్చేవారితో పోలిస్తే.. త్వరగా తల్లయ్యే వారిలో ఎదురయ్యే సమస్యలు తక్కువే అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ర్రెండు అంతకన్నా ఎక్కువగా గర్భస్రావాలు అయినప్పుడు గర్భం దాల్చేముందు, డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. దానికి గల కారణాలు డాక్టర్లు తెలుసుకుని ముందు జాగ్రత్తగా అవసరమైన చికిత్సలు చేసి, మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూస్తారు. కొన్నిసార్లు గర్భాశయంలో క్యాన్సర్‌కు దారితీయని కణితి పెరుగుతుంది. దాన్ని గర్భం అనుకుంటాం కానీ కాదు. ఇలాంటప్పుడు ఆ కణితిని తొలగించాక వైద్యులు ఆర్నెల్ల నుంచి ఏడాది వరకూ ఆగమని చెబుతారు వైద్యులు. దీన్ని కచ్చితంగా పాటించాలి.

ఈ జాగ్రత్తలూ అవసరమే..
గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పాక.. ముందు మీ బ్లడ్‌గ్రూప్‌ని తెలుసుకునేందుకు రక్తపరీక్ష చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్‌ కాకుండా నెగిటివ్‌ బ్లడ్‌ టైప్‌ అని తేలితే ఆ మహిళలు యాంటీ డి ఇంజెక్షన్‌ని గర్భస్రావం తరవాత తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో సమస్యల్ని కొంతవరకూ నివారించవచ్చు. కొందరికి గర్భస్రావం ఒకసారే అయితే, ఐదు శాతం కన్నా తక్కువమందికి రెండుసార్లు కావచ్చు. ఒకశాతం మాత్రమే అంతకన్నా ఎక్కువసార్లు అబార్షన్లు అవుతాయి. అయితే ఒకేసారి అయినా.. అంతకన్నా ఎక్కువసార్లు జరిగినా.. మళ్లీ గర్భం దాల్చి, అది ఏ ఆటంకం లేకుండా నవమాసాలూ కొనసాగాలనుకుంటే కొన్ని అంశాలపై శ్రద్ధ పెట్టాలి.

ముందునుంచీ ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని పాటించాలి. సాధ్యమైనంత వరకూ అన్నిరకాల పోషకాలు లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. వైద్యులు చెప్పాక రోజులో కనీసం అరగంట ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం కూడా మానసికంగా సాంత్వనను అందిస్తుంది. అప్పుడే కాబోయే తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంటుంది.

గర్భధారణకు కనీసం కొన్ని నెలల ముందునుంచీ ఫోలిక్‌యాసిడ్‌ని తీసుకోవడం మంచిది. అది ఎప్పుడనేది డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి.
కారణాలు తెలిపే పరీక్షలున్నాయి..
ఒకటికన్నా ఎక్కువగా గర్భస్రావాలు జరిగితే మళ్లీ అలాంటి సమస్య ఎదురుకాకుండా దానికి కారణాలు తెలుసుకున్న తరవాత గర్భం దాలిస్తే, పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. పరిస్థితిని బట్టి వైద్యుల సలహాతో కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిది. ముఖ్యంగా హార్మోన్లూ, రోగనిరోధశక్తికి సంబంధించిన సమస్యల్ని తెలుసుకునేందుకు వైద్యులు రక్త పరీక్షలు సూచించవచ్చు. దాంతోపాటూ కొన్నిసార్లు భార్యాభర్తల నుంచి రక్తాన్ని సేకరించి కూడా కొన్నిరకాల పరీక్షలు చేస్తారు. ఫలితంగా క్రోమోజోమ్‌ల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అవసరాన్ని బట్టి గర్భస్రావం జరిగాక ఆ కణజాలాన్ని కూడా పరీక్ష చేయొచ్చు. ఇవి కాకుండా గర్భాశయం పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ కూడా చేస్తారు. కొన్నిసార్లు గర్భాశయ గోడల్నీ, ఫెల్లోపియన్‌ ట్యూబుల పనితీరునూ అంచనా వేసేందుకు టెలిస్కోప్‌ ఆకారంలో ఉండే చిన్న పరికరాన్ని గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతిని హిస్టెరోస్కోపీ అంటారు. పరిస్థితిని బట్టి సోనోహిస్టెరోగ్రామ్‌ పద్ధతినీ ఎంచుకోవచ్చు. దానివల్ల గర్భాశయ పొరల్లో ఉన్న సమస్యల్నీ తెలుసుకునే అవకాశం ఉంది.

courtesy with : Dr.Pranathi reddy (Uro gynaecologist)@vasundara of eenadu news paper.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 12, 2013

Tension in women-awareness,స్త్రీలు ఒత్తిడి వలలో పడకుండా అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Tension in women-awareness,స్త్రీలు ఒత్తిడి వలలో పడకుండా అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    తలనొప్పిగా ఉంటే ఓ మాత్ర వేసుకుంటాం. జలుబు చేసినా, జీర్ణ సంబంధ సమస్యలు ఎదురైనా వాటిని నివారించే పరిష్కారాలు ఆలోచిస్తాం. అయితే అవి ఒత్తిడి వల్ల ఎదురవుతున్నాయని ఎప్పుడూ అనుకోం. తగిన జాగ్రత్తల్ని తీసుకోం. ఉద్యోగినుల్నే కాదు... గృహిణుల్ని సైతం ఇబ్బందిపెట్టే ఒత్తిడిని తగ్గించుకోకపోతే... శారీరక, మానసిక సమస్యలు తప్పవు. అందుకే వెంటనే దాన్ని తగ్గించుకునే మార్గాలను తెలుసుకుని, ఆచరణలో పెట్టాలి.

'ఒత్తిడి..'
ఉద్యోగినుల్ని మాత్రమే వేధిస్తుందని అనుకుంటారు చాలామంది. కానీ ఇంటిదగ్గర ఉండే మహిళల్నీ ఇబ్బందిపెడుతుందీ సమస్య. చేసే పనులొక్కటే కాదు పెరిగిన వాతావరణం, శారీరకంగా జరిగే మార్పులూ, సామాజిక పరిస్థితులూ లాంటివెన్నో కూడా ఒత్తిడికి దారి తీస్తాయి. స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారు కానీ.. ఉద్వేగాల పరంగా కుంగదీసే ప్రయత్నం చేస్తే త్వరగా ఒత్తిడికి లోనవుతారు.

ఎన్ని సమస్యలున్నా...
ఒత్తిడి మానసికంగా ఎదురవుతుందనేది కొంతవరకే. కౌమారంలో మొదలయ్యే రుతుక్రమం నుంచి మెనోపాజ్‌ వరకూ వివిధ దశల్లో చోటు చేసుకునే శారీరక మార్పులూ, చుట్టూ ఉండే పరిస్థితులూ, హార్మోన్ల పనితీరూ ఉద్వేగాలపై ప్రభావం చూపుతాయి. అవే ఒత్తిడికి దారితీస్తాయి. ఇంట్లో ఇద్దరు పిల్లల్నీ సమానంగా చూస్తున్నాం అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ తమకు తెలియకుండానే మగపిల్లలతో పోల్చి కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని చిన్నచూపు చూస్తారు. 'ఆడపిల్లవి అలా చేయకూడదు..' అంటూ నిబంధనలు పెడతారు. పదేపదే 'నువ్వే సర్దుకుపోవాలి మరి...' అని మాటలూ, చేతలతో నిర్దేశిస్తారు. చదువై ఉద్యోగంలో స్థిరపడ్డాక డెడ్‌లైన్లు చేరుకోవడం, పోటీని తట్టుకోవడం, పదోన్నతులు పొందే ప్రయత్నం వంటి సమస్యలెన్నో. వీటికి తోడు పెళ్లయ్యాక పెరిగే బాధ్యతల గురించి చెప్పక్కర్లేదు. భార్యగా, ఉద్యోగినిగా, తల్లిగా... ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాలి. గృహిణులకూ ఉద్యోగ విధులు తప్ప ఇంచుమించు ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. పైగా చాలామందికి భాగస్వామి నుంచి సహకారం అందదు. వీటన్నిటితో చాలాసార్లు మహిళలు బాగా అలసిపోతారు. ఆందోళనకు గురవుతారు. రకరకాల పనులూ... శక్తికి మించి చేయాల్సి వచ్చినా 'తప్పదు మరి' అనుకుంటూ చేసుకుపోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడికి లోనుచేస్తాయి.

చిరాకు నుంచి రక్తపోటు దాకా...
మనసు బాగా లేకపోతే ఆ ప్రభావం ముందుగా శరీరంపైనే పడుతుంది. ఒత్తిడి లక్షణాలు అనగానే కోపం, చిరాకూ, అసహనం.. లాంటివే చెబుతారు. అవి చాలా చిన్నవి. తరచూ తలనొప్పి రావడం, వికారంగా అనిపించడం, నిస్సత్తువకు లోనవడం, రోగనిరోధక శక్తి తగ్గి జలుబూ జ్వరం... గుండె దడా... అజీర్ణం... అధిక రక్తపోటూ, థైరాయిడ్‌, ఎసిడిటీ వంటివి మరికొన్ని సమస్యలు. పీసీఓడీకి కొన్నిసార్లు ఒత్తిడీ కారణం అవుతుందని అధ్యయనాలు తెలిపాయి. దీనివల్ల నెలసరి సమస్యలు బాధపెడతాయి. ఒత్తిడితో కొందరు అతిగా తింటే.. మరికొందరు అసలు తీసుకోరు. దీనివల్ల వూబకాయం, రక్తహీనతకు గురవుతారు. 'ఈ మధ్య సరిగ్గా నిద్ర పట్టడం లేదు' అని చాలామంది అంటుంటారు. అందుకు గల కారణాలను పరిశీలించుకుంటే కచ్చితంగా ఒత్తిడి ముందుంటుంది. సైనస్‌, ఉబ్బసం లాంటివి శాశ్వతంగా తగ్గకపోవచ్చు కానీ.. ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల వాటి తీవ్రత చాలామటుకు అదుపులోకి వచ్చేస్తుంది. అలాగే ఒత్తిడిలో ఉండే గర్భిణులకు తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. ఒత్తిడి వినడానికి చిన్న పదమే. కానీ చిక్కు సమస్యలకు కారణమవుతుంది. అధ్యయనాల ప్రకారం విపరీతంగా ఒత్తిడి ఉన్నవారిలో మధుమేహం, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే సాధ్యమైనంత త్వరగా దాన్ని అదుపు చేసుకోవాలి. ఒత్తిడిని చిత్తు చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలించి, ఆచరణలో పెట్టాలి.
ఇలా చిత్తు చేద్దాం...
మీకోసం రోజుకో అరగంట: ఇల్లూ, ఆఫీసూ, పిల్లల బాధ్యతలూ... అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే పనుల జాబితా చాలానే ఉంటుంది. ఎంత చేసినా, కొత్తవి వచ్చి చేరుతూనే ఉంటాయి. అయినా ఆ పనుల ప్రవాహంలో పడిపోకూడదు. ముఖ్యమైన పనులు చేస్తూనే, వ్యక్తిగత అభిరుచులకూ కొంత సమయం కేటాయించుకోవాలి. టొరంటోకి చెందిన ఓ అధ్యయనం, 'మనసుకు నచ్చిన పనుల్లో ఏదో ఒకదానికి రోజూ కనీసం అరగంట కేటాయించండి. శరీరంలో ఉత్సాహాన్ని నింపే హార్మోన్లు విడులవుతాయి. ఒత్తిడి దూరమై, భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి సొంతమవుతుంది' అని తెలిపింది.
మథనపడితే నష్టమే: చాలామంది ఒత్తిడికి గురవుతారు. బాధ పడతారు. ఆరోగ్య సమస్యలకు లోనవుతారు. కానీ ఎవరితో పంచుకోరు. ఎందుకలా? ఒత్తిడి మన మీద స్వారీ చేయకుండా చూసుకోవడం మన చేతుల్లో పనే. శక్తికి మించిన పనులు ఉన్నాయి అనిపించినప్పుడు తగ్గించుకునే మార్గం ఆలోచించాలి. ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల సాయం తీసుకోవాలి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం కోరాలి. ఎలాంటి సమస్య ఉన్నా జీవిత భాగస్వామితో చర్చించాలి. అవసరాన్ని బట్టి సన్నిహితులూ, నిపుణుల సాయం పొందాలి. మనసులో భారంగా మాత్రం మిగుల్చుకోకూడదు.
అధ్యయనాలను గమనించండి: ఉదయం పూట టిఫిన్‌ చేయరు. వేళకు భోంచేయరు. తగినంత నిద్ర ఉండదు. మహిళలకు సంబంధించిన చాలా అధ్యయనాలు వెల్లడించిన వాస్తవాలివి. కారణం... పనుల ఒత్తిడి. ఈ తీరు పోషకాహార లేమికి గురి చేస్తుంది. ఒత్తిడికీ కారణమవుతుంది. అందుకే మీ పనుల జాబితాలో వేళకు భోంచేయడం, తగిన సమయం నిద్రపోవడం చేర్చుకోవాలి. యోగా, ధ్యానం జీవనశైలిలో భాగం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి పనుల్లో సాయం, మద్దతూ లభించనప్పుడు 'వాళ్లంతే' అని వదిలేయకుండా... మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఇది కష్టమైన పనే... కానీ మన ఆరోగ్యం కోసం ప్రయత్నించక తప్పదు.
నేను బాగుండాలి అనుకోవాలి: జీవితమే కాదు... చుట్టూ ఉండే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా 'నేను సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అనే అనుకోవాలి. అది సెల్ఫ్‌ హిప్నాటిజంలా పని చేస్తుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తే ఒత్తిడికి లోనయ్యే అవకాశం తగ్గుతుంది.

ఇవన్నీ పాటించడం వల్ల ఒత్తిడి తగ్గాలి. ఆ సానుకూల పరిస్థితి కనిపించకపోతే మానసిక నిపుణుల్ని సంప్రదించాలి. మొదట కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒత్తిడి తగ్గడానికి మందుల్ని సూచిస్తారు. స్ట్రెస్‌ మేనేజిమెంట్‌ చికిత్సనీ అందిస్తారు. అంటే... మాటలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తారు. అవసరాన్ని బట్టి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌, రిలాక్సేషన్‌ థెరపీ ఇస్తారు.

  • courtesy with:Dr.Poornima Nagaraj-clinical psychologist@vasundara of Eenadu news paper 11-11-13.
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, November 7, 2013

Hints to prevent eye strain during reading,చదువుకొనేటప్పుడు కళ్లు అలసిపోకుండా జాగ్రత్తలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints to prevent eye strain during reading,చదువుకొనేటప్పుడు కళ్లు అలసిపోకుండా జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చదువులూ, పోటీ పరీక్షలు అంటూ విద్యార్ధులు పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటారు. మరి దీని వల్ల కళ్లు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తుతాయి. అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

గదిలో లైటు కాంతి కాగితం మీద పడకుండా చూసుకోవాలి. దానికి కాస్త దూరంగానే కూర్చోవాలి.

పగటి పూట చదువుకొనేటప్పుడు కిటికీలకూ దూరంగా కూర్చోవాలి. కిటికీ అద్దాల వెలుతురు కళ్ల మీద పడకుండా చూసుకోవాలి. అది కళ్లకు హాని చేస్తుంది.
చదువుకొనేటప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

ఆరుబయట నడుస్తూ చదువుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ సూర్యకిరణాల ప్రభావం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. దానికి బదులు నీడలో చదవడం మంచిది.

పడుకొని చదువుతుంటారు. దీని వల్ల కళ్లు లాగేస్తుంటాయి. అందుకే కుర్చీలో కూర్చుని, లేదా గోడకు ఆనుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ కూడా నొప్పి కూడా రాదు. ఏకాగ్రత కుదురుతుంది.

చల్లటి నీళ్లూ, ఒక మెత్తటి వస్త్రం పక్కన పెట్టుకోవాలి. కళ్లు మంటగా అనిపించిన ప్రతిసారీ ఆ వస్త్రాన్ని నీళ్లలో ముంచి కళ్ల మీద పెట్టుకోవాలి. ఫలితంగా కళ్లు వాయకుండా ఉంటాయి. చల్లదనం వల్ల నరాలకు సాంత్వన కలుగుతుంది. అలసట దూరమవుతుంది.

రోజుకు పదహారు గంటలు చదివే వాళ్లు వైద్యుల సలహా మేరకు అద్దాలు వాడాలి.
  • ================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 4, 2013

pregnancy general problems-awareness,గర్భిణుల్లో సాధారణంగా కనిపించే సమస్యలు-అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - pregnancy general problems-awareness,గర్భిణుల్లో సాధారణంగా కనిపించే సమస్యలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



గర్భం దాల్చగానే సరిపోదు. నవమాసాలూ ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలి. అప్పుడే పండంటి పాపాయిని ఎత్తుకుంటాం. కానీ అందరి విషయంలో అలా జరగదు. రకరకాల కారణాల వల్ల ఆ తొమ్మిది నెలల కాలంలోనే కొన్ని సమస్యలు ఇబ్బందిపెడతాయి. కాబోయే తల్లీబిడ్డలిద్దరిపైనా ప్రభావం చూపుతాయి. కొన్నిరకాల ముందుజాగ్రత్తలూ, మరికొన్ని పరిష్కారాలతో ఆ సమస్యల్ని అదుపులో ఉంచొచ్చు..

ఉద్యోగాలు చేయడం, వృత్తిపరంగా లక్ష్యాలు పెట్టుకోవడం, ఆర్థికంగా స్థిరపడాలనుకోవడం.. ఇలా కారణం ఏదయినా చాలామంది మహిళలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇంకా ఆలస్యంగా గర్భం దాల్చేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో కొన్నిసార్లు గర్భం రాక ప్రత్యేక చికిత్స తీసుకోక తప్పడంలేదు. ఈ మార్పులన్నీ కాబోయే తల్లిలో అధికరక్తపోటు, మధుమేహం.. లాంటి సమస్యల్ని పెంచుతున్నాయి. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది అధికరక్తపోటు గురించి.

అధిక రక్తపోటు...
గర్భిణుల్లో సాధారణంగా కనిపిస్తుందీ సమస్య. కొందరిలో ముందునుంచీ ఉంటే, మరికొన్నిసార్లు గర్భధారణ సమయంలో ఎదురవుతుంది. ఒకవేళ ముందే మొదలై ఉంటే సమస్య నవమాసాలూ, ఆ తరవాత కూడా కొన్ని వారాలు కొనసాగుతుంది. కేవలం గర్భధారణ సమయంలో వస్తే.. ప్రసవానంతరం దానంతట అదే తగ్గిపోతుంది. ఎప్పుడు మొదలైనా దానివల్ల కొన్ని సమస్యలు తప్పవు.

అధికరక్తపోటు ఉన్నప్పుడు మాయకు రక్తప్రసరణ సక్రమంగా అందదు. దాంతో గర్భస్థశిశువుకు ప్రాణవాయువూ, పోషకాల్లాంటివి అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. తక్కువ బరువుతో పుడతారు. నెలలు నిండకుండానే కాన్పు కావచ్చు.

కొన్నిసార్లు గర్భాశయం నుంచి మాయ విడిపోతుంది. శిశువుకు ప్రాణవాయువు సరిగ్గా అందదు. తల్లిలోఅధికరక్తస్రావం మొదలవుతుంది. ఈ సమస్య కొందరిలో విపరీతంగా ఉంటుంది. దాంతో మూత్రం నుంచి ప్రొటీన్లు వెళ్లిపోతుంటాయి. ముఖం, కాళ్లలో వాపు ఉంటుంది. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తరచూ తలనొప్పి రావడం.. చూపు మసగ్గా ఉండటం... పై పొట్ట నొప్పీ... హఠాత్తుగా బరువు పెరగడం... ముఖం, చేతుల వాపులాంటి సమస్యలు కనిపిస్తాయి.

మాత్రలు వాడాలి: గర్భధారణ సమయంలో వేసుకునే మాత్రలు బిడ్డపైనా ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో డాక్టర్లు సాధారణంగా ఇతర మందుల్ని సూచించరు. కానీ అధికరక్తపోటు అదుపులో ఉండాలంటే మాత్రలు తప్పనిసరి కాబట్టి వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకుని కొన్నిరకాల మాత్రల్ని సూచిస్తారు.

ఉప్పు తగ్గించాలి: గర్భధారణకు ముందే ఈ సమస్య ఉంటే వైద్యులకు తెలియజేయాలి. దాన్ని బట్టి వాడుతున్న మందుల్ని కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. మందుల్ని క్రమం తప్పకుండా వేసుకోవాలి. గర్భం దాల్చిన తొమ్మిదినెలలూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఎప్పకటిప్పుడు బీపీని గమనించుకోవాలి. తరచూ మూత్ర, రక్తపరీక్షలు చేయించుకోవడమూ అవసరమే. ఎప్పటికప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లు చేస్తూ పాపాయి ఆరోగ్యాన్నీ వైద్యులు గమనిస్తారు. బిడ్డ గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకుంటారు.

నిపుణుల సలహాతో వ్యాయామం చేయాలి. గర్భధారణ సమయంలో కాబోయే తల్లి బరువు పదకొండు నుంచి పదహారు కిలోలు పెరిగితే సరిపోతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రసవ సమయంలో అధికరక్తపోటు పెరగకుండా డాక్టర్లు ఎప్పటికప్పుడు గమనిస్తారు. లేబర్‌ ఇండక్షన్‌ ప్రక్రియను ఎంచుకుంటారు. అంటే ఇంజెక్షన్లు ఇచ్చి ప్రసవం అయ్యేలా చేస్తారు. ఒకవేళ సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఫిట్స్‌ రాకుండా మాత్రలు ఇచ్చి సిజేరియన్‌ చేస్తారు.

మధుమేహం
గర్భిణుల్లో కనిపించే మరో సమస్య మధుమేహం. ముందునుంచీ ఉన్నా లేక ఆ సమయంలోనే కనిపించినా గైనకాలజిస్టుతోపాటూ ఎండోక్రైనాలజిస్టు, డైటీషియన్‌ సలహాలు తీసుకుంటూ ఉంటే సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయి. ఫలితంగా..గర్భస్రావం అవకుండా చూసుకోవచ్చు. తల్లిలో అధికరక్తపోటు అదుపులో ఉంటుంది. కాబోయే తల్లిలో ఇతర సమస్యలూ తగ్గుతాయి. తొమ్మిదినెలలు గడిచాక కూడా పాపాయి దక్కకపోవడం లాంటి సమస్యల్నీ అధిగమించవచ్చు.

నెలలు నిండకుండా కాన్పు అయ్యే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. పుట్టబోయే పాపాయికి దృష్టిలోపాలు ఎదురవకుండా, మెదడూ, వెన్నెముక, గుండె పనితీరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.

ఒకవేళ రక్తంలో చక్కెరస్థాయులు సమతూకంలో లేకపోతే ఆ ప్రభావం మాయపై పడుతుంది. శరీరంలో అదనంగా ఇన్సులిన్‌ తయారీ అవసరం అవుతుంది. దాంతో బిడ్డ బరువు పెరుగుతుంది. ఫలితంగా కొన్నిసార్లు సహజ కాన్పు కాకపోవచ్చు.

కొన్నిసార్లు కాబోయే తల్లులకు గర్భధారణ సమయంలో మధుమేహం ఎదురైనా.... ప్రసవానంతరం అది తగ్గుతుంది.

ముందు జాగ్రత్తలున్నాయి: ఈ సమస్య ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరస్థాయుల్ని పరీక్షించుకోవాలి. తదనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారం.. వికారంతో అయ్యే వాంతుల్ని బట్టి గర్భిణికి ఇన్సులిన్‌ని ఎంత మోతాదులో ఇవ్వాలనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆహారంలో పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాలూ ఎక్కువగా ఉండాలి. ఓ పద్ధతి ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. ఫోలిక్‌యాసిడ్‌ లాంటి పోషకాలనూ వాడాల్సి ఉంటుంది. అలాగే నడక, యోగాసనాలు లాంటి వ్యాయామాలు వారంలో కనీసం ఐదురోజులు అరగంట చొప్పున చేయాలి. బిడ్డ ఆరోగ్యాన్ని గమనించేందుకు ఎప్పటికప్పుడు స్కాన్‌ చేయించుకోవడం కూడా అవసరమే.

ప్రసవంపై ప్రభావం: పరిస్థితిని బట్టి కొన్నిసార్లు కాన్పు సహజంగా అయ్యేవరకూ ఆగుతారు. లేదంటే తల్లీబిడ్డల ఆరోగ్య దృష్ట్యా ముందే చేయాల్సీ రావచ్చు. ఒకవేళ బిడ్డ మరీ బరువుంటే సిజేరియన్‌కి ప్రాధాన్యం ఇస్తారు.

ఒత్తిడి అదుపులో: గర్భధారణకు ముందే వైద్యులకు పరిస్థితిని వివరించి వారు సూచించిన మందుల్ని వాడాలి. శారీరక శ్రమ ఉండాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. కెఫీన్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. గర్భం దాల్చకముందే వైద్యుల్ని సంప్రదిస్తే ఫోలిక్‌యాసిడ్‌ని ఎక్కువ మోతాదులో సూచిస్తారు. దానివల్ల నాడీ సంబంధ సమస్యల్లాంటి వాటిని తగ్గించుకోవచ్చు. అలాగే నవమాసాల సమయంలోనూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

గర్భధారణ సమయంలో ఉబ్బసం--
వాస్తవానికి ఇది వూపిరితిత్తుల సమస్య. పుట్టబోయే పిల్లలపైనా దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు,
* పుట్టబోయే పాపాయికి ప్రాణవాయువు సరిగ్గా అందదు. మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఎక్కువగా కనిపిస్తుంది. రక్తపోటు పెరుగుతుంది.
* బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. నెలలు నిండకుండానే కాన్పు అవడమే కాదు... ప్రసవం కూడా కష్టం అవుతుంది.

వేటికి దూరంగా ఉండాలి: దీని లక్షణాలు తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. గర్భం దాల్చిన వెంటనే వేసుకునే మందుల్ని మానేయడం, లేదా మార్చడం లాంటివి ఈ సమస్యని పెంచుతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు నవమాసాలూ చికిత్స తీసుకోవచ్చు. అది ఏ పద్ధతిలో ఎలాగా అనేది డాక్టర్లే నిర్ణయిస్తారు. పొగ, దుమ్మూ, మంచూ, పుప్పొడీ, జంతువుల నుంచి వచ్చే జుట్టు లాంటి వాటికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహాతో వ్యాయామాన్ని చేయాలి. తరచూ దగ్గు వస్తున్నా, ఛాతీలో పట్టేసినట్లు ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించినా తేలిగ్గా తీసుకోకూడదు.

 మూర్ఛ -
కొన్నేళ్ల క్రితం మూర్ఛ ఉన్న స్త్రీని పిల్లలు కనేందుకు ప్రోత్సహించేవారు కాదు. కానీ ఇప్పుడా సమస్య ఉన్నవారిలో తొంభైశాతం మంది పండంటి పాపాయిలకు జన్మనిస్తున్నారు. అయితే మూర్ఛ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే..
* మాయ ముందే విడిపోవచ్చు. అధికరక్తపోటూ తప్పదు. మూత్రం ద్వారా ప్రొటీన్‌ బయటకు పోతుంది.
* తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, ప్రసవ సమయంలో ఇబ్బంది..
* బిడ్డలో ఇతర సమస్యలూ ఎదురవుతాయి.

వాస్తవానికి ఇలాంటి వారు గర్భధారణ సమయంలో ఏ తరహా మందులు వాడినా అవి పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతాయి. నాడీ సంబంధ సమస్యలూ, గుండెకు అసౌకర్యం.. లాంటివి వాటిల్లో కొన్ని. అలాగని మందులు మానేస్తే గర్భస్రావం, నెలలు నిండినా బిడ్డ దక్కకపోవడం లాంటివి తప్పవు. వైద్యులు ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే మందులు సూచిస్తారు.

Courtesy with : Dr.Pranati Reddy , Uro-Gynaecologist , Hyd. @Vasundara of Eenadu paper
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, November 1, 2013

Post delivery rest and care, బాలింతరాల విశ్రాంతి-జాగ్రత్తలు ,ప్రసవం తరువాత జాగ్రత్తలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --బాలింతరాలు పాటించవలసిన జాగ్రత్తలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

ప్రసవం తర్వాత...
దీనిని బాలెంత కాలము లేదా సూతికా కాలము (పోస్టు పార్టం పీరియడ్ ) అంటారు . .
  నార్మల్ డెలివరి తర్వాత రెండు, మూడు గంటల తర్వాత ఆహారాన్ని ఇవ్వాలి. సిజేరియన్ అయితే తల్లి కండిషన్ ను బట్టి లేచి కూర్చోవాలని డాక్టర్లు సూచిస్తారు. వారికి ఒక రోజు తర్వాత ఆహారాన్ని అందిస్తారు. ప్రసవం అయిన తర్వాత మూడు నెలల్లో సుమారు ఒక లీటరు పాలు పడతాయి. ఈ క్రమంలో బిడ్డకు పాలందించాలంటే ఐరన్, కాల్షియం, బి- కాంప్లెక్స్ మాత్రలు అదనంగా తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.దానివల్ల బిడ్డకు పోషకాలు అందుతాయి.
సిజేరియన్ అయిన తర్వాత ఇన్ ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బిపి, బ్లీడింగ్ సమస్యలు ఉంటే.. రక్తం గడ్డకట్టకుండా ఉండకుండా సిజేరియన్ (ఆర్టీ అంబ్యులేషన్) అయిన తర్వాత నడిపిస్తారు.

ఆపోహలు....
 ప్రసవం తర్వాత.... మంచినీరు ఇవ్వొద్దు.. ఒక్కపూటే భోజనం.. అన్ని రకాల భోజనం ఇవ్వొద్దు, సరియైన భోజనం ఇవ్వకుండా పత్యం పాటించడం... వీటన్నింటినీ వదిలేసి వైద్యుల పర్యవేక్షణలో సలహాలను తీసుకుంటే ఆరోగ్యం మన చెంతనే ఉంటుంది.

స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన తరువాత 21రోజుల నుంచి 42 రోజుల పాటు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెను బాలింత లేదా బాలెంతగా వ్యవహరిస్తారు. ప్రసవం (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ (Infection) మూలంగా వస్తుంది.


ప్రసవం తర్వాత తల్లి పోషకాహారం తీసుకోవ డం మంచిది. ప్రసవానంతరం తల్లి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తగినన్ని న్యూట్రీషియన్స్‌ ఉం డేటట్లుగా చూసుకోవాలి. ఇవ్వాలి. ఉదా హరణకు నీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. అటువంటి అలవాటు జీర్ణక్రియను సులభ తరం చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచు తుంది. శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. దాంతో మలబద్ధక సమస్య కొంత మేరకు పరిష్కార మతుంది. ఏదిఏమై నా వైద్యనిపుణుల సహాయం పొందడం చాలా సమయాల్లో మేలు చేస్తుంది.

ఆహారం-ప్రాధాన్యత :సాదారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తలు పాటిస్తూ మంచి పోషక విలు వలున్న ఆహారం తీసుకోవాలి.తీసుకునే ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండేలా చూసు కోవాలి. ఎందుకంటే పుట్టే సమయంలో ఎక్కు వ రక్తాన్ని కోల్పోతారు. కాబట్టి ఐరన్‌ పుడ్స్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కావ ల్సిన కాల్షియాన్ని మన శరీరం పొంద గలుతుంది.

విటమిన్స్‌:
1. విటమిన్‌ బి9: పోస్ట్‌ నేటల్‌ విటమిన్‌ను ఫోలిక్‌ ఆసిడ్‌ అనికూడా పిలుస్తారు. ఈ పోల్లెట్‌ (టాబ్లెట్‌) ను గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకూ కూడా తీసుకుంటారు. ఎందుకంటే శిశువు నాడీవ్యవస్థ క్రమంగా ఉండటానికి ఇది చాలా అవసరం. కాబట్టి ఈ విటమిన్‌ సప్లిమెంట్‌ను ప్రసవం అయిత తర్వాత కూడా కొద్ది రోజులు కొనసాగించడం తల్లీ బిడ్డకు ప్రయేజనం.
2.విటమిన్‌ ఎ: ప్రసవం తర్వాత జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. అలాగే పోస్ట్‌ నేటల్‌ సమయంలో ఎక్కువ ఒత్తిడికి గురిఅవుతుండం వల్ల కూడా జుట్టు అధికం గా రాలిపోతుంటుంది. కాబట్టి ఆరోగ్యకర మైన జుట్టు మరియు చర్మ సంరక్షణకు విటమిన్‌ ఎ ఎంతగానో ఉపయోగపడు తుంది.
3. విటమిన్‌ సి: ప్రసవించిన మహి ళలకు తాజా పండ్లు చాలా ఉపయోగకరం. ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి మరియు ఎసెన్సియల్స్‌ పాలిచ్చే తల్లులకు చాలా అవసరం. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
4. విటమిన్‌ డి: ప్రసవానంతరం మహిళలు తిరిగి శక్తిని పొందడానికి, నరాలు, ఎము కలు బలపడటానికి క్యాల్షియం చాలా అవ సరం. ప్రసవం తర్వత మహిళల్లో చాలా వరకూ క్యాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి శరీరానికి కావల్సిన క్యాల్షియం పొందడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. 5. విటమిన్‌ ఇ: విటమిన్‌ ఇ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ బాలింతలకు చాలా బాగా సహాయపడుతాయి. సెల్‌ డ్యామేజ్‌ను తిరిగి పునరుత్పత్తి చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ను ఎవరెవరు ఎంతవరకు వాడాలన్నది వైద్యులు నిర్ధారించవలసి ఉంటుంది.

వ్యాయమం తప్పనిసరి:

ప్రసవానంతరం శారీరక ఆరోగ్యం కాపాడుకునేందుకు బాలిం తలు వ్యాయమం చెయాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. ఆ జాగ్రత్తలు ఎందుకంటే-

బరువు తగ్గుట:

కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే వ్యాయమం తప్పని సరి. పాలు ఉత్పత్తి:

ఆమెలో పాలగ్రంధులు అధిక ఉత్పత్తి చేయాలంటే తగిన జాగ్రత్తలు అవసరం. వైద్య నిపుణుల సలమా పాటించి, తగిన మందులు, వ్యాయమం పొందడం వల్ల పాలగ్రంధులకు రక్తప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది.

కండరాలు బిగువు:

కాన్పు సమయంలో అమె కండరాలు వదులవుతాయి. కాన్పు తర్వాత చేసే వ్యాయమాలు కండరాలు మరోమారు ఫిట్‌నెస్‌ సంతరించుకుంటాయి.


శస్త్రచికిత్స తరువాత నొప్పి ఉంటుందా?----Carserian opetation pain

కొంతవరకు ఉంటుందనే చెప్పాలి. శస్త్రచికిత్స సమయంలో పొట్టపై గాటు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటిలాగా చురుగ్గా ఉండలేరు. పుట్టిన శిశువు పట్ల సరైన శ్రద్ధ వహించడం కష్టమవుతుంది. అందుకే ఆపరేషన్ తరువాత వచ్చే నొప్పిని అదుపులో ఉంచాలి.

నొప్పిని అదుపులో ఉంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నొప్పిని తగ్గించడానికి నోటి ద్వారా లేదా సిరల ద్వారా మందును ఇస్తారు. కడుపునొప్పిని ఎక్కువసేపు భరించే శక్తి లేకుంటే నోటి ద్వారా మందును అందివ్వడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి రీజనల్ మత్తుమందుతో పాటుగా ఆపరేషన్ కి ముందే నొప్పి తగ్గించే మందును కూడా ఇవ్వవచ్చు.
సర్జరీ తరువాత కూడా అనస్తీషియాలజిస్టు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. సిజేరియన్ డెలివరీ కోసం మీరు తీసుకున్న మత్తుమందు రకాన్ని బట్టి కూడా నొప్పి తగ్గించే మందు ఇచ్చే పద్ధతి ఆధారపడి ఉంటుంది. రీజనల్ గా ఇచ్చే మత్తుమందు తీసుకుంటే నొప్పిమందును వెన్నుముక బాహ్యపొర నుంచి ఎపిడ్యురల్ పద్ధతి ద్వారా అందిస్తారు. ఇది సర్జరీ తరువాత కూడా 18 గంటల వరకూ పనిచేస్తుంది. తల తిరగడం, మగతగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపించవు. ఒకవేళ జనరల్ అనస్తెటిక్ తీసుకుంటే సాధారణంగా నొప్పి మందును సిరల ద్వారా ఇస్తారు. ఆపరేషన్ తరువాత మొదటిరోజు మాత్రం నోటి మత్రల ద్వారా నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తారు.

నొప్పి తగ్గించే మందు వల్ల దుష్ప్రభావాలుంటాయా?
సాధారణంగా నొప్పి తగ్గించే మందులు చైతన్యాన్ని హరించే నార్కోటిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటివల్ల దురద, వికారంగా ఉండడం, శ్వాస పడిపోవడం, మలబద్దకం లాంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి. కాకపోతే వీటి తీవ్రత చాలా తక్కువ. చాలావరకు వాటికవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోయినా వాటికి తగిన మామూలు మందులు వాడితే సరిపోతుంది. తల్లిపాలలోకి ఈ మందులు చేరుతాయని భయపడాల్సిన అవసరం లేదు. వీటికి బానిసలవుతామన్న భయం అక్కరలేదు. సర్జరీ తరువాత లేచి ఇతర పనులు చేసుకోగలమో లేదోనన్న బెంగ కూడా వద్దు.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/