Sunday, July 27, 2014

Ayurvedhi Tips for skin health and beauty, చర్మ సౌందర్యానికి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Ayurvedhi Tips for skin health and beauty, చర్మ సౌందర్యానికి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • అందుబాటులో ఉండే వాటితోనే అందంగా ఎలా కనిపించవచ్చో-

* తాజా మెంతి ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట పాటు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే యాక్నె, మొటిమలూ, ముడతలూ, బ్లాక్‌ హెడ్స్‌ వంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే

*స్ట్రాబెర్రీలు కొన్నప్పుడు ఆ బాక్స్‌లో అడుగున కొన్ని ఆకులు ఉంటాయి. వాటిని పారేయాల్సిన అవసరం లేదు. మొటిమలు అధికంగా ఉన్నవాళ్లు, ఆ ఆకుల్ని మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే, వాటి చుట్టూ ఉండే వాపు తగ్గుతుంది.

* రెండు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల రోజ్‌వాటర్‌ని కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ఎండిన తులసి ఆకులతో చేసిన టీలో దూది ముంచి దానితో ముఖాన్ని తుడుచుకొంటే ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు.

* యాక్నె అధికంగా ఉండేవారు అలొవెరా రసాన్ని రెండు పూటలా ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. గంధానికి రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించి, కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

  • కలబందతో కళగా..12/08/2014
కప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మెంతి పొడీ, టేబుల్‌ స్పూన్‌ తులసి ఆకుల పొడీ, రెండుటేబుల్‌ స్పూన్ల ఆముదం వేసుకుని బాగా కలపాలి. దీన్ని తలకు పూతలా రాసుకుని, షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ముప్పావు గంట తరవాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టును బలంగా మారుస్తుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మెరుగైన ఫలితాలు పొందేందుకు కనీసం వారానికోసారి ఈ పూతను వేసుకోవాలి.

అరకప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మందార పువ్వుల పేస్టును వేసి బాగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి పోషణనిస్తుంది.

    చర్మం మరీ పొడిగా, తాకితే గరుకుగా అనిపిస్తోందా! అయితే చర్మానికి తేమనందించే ఈ క్యారెట్‌ మాస్క్‌ని ప్రయత్నించి చూడండి. -- 17-Aug-14

చెంచా తాజా కీరదోస గుజ్జుకి చెంచా మీగడ, రెండు చెంచాల క్యారెట్‌ రసం కలిపి ఆ మిశ్రమాన్ని దట్టంగా మెడ నుంచి ముఖం వరకూ పట్టించాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మానికి పోషకాలు అంది మృదువుగా మారుతుంది. క్యారెట్‌ రసం, నిమ్మరసం, సెనగపిండిని సమపాళ్లలో తీసుకొని పావుకప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటూ కాళ్లూ, చేతులూ, మెడ దగ్గర పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా ఆలివ్‌నూనె, రెండు చెంచాల క్యారెట్‌ రసం, కాస్త పెరుగూ తీసుకుని బాగా గిలకొట్టాలి. దీనిని ముఖానికి రాసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు ఛాయలని వెనక్కి నెట్టేస్తాయి. క్యారెట్‌ తురుమూ, పాలపొడీ, పంచదారని సమపాళ్లలో తీసుకొని ముఖంపై రుద్దాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మృతకణాలు తొలగి ముఖం కాంతిమంతం అవుతుంది.

స్నానం ద్వారా చర్మ సమస్యలు మాయం

    వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా భాధిస్తాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు. ఈ ఇబ్బందులన్నీ తొలగించుకుని చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

ఈ కాలంలో పొగలొచ్చే వేణ్నీళ్లతో స్నానం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అలాకాకుండా గోరువెచ్చని నీళ్లలో కొబ్బరినూనె కలిపితే చర్మం మృదువుగా మారుతుంది. కాగుతున్న నీళ్లలో వేపాకు లేదంటే నిమ్మతొక్కలు వేస్తే వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి.

* సబ్బులూ, గాఢత ఎక్కువగా ఉన్న క్రీమ్‌లు వాడకపోవడం మంచిది. వాటివల్ల కొన్నిసార్లు చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. సున్నిపిండీ, నలుగు పిండి వంటి వాటికి ప్రాధాన్యమివ్వడం మంచిది.

* అప్పుడప్పుడూ కాసిని నీళ్లలో లవంగాల నూనె చేర్చి ఒంటికి మర్దన చేసుకోవాలి. ముఖ్యంగా పాదాలకు మసాజ్‌ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. అలానే వర్షంలో తడిసి ఇంటికెళ్లినప్పుడు స్నానం చేసే నీళ్లలో వెనిగర్‌ కలపాలి. దీంతో బురద వల్ల వెంట వచ్చిన ఫంగస్‌ వదిలిపోతుంది. రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి రాత్రిపడుకునే ముందు ముఖం, మెడా తుడుచుకుంటే కనిపించని క్రిములూ మురికీ దూరమవుతాయి. చర్మం చక్కటి నిగారింపును సంతరించుకుంటుంది.

  • అందానికి ఆలివ్‌
నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎలు చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడానికి తోడ్పడతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ముడతలూ, గీతలను తొలగిస్తాయి. చర్మానికి అవసరమైన తేమను అందించి, మృదువుగా మారుస్తాయి. స్నానానికి అరగంట ముందు ఆలివ్‌నూనెను ఒంటికి పట్టించి, తరవాత స్నానం చేసినా ఫలితం ఉంటుంది.

* తరచూ మేకప్‌ వేసుకునే వారి చర్మం త్వరగా పొడి బారుతుంది. ఈ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే మేకప్‌ను తొలగించడానికి ఆలివ్‌నూనెను వాడాలి. దాన్ని గోరువెచ్చగా చేసి ముఖానికి మర్దన చేసి, కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల, కఠిన రసాయనాల ప్రభావం చర్మంపై పడదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

* కొందరికి గోళ్లు ఇట్టే విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు రోజూ ఐదు నిమిషాలు ఆలివ్‌నూనెతో మర్దన చేస్తే గోళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.


పెసరపిండితో అందం
అందంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తప్పనిసరి. దీనికి అందుబాటులో ఉండే వంటింటి వస్తువులు సరిపోతాయి. అలాంటివాటిల్లో పెసరపిండి కూడా ఒకటి.

చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు కప్పు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

రెండుమూడు చెంచాల పెసరపిండీ, పావుకప్పు పెరుగూ, చెంచా తేనె, చిటికెడు పసుపూ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం శుభ్రంగా కడుక్కున్నాక పూతలా వేసి, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలూ, మొటిమల తాలూకు మచ్చల్ని తొలగిస్తుంది.

పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు కొద్దిగా పెసరపిండిలో చెంచా తేనె, పావు చెంచా కలబంద గుజ్జూ, అరచెంచా బొప్పాయి పేస్ట్‌ కలుపుకొని మెత్తగా చేసుకుని ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. తాజాగా కనిపిస్తారు.

గుడ్డులోని తెల్లసొనలో చెంచా పెరుగూ, చెంచా పెసరపిండీ, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటాగి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.

  • పాల మెరుపు
విటమిన్‌ 'ఎ', 'డి' వంటి వాటితో పాటూ ఎముకల్ని బలంగా ఉంచే క్యాల్షియం వంటి ఖనిజాలూ పాల నుంచి పెద్ద మొత్తంలో శరీరానికి అందుతాయి. దుమ్మూ, ధూళీ ప్రభావం పడినప్పుడు చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పాలను సహజ క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు. పాలు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రపరిచి బ్లాక్‌హెడ్స్‌, యాక్నె వంటి సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. దీనికోసం ఏం చేయాలంటే... పచ్చి పాలను ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచి దాానికి చెంచా సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. దీంతో మురికి తొలగిపోతుంది.

* చర్మం పొడి బారి ఇబ్బందిపెడుతోందా! దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది. పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి ఆరనివ్వాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది. పచ్చి పాలల్లో గులాబీ రేకల ముద్దా, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజు విడిచి రోజు ఒంటికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
  •  




* ఎండవేడితో తలెత్తే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలు అదుపులో ఉంచుతాయి. మేని ఛాయను మెరుగుపరుస్తాయి. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. పచ్చి పాలూ, తేనె మిశ్రమాన్ని రోజూ ఒంటికి రాసుకుని ఆరాక స్నానం చేస్తే సరి. స్నానం చేసే నీళ్లలో అరకప్పు పచ్చిపాలూ, చెంచా గులాబీ నీరూ, రెండు చెంచాల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. దీనితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అవసరమైన పోషకాలు అంది నిగనిగలాడుతుంది.

బంగాళాదుంప రసం పూత చర్మం నిగారింపుకు  ప్రయత్నిద్దాం

    ఎప్పుడూ వంటింట్లో అందుబాటులో ఉండే బంగాళాదుంప అందానికి ఎంతో మేలు చేస్తుంది.

చెంచా బంగాళాదుంప రసంలో రెండు చెంచాల నిమ్మరసం, ముల్తానీమట్టీ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. అది ఆరాక చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ఎండ వేడికి చర్మం రంగును కోల్పోయినప్పుడు ఫ్రిజ్‌లోపెట్టి తీసిన బంగాళాదుంప ముక్కలతో ముఖం మీద రుద్దుకుంటే సరిపోతుంది అలానే బంగాళాదుంపలో ఉండే పొటాషియం, విటమిన్‌ బి6, విటమిన్‌ 'సి'లు చర్మం మీద మృతకణాలను తొలగించేస్తాయి. విటమిన్‌ సి యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మ సమస్యలను దూరం చేసి మృదువుగా మారుస్తుంది. బంగాళాదుంప గుజ్జులో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేయాలి. ఈ పూత ముఖానికి బ్లీచ్‌లా కూడా పని చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది.

ఎండకు కమిలిన చర్మానికి సాంత్వన కలగాలంటే, బంగాళాదుంపల్ని తరిగి ఆ ప్రాంతంలో ఉంచాలి. పది నిమిషాలయ్యాక తీసి చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే పెరుగులో చెంచా బంగాళాదుంప గుజ్జును కలిపి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఆలూలో ఉండే విటమిన్‌ బి6 చర్మం మీద యాంటీ ఏజింగ్‌ కారకంలా పనిచేస్తుంది. ముడతలు రాకుండా కాపాడుతుంది.

కళ్ల కింద నల్లటి మచ్చలు బాధిస్తోంటే ఈ గుజ్జులో తేనె కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ పూత వల్ల నల్లటి మచ్చలు దూరమవుతాయి. కళ్ల మంటలూ, దురదా తగ్గుతాయి.

బంగాళా దుంప రసంలో సమపాళ్లలో కీరదోస రసం కలిపి అందులో దూది ఉండలు వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత దూదితో ముఖం తుడుచుకుంటే టోనర్‌గా పనిచేసి ముఖాన్ని మెరిపిస్తుంది. ఇక బంగాళాదుంపలను ఉడికించిన నీళ్లతో తరచూ ముఖం కడుక్కుంటే తాజాదనం సొంతమవుతుంది.

  • ముడతలు దూరం
కార్యాలయంలో కూర్చుని పనిచేసే వాళ్లతో పోలిస్తే... బయట తిరిగి పని చేసే వాళ్లకి ముప్ఫైల్లోనే చర్మంపై గీతలు పడటం, చర్మం పొడి బారడం వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లు క్రీముల కన్నా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.

*బాగా పండిన అరటిపండుని మెత్తగా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంటయ్యాక కడిగేసుకోవాలి. బయటికి వెళ్లొచ్చాక ఇలా చేస్తే గీతలు పడే అవకాశం తగ్గుతుంది.
*అనాస గుజ్జు కూడా చర్మంపై బాగా పనిచేస్తుంది. ఆ గుజ్జూ లేదా రసాన్ని ముఖానికీ మెడకీ రాసుకుని మర్దన చేస్తే ముడతలూ, గీతలు రాకుండా చూసుకోవచ్చు.
*ఒక టీ చెంచా ఆలివ్‌ నూనెకి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని బాగా రుద్దినా మంచిదే.
* తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
*బొప్పాయిని మెత్తగా చేసి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి వారానికోసారి ముఖానికి రాసుకోవాలి.
*అప్పుడప్పుడు తేనె, గులాబీ నీళ్లూ, పసుపూ కలిపి ముఖానికి రాసుకుని కాసేపు వదిలేసినా మంచిదే.

పై పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటే ముప్ఫైల్లోనే చర్మంపై గీతలూ, ముడతలూ రావడం... పొడిబారడం వంటి సమస్యలు దూరమవుతాయి.

  • గుడ్డుతో అందమే...

జుట్టుకి ఆరోగ్యాన్నీ అందాన్నీ అందించే వాటిలో గుడ్డు స్థానం ఎప్పుడూ ముందే. ఇందులో సల్ఫర్‌, సెలీనియం, ఫాస్ఫరస్‌, ఇనుమూ, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్‌ 'ఇ' కూడా కావల్సినంత ఉంటుంది. అది అతినీలలోహిత కిరణాల నుంచి వెంట్రుకలను కాపాడుతుంది. గుడ్డులోని తెల్లసొనకు ఒక చెంచా ఆలివ్‌ నూనెని కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని మాడుకు పట్టేలా రాసుకోవాలి. పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలాగే గుడ్డు పచ్చసొనలో మూడు చెంచాల ఆలివ్‌నూనెనీ కాస్త తేనెనీ కలిపి రాసి అరగంట తరవాత కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని పచ్చసొనకు కాస్త నిమ్మరసాన్ని కలిపి వెంట్రుకల కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ హెయిర్‌ ప్యాక్‌లను నెలలో కనీసం రెండుసార్లయినా ప్రయత్నిస్తే... మృదువైన, నిగనిగలాడే జుట్టు సొంతమవుతుంది.
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Asanas for sinus problem,సైనస్‌ సమస్య కి ఆసనాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Asanas for sinus problem,సైనస్‌ సమస్య కి ఆసనాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    ముక్కు పట్టేయడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, ముఖమంతా నొప్పులూ, తలనొప్పి.. ఇలా ఏడాది పొడవునా సైనస్‌ లక్షణాలు కొందరిని ఇబ్బంది పెడుతుఉంటాయి. వాటిని అదుపు చేయాలంటే... ఈ ఆసనాలు వేయాల్సిందే.

  • పూర్ణ భుజంగాసనం
బోర్లా పడుకుని ఛాతీ పక్కన రెండు చేతులూ ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచి పాదాల్ని పైకి లేపి తల దగ్గరకు తీసుకురావాలి. తరవాత శ్వాస తీసుకుంటూ మెల్లగా భుజాలను పైకి లేపుతూ సాధ్యమైనంత వరకూ తలను పాదాలకు ఆనించడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయాలి. దీన్ని చేయడం వల్ల ఛాతీ భాగం, పొట్ట బాగా సాగుతాయి. వెన్నెముకకు విశ్రాంతి అంది ఆరోగ్యంగా మారుతుంది. స్వాధీష్టాన చక్రం క్రమబద్ధం అవుతుంది. ఈ ఆసనం గర్భాశయం, అండాశయాలకూ మేలు చేస్తుంది. పొట్టలోని భాగాలన్నింటికీ మంచిది. అలాగే శ్వాస సమస్యలున్న వాళ్లకూ ఈ ఆసనం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. హెర్నియా, హైపర్‌ థైరాయిడ్‌ ఉన్నవాళ్లు ఆసనాన్ని గురుముఖంగా వేయడం మంచిది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, గుండె జబ్బులూ, అధికరక్తపోటు ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

  • భస్త్రిక ప్రాణాయామం
కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి, కొద్దిగా వేగంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా వందసార్లు లేదా మూడు నిమిషాలు చేయాలి. తరవాత వెంటనే లేవకుండా కళ్లు మూసుకుని నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. ఆ తరవాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.ఈ ప్రాణాయామం చేయడం వల్ల వూపిరితిత్తులు దృఢంగా మారతాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రోజులో రెండుసార్లు కూడా ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు.

  • విపరీత నౌకాసనం
బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులూ, కాళ్లూ, తలను సాధ్యమైనంత వరకూ పైకి లేపాలి. ఈ క్రమంలో శరీర బరువంతా పొట్టపై ఉంచాలి. మోకాళ్లు వంచకూడదు. ఈ స్థితిలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస వదులుతూ తలా, కాళ్లూ చేతులూ కింద పెట్టాలి. తరవాత మళ్లీ శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం వేయాలి. ఇలా ఆరుసార్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా సైనస్‌ సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎలర్జీల్లాంటివి రాకుండా ఉంటాయి. శరీరాన్ని సాగదీయడం వల్ల ఛాతీ భాగం, వూపిరితిత్తులూ దృఢంగా మారతాయి.

-- courtesy with eenadu vasundara
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, July 16, 2014

Hints for Flashing white teeth,దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే-చిట్కాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints for Flashing white teeth,దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే-చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయడం వల్ల మరియు కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా వసరం. ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. పసుపు రంగు దంతాలను నివారించే ఉత్తమ పదార్థాలు, ఏమేమి తింటే మీ దంతాల అలా ప్రభావితం అవుతున్నాయి తెలుసుకోవాలి.  ప్రస్తుతం దంతాలు తెల్లబడటానికి మార్కెట్లో అనేక విధానాలు మరియు ఖరీదైన దంత చికిత్సలు ఉన్నాయి. అయితే ఖరీదైన చికిత్సలతో పనిలేకుండా, సహజపద్దతులో మీ దంతాలు మిళమిళమిరిపంప చేసే  నేచురల్ టిప్స్ ఇక్కడ చూడండి .

*మౌత్ వాష్, కాఫీ మరియు సోడాల వంటి వాటికి దూరంగా ఉండండి: కాఫీ, సోడా మరియు కొన్ని సార్లు మౌత్ వాష్ లు కూడా మీ దంతాలు పసుపు వర్ణానికి దారితీస్తాయి. అందువల్ల మనం వాటికి దూరంగా ఉండాలి .

*రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి: 
ఒక రోజుకు కనీసం రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా అవసరం . అందువల్ల మీ దంతాలలో మరియు నాలు మీద అతుకొన్ని ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా సహాయపడుతుంది . అందువల్ల, ఎల్లో మరకలు నివారించాలంటే, రోజుకు రెండు సార్లు బ్రెష్ చేయడం తప్పనిసరి .

*పండ్లు తినాలి: కొన్ని సార్లు మీరు ఆతురతతో ఉన్నప్పుడు సరిగా బ్రష్ చేయరు. అటువంటప్పుడు మీరు ఫైవర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మీ దంతాలు నేచులర్ గా శుభ్రపడుతాయి. అలాగే సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి. అందుకు అవసరం అయ్యే సలివాను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఇది మీ దంతాలు శుభ్రపరచడానికి మరియు దంతాలను తెల్లగా మార్చడానికి సహయపడుతాయి. మరియు పండ్లలో విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి మీ దంతాలను బలోపేతం చేస్తాయి. ఆపిల్ మరియు పియర్స్ వంటివి చాలా ఉపయోగకరమైనవి, వీటిలో అధికంగా నీరు అధికంగా ఉంటుంది . ఇది లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది.

 *ఫ్లాసింగ్ : ఫ్లాసింగ్ చేయడం వల్ల చిగుళ్ళ నుండి అధిక రక్తస్రావం జరుగుతుందని చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ జాగ్రత్తగా మరియు ఓపికగా చేయడం వల్ల మీ దంత ఆరోగ్యాన్ని నిర్వహించడానికి మరియు మీ పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది.

*పాల ఉత్పత్తులు: జున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి మరియు దంతాల యొక్క స్వచ్ఛత మరియు అభివృద్ధి నిర్వహించడానికి సహాయపడుతుంది . ఎనామిల్ ను రక్షణ కల్పించడంలో మరియు బలోపేతం చేయడంలో హార్డ్ చీజ్ అంటే మృదువైన జున్నులు పళ్ళును శుధ్దిచేసి, అత్యంత సమర్థవంతంగా మరియు తెల్లగా మార్చుతాయి.

*నువ్వు గింజలు : నువ్వులు నాలుక మీద బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు ఇది పళ్లఎనామిల్ నిర్మాణానికి సహాయపడుతుంది. వీటిలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది, ఇది మీ దంతాల చుట్టూ ఉన్న ఎముకలను రక్షణకు సహాయపడుతుంది . పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్స్ మరియు విటమిన్ ఇ వంటివి మంచి మూలంగా ఉన్నది. ఇవి ఇంకా ముఖ్యమైన మినిరల్స్ అంటే మెగ్నీషియన్ ను అందిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు నమలడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు పడకుండా రక్షణ కల్పిస్తుంది.

* స్ట్రాను ఉపయోగించండి: స్ట్రాను ఉపయోగించడం వల్ల మీ దంతాల మీదు మరకలు పండకుండా నిరోధించవచ్చు. ఏదైనా కలర్ డ్రింక్ త్రాగుతున్నప్పుడు , దంతాల మీద మరకలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. స్ట్రాలను ఉపయోగించడం వల్ల దంతాలకు తగలకుండా నోట్లోకు పోవడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పడటానికి అవకావం ఉండదు.

* వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంది, ఇది పళ్ళు ఎనామెల్ యొక్క నిర్మాణంకు సహాయపడుతుంది. కాబట్టి, ఈ కూరగాయలరు పచ్చిగా తినడం వల్ల పళ్ల మద్య సహజంగానే మాసాజ్ చేస్తాయి దాంతో పళ్ళ మద్య శుభ్రం అవుతుంది. ఇంకా దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*నిమ్మ , ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించండి నిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి. మీ దంతాలు తెల్లగా మారాలంటే ఈ రెండింటి మిశ్రమంతో రెగ్యులర్ గా బ్రష్ చేయాలి.

*ప్రతి రెండు నెలల కొకసారి కొత్త బ్రష్ ఉపయోగించండి ఉత్తమ ఫలితాలు పొందడం కసం రెగ్యులర్ ఇంటర్వెల్స్(తరచూ)రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చుతుండాలి. ఒక నిర్ణీత కాలం తర్వాత టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ చాలా కఠినంగా మారుతాయి. దాంతో మీ దంతాల యొక్క ఎనామిల్ ను పాడుచేస్తుంది. దాంతో మీ దంతాల మీద మరకలు ఏర్పడటానికి దారితీస్తుంది.

* మీ కాల్షియం తీసుకోవడం మెయింటైన్ చేయండి తగినంత క్యాల్షియంను మీరు తీసుకోవడం వల్ల మీ దంతాలను బలోపేతం చేస్తుంది మరియు దంతాల అమరిక నిలబెట్టడానికి సహాయపడుతుంది .

*టాయిలెట్ నుండి కనీసం 6 అడుగుల దూరంగా మీ బ్రష్ ఉంచాలి: దంతాలు శుభ్రం చేసుకొనే బ్రష్ లు టాయిలెట్ నుండి కనీసం 6 అడుగుల దూరంగా ఉంచాలి. ఎందుకంటే గాలిలో ప్రయాణించే కణాలు నివారించేందుకు ఇలా ఉంచాలని గట్టిగా సిఫార్సు చేయబడింది. ఇది దంత పరిశుభ్రతను నిలబెట్టడానికి సహాయపడుతుంది మరియు మీ దంతాలకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది.

 *క్రమం తప్పకుండా దంత వైద్యుడు సందర్శించండి మీరు ఉత్తమ ఫలితాలను పొందడానికి క్రమం తప్పకుండా దంత వైద్యుడుని సందర్శించడం తప్పనిసరి. ఎవరైతే సంవత్సరం పొడవునా పరిశుభ్రం చేయకుండా ఉంటారో , వారుకి నిజానికి అప్పుడు పాడైపోయిన లేదా అధ్వాన్నంగా పళ్ళు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళకుండా అక్కడి ముగించేస్తుంది.

* పళ్ళు తెల్లబర్చుకోవడం కోసం చికిత్స టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్లు అంత అమోదకరమైనవి కాదు, ఒక వేళ మీ పళ్ళు చాలా చెడ్డగా మరకలు పడినప్పుడు మరియు ఇక వాటిని నయం చేయడం కాదు అన్నప్పుడు హోం రెమడీస్ చాలా బాగా సహాయపడుతాయి. మరియు దంతాలను తెల్లబర్చడంలో గొప్పగా సహాయపడుతాయి.

*ఒక బలమైన మింట్ టూత్ పేస్టును ఉపయోగించండి పుదీనాతోతయారుచేసిన టూత్ పేసట్ చాలా ప్రయోజనకారి, ఇది మీ దంతాలను తెల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతంది. ఇది తక్షణమే ఫలితాలను చూపించకపోవచ్చు. కానీ కొంత కాలం తర్వాత సానుకూల ఫలితాలను చూపిస్తుంది.

* వంశానుగత కారణాలు అనేక సార్లు ప్రజలు వారి వారసత్వ కారణంగా వారి దంతాలు మరకగాఉంటాయి. అందువల్ల దంతవైద్యుడు సందర్శించండి మరియు మీ పళ్ళు మీద మరకలు ఏర్పడటానికి గల సరైన కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

*అధిక మోతాదు కలిగిన యాంటీబయాటిక్స్ మానుకోండి అధిక మోతాదు కలిగిన యాంటీ బయోటిక్స్ ను మీ దంతాల యొక్క రంగును మార్చివేస్తుంది. అందువల్ల, అనవసరంగా యాంటీబయోటిక్స్ తీసుకోవడం నివారించడం చాలా ముఖ్యం.

* సోనిక్ టూత్ బ్రష్ ను ఉపయోగించండి: ఒక సోనిక్ టూత్ బ్రష్ మీ పని చాలా తేలికచేస్తుంది. మాన్యువల్ టూత్ బ్రష్ తో, ప్రజలు సాధారణంగా హార్డ్ బ్రష్ ను ఉపయోగిస్తుంటారు. దాంతో దంతాలు మరింత దెబ్బతీస్తాయి. ఈ నిజానికి గమ్ ప్రాంతంలో కోతకు దారితీస్తుంది మరియు టూత్ వేర్ ను పెంచుతుంది. అయితే, సోనిక్ టూత్ బ్రష్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది . మీ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*దంతాలు తెల్లబర్చే వస్తు సామగ్రి టీత్ వైటనింగ్ కిట్స్ మీ దంతాలు తెల్లగా నిర్వహించడానికి సహాయపడిందని నిరూపించబడింది. అయితే వాటిని తీసుకొనే ముందు మీ దంత వైద్యున్ని సంప్రదించి ఏ బ్రాండ్ సురక్షితమో కనుక్కోండి మరియు ఎటువంటి దుష్ర్పభాలు లేకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. .

*అక్రమ జీవక్రియ మెరుగుపరచుకోండి అక్రమ జీవక్రియ కూడా మీ దంతాలను రంగు మార్చడానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లును సరిచేసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తీవ్రమైన ఒత్తిడిని నివారించడంలో తగి జాగ్రత్తులు తీసుకోవాలి.


  • Written by: Derangula Mallikarjuna -March 20, 2014@http://telugu.boldsky.com
























  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, July 14, 2014

Summer sweat-వేసవికాలం చమట

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Summer sweat-వేసవికాలం చమట- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



అసలే వేసవికాలం అందులోనూ గతంతో పోల్చితే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం బయపడిపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఎంత ఎండ ఉన్నా తమ విధులకు హాజరు కాక తప్పనిపరిస్థితి.ఎండలో శరీరం నిండా చమట నిండి పనిచేసే చోట కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటాము. చికాకు వస్తుంది. ఇంటికి రాగానే హాయిగా చల్లని నీళ్లతో స్నానం చేస్తాము. కానీ తిగిరి ఉక్కపోతకు ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా?

మన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉన్నపుడు శారీరక పనితీరు సక్ర మంగానే ఉంటుంది. దీనికంటే అధికవేడి ఉత్పన్నమయినప్పుడు మనలో చికాకు మొదలవుతుంది. అం దులో భాగంగానే కాస్త వేడి ఎక్కువవ్వగానే మనం చల్లని ప్రదే శాన్ని వెతుక్కుంటాం.

శరీరమంతా స్వేదరంధ్రాలు ఉంటాయి కాబట్టి మనం తాగిన నీరు చెమట రూపంలో విడుదలవుతూనే ఉంటుంది. పెదవులు, జననాంగాల్లో తప్పించి మిగతా భాగమంతా శ్వేదరంధ్రాలుంటాయి. సాధా రణంగా చెమట పట్టడం అంటే శరీరం తనని తాను చల్లబరుచు కోవడమే. కాని అధిక మొత్తంలో చెమట విడుదలవుతే శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరుతగ్గిపోయినప్పుడే మనలో చికాకు మొదవలవుతుంది. కాబట్టి ప్రతి గంటకి తప్పనిసరిగా నీరు తీసుకోవడం మరవకూడదు. అప్పుడు శరీరమే కాదు మనసూ చల్లబడు తుంది. నీరు కేవలం చల్లదనాన్నే కాదు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.

ఆరోగ్యరీత్యా...
కొన్నిసార్లు ఆరోగ్యం సరిగ్గా లేకపో యినా చెమటతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. థైరాయిడ్‌ గ్లాండ్‌ అతి చురుకుదనం మరోకారణం. థైరాయిడ్‌ హార్మోన్‌ శారీరక మెటబాలిజాన్ని, వేడి ఉత్పత్తిని విపరీతంగా పెంచుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, మందులు కూడా దీనికి కారణమవుతాయి. ఈ పరిస్థితుల్నీ వైద్య చికిత్సల ద్వారా అధిగమించే అవకాశం ఉంది. ప్యూబర్టీ దశలో అయితే ప్రత్యేక హార్మోన్లు ముంజేతుల్లోని గ్రంధుల్ని ప్రభా వితం చేస్తాయి. ఈ గ్రంధులు విడుదల చేసే చెమట దుర్వాసనతో కూడా ఉంటుంది. స్పష్ట మైన కారణం ఏదీ లేకుండా రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడుతున్నా, శారీరక వాసనలో తేడా కనిపించినా వైద్య సలహా తీసుకోవాలి.

ఇల్లే వైద్యశాల
స్వేదాన్ని దాని వాసనను తగ్గించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
పాదాలు: స్నానం తరువాత పాదాల్ని శుభ్రంగా తుడుచుకోవా లి. సూక్ష్మక్రిములు వేళ్ల సందుల నడుమ జీవిస్తుంటాయి. స్వేదాన్ని పీల్చగలిగిన ఫుడ్‌ పౌడర్స్‌ని ఉపయోగిస్తే ఫలిత ముంటుంది.
షూస్‌: లెదర్‌వంటి సహజ సిద్ధ మైన మెటీరియల్స్‌తో తయారు చేసే షూస్‌ని, ఇతర పాదరక్షలు ధరించడం వల్ల పాదాల్లో చెమ ట తగ్గుతుంది. షూస్‌లోని చెమట రాత్రికి రాత్రి ఆరిపోయే అవకాశం ఉండదు. మళ్లీ తెల్లారగానే వాటిని ధరిస్తే దుర్వాసన ఎక్కువవుతుంది. కాటన్‌, ఊల్‌ సాక్స్‌ పాదాల్ని పొడిగా ఉంచు తాయి. ఇవి తేమ ను పీల్చే గుణాన్ని కలిగి ఉంటాయి. వ్యా యా‚మం చేసే సమయంలో ఎధ్లెటిక్స్‌ సాక్స్‌ బాగా పనిచే స్తాయి. వీటిని ఏ రోజు ధరించినవి ఆరోజు శుభ్రంచేసుకుని మళ్లీ వాడాలి.
దుస్తులు: వీలైనంతవరుకు కాటన్‌ వస్త్రాలనే ధరించాలి. స్వేదా న్ని పీల్చని, ఎక్కువ చెమటకు కారణమయ్యే సిల్కు దుస్తులకు దూరంగా ఉండాలి.
సుగంధాలు: పడుకునే ముందు స్వేదం ఎక్కువగా అలుము కునే అరచేతులు, పాదాల్లో యాంటీ పరిస్పిరెంట్స్‌ రాసుకుం టూ ఉండాలి.
విశ్రాంతి: యోగా, ధ్యానం వంటి విశ్రాం తి ఇచ్చే విధానాలను పాటించాలి. వీటివల్ల ఒత్తిడిని నియంత్రించుకునే అవకాశం కలు గుతుంది. ఒత్తిడివల్ల చెమట అధికంగా పడుతుంది.
ఆహారం: సాధారణ స్వేదం కంటే ఎక్కు వగా ఉన్నా, దుర్వాసన ఆహారపదార్థాలు క నుక కారణం అవుతుంటే అంటువంటి వా టికి దూరంగా ఉండటం మంచిది. కెఫైన్‌ ఉండే పదార్థాల్ని, ఘాటైన వాసన ఉండే వె ల్లుల్లి, ఉల్లిని తినడం తగ్గించాలి.
ఒత్తిడి: మానసిక ఆందోళన వల్ల చెమట మరింత అధికమవు తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నా చెమట అధికంగా పడుతుంది.
ముఖ్యంగా నూనెపదార్థాలు అధికంగా ఉండే వాటిని, సై్పసీగా ఉండే పదార్థాలని తగ్గిస్తే చెమట దాని తాలూకు సమస్యలు చాలా భాగం తగ్గిపోతాయి. వేసవికాలంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా చమట తగ్గుముఖం పట్టడంతో పాటు మససుకు ఆహ్లాదాన్నిస్తాయి వీటిన క్రమం తప్పక పాటించడం అలవాటు చేసుకోవాలి

తాజాదనానికి...
కాఫీ, టీలను తాగడం తగ్గించాలి. సాధారణంగా చెమట దుర్గందాన్ని వెద జల్లుతుందనుకుంటారు. కానీ శరీరం మీద ఉన్న బ్యాక్టీరియాతో స్వేదం చేరినప్పుడు వాసన వస్తుంది. కాబట్టి శరీరం మడతల్లో పౌడర్లు, డియోడ్రెంట్లు ఉపయోగిస్తుండాలి. స్నానం చేసే ముందు నీటిలో ఒక నిమ్మ కాయ పిండుకుని స్నానం చేస్తే ఆ రోజంతా తాజాగా ఉంటుం ది. వీటిని పాటించడంతో పాటు ఆకుకూరలు, సలాడ్స్‌ అధికంగా తీసుకుంటూ ఉండాలి. ప్రతీరోజూ రెండుసార్లు స్నానం చేయడంతో పాటు వీలనైన్ని సార్లు ముఖాన్ని చేతులు, మెడని చల్లని నీటితో కడుక్కుంటూ ఉండాలి.

ఒత్తిడీకారణమే
ఆడవాళ్లలో ఎక్కువగా ఒత్తిడి వల్ల చెమట పడుతుంది. అరచేతులు, నుదురు, అరికా ళ్లలో చెమట ఎక్కువగా పడితే అది ఒత్తిడికి సంకేతమే. కాబట్టి ముందుగా ఒత్తిడిని త గ్గి ంచు కునే ప్రయత్నాలు చేయాలి. బాగా టెన్ష న్‌లో ఉంటే మీ దృష్టిని వేరొక అంశం మీదకి మరల్చండి. హార్మోన్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వల్ల కూడా ఒత్తిడి పెరిగే అవకాశం లేకపో లేదు. తగిన విశ్రాంతి తీసు కుంటున్నా స మస్య తగ్గు ముఖం పట్టకపోతే డాక్టర్‌ని సం ప్రదించడంలో ఆలస్యం చేయకూడదు.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, July 8, 2014

Laparoscopy,లాప్రోస్కోపీ(బాధ పెట్టని సర్జరీ)

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Laparoscopy,లాప్రోస్కోపీ(బాధ పెట్టని సర్జరీ)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  



  •  
గాయం మానిపోయినా మచ్చ మానదు అంటారు. నిజమే. చిన్నా చితకా కోతలంటే కనుమరుగైపోవచ్చు. కాని జానెడు, మూరెడు నిడివితో పడిన కత్తికోతల మచ్చలు దాదాపు జీవితమంతా ఉంటాయి. అవి ఆ బాధాకర సంఘటనల్ని జీవితమంతా గుర్తుచేస్తూనే ఉంటాయి. మచ్చల సంగతి అలా ఉంచితే, అంత పెద్ద సర్జరీ జరిగితే అవి మానేదాకా ఎంత నొప్పిని భరించాలి? ఎన్ని దుష్ప్రభావాల్ని ఎదుర్కోవాలి? ఇప్పుడు వీటన్నింటికీ గొప్ప విరుగుడుగా వచ్చిందే లాప్రోస్కోపిక్ లేదా కీ హోల్ సర్జరీ. స్కోప్స్ కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా పదిరెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయడం సాధ్యమవుతోంది. అన్నింటినీ మించి సర్జరీ తాలూకు నొప్పి, బాధ లేకుండా పోవడంతో ఒకటి రెండు రోజుల్లోనే ఇంటికి వెళ్లిపోయి ఆత్మీయుల మధ్య ఆనందంగా గడిపే వీలు కలుగుతుంది. క్యాన్సర్ సర్జరీలో లాప్రోస్కోపిక్ విధానం రావడం ఒక విప్లవాత్మకమైన ముందడుగు.
మత్తుమందు ఇవ్వడం వల్ల సర్జరీ సమయంలో నొప్పి తెలియకపోవచ్చేమో గానీ, సర్జరీ తరువాత మాత్రం ఎంత నొప్పి.. ఎంత బాధ! పాత విధానాల్లో మూరడేసి పొడవునా చేసే సర్జరీతో ఆసుపత్రిలో, ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత ఎంత నరకం అనుభవించేవాళ్లు.. ప్రత్యేకించి క్యాన్సర్ సర్జరీల్లో ఈ తేడా మరింత తీవ్రంగా కనిపిస్తుంది. కణుతులు మరీ పెద్దవైనప్పుడు కత్తికోతలు కూడా పెద్దగానే ఉండేవి. క్యాన్సర్ నివారణలో ఎంత సమర్ధవంతమైన వైద్యం అందించినా, ఓపెన్ సర్జరీ వల్ల కలిగే విపరీతమైన నొప్పి, బాధ కొద్దిరోజుల దాకా ఎంతో దుర్భరంగానే ఉంటాయి.

క్యాన్సర్ సర్జరీలో ఒక్కోసారి చిన్న కణితిని తీసివేయడానికి కూడా ఎంతో పొడవాటి కోత పెట్టక తప్పదు. ముఖ్యంగా ఛాతి, అన్నవాహిక, జీర్ణాశయం, పెద్దపేగు, గర్భసంచి, మూత్రాశయాల్లో వచ్చే క్యాన్సర్ కణుతుల్ని తీసివేయడానికి మొన్నమొన్నటి దాకా ఈ పెద్ద కోత తప్పని ఓపెన్ సర్జరీ మాత్రమే మార్గంగా ఉండేది. కాని కీహోల్ విధానం వచ్చిన తరువాత క్యాన్సర్‌సర్జరీలో పెను మార్పులే సంభవించాయి. అయితే ఇప్పటికీ కొందరు క్యాన్సర్ సర్జరీలను కీహోల్ విధానంలో చేయాల్సిన పనేముంది..? కోత 20 సెంటీమీటర్లు పడితే ఏంటి.. 2 సెంటీమీటర్లు పడితే ఏంటి..? క్యాన్సర్ కణితిని మొత్తంగా తీసివేయడం ఇక్కడ ముఖ్యం. అంతేగాని, కాస్మెటిక్ ఫలితాలు ముఖ్యంకాదు కదా! అంటూ ఉంటారు. దష్టినంతా కాస్మెటిక్ ఫలితాలు సాధించడం మీదే పెడితే, క్యాన్సర్ సర్జరీలో ఒక రాజీ ధోరణి అలవడవచ్చు కదా అని కూడా అంటూ ఉంటారు. నిజానికి అలాంటి పరిస్థితే ఇక్కడ ఉత్పన్నం కాదు.

ఎన్నో రెట్లు మెరుగు
ఏ రకంగా చూసినా, ఓపెన్ సర్జరీ కన్నా కీహోల్ సర్జరీ పది రెట్లు మెరుగైనది. ప్రామాణికమైనది కూడా. కీహోల్ సర్జరీ వల్ల అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాల్ని కంటి చూపు కన్నా పదీ పదిహేను రెట్లు పెద్దవిగా చూడగలిగే సౌలభ్యం ఉంటుంది. కీహోల్ సర్జరీలో భాగంగా స్కోప్స్ కెమెరాను ఉపయోగించి శరీర అంతార్భాగాలను కంటి కనిపించని అతి సూక్ష్మభాగాలను కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. లాప్రోస్కోప్ విధానంలో కంటికి కనిపించని ఆయా భాగాలు సహజ పరిమాణం కన్నా పదిరెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. ఈ విధానంలో క్యాన్సర్‌కు గురైన భాగాలు, దాని చుట్టూ ఉండే క్యాన్సర్ పాకే అవకాశం ఉన్న ఇతర విభాగాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీ ద్వారా ఏ భాగాలను ఏమేరకు తీసివేయాలో స్పష్టంగా తెలుస్తుంది.

లింఫ్ గ్రంథులతో సహా..

క్యాన్సర్ సర్జరీలో ఆ కణితి, దాని చుట్టూ ఉండే కణజాలం, అది పాకే అవకాశం ఉన్న లింఫ్ గ్రంథులన్నింటినీ తీసివేయాలి. అయితే వాటిని సంపూర్ణంగా తీసివేయడంలో కీహోల్ సర్జరీ తోడ్పడుతుంది. ఒకప్పుడు మల విసర్జక, మూత్రాశయ, లైంగిక భాగాలకు మరికొన్ని ఇతర భాగాలకు సర్జరీ చేస్తున్నప్పుడు ఆయా భాగాలకు సంబంధించిన, కంటికి కనిపించని అతి సూక్ష్మమైన నాళాలు తెగిపోయేవి. అవి తిరిగి అతికించడానికి కూడా అవకాశం లేనివి. అయితే ఈ లాప్రోస్కోపిక్ విధానంలో సర్జరీ చేస్తున్నప్పుడు ఆ నాళాలన్నీ పది పదిహేను రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. అలా అవి చాలా స్పష్టంగా కనిపించడం వల్ల అవి మునుపటిలో తెగిపోయే ప్రమాదం తప్పింది.

దీనివల్ల సర్జరీ సమయంలో రక్తస్రావం అయ్యే అవకాశం బాగా తగ్గిపోతుంది. చాలావరకు రక్తం ఎక్కించాల్సిన అవసరమే ఉండదు. అన్నవాహిక క్యాన్సర్‌కు గాని, రెక్టల్ క్యాన్సర్‌కు గాని సర్జరీ చేసిన తరువాత కణితి బాగా పెద్దదిగా ఉన్నప్పుడు వెంటనే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ సర్జరీ చేసినప్పుడు సర్జరీ కోత గాయం పూర్తిగా మానేదాకా ఈ థెరపీలో ఇవ్వకుండా ఆపాల్సి ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో పెద్ద గాయమే ఉండదు కాబట్టి వెంటనే థెరపీలు ఇవ్వడం వీలవుతుంది. ఓపెన్ సర్జరీతో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇచ్చే పెయిన్‌కిల్లర్స్ వల్ల ఇతర దుష్ప్రభావాలు కొన్ని తలెత్తుతాయి. కొందరిలో శ్వాసపరమైన ఇబ్బంది కలిగించే రెస్పిరేటరీ డిప్రెషన్ సమస్య కూడా మొదలవుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీతో పెద్దగా నొప్పే ఉండదు కాబట్టి పెయిన్ మెడికేషన్ అవసరమే ఉండదు. హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. ఇతరత్రా ఖర్చులు ఎక్కువే అయినా హాస్పిటల్‌లో ఉండే సమయం తగ్గిపోతుంది కాబట్టి ఆ ఖర్చులు మిగులుతాయి.

జెనైటల్ యూరినరీ ఆంకాలజీ

జననాంగ సంబంధిత క్యాన్సర్లకు లాప్రోస్కోపీ విధానం ఎంతో ప్రయోజనకరం. ప్రత్యేకించి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ సర్జరీలోనూ, మలవిసర్జక భాగపు సర్జరీలోనూ, అండాశయ క్యాన్సర్ సర్జరీలోనూ దీని ఉపయోగం చాలా ఎక్కువ. గర్భాశయ క్యాన్సర్‌లో వ్యాధి పాకే అవకాశం ఉన్న లింఫ్ గ్రంథులను కూడా ఈ విధానంలో చాలా కచ్చితమైన రీతిలో తీసివేయవచ్చు. అలాగే స్త్రీ జననాంగంలో వచ్చే క్యాన్సర్‌ను సంపూర్తిగా తీసివేయడం కూడా ఈ విధానంలో వీలవుతుంది.

అలాగే మూత్రాశయ నాళాలను స్పష్టంగా గుర్తిస్తూ, వాటికి హాని కలగకుండా చేయడంలో కూడా లాప్రోస్కోపీ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ఓపెన్ సర్జరీ చేయడం వల్ల గర్భాశయం మీద వచ్చే దుష్ప్రభావాలేవీ లేకుండా లాప్రోస్కోపీ విధానంలో చేయడం వీలవుతుంది. జననాంగం, దాని చుట్టూ ఉండే భాగాన్ని తీసివేసేటప్పుడు చాలా పర్‌ఫెక్ట్‌గా తీసే అవకాశం ఉంది.

అండాశయ క్యాన్సర్‌లో కణితి చాలా చిన్నదిగా ఉంటే సులువుగా తీసివేయవచ్చు. ఒకవేళ పెద్దదిగా ఉంటే ముందు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా దాని సైజు తగ్గాక ఆ తరువాత సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ సర్జరీతో అయితే చాలా పెద్ద కోత పడుతుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువే. అందుకే ఆ గాయం మానడానికి ఎక్కువ కాలం పడుతుంది. అదే లాప్రోస్కోపీ విధానంలో అతి చిన్న కోతతోనే అయిపోతుంది కాబట్టి రెండోరోజుకే బాగా కోలుకుంటారు. సర్జరీ జరిగిన వారం రోజులకే కీమోథెరపీ ఇవ్వవచ్చు.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్లు

కీహోల్ సర్జరీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ చికిత్సలకు చాలా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్. 25 సెంటీమీటర్ల పొడవుండే అన్నవాహిక క్యాన్సర్‌కు మామూలుగా అయితే ఒకే పెద్దకోతతో ఈ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇది దాదాపు 7 గంటలు పట్టే పెద్ద ఆపరేషన్. ఈసోఫేగల్ క్యాన్సర్లు ఎక్కువగా పెద్దవయసులోనే వస్తాయి. పొగ, మద్యం తాగేవారిలో కూడా ఇవి ఎక్కువే. వీళ్లందరికీ ఏదో ఒక స్థాయిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉంటాయి.

శ్వాస సాఫీగా సాగిపోవాలంటే నొప్పి ఉండకూడదు. సర్జరీలో పెద్ద కోత పడినప్పుడు విపరీతంగా నొప్పి ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా సమస్యగా ఉంటుంది. కీహోల్ సర్జరీతో చేసే ఈ చికిత్స కేవలం మూడు నాలుగు గంటల్లో పూర్తవుతుంది. సర్జరీ జరిగాక వారు కోలుకోవడం చాలా వేగంగా, సునాయాసంగా ఉంటుంది. ఇతరత్రా వారికి ఏ ఇబ్బందీ ఆయాసమూ ఉండవు. అందుకే 80 ఏళ్ల వయసు వారు కూడా ఈ సర్జరీని తట్టుకోగలుగుతారు. పెద్దపేగుల్లోని ఎడమ, మధ్య, కుడి భాగాల్లో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా, ఈ లాప్రోస్కోపీ విధానం ద్వారా సులువుగా చేయగలుగుతున్నాం.

రెక్టల్ క్యాన్సర్

విసర్జన భాగానికి దగ్గరలో క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ చేయడమంటే ఒకప్పుడు పెద్ద సమస్యగా ఉండేది. ఈ సర్జరీలో మలవిసర్జనను నియంత్రించే యానల్ స్పింక్టర్‌ను మొత్తంగా తీసివేయడమే ఇందుకు కారణం. అలా తీసివేయడం వల్ల నియంత్రణ లేకుండా మలం విడుదల అవుతూనే ఉంటుంది. అందుకే నడుముకు ఒక పక్కన రంధ్రం చేసి మలవిసర్జన కోసం పేగును అక్కడ అమర్చేవాళ్లం.

అప్పటికి అది అనివార్యమే అయినా, ఎల్లకాలం ఆ కత్రిమ మార్గం ద్వారా విసర్జంచవలసి రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. అలా మొత్తంగా తీసివేయడానికి రెక్టమ్ పైనున్న క్యాన్సర్ భాగాలను అంత స్పష్టంగా గుర్తించే అవకాశం లేకపోవడమే కారణం. అయితే లాప్రోస్కోపిక్ విధానం ద్వారా అక్కడ వచ్చిన కంటికి కనిపించని క్యాన్సర్ కణుతులను చాలా స్పష్టంగా గుర్తించగలిగే అవకాశం ఏర్పడింది. అందుకే క్యాన్సర్ ఉన్న భాగాన్ని తీసివేసి ఆ కత్తిరించిన భాగాన్ని స్పింక్టర్ పైన కుట్లు వేసి అతికిస్తున్నాం. ఒకప్పుడైతే చాలాసార్లు రెక్టల్ క్యాన్సర్స్‌లో రెక్టల్ స్పింక్టర్‌ను కూడా తీసివేయాల్సి వచ్చేది. దీనివల్ల మలం సహజమార్గంలో రాకుండా పోవడంతో కత్రిమ మార్గాన్ని ఏర్పరిచి అందులోంచి వెళ్లే ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా, యానల్ స్పింక్టర్‌ను అలాగే ఉంచేసి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేయడం సాధ్యమవుతోంది.


థైరాయిడెక్టమీ

థైరాయిడ్‌కు సంబంధించిన క్యాన్సర్ కాని (బినైన్) కణుతులను ఇప్పుడు ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ ద్వారా తీసివేయగలుగుతున్నాం. దీనివల్ల ఎక్కడా కత్తి కోతలు కనబడవు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో లింఫ్‌నోడ్స్ తీయడానికి ఎండోస్కోపిక్ సెంటినల్ నోడ్ హార్వెస్టింగ్, అలాగే ఎండోస్కోపిక్ యాక్సిలరీ క్లియరెన్స్ చేయడం జరుగుతోంది. దీనివల్ల మునుపున్న దుష్ప్రభావాలు బాగా తగ్గిపోయాయి. చేయి కదల్చడంలో ఉండే మునుపటి ఇబ్బందులు కూడా ఇప్పుడు రావడం లేదు. అలాగే గాల్‌బ్లాడర్ సర్జరీ, అండాశయ క్యాన్సర్ సర్జరీ ఇవన్నీ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సమర్థవంతంగా చెయ్యగలుగుతున్నాం. అత్యాధునిక ఔషధాలతో క్యాన్సర్‌ను ఎలాగూ శక్తివంతంగా అరికట్టగలుగుతున్నాం. దీనికి తోడు కీహోల్ సర్జరీ. లేదా లాప్రోస్కోపిక్ సర్జరీతో కత్తి కోతల బాధ కూడా బాగా తగ్గిపోయింది. ఈ ఆధునిక విధానాలు పాత తరహా సర్జరీలతో కలిగే అనేకానేక బాధల నుంచి విముక్తి కలిగించాయి.

  • courtesy with Dr. Ch.Mohana Vamsy @namasthetelangaana.jindagee.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, July 7, 2014

Esophagial cancer,అన్నవాహిక యొక్క క్యాన్సర్

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Esophagial cancer,అన్నవాహిక యొక్క క్యాన్సర్ గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




ఏవో కొన్ని మినహా ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్లు నయమవుతున్నాయి. ఎంత ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను అంత సమర్థంగా నయం చేయవచ్చు. అందుకే ఆయా రకాల క్యాన్సర్ల లక్షణాలను తెలుసుకుని, వాటినిబట్టి క్యాన్సర్‌ను నిర్ధారణ చేయగలిగితే చికిత్స సమర్థంగా జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు. క్యాన్సర్‌లో కనిపించే ఇవే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న రుగ్మతలకూ కనిపిస్తాయి. కాకపోతే అదే లక్షణం తరచూ కనిపిస్తుంటే మాత్రం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుని, అది కాదని తెలుసుకుని నిశ్చింతగా ఉండటం ఉత్తమము ..

క్యాన్సర్ వ్యాప్తి భారతదేశంలో విపరీతంగా పెరుగుతోంది. 2014 నాటికి ప్రమాదాలు (ట్రామా), గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్)ను అధిగమించి క్యాన్సరే అత్యధికంగా ప్రాణాలు బలిగొనే వ్యాధి అవుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే క్యాన్సర్‌ను ముందే గుర్తించడం అవసరం.

గొంతు నుండి జీర్ణాశయానికి కలిపే గొట్టంపేరు అన్నవాహిక. దీనిలో నుండే మనము నమిలి మ్రింగిన ఆహారం నెమ్మదిగా క్రిందకు దిగి జీర్ణాశయంలోనికి చేరుతుంది. సాధారణంగా ఈ గొట్టములో ఏదైనా అడ్డు వున్న ఎడల ఆహారం మ్రింగటానికి ఇబ్బంది కలుగుతుంది. అది  ఇన్‌ఫెక్షన్‌  లేక క్యాన్సర్‌ గడ్డ వల్ల కావచ్చును.

పైన చెప్పిన కారణాలే కాకుండా, (1) ఎక్కువ కాలం పొగత్రాగటం వల్ల, మద్యం సేవించటం వల్ల, (2) హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల (3) మనం త్రాగే నీటిలో నైట్రేట్స్‌ శాతం ఎక్కువ వున్న యెడల (4) తినే ఆహార పదార్ధాలలో carcinogens ఉన్నప్పుడు - ఉదా: ఎక్కువ కాలం వుంచిన రొట్టె . వీటి వల్ల కూడా అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశము వుంది. ఇంకా కొన్ని రకాల అన్నవాహిక జబ్బులు కూడా క్యాన్సర్‌కు దారితీయవచ్చును. ఉదా:- హోవెల్‌-ఈవాన్స్‌ సిండ్రోమ్‌, ప్లమ్మర్‌ విల్సన్‌ సిండ్రోమ్‌, ఎకలేషియా,  మొదలగునవి.

తెలుసుకోవటం ఎలా : చాలా మందికి తొలిదశలో ఏమీ సింప్టంస్‌(symptoms) వుండవు. ఉన్నా కూడా గమనించనంతగా ఉంటాయి. అది పెరిగే కొద్దీ ప్రధానంగా ఆహారం మ్రింగటంలో ఇబ్బందిగా వుంటుంది. నెమ్మదిగా కొంత మందిలో మ్రింగేటపుడు నెప్పిరావచ్చును. కొంతమందిలో ఆహారం తీసుకోగానే వాంతి రావచ్చును. కొంత మందికి క్రమేణా ఘనపదార్ధాలు తినలేక, ద్రవపదార్ధాలు త్రాగటం, ఆ తర్వాత ద్రవపదార్ధాలు కూడ వెళ్ళలేకపోవటం జరుగుతుంది. కొంత మందిలో దగ్గు కూడా రావచ్చు.

కనుక్కోవటం ఎలా? : ఇలా ఉన్నవారు ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ., ఎండోస్కోపి ,అల్ట్రాసౌండ్‌, సి.టి. స్కాన్‌ మొదలగునవి చేయించుకోవటం వల్ల జబ్బు తెలుస్తుంది. బయాప్సీవల్ల క్యాన్సర్‌ అవునా కాదా, అయితే ఏ రకమైనది అను వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా స్క్వేమస్‌ సెల్‌ కార్సినోమా, ఎడినో కార్సినోమా, సార్కో మా, లింఫోమా అను రకరకాల క్యాన్సర్లు ఉంటాయి.

ట్రీట్‌మెంట్‌ : మొదటి భాగం, రెండో భాగం అన్నవాహిక క్యాన్సర్లను సాధారణంగా రేడియో థెరపి వల్ల, మరియు ఒక్కోసారి కీమోథెరపీతో అనుసంధానం చేసి వైద్యం ఇస్తుంటారు. అన్నవాహిక క్రింది భాగంలో క్యాన్సరుకు సాధారణంగా ఆపరేషన్‌ చేయవచ్చును. రేడియో థెరపీ కూడ ఇస్తారు. కొంత మందిలో అన్నవాహికలో క్యాన్సర్‌ వున్న ప్రదేశాన్ని బట్టి, Treatment    చేస్తారు .

అన్నవాహిక క్యాన్సర్‌ సాధారణంగా ముదిరిన తర్వాత తెలియటం వల్ల చాల మంది రోగులు ఎక్కువ కాలం బ్రతకటం కష్టమవుతుంది. ఏ ఇబ్బంది వున్నా, ఎండోస్కోపి పరీక్ష ద్వారా తొలిదశలో గుర్తించటం, తగిన వైద్యం తొలిదశలో చేయించుకుంటే రోగికి ఎక్కువ కాలం ఇబ్బంది లేకుండా ఉండే అవకాశ ముంది. క్యాన్సర్‌ గురించి ఏ అనుమానం వున్నా, క్యాన్సర్‌ వైద్యుని సంప్రదించి, అనుమానం తీర్చుకొనవచ్చును.

  • Dr..V.ch. rao,--క్యాన్సర్‌ వైద్య నిపుణులు.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Leptospirosis,మెదడు పొరల వాపు వ్యాది ,లెప్టోస్పిరోసిస్

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు-Leptospirosis,మెదడు పొరల వాపు వ్యాది ,లెప్టోస్పిరోసిస్-గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  అంటే ఏమిటి?:
 Leptospirosis,మెదడు పొరల వాపు వ్యాది ,లెప్టోస్పిరోసిస్ --  Leptospira రకమైన బాక్టీరియా వలన సంక్రమిస్తుంది.(కలుగుతుంది) . దీనిని రాట్ క్యాచర్ యెల్లోస్ అని , పెరిటిబియల్ ఫీవర్ అని ఇతర పేర్లు కలవు . వ్యాధి లక్షణాలు కొద్దిపాటి తలనొప్పి ,కండరాల నొప్పి తోకూడిన జ్వరము నుండి బయంకరమైన మెదలు పొరల వావు (meningitis) , ఊపితిత్తులలో రక్త స్రావము(pulmonary haemorrhage) , weil's disease  అనే కిడ్నీ ఫైల్యూర్ కలుగజేయును .
  • రకాలు : 
దీనిలో 10 రకాల లెప్టోస్పైరా సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇది అడవి మరియు దేశీయ జంతువుల వలన వ్యాపిస్తుంది. సాదారణ జంతువులు -ఎలుకలు .జంతువు ల నీరుడు వాన , వరద , పొలముల్లో నీటితో కలవడము వలన మానవులకు సంక్రమించును. ఇన్ఫెక్టైన నీరు మనుసుల కళ్ళు , నోరు, ముక్కు , మర్మావయాల మ్యూకస్ పొరలతోను , పగిన చర్మము తోను contact అవడము వలన వ్యాధి అంటుతుంది. ఎక్కువగా పొలములలో పనిచేసే రైతులలో ఇది కనిపిస్తూ ఉంటుంది. 
  • ఎలా కనుక్కోవదము (Diagnosis): 
 ఈ వ్యాధి ఉన్న వారి లోబ్లడ్ కల్చర్(blood culture) ద్వారా ఈ లెప్టోస్పైరా ను కనుగొనడము , దీని డి.ఎన్‌.ఎ. ను రక్తము లో కనుగొనడము(finding DNA in the blood) , ఈ వ్యాది యాంటీబడీస్ ను వ్యాధి ఉన్న వ్యక్తులలో కనుగొనడము (Elisa test)
  • ఎలా అదుపుచేయడము : 
శరీర భాగాలు ఇన్‌ఫెక్టైన నీటితో తగలకుండా తగిన రక్షణ పరికరాలు వాడడము , 
ఎలుకలను , జంతువులను ఆయా ప్రాంతాలలో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడము ,
పొలము పనులలో ఉన్నవారు వ్యాధి ఉన్నదన్న అనుమారము ఉన్నా లేదా ముందుజాగ్రత్తగా మంచినీటితో శుభ్రముగా కడుగుకోవాలి .
  •  సూచనలు మరియు లక్షణాలు
    మానవులలో Leptospiral సంక్రమణ లక్షణాలు ఒక పరిధి కారణమవుతుంది, మరియు కొంతమంది   సోకిన వ్యక్తులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండవచ్చు. లెప్టోస్పిరోసిస్ ఫ్లూ వంటి లక్షణాలు (జ్వరం, చలి, myalgias, తీవ్రమైన తలనొప్పి) ప్రారంభమవుతుంది బైఫాసిక్ వ్యాధి. మొదటి దశ (తేలికపాటి మెదడు పొరల వాపు) పరిష్కరిస్తుంది, మరియు రెండవ దశ (తీవ్రమైన మెదడు పొరల వాపు) ేయ్వరకు రోగి క్లుప్తంగా కన్పించడం లేదు. వ్యాధి కేసులు 90 శాతం తేలికపాటి మెదడు పొరల వాపు మరియు ఏ నిర్దిష్ట చికిత్స మరియు మిగిలిన లేకుండా తీవ్రమైన మెదడు పొరల వాపు అభివృద్ధి. ఈ (కామెర్లు కారణమవుతుంది) కాలేయ, అదే చిహ్నాలు మరియు లక్షణాలు మూత్రపిండ వైఫల్యం కలిగి ఉంటుంది; గుండె మరియు మెదడు ప్రభావితమవతాయి మెదడు యొక్క బాహ్య పొర, అదే చిహ్నాలు మరియు లక్షణాలు మెదడు కణజాలం ఎన్సెఫాలిటీస్ మెనింజైటిస్; మరియు అత్యంత తీవ్రమైన మరియు ప్రాణహాని అన్ని మెదడు పొరల వాపు సమస్యలు వంటి ప్రభావితం ఊపిరితిత్తుల. సంక్రమణ తరచూ తప్పుగా కారణంగా అనిశ్చయ లక్షణాలు వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.

    సూచనలు మరియు మెదడు పొరల వాపు లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి మరియు వాంతులు కలిగి, మరియు కామెర్లు, ఎరుపు కళ్ళు, కడుపు నొప్పి, అతిసారం, మరియు రాస్ ఉన్నాయి ఉండవచ్చు. ప్రాథమిక న్యుమోనియా పోలివుంటాయి. మానవులలో లక్షణాలు ఒక 4-14 రోజు పొదిగే కాలం తర్వాత కనిపిస్తుంది. మరింత తీవ్రమైన వ్యక్తీకరణలు మెనింజైటిస్, తీవ్రమైన అలసట, వినికిడి నష్టం, శ్వాసకోశ ఇబ్బందులు, రక్తమున యూరియా అధికముగా నుండుట, మరియు కొన్నిసార్లు పెట్టారు అయితే, మూత్రపిండ వైఫల్యం మరియు అప్పుడప్పుడు కాలేయ వైఫల్యానికి (ఈ వ్యాధి తీవ్రమైన రూపం వెయిల్ యొక్క వ్యాధి అంటారు ఫలితంగా మూత్రపిండాల మధ్యంతర గొట్టపు నెక్రోసిస్, ఉన్నాయి వెయిల్ సిండ్రోమ్). [9] కార్డియోవాస్క్యులర్ సమస్యలు కూడా సాధ్యమే.

    జంతువులు పొదిగే (మొదటి లక్షణాలు బహిర్గతం సమయం) ఎక్కడైనా 2 నుండి 20 రోజుల వరకు. కుక్కలు, తరచుగా మెదడు పొరల వాపు నష్టాలను కాలేయం మరియు మూత్రపిండాల. అదనంగా, ఇటీవలి నివేదికలు తీవ్రమైన రక్తస్రావం సంబంధం కుక్క మెదడు పొరల వాపు ఒక పుపుస వివరించటానికి ఊపిరితిత్తులు ఇలాంటి మానవ పల్మనరీ రక్త స్రావ జబ్బుకు. [10] [11] వాస్కులైటిస్ వాపు మరియు శక్తివంతంగా ప్రసరణ రక్తనాళ స్కంధనంలో (డి ఐ సి) దీనివల్ల, సంభవించవచ్చు. హృదయ కండరముల వాపు పెరికార్డిటిస్లో, మెనింజైటిస్, మరియు క్రిష్ణపటలపు కూడా అవకాశం సీక్వెలే ఉన్నాయి. [12]

    ఐ కనుగొనడంలో కండ్ల ద్రవ స్రావ విస్తారణ ఉండవచ్చు
    కారణం
    Leptospira sp అనేక స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఒక 0.1 μm పాలి వడపోత పైన బాక్టీరియా
    స్థానిక అమెరికన్ జీవనశైలి leptospiral జీవిత చక్రం వాటిని బహిర్గతం

    లెప్టోస్పిరోసిస్ Leptospira spp అనే కొఱకు బాక్టీరియా వలన కలుగుతుంది. కనీసం ఐదు ముఖ్యమైన క్రిములకు ఇది అన్ని కుక్కలలో వ్యాధికారక, యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా లో ఉన్నాయి: [12] [13] [14]

         Icterohaemorrhagiae
         Canicola
         POMONA
         Grippotyphosa
         బ్రాటిస్లావా

    ఇతర (సాధారణంగా) ప్రాణాంతకమైన అంటు జాతులు ఉన్నాయి. జన్యుపరంగా వివిధ leptospira జీవుల serologically పక్కకు ఒకేలా ఉండవచ్చు. అందువల్ల, కొన్ని రకం గుర్తింపు గురించి వాదించారు. సంప్రదాయ రసి వ్యవస్థ ప్రస్తుతం ఒక విశ్లేషణ మరియు epidemiologic నుండి మరింత ఉపయోగకరంగా ఉంది దృష్టికోణంలో-కానీ ఈ పాలీమెరాసీ చైన్ రియాక్షన్ (PCR) వంటి టెక్నాలజీలను తదుపరి అభివృద్ధి మరియు వ్యాప్తి మార్చవచ్చు.

    లెప్టోస్పిరోసిస్ ఒక వ్యాధి సోకిన జంతువుల మూత్రం ద్వారా ప్రసారం, మరియు కాలం మూత్రం ఇప్పటికీ తడిగా వంటి అంటుకొను ఉంది. ఎలుకలు, ఎలుకలు, మరియు పుట్టుమచ్చ ముఖ్యమైన ప్రాధమిక ఆతిథ్య-కానీ కుక్కలు, జింకలు, కుందేళ్ళు, ముళ్లపందుల, ఆవులు, గొర్రెలు, రాకూన్లు opossums, ఉడుములు, మరియు కొన్ని సముద్ర క్షీరదాల సహా ఇతర క్షీరదాల్లో విస్తృత ద్వితీయ అతిధేయ వ్యాధి తీసుకు మరియు ప్రసారం. ఆఫ్రికాలో, పట్టిత ముంగిస ఇతర ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ ఆతిథ్య పాటు అవకాశం రోగ ఒక క్యారియర్, గుర్తించబడిన. [15] డాగ్స్ గడ్డి లేదా మట్టి ఆఫ్ ఒక వ్యాధి సోకిన జంతువుల మూత్రం నాకు, లేదా ఒక సోకిన సిరామరక నుండి త్రాగునప్పుడెల్లనన్ను.

    హౌస్ ఆదరించిన దేశీయ కుక్కలు స్పష్టంగా ఇంట్లో సోకిన ఎలుకలు మూత్రం licking నుండి, మెదడు పొరల వాపు సోకిందని. ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కలిగి ఎక్కువగా ఆవాసాల రకం మడ్డీ నది, పల్లాలు, సందులు, మరియు అడవి లేదా వ్యవసాయ క్షీరదాలు సాధారణ మార్గం లేదు పేరు మడ్డీ పశువుల పెంపక ప్రాంతాలు. మెదడు పొరల వాపు సంభవం సమశీతోష్ణ వాతావరణం మరియు ఉష్ణమండల సంవత్సరం పొడవునా లో కాలానుగుణ దీనితో వర్షపాతం మొత్తం నేరుగా పరస్పర సంబంధం. లెప్టోస్పిరోసిస్ కూడా సోకిన జంతువులు వీర్యం ద్వారా ప్రసారం. [16]

    మానవులు ఈ సోకిన జంతువులు నుండి మూత్రం కలిగి నీరు, ఆహారం, లేదా మట్టి తో పరిచయం ద్వారా వ్యాధి బారిన. ఈ కలుషితమైన ఆహారం లేదా నీటిని మింగడం ద్వారా లేదా చర్మ స్పర్శ ద్వారా జరుగుతుంది. వ్యాధి మానవుల మధ్య వ్యాప్తి తెలిసిన, మరియు స్వస్థత బాక్టీరియా వ్యాపించే మానవులలో అరుదుగా ఉంటుంది లేదు. నీటిలో సుదీర్ఘ ఇమ్మర్షన్ బ్యాక్టీరియా ఎంట్రీ ప్రోత్సహిస్తుంది వంటి లెప్టోస్పిరోసిస్, నిర్దిష్ట ప్రాంతాల్లో నీరు క్రీడ ఔత్సాహికుల నుంచి సాధారణం. సర్ఫర్లు మరియు నురగ తెడ్డు [17] బ్యాక్టీరియా చూపాయి ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రమాదం ఎక్కువగా ఉన్నాయి, మరియు వారి కళ్ళు లేదా ముక్కుకు కలుషితమైన నీరు splashing, లేదా వ్యాధి సోకిన నీరు గాయాలకు పరిచయం, కలుషితమైన నీరు మింగడం ద్వారా వ్యాధితో చేయవచ్చు. [18]
    ప్రమాదం వృత్తులు వద్ద

    ప్రమాదం వృత్తులు పశువైద్యుల కబేళా కార్మికులు, రైతులు, మురుగు నిర్వహణ కార్మికులకు, వ్యర్ధ పరిష్కార కార్మికులు, భూమిని కొలిచే, మరియు వదిలివేసిన భవనాలు పని. [19] కబేళా కార్మికులు సోకిన రక్తం లేదా శరీర ద్రవాలతో పరిచయం ద్వారా వ్యాధితో చేయవచ్చు వారున్నారు. రోవర్లు, kayakers మరియు canoeists కొన్నిసార్లు వ్యాధితో. [12]
    రోగ నిర్ధారణ
    Leptospira బాక్టీరియా ఉనికిని బహిర్గతం ఒక వెండి రంజనం పద్ధతిని ఉపయోగించి కిడ్నీ కణజాలం,

    సారీ సూక్ష్మజీవి (serologically గుర్తించదగిన చర్యల ప్రేరేపించడం) మరియు తరువాత మూత్రపిండాల వెళ్లడం మొదటి 7 10 రోజులు రక్తం మరియు సెరెబ్రోస్పానియల్ ద్రవం (CSF) లో చూడవచ్చు. 7 నుంచి 10 రోజుల తరువాత సూక్ష్మజీవి తాజా మూత్రంలో చూడవచ్చు. అందువల్ల, ప్రారంభ విశ్లేషణ ప్రయత్నాలు వివిధ ఆకారాల ప్యానెల్ తో serologically రక్తరసి లేదా రక్త నమూనా పరీక్ష ఉన్నాయి.

    కిడ్నీ పనితీరు పరీక్షలు (బ్లడ్ యూరియా నైట్రోజెన్ మరియు క్రియాటినిన్) అలాగే కాలేయం విధులు కోసం రక్త పరీక్షలు నిర్వహిస్తారు. రెండో ట్రాన్సామినాసెస్ ఒక మధ్యంతర ఎత్తుతో బహిర్గతం. ఆస్పార్టేట్ల aminotransferase (AST), అలనిన్ aminotransferase (ALT), మరియు గామా glutamyltransferase (GGT) స్థాయిలు బ్రీఫ్ ఎత్తు బాగా మందంగా ఉంటాయి. ఈ స్థాయిలు కూడా కామెర్లు పిల్లల్లో సాధారణంగా ఉండవచ్చు,.

    మెదడు పొరల వాపు యొక్క రోగనిర్ధారణను ఎంజైమ్ అనుబంధ ఇమ్మ్యునో అస్సే (ELISA) మరియు పాలీమెరాసీ చైన్ రియాక్షన్ (PCR) వంటి పరీక్షలు నిర్ధారించబడింది. MAT (సూక్ష్మ సంయోజన పరీక్షను), ఒక serological పరీక్ష, మెదడు పొరల వాపు నిర్ధారించడంలో బంగారు ప్రమాణం భావిస్తారు. వివిధ leptospira పెద్ద ప్యానెల్ శ్రమతో మరియు ఖర్చుతో రెండూ ఇది తరచుగా subcultured తప్పక, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, underused ఉంది.

    మెదడు పొరల వాపు కోసం రోగ నిర్ధారణ జాబితా కారణంగా విభిన్న symptomatics చాలా పెద్దది. అధిక తీవ్రత మధ్య తో రకాల కోసం, జాబితా డెంగ్యూ జ్వరం మరియు ఇతర రక్త స్రావ జ్వరాలు, వివిధ కారణాలతో యొక్క హెపటైటిస్, వైరల్ మెనింజైటిస్, మలేరియా, టైఫాయిడ్ కలిగి. లైట్ రకాల ఇన్ఫ్లుఎంజా మరియు ఇతర సంబంధిత వైరల్ వ్యాధులు నుండి వేరు చేయాలి. నిర్దిష్ట పరీక్షలు మెదడు పొరల వాపు యొక్క సరైన రోగ ఒక ఉండాలి.

    నిర్దిష్ట విశ్లేషణ ద్వార పరిమిత యాక్సెస్ (ఉదా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో) యొక్క పరిస్థితులలో, ధ్యాస రోగి యొక్క వైద్య చరిత్ర చెల్లించే ఉండాలి. వైద్య చరిత్రలో కొన్ని నివాసస్థలం ప్రాంతాల్లో, seasonality, మందకొడి కలుషితమైన నీరు సంబంధం (స్నానం, ఈత వరదలు పచ్చికభూములు పని, మొదలైనవి) లేదా ఎలుకలు వంటి అంశాలు మెదడు పొరల వాపు పరికల్పనకు మద్దతు మరియు (అందుబాటులో ఉంటే) నిర్దిష్ట పరీక్షలు కోసం సూచనలు ఉపయోగపడతాయి.

    Leptospira అనుకూలత మధ్యస్థ మూడు నెలల గరిష్ట తో మూడు వారాలు 30 ° C. [20] 28 వద్ద incubated ఇది Ellinghausen-మక్-జాన్సన్-హారిస్ మీడియం (EMJH), లో వర్ధనం చేయవచ్చు. ఈ విశ్లేషణ ప్రయోజనాల కోసం కల్చర్ పనికిరాని చేస్తుంది, కానీ సాధారణంగా పరిశోధనలో ఉపయోగిస్తారు.
    నివారణ

    డాక్సీసైక్లిన్ ప్రమాదం ప్రాంతాల్లో వ్యాధి నివారించేందుకు, ఒక రోగనిరోధకత వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. [21] ఎఫెక్టివ్ ఎలుక నియంత్రణ మరియు మూత్రం కలుషితమైన నీటి వనరులు తప్పించడానికి అవసరమైన నివారణ measures.Human టీకాలు క్యూబా మరియు చైనా కొన్ని దేశాలు, అందుబాటులో ఉంటాయి . [5] ప్రస్తుతం, ఏ మానవ టీకా సంయుక్త అందుబాటులో ఉంది. జంతు టీకాలు మాత్రమే బ్యాక్టీరియా కొన్ని జాతులు కవర్. డాగ్ టీకాలు కనీసం ఒక సంవత్సరం ప్రభావవంతమైన. [22]
    చికిత్స

    ఎఫెక్టివ్ యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ G, ampicillin, అమోక్సిసిలిన్ మరియు డాక్సీసైక్లిన్ ఉన్నాయి. మరింత తీవ్రమైన సందర్భాలలో cefotaxime లేదా ceftriaxone మక్కువ చేయాలి.

    గ్లూకోజ్ మరియు ఉప్పు పరిష్కారం కషాయాలను నిర్వహించబడినా; డయాలసిస్ తీవ్రమైన సందర్భాలలో ఉపయోగిస్తారు. సీరం పొటాషియం ఉద్గమనాలు సాధారణం మరియు పొటాషియం స్థాయి గెట్స్ చాలా అధిక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సీరం భాస్వరం స్థాయిలు కూడా మూత్రపిండ వైఫల్యం కారణంగా ఆమోదనీయం స్థాయిలు పెరుగుతుంది.

    Hyperphosphatemia కోసం చికిత్స కాల్షియం కార్బోనేట్ అంతర్లీన వ్యాధి, డయాలసిస్ తగిన, లేదా నోటి చికిత్స, కానీ మొదటి సీరం కాల్షియం స్థాయిలు తనిఖీ లేకుండా (ఈ రెండు స్థాయిలు సంబంధించిన) కలిగి. 7-10 రోజులలో క్రమంగా తగ్గిన మోతాదులో (ఉదా, ప్రెడ్నిసోలోన్) లో కోర్టికోస్టెరియాడ్స్ పరిపాలన తీవ్రమైన రక్తసిక్త ప్రభావాలు సందర్భాలలో నిపుణులు కొన్ని [citation needed] ద్వారా మద్దతిస్తుంది. ఆర్గాన్ నిర్దిష్ట సంరక్షణ మరియు చికిత్స మూత్రపిండ, కాలేయ, లేదా గుండె ప్రమేయం సందర్భాలలో అవసరం.
    మహమ్మారి వ్యాధి

    ఇది ఏడు మిలియన్ పది ప్రజల సంవత్సరానికి మెదడు పొరల వాపు సోకిన ఉంటాయి అంచనా. [8] సంక్రమణ వార్షిక రేట్లు ఉష్ణమండల 100,000 100 కు 10 సమశీతోష్ణ వాతావరణం 100,000 0.02 వరకు ఉంటాయి. [21] ఈ తక్కువ సంఖ్యలో దారితీస్తుంది అవకాశం ఉంది కంటే నమోదయ్యాయి.
    చరిత్ర

    అతను ఒక నివేదించారు వ్యాధి మొదటి 1886 లో అడాల్ఫ్ వెయిల్ వర్ణించారు "ప్లీహము, కామెర్లు, మరియు మూత్ర పిండ శోధము విస్తరించడంతో తీవ్రమైన అంటు వ్యాధి." Leptospira మొదటి ఒక పోస్ట్ మార్టం మూత్రపిండ కణజాలం ముక్క 1907 గమనించారు. 1908 లో [23], Inada మరియు Ito మొదటి కారణ జీవి [24] ఇది గుర్తించి 1916 లో ఎలుకలలో దాని ఉనికిని కూడా గుర్తించారు. [25]

    లెప్టోస్పిరోసిస్ 1620 లో యాత్రికులు రాక ముందు వెంటనే ఏర్పడింది మరియు స్థానిక జనాభా చాలా మంది ప్రస్తుత మసాచుసెట్స్ తీరంలో స్థానిక అమెరికన్లలో ఒక అంటువ్యాధి కారణమవుతుందని ప్రతిపాదించారు. [26] గతంలో ప్రతిపాదనలు ప్లేగు, పసుపు జ్వరం కూడా, మశూచి, ఇన్ఫ్లుఎంజా, ఆట్లమ్మ, టైఫస్, టైఫాయిడ్, పందిపురుగుల సంక్రమణ వ్యాధి, మెనింజైటిస్ మరియు డెల్టా ఏజెంట్ తో హెపటైటిస్ బి వైరస్ syndemic సంక్రమణ. [27] [28] [29] [30] వ్యాధి న్యూ వరల్డ్ తీసుకు ఉండవచ్చు యూరోపియన్లు మరియు స్థానిక అమెరికన్లు అధిక ప్రమాదం రోజువారీ కార్యకలాపాలు ద్వారా వ్యాప్తి [citation needed].

    1886 లో వెయిల్ యొక్క పాత్ర ముందు, అంటు కామెర్లు అని పిలుస్తారు వ్యాధి అవకాశం వెయిల్ యొక్క వ్యాధి, లేదా తీవ్ర పచ్చకామెర్లు మెదడు పొరల వాపు మాదిరిగానే. ఈజిప్టు ప్రచారం సందర్భంగా, నెపోలియన్ సైన్యం బహుశా అంటు కామెర్లు ఏమి బాధపడ్డాడు. [31] అంటు కామెర్లు అమెరికన్ పౌర యుద్ధం సమయంలో దళాలు మధ్య ఏర్పడింది. [32]

    ఇది గల్లిపోలి మరియు కందక యుద్ధం యొక్క తడిసిన పరిస్థితులు సంక్రమణ అనుకూలంగా పేరు ప్రపంచ యుద్ధం, ఇతర యుధ్ధాలలో దళాలు మధ్య నివేదించబడింది. మెదడు పొరల వాపు యొక్క 20 శతాబ్ద వర్ణనలలో ఉపయోగిస్తారు నిబంధనలు జావా నకిలీ డెంగ్యూ, ఏడు రోజుల జ్వరం, శరదృతువు జ్వరం, అకియమ వ్యాధి, మరియు మార్ష్ లేదా చిత్తడి జ్వరం. L icterohaemorrhagiae కామెర్లు మరియు అధిక మరణ రేటు వర్గీకరింపబడినాయి ఇది జపాన్ లో ముందు రెండవ ప్రపంచ యుద్ధం వ్యాప్తి లో కారణమైన కారకాన్ని, గుర్తింపబడిన.

    అక్టోబర్ 2010 లో బ్రిటిష్ rower ఆండీ హోమ్స్ వెయిల్ యొక్క వ్యాధి సోకే తర్వాత మరణించాడు. [33] అతని మరణం ప్రభుత్వ మరియు వైద్య నిపుణులను వ్యాధి అవగాహన వసూలు చేసింది. [34]
    పేర్లు

    "7 రోజుల జ్వరం", [1] "పంట జ్వరం", [1] "రంగంలో జ్వరం", [1] "canefield జ్వరం", [1] "తేలికపాటి జ్వరం", [1] ": లెప్టోస్పిరోసిస్ అనేక పేర్లు ఎలుక బోను యొక్క పసుపు ", [2]" ఫోర్ట్ బ్రాగ్ జ్వరం ", [3] మరియు" pretibial జ్వరం ". [3]

    అది చారిత్రాత్మకంగా ఇది "nanukayami జ్వరం" అని పిలుస్తారు "బ్లాక్ కామెర్లు" [35] మరియు జపాన్ లో ప్రతీతి. [36]
    ఇతర జంతువులు

    మెదడు పొరల వాపు L. interrogans కలుగుతుంది కుక్కలు లో "canicola జ్వరం" అని ఉండవచ్చు. [36] లెప్టోస్పిరోసిస్ గట్టిగా అనుమానించినా మరియు కుక్క కళ్ళు sclerae (కూడా కొద్దిగా పసుపు jaundiced ఉంటే ఒక రోగ నిర్ధారణ భాగంగా చేర్చబడిన చేయాలి ). కామెర్లు లేకపోవడం మెదడు పొరల వాపు అవకాశం తొలగించడానికి లేదు, మరియు దాని ఉనికిని హెపటైటిస్ లేదా మెదడు పొరల వాపు కంటే ఇతర కాలేయ రోగ సూచిస్తుంది. వాంతులు, జ్వరం, తినడానికి వైఫల్యం, తగ్గిన మూత్ర ఉత్పత్తి, అసాధారణంగా ముదురు లేదా గోధుమ మూత్రం, బద్ధకం కూడా వ్యాధి సంకేతాలను ఉన్నాయి.

    కుక్కలలో పెన్సిలిన్ సాధారణంగా leptospiremic దశ (రక్తం సంక్రమణ) ముగిసింది ఉపయోగిస్తారు, మరియు డాక్సీసైక్లిన్ క్యారియర్ రాష్ట్ర తొలగించడానికి ఉపయోగిస్తారు.
  •  
 
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/