Showing posts with label క్యాన్సర్‌ రోగుల్లో మానసిక సమస్యలు. Show all posts
Showing posts with label క్యాన్సర్‌ రోగుల్లో మానసిక సమస్యలు. Show all posts

Saturday, April 6, 2013

Psychological problem in cancer patients,క్యాన్సర్‌ రోగుల్లో మానసిక సమస్యలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Psychological problem in cancer patients,క్యాన్సర్‌ రోగుల్లో మానసిక సమస్యలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్‌ అంటే తగ్గని వ్యాధి అని ... ఇక తమకు చావు తప్పదని భయపడతారు రోగులు. నిజమే క్యాన్‌సర్ ఆదిలో గుర్తించక పోతే పూర్తిగా నయము చేయడము సాధ్యపడదు. సెంటిమెంట్స్ తోనూ , మూఢనమ్మకాలతోను , పేదరికము తోనూ కూడికొనిఉన్న భారతదేశములో క్యాన్‌సర్ అవునో కాదో గుర్తింపుకోసము ప్రజలు ముందుకు రావడములేదు. తీరా ముదిరిపోయిన తరువాత చేసేదేమీ ఉండదు. మానసికము గా బాధపడడమే మిగులుతుంది.

క్యాన్సర్‌ రోగుల్లో మానసిక అధికంగా ఉంటాయని శాస్త్రీయ అధ్యయనాల్లో వెల్లడైందని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం చెప్పారు. దేశంలోని 20 ఆస్పత్రుల్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 40% మంది రోగుల్లో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిర్థరణ అయిందన్నారు. క్యాన్సర్‌ తీవ్రత కన్నా, మానసిక సమస్యలతో చాలా మంది రోగుల్లో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోందన్నారు. దీన్ని నివారించడానికి క్యాన్సర్‌ చికిత్సలు చేసే ఆస్పత్రుల్లో మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందించే విధానం అందుబాటులోకి రావలసిన ఆవశ్యకత ఉందని హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ క్యాన్సర్‌ సదస్సులో కలాం చెప్పారు. రక్త క్యాన్సర్‌ సోకిన తన ముగ్గురు స్నేహితులకు మానసికంగా ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా వివరించారు. క్యాన్సర్‌ చికిత్సలకు దేశంలో ఆ తరహా విధానం లేదు,60% రోగులకు సాధారణ వైద్యులే దిక్కు. క్యాన్సర్‌ రోగులకు చికిత్సలు బాధాకరం కాకుండా నివారించడానికి అనుసరించాల్సిన విధానాలపై వైద్యులు, మానసిక నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్‌ సోకిన వారి కుటుంబసభ్యుల్లో మానసిక భయాందోళనలు తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలాం సూచించారు. దేశంలోని సుమారు 120 కోట్ల జనాభాకు దాదాపు 1200 మంది క్యాన్సర్‌ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. దీనివల్ల మొత్తం క్యాన్సర్‌ రోగుల్లో దాదాపు 60% మందికి సాధారణ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని వివరించారు. ప్రతి జిల్లా ఆస్పత్రిలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సలు అందించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో వివిధ రకాల క్యాన్సర్ల తీవ్రతను అంచనా వేయడానికి ''రోగుల నమోదు విధానం'' తప్పనిసరి చేయాలన్నారు. వివిధ రకాల క్యాన్సర్‌ రోగాలకు కారకాలైన జన్యువులను గుర్తించి, వాటిపై పరిశోధనలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోగులకు రేడియోథెరఫీ చికిత్సల్లో దుష్ప్రభావాలను నివారించడానికి నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయి: క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక సంపత్తిని సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌కు వివిధ విభాగాలకు చెందిన వైద్యనిపుణులు బృందాలుగా ఏర్పడి చికిత్సలు అందించే విధానం మన దేశంలో కూడా అందుబాటులోకి రావలసిన అవసరం ఉందని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సినీనటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈ అంశంపై అంతర్జాతీయ సదస్సుల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ వ్యాధులపై మన దేశంలో విస్తృతంగా అధ్యయనం చేసిన డాక్టర్‌ డి.డి.పటేల్‌ను సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ బారినపడ్డ వారికి చికిత్సలు అందడంలేదని డాక్టర్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్లపై విస్తృతస్థాయిలో పరిశోధనలు, రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి రూ.1000 కోట్లతో ఢిల్లీలో జాతీయ క్యాన్సర్‌ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

-క్యాన్సర్‌ సదస్సులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం-ఈనాడు - హైదరాబాద్‌
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/