Tuesday, December 29, 2009

ఊబకాయము , Obesity


  • 21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది. ఈ సమస్య ఎంతమేరకు వ్యాపించిందో నిర్ధిష్టంగా తెలియకపోయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో 20-40 శాతం మంది వయోజనులు, 10-20 శాతం మంది పిల్లలు, యువత దీని బారిన పడుతున్నారని అంచనా. స్థూలకాయం పెరగడానికి కారణాలలో ప్రధానమైనది గ్రామీణ జీవనం నుంచి నగర జీవితానికి పరివర్తన చెందడం, వ్యక్తులకు భౌతిక వ్యాయామం లేకపోవడం. స్థూలకాయాన్ని మందులు లేకుండానే తగ్గించవచ్చు. అయితే దాని వ్యాప్తి గురించి, రావడానికి కారణాలు, జీవితంపై దాని ప్రభావం, సామాజిక, మానసిక ప్రభావాలు, మరణానికి చేరువ చేసే దాని సామర్ధ్యం గురించి సరైన అవగాహన ఉండాలి.




నిర్వచనము : ఆరోగ్య పరం గా చెడు ప్రభావము చూపే విధం గా శరీరము లో కొవ్వు అధికం గా పెరుకుపోవడాన్నే ఉబకాయము (obesity) అంటాము . ఇది ఎన్నో అనారోగ్యాలకు (జబ్బులకు) కారణమవుతుంది . బాడీ మాస్ ఇన్దెక్ష్ (BMI) దీనికి కొలమానము గా పరిగనిస్తారు
బి.యం.ఐ = బరువు కిలో గ్రాముల్లో /ఎత్తు స్క్వేర్ (మీటర్లలో) (BMI = weight in kg/height ^2 in meters)

BMI Classification
<> underweight
18.5–24.9 normal weight
25.0–29.9 overweight
30.0–34.9 class I obesity
35.0–39.9 class II obesity
≥ 40.0 class III obesity










ఉబాకాయాన్ని మూడు విధములు గా వర్గీకరించారు . క్లాస్ 1, క్లాస్ 2 , క్లాస్ 3 . పై టేబుల్ లో చూడవచ్చును .
కలిగే అనర్ధాలు :
  1. గుండె జబ్బులు - హార్ట్ ఎటాక్ , యాంజైన , బి.ఫై , హార్ట్ ఫైల్యూర్ , హై కొలెస్టిరాల్ , డీప్ వెయిన్ త్రోమ్బోసిస్ ,
  2. మదుమేహ వ్యాధి -టైపు 2 దయబిటీస్ ,
  3. నిద్రలో శ్వాశ తీసుకోవడానికి కష్టము గా ఉంటుంది .
  4. కొన్ని రకాల కాన్సెర్ జబ్బులు ,
  5. కీళ్ళ నొప్పులు (Osteoarthritis) -గౌట్ , నడుము నొప్పి ,
  6. శరీర ఆకృతి లో పలుమార్పులు (Disfiguration) ,
  7. పెళ్ళైన తరువాత గర్భం దాల్చడం ఇబ్బందులు (conceiving problems) పిల్లల పుట్టుక లో కొన్ని అవకతవకలు ,
  8. ఫంగల్ చర్మ వ్యాదులు ఎక్కువ ,
  9. రుతుక్రమములో తేడాలు ,
  10. డిప్రషన్ , సమాజము లో ఒంటరి తనము ,

ఊబకాయానికి కారణాలు :
  • ఎక్కువ క్యాలరీస్ ఆహారము తీసుకోవడం,
  • శరీర వ్యాయామము లేకపోవడం ,
  • వంశ పారంపర్యం ,
  • ఎండో క్రయిన్ అసమతుల్యము వలన ,
  • ఏ కారణము తెలియనివి (UnknownCause),
ట్రీట్మెంట్ :
  • ఎక్కువ పీచు పదార్ధము ఉన్న ఆహారము - ఆకుకూరలు , కాయకురాలు గింజలు గల ఆహారము ,
  • రోజు వ్యామాము చేయాలి ,
  • ఆహారము తక్కువగా తీసుకోవము ,
  • తైరాయిడ్ జబ్బులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవాలి ,
  • మంచి డాక్టర్ ను కలిసి - యాంటి ఒబీసిటి మందులు వాడాలి ,
  • తిండి ముందు ఎంత నోరు కట్టేసుకుని కూర్చున్నా బరువు తగ్గట్లేదా?
...అయితే రోజు మార్చి రోజు ఉపవాసం ఉండి చూడండి. బరువు తగ్గడం బహు సులభం అంటున్నారు అమెరికన్‌ పరిశోధకులు. పదహారు మంది స్థూలకాయులపై పదివారాల పాటు ఒక క్రమపద్ధతిలో వారు జరిపిన అధ్యయనంలో తేలిన ఫలితమిది. వారికి తొలి రెండు వారాల పాటూ మామూలుగానే ఆహారమిచ్చారు. మిగతా ఎనిమిది వారాల్లో రోజు విడిచి రోజు తిండి బాగా తగ్గించి పెట్టారు. రోజుకు 1800-2200 క్యాలరీల ఆహారం అవసరమైతే అందులో 20 నుంచి 25 శాతం మేర మాత్రమే తిననిచ్చారు. పదివారాల తర్వాత చూస్తే ఒక్కొక్కరూ వారి శరీరతత్వాన్ని బట్టీ 3 నుంచి 13 కేజీల దాకా తగ్గారు. శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రత గల కొవ్వు(ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజరైడ్‌లూ, రక్తపోటు స్థాయులూ కూడా బాగా తగ్గినట్టు గమనించారు.

  • నిద్రలేమితో వూబకాయం
అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట హాయిగా నిద్రపోండి. లేకపోతే వూబకాయం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని కేస్‌ వెస్టర్న్‌ విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. రాత్రిపూట రోజుకి ఏడు గంటల పాటు నిద్రపోయేవారితో పోలిస్తే.. ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు వూబకాయులయ్యే అవకాశం 70 శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. నిద్రపోవాల్సిన సమయంలో మెలకువగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పులే దీనికి కారణమవుతున్నాయి.

నిద్రలేమి మూలంగా శరీరంలో లెప్టిన్‌, ఘ్రెలిన్‌ అనే హార్మోన్ల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. కొవ్వు తగినంతగా ఉందని చెప్పేందుకు కొవ్వు కణాలు లెప్టిన్‌ను విడుదల చేస్తాయి. ఇది తక్కువగా తినమని శరీరానికి సూచిస్తుంది. మరోవైపు ఘ్రెలిన్‌ ఆహారాన్ని తీసుకోవాలంటూ మెదడుకు సంకేతాలు పంపిస్తుంటుంది. సరిగా నిద్రపోతే లెప్టిన్‌, మెలకువగా ఉంటే ఘ్రెలిన్‌ అధిక మోతాదులో విడుదలవుతాయి. అంటే నిద్రలేమి వల్ల ఆకలి పెరగటం వల్ల తిండి కూడా ఎక్కువెక్కువగానే తింటారన్నమాట. ఇలా రాత్రిపూట మాత్రమే కాదు, తెల్లారిన తర్వాత కూడా తింటుంటారు. అది కూడా పండ్లు, కూరగాయల వంటివి కాకుండా స్వీట్లు, పిండి పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండేవి తీసుకోవటం వల్ల కేలరీల మోతాదూ పెరుగుతుంది. దీంతో జీవక్రియలు మందగించి చివరికి బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి కారణంగా శరీరం కేలరీలను తగినంతగా వినియోగించుకోలేదు. పైగా నిద్రించాల్సిన సమయంలో మెలకువగా ఉంటే దెబ్బతిన్న కణాలను సరిచేసుకోవటం, మెదడుకు విశ్రాంతి దొరికే అవకాశం కూడా తగ్గిపోతుంది.--- ఈనాడు సుఖీభవ 21-09-2010.

  • ప్రశ్న: శరీరంలోని జన్యువుల కారణంగానే వూబకాయం వస్తుందా?

జవాబు: ఒక వయసులో ఉండవలసిన బరువుకన్నా చాలా ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి వూబకాయానికి కారణం 60 శాతం వరకూ జన్యు సంబంధమైన సమస్యేనని అనుకోవచ్చు. శరీరంలో ఆకలిని ప్రభావితం చేసే జన్యువులు కొన్ని ఉంటాయి. అవి ఆకలిని ప్రేరేపించే, ఆకలిని తీర్చే హార్మోన్లను విడుదల చేస్తాయి. అవి కొందరి విషయంలో తిన్న ఆహారాన్ని మండించి శక్తిగా మార్చకుండా కొవ్వు రూపంలో దేహంలోని వివిధ భాగాల్లో నిలువ చేస్తాయి. ఈ లోపం వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువుల వల్ల ఏర్పడిందే. కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే ఊబకాయాన్ని కొంతవరకూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా తగ్గించవచ్చు. కానీ జన్యుపరంగా వచ్చిన వూబకాయం విషయంలో ఇది సాధ్యం కాదు. మెదడులో ఆకలిని ప్రేరేపించే హార్మోన్‌ ఉండే ప్రదేశం జన్యు ప్రభావం వల్ల ఎప్పుడూ చురుగ్గా పని చేస్తూ ఉంటే ఊబకాయాన్ని తగ్గించడం అసాధ్యం. ఇలాంటి వారికి వైద్య చికిత్స ఒకటే పరిష్కారం.

  • ఎండ తగలకపోతే ఊబకాయం ఖాయం

ఎండను చూసి భయపడి ఇంట్లో కూచుంటే లావెక్కిపోవడం ఖాయమంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరర్శి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి. విటమిన్ అందదు.

డి విటమిన్ అనేది శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్ తయారవక పోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది.

శరీరంలో క్యాల్షియమ్‌కి భారీకాయానికి సంబంధముంది. భారీకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండలో సమీపంలోని పార్క్‌లకు వెళ్లండి. ఇంటి పెరడు ఉంటే అక్కడ పిల్లలతో చేరి ఆటలాడండి. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు ఊబగా మారిపోవడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే.
  • వూబకాయం నుంచి బయట పడాలంటే డి vitamin -- సి పట్టండి
వూబకాయం నుంచి బయట పడాలంటే మితాహారం, వ్యాయామమే కాదు తగినంత సూర్యరశ్మిని గ్రహించడమూ ముఖ్యమేనని చెబుతోంది ఓ తాజా పరిశోధన. ఉదయం పదకొండులోపూ సాయంత్రం మూడు తర్వాతా ఉండే ఎండలో మనకు కావాల్సిన విటమిన్‌-డి లభిస్తుంది. శరీరంలోని కొవ్వుని కరిగించడంలో దీనిది ముఖ్యపాత్ర. విటమిన్‌-డి తక్కువైతే మనశరీరంలో, ముఖ్యంగా పొట్టభాగంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. కేవలం వూబకాయం మాత్రమే కాదు, క్యాన్సర్‌కూ ఇది మందు. విటమిన్‌-డి తగినంత లేకుంటే క్యాన్సర్‌ కణాల ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్‌ డి లేమి కారణంగా అల్జీమర్స్‌, ఒత్తిడి, మధుమేహం వంటి వ్యాధులూ వస్తాయి. శరీరంలోని కణాలచుట్టూ ఉండే రక్షణ కవచం ఏర్పడటంలో విటమిన్‌-డి పాత్ర కీలకం. అర్థమైందిగా, చలికాలం కదా అని ఎనిమిదివరకూ ముసుగు తన్ని పడుకోకుండా, కాస్త ముందేలేచి అలా ఎండలో కాసేపు నడవాలి మరి!

  • క్రమం తప్పిన నెలసరితో స్థూలకాయం,Obesity in girls of irregular periods :

యుక్తవయసు అమ్మాయిల్లో నెలసరి క్రమం ప్రకారం రాకుండా అస్తవ్యస్తంగా తయారవ్వటం తరచుగా కనిపించే సమస్యే. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ ఇలాంటి అమ్మాయిలకు అధిక బరువు, స్థూలకాయం ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బు లక్షణాలు కూడా త్వరగానే బయటపడుతున్నట్టు వెల్లడైంది. నెలనెలా రుతుక్రమం సరిగా కాకపోవటానికి పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీవోఎస్‌) సమస్య కారణం కావొచ్చు. హార్మోన్ల వ్యత్యాసం మూలంగా కనబడే ఇది.... సంతానం కలగకపోవటం, స్థూలకాయం వంటి వాటికీ దారితీస్తుంది. బాడీమాస్‌ ఇండెక్స్‌, నడుం చుట్టుకొలత అధికంగా ఉండటం, మధుమేహం ముప్పులకు నెలసరి సమస్యలతో ఎంతమేరకు సంబంధం ఉందోననే దానిపై అమెరికాలోని నేషనల్‌ హార్ట్‌, లంగ్‌ అండ్‌ బ్లడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. పద్నాలుగు ఏళ్ల నుంచి ఆపైన వయసు గలవారిని ఇందుకు ఎంచుకున్నారు. వీరి రుతుక్రమంతో పాటు సెక్స్‌ హార్మోన్లు, గ్లూకోజ్‌, ఇన్స్‌లిన్‌, రక్తపోటు స్థాయులను కూడా పరిశీలించారు. 42 రోజుల తర్వాత నెలసరి వస్తున్నవారు 14 ఏళ్ల వయసులోనే అధిక బరువు కలిగి ఉంటున్నట్టు గుర్తించటం గమనార్హం. అధ్యయనం సాగుతున్నకొద్దీ వీరి బరువు, నడుం కొలత కూడా పెరుగుతూనే ఉంది కూడా. ఈ అమ్మాయిలు 25 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి మిగతావారితో పోలిస్తే వీరి బాడీమాస్‌ ఇండెక్స్‌ సగటున 37.8గా నమోదైంది. ఇది స్థూలకాయానికి సూచిక. అంతేకాదు వీరిలో ఇన్స్‌లిన్‌, రక్తంలో చక్కెర శాతం కూడా అధిక మోతాదుల్లోనే కనిపించాయి. అయితే వీటికి నెలసరి సరిగా కాకపోవటమే కారణమవుతున్నది అని అధ్యయనంలో నిర్ధారణ కాలేదు. కానీ నెలసరి సరిగా రాకపోవటానికి జీవక్రియల్లో మార్పులను బట్టి (ఇన్స్‌లిన్‌ మోతాదు పెరగటం లాంటివి) అండాశయాలు స్పందించటం వంటి ఇతర అంశాలేవైనా దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అంటే మధుమేహ సంబంధ ముప్పులు నెలసరి సమస్యలకు ముందు నుంచే ఆరంభమవుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయటం లేదనటానికి నెలసరి సరిగా కాకపోవటం ఓ హెచ్చరిక అనుకోవచ్చు.

  • బరువు.. కాస్త తగ్గినా క్యాన్సర్‌ దూరం

వూబకాయం తెచ్చిపెట్టే అనర్థాలు ఎన్నెన్నో. దీంతో పలు రకాల సమస్యలు ముంచుకు రావొచ్చు. అయితే ఊబకాయులు ఏమాత్రం బరువు తగ్గినా మంచి ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగిడిన మహిళలు ఓ మోస్తరుగా బరువు తగ్గినా క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు బయటపడింది. వీళ్లు తమ శరీరబరువులో కనీసం 5 శాతం బరువు తగ్గినా సరే. రక్తంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌, ఇంటర్‌లుకైన్‌-6 వంటి వాపు సూచికలు గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. ఈ వాపు సూచికలు పెరిగితే గుండెజబ్బుతో పాటు రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఊబకాయ స్త్రీలు తక్కువ కేలరీ ఆహారం తీసుకోవటంతో పాటు వ్యాయామం ఎక్కువగా చేయటం ద్వారా బరువు తగ్గితే క్యాన్సర్‌ ముప్పూ తగ్గుతున్నట్టు ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అధ్యయనకర్త డాక్టర్‌ అన్నే మెక్‌టీర్నర్‌ చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరిని ఎంచుకొని తక్కువ కేలరీలు ఆహారం తీసుకోవాలని, రోజుకి 45 నిమిషాల సేపు (వారంలో ఐదు రోజులు) ఏరోబిక్‌ వ్యాయామాలు చేయాలని సూచించారు. వీలైతే రెండూ పాటించాలనీ చెప్పారు. ఏడాది తర్వాత తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 36 శాతం, ఇంటర్‌ల్యూకిన్‌ 26% తగ్గింది. కేలరీలు తగ్గించటంతో పాటు వ్యాయమమూ చేసినవారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 42 శాతం, ఇంటర్‌ల్యూకిన్‌ 24 శాతం తగ్గింది. కనీసం 5% బరువు తగ్గినవారిలో ఈ స్థాయులు గణనీయంగా పడిపోవటం గమనార్హం. మెనోపాజ్‌లోకి అడుగిడిన వారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 40% తగ్గితే రొమ్ము, ఎండోమెట్రియల్‌, తదితర క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బరువు తగ్గటం వల్ల కొవ్వు కణాలు కుంచించుకుపోయి వాపు కారక హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. వాపు మూలంగా గుండెజబ్బులతో పాటు పలు సమస్యలూ ముంచుకొస్తాయి కూడా.

ముంచెత్తుతున్న వూబకాయ సునామీ :

ప్రపంచంలో 30% మంది అధికబరువు గలవారే--అరికట్టటంలో అన్ని దేశాలూ విఫలం-- తాజా విశ్లేషణలో వెల్లడి--
లండన్‌: ప్రపంచాన్ని వూబకాయ సునామీ ముంచెత్తుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది వూబకాయులేనని తాజా విశ్లేషణలో తేలటమే దీనికి నిదర్శనం. ఇందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు. గత మూడు దశాబ్దాలుగా ఏ దేశమూ వూబకాయులు సంఖ్య పెరగటాన్ని అరికట్టలేకపోవటం గమనార్హం. ప్రపంచంలోని 200 కోట్ల మంది (30%) అధిక బరువు లేదా వూబకాయం గలవారేనని పరిశోధకులు గుర్తించారు. వూబకాయుల సంఖ్యలో మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు అన్నింటికన్నా ముందున్నాయి. అక్కడ 60% మంది పురుషులు, 65% మంది స్త్రీలు వూబకాయులేనని తేలింది. ఇక అమెరికాలో మరే దేశంలోనూ లేనంత ఎక్కువగా.. 13% మంది వూబకాయులు ఉన్నట్టు బయటపడింది. భారత్‌, చైనా.. రెండు దేశాల్లో కలిపి 15% మంది వూబకాయులు ఉన్నట్టు వెల్లడైంది. ఇది చాలా తీవ్రమైన విషయమని అధ్యయన నేత, వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టఫర్‌ ముర్రే వ్యాఖ్యానించారు. ఆయన తన బృందంతో కలిసి 1980-2013 మధ్య 188 దేశాల్లో చేసిన 1,700 అధ్యయనాలను సమీక్షించి విశ్లేషించారు.

బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారంతో రూపొందించిన ఈ నివేదిక ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్‌లో గురువారం ప్రచురితమైంది. మూడు దశాబ్దాలుగా ఏ దేశమూ వూబకాయాన్ని తగ్గించలేకపోయినట్టు తేలిందని, అందువల్ల ఇది ఎంత కష్టమైన సవాలో అర్థమవుతోందని ముర్రే వ్యాఖ్యానించారు. ఆదాయానికీ వూబకాయానికీ బలమైన సంబంధం కనబడుతోందని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ధనవంతులుగా మారుతున్నకొద్దీ వారి నడుం చుట్టుకొలత కూడా పెరుగుతూ వస్తోందని వివరించారు. అమెరికా, బ్రిటన్‌ వంటి సంపన్నదేశాల్లో ఈ ధోరణి తగ్గుతున్నప్పటికీ.. అది చాలా స్వల్పంగానే ఉందని పెదవి విరిచారు. వూబకాయంతో పాటు మధుమేహం కూడా పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారని, అలాగే క్యాన్సర్ల సంఖ్య కూడా పెరుగుతోందని హెచ్చరించారన్నారు.

For some more details(మరికొన్ని వివరాలకోసము) -ప్రపంచ ఊబకాయ నివారణ దినము
  • =========================================================
visit my website -> dr.seshagirirao-MBBS

Monday, December 28, 2009

పౌష్టికాహారానికి పది చిట్కాలు , Balanced Diet -ten hints




  • పౌష్టికాహారానికి పది చిట్కాలు..
ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడంఅనేవి, ఆరోగ్యంగాఆహారం తీసుకునే, పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. మరి ఈ క్రింది సూచనలు మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష కాగలవు.

1) వైవిధ్యంతో కూడిన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోండి: మంచి ఆరోగ్యానికి మీకు దరిదాపుగా 40 రకాలు అయిన చిన్న పోషకాలు కావాలి. ఏ ఒక్కతరహా ఆహారమూ మీకు వాటిని ఇవ్వలేదు. మీ రోజువారి ఆహారంలో తప్పనిసరిగా వుండవలసినవి: పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు లేదా పదార్థాలు; శాకాహారులు కాకుంటే మాంసం ఉత్పత్తులయిన చేపలు, చికెన్‌, ఇతర మాంసకృత్తులు, అలాగే తృణధాన్యాలు వంటివి. మీరు, ఈ తరహా ఆహారాలను, ఏ మోతాదులో తీసుకోవాలి అన్నదిమీకు అవసరం అయ్యే కేలరీల స్థాయిని బట్టి వుంటుంది.

2) సాధ్యమైనంత ఎక్కువగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోండి.

3) సమతుల శరీర బరువును కొనసాగించండి. మీ శరీరం బరువు ఎంత వుండవచ్చుననేది, పలు అంశాలపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు: మీరు పురుషులా, స్త్రీలా, ఎత్తు, వయస్సు, వారసత్వం లేదా జన్యువుల వంటి అంశాలు ప్రధానమైనవి. స్థూలకాయం వలన పలు వ్యాధులు రావచ్చు. మచ్చుకు: రక్తపోటు, హృద్రోగాలు, మధు మేహం, కొన్నిరకాల క్యాన్సర్లు మొదలైనవి చెప్పుకోవచ్చును. అయితే, దీనితో పాటుగా మీ శరీరం వుండాల్సినంత బరువును కలిగి లేకపోవడం కూడా ప్రమాదమే. దీనివలన: ఎముకల సమస్యలు, బుుతుస్రావ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చును. కాబట్టి మీ శరీరంబరువు అతిగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా వైద్యుల సలహాతో మీ ఆహార అలవాట్లను మార్చుకోండి. అలాగే, క్రమం తప్పని వైద్యం కూడా శరీరం బరువును తగిన స్థాయిలో ఉంచుకోగలిగేటందుకు ప్రధానం.

4) పరిమితంగా, వైవిధ్యంతో ఆహారాన్ని తీసుకోండి. ఏ ఒక్క ఆహార పదార్థాన్ని శృతిమించి తీసుకోకుంటే, భిన్నమైన ఆహార పదార్థాలను మీరు క్రమం తప్పకుండా, తీసు కోగలుగుతారు.

5) సమయ బద్ధంగా ఆహారం తీసుకోండి: తగిన సమయంలో, తగినంతఆహారం తీసుకోకపోవడం వలన శృతిమించి ఆకలి ఏర్పడితిన్నప్పుడుఒకేసారి, అతిగా తినే అవకాశం ఉంది. శృతిమించిన ఆకలితో ఆహారపు పౌష్ఠిక విలువల గురించి విస్మరించే ప్రమాదం ఉంది. భోజనానికీభోజనానికి నడుమ అల్పాహారం మంచిదే అయినా, అల్పాహారాన్ని అతిగా తీసుకుంటే అదే పూర్తిస్థాయి భోజనంగా తయారవ్వగలదు.

6) కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మెనూలోంచి తొలగించవద్దు; తగ్గించండిచాలు. మనలో పలువురం ఆహారాన్ని దాని పౌష్ఠిక విలువలతో పాటుగా, రుచికోసం కూడా తీసుకుంటాం. మీకు ఇష్టమైన ఆహారంలో కొవ్వు పదార్థాలూ,ఉప్పు లేదా తియ్యదనం (పంచ దార వంటివి) అధికంగా ఉంటేవాటిని పూర్తిగా వదిలివేయడం కంటే (వైద్యులుదీనికి భిన్నం గా చెబితే మినహా) వాటిని పరిమితంగా, తీసుకోండి. లేదా బాగా తక్కు వగా తీసుకోండి. ఈ రకం పదార్థాలు ప్రధానంగా ఉండేమీ ఆహారాలను గమనించుకొనిఅవసరం అయితే, మార్పులు, చేర్పులు చేసుకోండి.

7) ఒక నిర్ణీత కాల వ్యవధిలోమీ ఆహార సమతుల్యతను కొనసాగించండి: ప్రతీ ఆహారం ''అత్యుత్తమం''గా వుండాల్సిన అగత్యం లేదు. అతిగా క్రొవ్వులు, ఉప్పులు లేదా తియ్యదనం ఉన్న పదార్థాలనువాటితో సమతుల్యతనుకాపాడగల ఇతరేతర ఆహారాలతో కలిపి తీసుకోండి. ఒకరోజు, ఆహారంలో గనుకఈ సమతుల్యత లోపిస్తే, మరుసటిరోజున ఈ సమతుల్యతను కొనసాగించే విధంగా ఆహారం తీసుకోండి. లేదా ఒక నిర్ణీత కాలవ్యవధినిఈ సమతుల్యతను కొనసాగించండి.

8) మీ ఆహార స్వీకరణలో లోపాలను గమనించండి: మీ ఆహారపు అలవాట్లను మెరుగు పరుచుకునేందుకు దాని తాలూకు లోపాలను గమనించండి. కనీసం,మూడు రోజు లపాటు వరుసగామీరు తీసుకునే ఆహార పదార్థాల జాబి తాను రాసుకోండి. మీరు అతిగా క్రొవ్వు పదార్థాలూ, మాంస కృత్తులూ, పిండి పదార్థాలను తీసు కుంటున్నారేమో: గమనించండి. తర్వాతమీ, ఆహారంలో వీటిని పూర్తిగా తొలగించడం బదులుగా వాటి మోతాదును పరిమితం చేయండి. అలాగే, పండ్లు, కూరగాయలను తీసుకోవడంమీ శరీరంలో సమతుల పోషకాలకు తప్పనిసరి.

9) ఈ మార్పులు మెల్లమెల్లగా చేయండి. ఒకేసారి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చును. కాబట్టి, ప్రయత్న పూర్వకంగా, మెల్లమెల్లగా వాటిని మార్చుకోండి.

10) ఏ ఆహారమూ పూర్తిగా మంచిది లేదా చెడ్డది కాదు:ప్రతీ ఆహార పదార్థంలోనూదాని గుణానికి అనుగుణం అయిన పోషకాలు వుంటాయి. కాబట్టి, దానిని పూర్తి గా పరిత్యజించనవసరం లేదు. పరిమితి మరచిపోకుంటే చాలు.

మరికొన్ని విశాలాలకోరకు - > సంపూర్ణ ఆహారము

===================================================================
visit my website : Dr.seshagirirao.com

Saturday, December 26, 2009

కంటి కింద నల్ల మచ్చలు , UnderEye skin Black colour




కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు--కళ్లు... నిశ్శబ్దంగానే అనేక అంశాలు వెల్లడిస్తాయి. మరి కళ్ల కింద ఏర్పడే వలయాలు...ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి. అనేక అనారోగ్యాలకు సూచనలు ఇస్తాయి. అసలు... ఈ నల్లని వలయాలు ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా?

‘‘కంటి కింద నల్లటి వలయాలా? అయితే... ఫలానా క్రీమ్ అప్లై చేయండి. కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోండి...!’’ అనే రకరకాల ప్రకటనలు చూస్తుం టాం. ఆ క్రీములను తెచ్చి కొన్నిరోజులు కళ్ల చుట్టూ రాసుకోవడం, అయినా వలయాలు తగ్గడం లేదే అని బాధపడటం.. సహజం. నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? ఈ వివరాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు... దాన్ని నివారించుకోడానికి అవసరమైన ‘ముందు జాగ్రత్త’లు ఇవి...


డెర్మటాలజీలో అతిసాధారణంగా పేర్కొనే సమస్య కళ్లకింద నల్లని వలయాలు. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి. ఇవి స్ర్తీ, పురుషులిద్దరిలోనూ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న డార్క్‌సర్కిల్స్ యుక్తవయసులోనూ ఎక్కువగా గమనిస్తున్నాం.

కంటి కింది నలుపునకు కారణాలు:
  • ఎడతెరిపిలేని కంటి దురద,
  • నిద్రలేమి (ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలోపాలు....),
  • అటోపిక్ డెర్మటైటిస్,
  • అలెర్జీలు,
  • హె ఫీవర్,
  • దుమ్ము,
  • ఎగ్జిమా,
  • పాలిపోవడం: ఏదైనా దీర్ఘకాల ఆరోగ్యసమస్య ఉంటే కళ్లచుట్టూ ఉన్న చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది.
  • ఐరన్ లేదా విటమిన్ లోపాలు,
  • వైద్యపరంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు :
  • వయసు--మందంగా ఉండే చర్మం వయసు పై బడుతున్నా కొవ్వును కోల్పోతుంది. దీని వల్ల రక్తకణాలకు అవసరమైన ఆహారం అందక కళ్లకింద వలయాలు ఏర్పడతాయి..,
  • డి-హైడ్రేషన్ ,
  • వంశపారంపర్యం-- కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చేఅవకాశాలు ఉంటాయి.
  • జీవనశైలి-- పొగ తాగడం, మద్యం సేవించడం, కేఫినేటెడ్ సోడాలు తీసుకోవడం... వంటివి.
  • ముక్కు సమస్యలు: కంటికి ముక్కుకు సంబంధించిన సూక్ష్మరక్తనాళాలు ఒత్తిడికి లోనయినప్పుడు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి)
  • పిగ్మెంటేషన్,
  • సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడం.,
  • క్యాచెక్సియా(Cachexia),
  • అదేపనిగా చదవడం, టీవీ చూడ్డం..


ప్రధాన కారణం......
రక్తకేశనాళికల చివరలు చిట్లడం :
రక్తనాళాల చివరను రక్తకేశనాళికలు అంటారు. అంటే వెంట్రక అంత సన్నగా ఉండే రక్తనాళాలన్నమాట. వీటినే క్యాపిల్లరీస్ అంటారు. కనురెప్పల్లో చివరన ఉండే రక్తకేశనాళికల చివరలు చిట్లడం, అందులోని ఎర్ర రక్తకణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి. అలా విరిగినప్పుడు అక్కడ మిగిలిపోయే కొన్ని పదార్థాల వల్ల అది నలుపు, ముదురునీలం రంగులో కనిపిస్తుంటుంది. అక్కడి చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటికింది భాగం నల్లగా, ముదురునీలంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా ఇవి కళ్ల కింద ఇలా వలయాల్లా కనిపిస్తుంటాయి. .

చికిత్స
ఇటీవల కంటికింది నలుపును తగ్గించుకోడానికి చాలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సాధారణ మేకప్ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీ వరకు ఉన్నాయి.

హైపర్ పిగ్మెంటేషన్:
ఎండకు ఎక్కువగా ఎక్సపోజ్ అవడం వల్ల చర్మం నల్లగా మారి మచ్చలాగా కనిపించడం జరుగుతుంది. దీన్నే పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్ మరీ ఎక్కువగా ఉండి, కనురెప్పలకు కూడా పాకితే కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా కళ్లు, కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం మొదటగా చేయాల్సిన పని.

గుంటకళ్లు: కొందరిలో కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కనుగుడ్డు లోపలికి ఉంటుంది. దాంతో కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించడం మామూలే. కనుగుడ్డు కింద ఉండే కొవ్వు పదార్థం లోపించడం వల్ల చాలామందిలో ఇది అనువంశికంగా కనిపిస్తుంటుంది. కంటికింద కొవ్వునింపడం, (ఫ్యాట్ గ్రాఫ్టింగ్), బ్లఫరోప్లాస్టీ వంటి శస్తచ్రికిత్సల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. కొందరిలో శస్తచ్రికిత్స చేయకుండానే కంటి కింద డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్ల ద్వారా చాలా తక్కువ గాటుతో చేసే శస్తచ్రికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. డెర్మల్ ఫిల్లర్స్ అంటే చాలా మృదువైన కణజాలంతో అక్కడి ఖాళీని భర్తీ చేయడం అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా కూడా కంటికింది నల్లమచ్చల వలయాలకు చికిత్స చేయవచ్చు.

నివారణ ఇలా...
డార్క్ సర్కిల్స్‌కు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖకాంతి కోసం లేజర్ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలే ఈ సమస్య నివారణకు ఉపయోగపడతాయి.

  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
  • సమతులాహారం వేళ ప్రకారం తీసుకోవాలి.
  • వంశపారంపర్యంగా వచ్చే వలయాలను చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు.
  • మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  • శారీరక వ్యాయామాలు మనసునూ ఉత్తేజంగా ఉంచుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి రిలాక్సింగ్‌గా ఉంటారు. అందుకని రోజూ 30 నుంచి 60 నిమిషాలు శారీరక
  • వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • చల్లని నీటిలో ముంచిన కాటన్‌ని అలసిన కళ్లపై ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
  • కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి.
క్రీములతో...
  • హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తే... వాటిని కొన్ని పూత మందుల (క్రీమ్‌ల) ద్వారా తగ్గించవచ్చు. డాక్టర్‌ల సలహా మేరకు హోడ్రోక్వినైన్, కోజిక్యాసిడ్, ఆర్‌బ్యుర్టిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీమ్‌లు వాడటంతో నల్లటి వలయాలకు చికిత్స చేయడం సాధ్యమే. అర్జనైన్ వంటి హైడ్రాక్సీ యాసిడ్స్ ఉండే కెమికల్ పీలింగ్‌తోనూ (అంటే... పూత మందు రాశాక కాసేపాగి అది పొరలా ఏర్పడ్డ తర్వాత దాన్ని తొలగించడం) వాటిని తొలగించడం ఇప్పుడు సాధ్యమే. అయితే ఇది ఒకేసారిగాక కొన్ని సిట్టింగ్స్‌లో చేసే ప్రక్రియ.

చిట్కాలు


నిద్రలేమి
, దిగులు ఆందోళన ... ఇలా కారణము ఏదైనా కావొచ్చు దీర్గాకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలనుఏర్పరచడం ద్వారా ముఖ సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలుఉన్నాయి .. ఉదా :
  • *బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది . ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు . బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి . ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమము గా విరుగుతుంది .
  • * ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్‌ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.
  • * నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.
  • * బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.
  • * కాసిని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్‌లా వేయాలి. ఆరాక కడిగేస్తే చాలు.. ఎంతో మార్పు కనిపిస్తుంది.
  • * మీరు వాడే మేకప్‌ సామగ్రిలో మీ చర్మతత్వానికి నప్పే కన్సీలర్‌ను తీసుకోండి. దీన్ని నల్లనివలయాలు కనిపించకుండా చేయవచ్చు. కంటి అడుగున రాసుకుంటే చాలు.
  • * మంచి నీళ్లు సమృద్ధిగా తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవడం కూడా తప్పనిసరి.
  • * కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.
  • ఇలా సౌందర్య చిత్కాలతోనే కాదు ఆహారము లో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చును . విటమిన్ల లో "కే"విటమిన్క్ష్ కి ఇదే గుణము (SkinLightening) ఉంది. కంటికింద మచ్చలతో భాధపదేవారు సౌందర్య ఛిట్కాలతోపాటు ' కే ' విటమిన్ అధికంగా లభ్యమయ్యే ఆహారము తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
" కే విటమిన్ పుస్కలము గా లభించే ఆహారపార్దాలు :
  • క్యాలీఫ్లవర్ ,
  • క్యాబేజీ,
  • బ్రాకోలి,
  • క్యారెట్ ,
  • బీన్స్ ,
  • సోయాబీన్స్,
  • దోసకాయ ,
  • పచ్చిబతానీలు ,
  • కాలేయము(Liver) ,
  • చేప నూనె,
  • పెరుగు ,
  • పాలు ,
  • అన్ని రకాల ఆకుకూరలు - పాలకురలో ఎక్కువ ,
  • ===============================
Visit my website -> Dr.seshagirirao.com/

Friday, December 25, 2009

ఆయుర్వేదము , Ayurvedic Medicine




ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరవాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. దీనిలో అనేక సాంప్రదాయములు కలవు.

ఆయుర్వేదం మందు : ప్రక్రుతి లో దొరికే , మందుగా వాడ దగ్గ ఆకులు , కాయలు , vaeLLu , పువ్వులు , గింజలు(విత్తనాలు) , బెరడు , మందు గా వాడే లోహాలు , మూలకాలు , రసాయనాలు ... ఒక్కటిగా గాని , కలిపిగాని ... లేహము రూపం లోనో , పౌడర్ రూపం లోనో , టానిక్ రూపంలోనో , పచ్సిగానో .. వండి గాని రోగానివారణకు వాడే దాన్నే ఆయుర్వేదిక్ ఔషదం అంటాము . ( definition : Crude extract of naturally available leaves , roots ,barks, flowers , nuts , medicinal metals , medicinal minerals , medicinal chemicals ... used as medicine).

ఆయుర్వేదం (Ayurveda) . దీనిలో అనేక సాంప్రదాయములు కలవు. ధన్వంతరి ఆయుర్వేద వైద్యుడు .

  • పౌరాణిక గాథలు

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకొనిరి అన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ
ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉన్నది.

  • చారిత్రక ఆభివృద్ధి

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశి రాజగు దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.


  • ఇతర వైద్యవిధానాలతో పోలిక

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు మరియు రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.

మరికొన్ని వివరాలకు -> ఆయుర్వేదం
  • ========================

visit my web blog -> Dr.seshagirirao.com

Thursday, December 24, 2009

శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌, Dry Fruits - Energy




శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.

బాదం పప్పు...


బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ బిలు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.

రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.

జీడిపప్పు...


శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.

ఎండు ద్రాక్ష...


ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.

ఖర్జూరపు పండ్లు...


ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.

అంజీర్‌ పండు....


ఎండిన అంజీర్‌ పండులో పీచు, రాగి, మంగనీస్‌, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్‌-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.

చిన్న పిల్లలలో ఎగ్జిమా , Eczema in children




కొంతమంది చిన్నపిల్లల్లో చర్మం పొడిబారి, పొట్టుగా రాలిపోతుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే.. వారు ఎటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా వ్యాధితో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మనం ఉపయోగించే నూనె, సబ్బు, కాస్మెటిక్స్, బట్టలు, ఆభరణాలు, వాతావరణంలోని మార్పులు, తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి.. తదితర అంశాలు ఎగ్జిమా వ్యాధికి దోహదం చేస్తాయి. పిల్లల్లో ఇది తరచూ మోచేతులు, తొడలు, బుగ్గలు, నుదురు లాంటి భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

* ఎగ్జిమాతో బాధపడే పిల్లలకు దురదలు రాకుండా ఉండేటట్లు చూడాలి. వారికి స్నానం చేయించిన వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలి. ఇలా చేస్తే చర్మం తేమగా ఉంటుంది. లేకపోతే చర్మం పొడిబారి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లలకి ఆయిల్ బేస్డ్ సోపులను వాడటం శ్రేయస్కరం.

* ఇంట్లో దుమ్మూ, ధూళీ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. కార్పెట్లు, కర్టెన్లు, బెడ్‌షీట్లు కూడా శుభ్రంగా ఉంచాలి. ఇదే వ్యాధితో బాధపడే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు 3, 4 నెలల్లోపే ఘనపదార్థాలు ఇవ్వటం వల్ల కూడా ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి.. కనీసం ఆరు నెలలదాకా పిల్లలకు పాలు పట్టించటం ఉత్తమం.

* సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే.. చాలా తక్కువ డోసులో స్టెరాయిడ్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్ లాంటివి వాడవచ్చు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటమేగాక, చలికాలంలో మరింత తీవ్రంగా బాధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

For full Details ->Eczema (in Telugu)
  • =====================================
Visit my Website -> Dr.seshagirirao-MBBS

Saturday, December 19, 2009

మూడ్ దిజార్దర్ , Mood Disorder




పూర్వము విలువలు కలిగిన సమాజము లో శరీరమే కాదు బుద్ది కుడా సక్రమము గా ఆరోగ్యము గా ఉంది జీవితాన్ని ఆనందమయము చేసేది . ఆధునిక సమాజములో వ్రుత్తి , ఆర్జన , సమయం లేకపోవడము కారణముగా పద్దెనిమిది ఏళ్ళ వ్యక్తీ నుండి యాబై ఏళ్ళ వ్యక్తీ దాకా వత్తిడి వాళ్ళ విచిత్ర ప్రవృత్తుల తో సతమతమవుతున్నారు . రోజు లో ఎన్నో సార్లు వారి మూడ్ లో మార్పులు చోటిచేసుకుంటున్నాయి . ఆధునిక సమాజములో ముఖ్యం గా పట్టణాలలోను , నగరాల లోను యువతలో ఇది ఎక్కువగా ఉంటుంది . ఈ బై పోలార్ వ్యాది ఉన్నవారి ప్రవర్తనలోనే కాదు వాళ్ళ మేధస్సు (బ్రెయిన్) లోను మార్పులోసతాయి . వీళ్ళలో సాదారణము గా వాళ్ళ ప్రవర్తన మాముల గానే ఉంటుంది . . . ఒక్కొక్క సారి ప్రవర్తన మారిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ కనిపిస్తారు , కోపం వచ్చి బిగ్గరగా అరుస్తారు , వింతగా ప్రవర్తిస్తుంటారు . ఇది కొద్ది కాలము ఉండవచ్చు లేదా చిరకాలము భాదిన్చావచ్చును . మానసిఅక వత్తిడి వల్లనే ఈ విరుద్ద ప్రవర్తన .. మొదట్లో చాలా నెమ్మదిగా ఉన్న ఒక్కొక్కప్పుడు మితిమీరి కనిపించిఅన వస్తువులను పగలగోట్టడము , తనని తానూ కొట్టుకోవడము , కోసుకోవడము వంటి ఉద్రిక్త పరిస్టి లోకి మారుతారు . కొంతమంది ఆడువారు చీరకాల్చు కోవడము , భర్తను ,పిల్లల్ని కొట్టడము వంటివి ఉంటాయి . సాదారణము గా ఈ పరిస్తితి 15 ఏళ్ళ నుండి 35 ఏళ్ళ వరకు ఉంటుంది .
చికిత్స :
  • మానసిక చికిత్స అవసరము . ప్రతి రోజు మంచి ఆలోచనలు , ఆశ ,నమ్మకము కలుగజేసే ఆలోచనలు (Positive) అందించడం.
  • తలకి బ్రాహ్మి తైలము రాయాలి .
  • వారం వారం తలంటి స్నానం చేపించి ప్రశాంతం గా ఉన్న వాతావరణం కలుగజేయాలి .
  • రాత్రి పడుకునే ముందు అరిపాదాలకు నువ్వుల నూనె మర్దన చేయడం మంచిది .
  • ఉద్రేకం కలిగించే ఆహారపదార్ధాలు , మందులు తినకూడదు ,
  • బ్రాహ్మి ,అశ్వగండ , శంకపుస్ప వంటి సహజ ఔషదాలు వాడాలి .
  • మంచి మానసిక వైద్యునికి చూపించాలి . చక్కటి వైద్యం అందజేస్తారు .

Wednesday, December 16, 2009

చలి కాలములో చర్మము పెదవులు సంరక్షణ , Winter skin care




శీతాకాలంలో చల్లనిగాలులు ఆహ్లాదంగా చలికాలపు వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది. అయితే శీతాకాలమంతా అందవికారంగా వుండక తప్పదా అని బాధపడవలసిన అవసరం లేదు. చలికాలంలో చర్మాన్ని సంరక్షించేం దుకు చర్మసౌందర్యాన్ని కాపాడేందుకు మార్కెట్లో ఎన్నెన్నో సౌందర్య సాధనాలు లభిస్తున్నాయి. వాటి నుపయోగించి వాతావరణ ప్రభావం చర్మంమీద ప్రసరించ కుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

శీతాకాలములో చర్మ సంరక్షణ చాలా ముఖ్యము . ఒక్కొక్క కాలములో ఒక్కక్క రీతిలో మన చర్మాన్ని రక్షించుకుంటూ ఉండాలి . కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . ఎండకాలములో ఒకరకమైన జాగ్రతాలు , వర్షాకాలములో వేరేవిధమైన చిట్కాలు .. శీతాకాలములో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవలసిన అవసరము ఉంటుంది .

చలికాలమనేది చర్మ సంరక్షణ కు అధికప్రాధాన్యత ఇవ్వవలసిన కాలము . ప్రత్యేకించి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోడానికి తగినంత సమయము వెచ్చించ వలసిన కాలమిది . ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి . డ్రై స్కిన్‌ ఉన్నవారు మరింత జాగ్రత్తగా మెలగాలి .

చలి కాలం వచ్చేస్తోందంటే మహిళలు అన్నింటికంటే ముందుగా పొడిబారిపోయే చర్మం గురించే భయపడుతుంటారు. గాలిలో తేమ చలికాలంలో బాగా తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా ఈ సీజన్‌లో పొడిబారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం కలవారు.. సాదా చర్మం కలవారు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిందే మరి.

స్నానం చేయడం, రాత్రిపూట చలిపులి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను కాపాడుకోవడం, శిరోజాల నిగనిగలు తగ్గిపోకుండా జాగ్రత్తపడటం, సరైన ఆహారం తీసుకోవడం... ఇలా చలికాలం మహిళల చర్మసౌందర్యానికి అన్నీ సమస్యలే మరి.

చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే..

చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌‌నెస్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు. శరీరంలో తగిన శాతంలో నీరు లేకపోయిన పక్షంలోనే చర్మం, శిరోజాలు జీవం లేనట్లుగా తయారవుతాయి.

అందుకని తాగాలనిపించక పోయినా సరే చలికాలంలో రోజూ పది గ్లాసుల నీరు తాగడం విధిగా పాటించాలి. అప్పుడే చర్మంలోని మలినాలు తొలిగిపోవడమే గాక చర్మం తాజాగా తయారవుతుంది. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.

ఏ కారణం చేత అయినా వ్యాయామం కుదరకపోతే నడక మంచి ఎక్సర్‌సైజ్ అనుభూతిని ఇస్తుంది. చర్మ సౌందర్యానికి, దేహారోగ్యానికి చలికాలంలో మంచినీరు పుచ్చుకోవడం, నడక లేదా వ్యాయామం చాలా ముఖ్యమైనవి. మిగతా అన్ని సౌందర్య లేపనాలు, లేహ్యాలు కూడా దీని ముందు దిగదుడుపే మరి.

ఉపశమనానికి వాడవలసినవి :
వేజలిన్ లేదా పెట్రోలియం జెల్లీ లు వాడాలి . వేజలిన్ బాడీ లోషన్ లేదా ఏ ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరు వెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువు గా ఉంటుంది . టాల్కం పౌడర్లు , ప్యాన్కేక్ పౌడర్లు వాడకూడదు ... ఏదైనా బేబీ పౌడర్ లు వాడడం మంచిది . నువ్వుల నూనె చలికాలం లో చక్క గా పనిచాస్తుంది . శరీరానికి నూనె పట్టించి సున్ని పిండి తో వేడి నీరు స్నానం చేస్తే చర్మం సున్నితమవుతుంది .
ఉదయం గోరువెచ్చని నీటితో స్నానము చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకొవాలి .
విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది .
శీతాకాలము పగుళ్ళకు వేసలైన్‌ వాడాలి .
లైట్ మాయిశ్చరైజర్ కి బదులు థిఖ్ క్రీమ్‌ ను ఉపయోగించాలి ,
స్నానము చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడినీల్లస్నానము చేయాలి .ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .
సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడాలి ,
రాత్రి పడుకునే ముందు చేతులకు , కాళ్ళకు వేజలైన్‌ రాసుకోవాలి ,
వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి ,
పాదాలు పగల కుండా 'సాక్స్ ' వేసుకుంటే మంచిది ,


ఆయుర్వేదిక్ పద్దతులు :

నవంబర్ నెల మొదలైనప్పటినుంచి చర్మం పాడవటం మొదలవుతుంది.'వాతావరణం మారింది, జాగ్రత్త పడాలి' అనే సూచనలు ఇవ్వటం ప్రారంభిస్తుంది మన చర్మం. రాత్రి చలి పెరగటంతో పాటు పగటి ఎండలో తీక్షణత ఏ మాత్రం తగ్గకపోవడంతో బయటకు వెళ్ళేవాళ్ళు రెండిటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందుకోసం అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోయే కొన్ని ట్రీట్ మెంట్ లు...

  • * పాలు, తేనె సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది. పొడి చర్మానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ప్యాక్ వేస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది.
  • * గుమ్మడికాయ గుజ్జులో కోడిగుడ్డు సొన, పాలు వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.
  • * స్నానం చేసే నీటిలో అర కప్పు తేనె కలుపుకుంటే చెర్మం మృదువుగా మారుతుంది.
  • * పుదీన అకులు, బాదం పప్పులు తీసుకుని తగినంత వేడి నీటిని కలుపుతూ గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితొ స్నానం చేయాలి. శీతాకాలం లో వారానికొకసారి ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.పిల్లలకు ఈ ట్రీట్‌మెంట్‌ బాగాపనిచేస్తుంది.
  • * పెసర పిండి లేదా శనగ పిండి లో పాలు కలిపి ఆ మిశ్రమంతో ఒళ్ళు రుద్దుకుంటే (సబ్బుకు బదులుగా) చర్మం కాంతివంతమవుతుంది.
  • * పచ్చి పసుపులో పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. క్రమం తప్పకుండా రోజూ ఇలా చేస్తుంటే చర్మం తెల్లబడుతుంది.
  • * ఒక టేబుల్‌ స్పూను శనగపిండిలో అర టీ స్పూను తేనె, ఒక టీ స్పూను పాలమీగడ, రెండు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసి ఆరిన తర్వాత కడగాలి..

  • =====================================
డా.శేషగిరిరావు వందన - ఎం.బి.బి.ఎస్ . (శ్రీకాకుళం )

Thursday, November 19, 2009

జలుబు తగ్గడానికి టిప్స్, Cold Treatment tips









సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా పరిస్కారము కాని సమస్యలు అనేకం ఉన్నాయి . మనిషికి సంభవించే అనేక అనారోగ్యలము మందులు కనుగొన్నా ప్రతి ఒక్కరికీ వేధించే జలుబుకి (common cold) ప్రత్యేకం గా చికిత్స నేటివరకు సాధ్యము కాలేదు .
వాతావరణంలో మార్పు చోటుచేసుకొన్నప్పుడల్లా ముక్కు మొరాయస్తుంది. పడిశం పట్టి పీడిస్తుంది. జలుబు చేస్తున్నట్టు అనీ అనిపించగానే తుమ్ములు, ముక్కునుంచి నీళ్లు కారడం లాంటివి బయటపడతాయ. అందుకే పడిశం పదిరోగాలపెట్టు అంటారు. పడిశం చేయగానే తలనుంచి పాదం దాకా అన్ని అవయాలు నొప్పి అనిపిస్తాయ. గాలి ఆడకుండా ముక్కు దిబ్బడి వేసినట్టుగా ఉంటుంది.

జీవితంలో ఎప్పుడో ఒకసారి జలుబు బారినపడని మని షంటూ ఎవరూ ఉండరు.చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా ప్రతివారూ ఎప్పుడోఒకప్పుడు జలుబుబారిన పడుతుంటారు. జలుబు మనిషికి ఎంతటి సహజమైనదో, అంతటి సర్వసాధారణమైనది. సగటున మనిషి ఏడాదికి రెండుసార్లు అయినా జలుబుతో బాధపడుతుంటాడని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వారి అంచనా. జలుబు రావడానికి కనీసం 200 పైచిలుకు వైరస్‌లు కారణంగా ఉంటాయి. మనిషినుంచి మనిషికి మారుతున్న కొద్దీ ఈ వైరస్‌ల జన్యు నిర్మాణం మారిపోతుంటుంది. అంటే భార్యాభర్తలలో ఒకరినుంచి మరొకరికి జలుబు అంటుకుంటే, ఆ ఇద్దరి జలుబు ఒకటి కాదన్నమాట. అయితే, ముక్కు చీదడం, తుమ్మడం, దగ్గడం వంటి లక్షణాలు మాత్రం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయి.

అపోహలు
జలుబు విషయంలో మనుష్యులలో రకరకాల అపోహలు చోటు చేసుకుని ఉన్నాయి. వర్షంలో తడిస్తే...వర్షంలో తడిస్తేజలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. వర్షంలో తడిసినంత మాత్రం చేత జలుబు చేయదు. నిజానికి జలుబు మూసి ఉన్న తలుపులోపలే,అంటే ఇంటిలోపలే అంటుకుంటుంది. జలుబు వైరస్‌లు మాయిస్ట్‌ హీట్‌లో వృద్ధి చెందుతాయి. అంటే మీరు బైట వర్షం కురుస్తున్నప్పుడు ఇంటిలోపలే ఉంటారు.గదిలోపలి చెమ్మగిల్లిన వేడి వాతావరణంలో వైరస్‌ వలన జలుబు చేస్తుంది.



ఇది వర్షాకాలము , ఆపైన వచ్చేది చలి కాలము లోను , వర్షం లో తడవడము , చలికాలపు మంచులో తిరగడము వల్ల ప్రతి వక్కరినీ వేధిస్తుంది ఈ జలుబు . ముక్కు కారడం తో మొదలై తలనొప్పి , జ్వరము , దగ్గు , వల్లునోప్పులు తలబరువుగా ఉండడం వంటి లక్షణాలు ఉన్నా ఈ జలుబును రాకుడా చూసుకోవడమే మంచిది ... ఒక వేళ వచ్చినా మందులు వాడినా వాడకపోయినా ఒక వారము రోజులలో తగ్గుముఖం పడుతుంది . ఈ జలుబునే ఎలర్జీ జలుబు అంటాము. కాని కొన్ని వైరస్ క్రిముల వల్ల వచ్చే జలుబు అయితే మాత్రం డాక్టర్ ని సంప్ర డించాల్సిందే . జలుబు ముఖ్యము గా పిల్లలను పట్టి పీడిస్తుంది . . . ఇది వైరస్ వల్ల నే వస్తుంది .

టిప్స్ :

1 . వ్యాపించే విధానము : సాధారణ జలుబు ఒకరి నుండి మరొకరికి స్పర్శద్వారా , గాలిద్వారా , వస్తువుల ద్వారా వ్యాప్తిచెండుతుంది . చేయిగాని , కర్చీప్ గుద్దగాని తుమ్మ , దగ్గు వచ్చినపుడు అడ్డం గా పెట్టుకోవాలి .

2. జలుబు క్రిములు తుమ్మినా , దగ్గినా చుట్టుప్రక్కల ఉన్నా వస్తువులపై పడి ఇతరులకు వ్యాప్తిచెందుతాయి కావున చేతులు సబ్బుతో సుబ్రం గా కడుగుకోవాలి .

౩ . జలుబు ఉన్నపుడు నోరు పాడవుతుంది , జ్వరం వస్తుంది కావున ఎంతోకొంత డీహైడ్రేషన్ వస్తుంది . నీరు ఎక్కువగా త్రాగాలి ... సుమారు 1.5 నుండి 2 లీటర్ల నీటిని త్రాగాలి . నీరు తాగడానికి ఇష్టం లేనపుడు ఏ ద్రవ రూపములోనైనా నీరు తీసుకోవచ్చును .

4. జలుబు వల్ల కలిగే నీరసము పోవడానికి మంచి ఆహారము తీసుకోవాలి . వేడి పదార్ధాలు తినాలి . తేలికగా జీర్ణం అయ్యే ఆహారము నే తీసుకోవాలి . ఉడికించిన కూరలు , పాలు , రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మజాతి పదార్ధాలు తిననాలి .

5. జలుబు ఉన్నవారు విశ్రాంతి తీసుకోవాలి . ఆఫీసుకి , పనులకు వెళ్ళకూడదు . తలుపులు మూసిన గదిలో ఉండకుండా బాగా గాలి వచ్చే ప్రదేశం లో విశ్రాంతి తీసుకోవాలి , చల్లని గాలి , మంచు లో తిరగకూడదు . తక్కువ తేమ , ఓ మోస్తరు వేడి ఉన్నా గదిలో ఉన్న్డాలి .

6. జలుబు ఉన్నా వారు బాగా అలిసిపోయే పనులు చేయకూడదు ... అలాగని ముసుగుతన్ని పడుకోకూడదు . ఉసారుగానే తిరగాలి . చురుకుదనం వల్ల శరీరము లోని రోగనిరోధక శక్తి మెరుగు పడుగుంది .

7. జలుబు ఉన్నవారు వేడినీరు స్నానం చేయండి . తలస్నానం చేయకూడదు . వేడినీరు స్నానం శరీర రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది .
8. జలుబుకి వాడే ఆయింట్ మెంట్లు ముక్కు కు రాయవచ్చును , వేడినీటిలో వేసి ఆవిరిపీల్చడం మంచిది .
9. మత్తుపానీయాలు తీసుకోకూడదు . పొగ తాగకూడదు . ఐస్ క్రీములు , చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు .
10. గొంతు నొప్పి ఉంటే జలుబు లేపనములు (ointments) గొంతు పైన రాయవచ్చును . వేడి కాఫీ , తీ , పాలు తీసుకుంటే గోతులో గురగుర తగ్గుతుంది .

చికిత్స చేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుంది... అనేది జలుబుకు సంబంధించి చెప్పే ఓ పాత సామెత. అంటే వైద్యం చేసినా, చేయకపోయినా జలుబు వస్తే ఓ వారం పాటు బాధపడక తప్పదు అనేదే ఈ సామెతలోని అంతరార్థం.

సాధారణ జలుబు

ఎలా వస్తుంది?
జలుబు తో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా,చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి.ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది.
జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని,చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది. జలుబు వున్న వ్యక్తి చీదిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి.
చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ప్రధానంగా వ్యాపించదు.ఈ వాతావరణ మార్పు జలుబు వ్యాప్తిలో పెద్దగా ప్రభావితము చూపించదు.
ఎంతకాలం వుంటుంది?

* జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన,ఆ వైరస్ రకాల పైన ఆధారపడి వుంటుంది.
* సాధారణంగా జలుబు 2 - 7 రోజుల మధ్య ఉంటుంది.విపరీతమైన జలుబు, దగ్గుతో కూడిన జలుబు వారం నుండి రెండు వారాల వరకు వుండవచ్చును.

జలుబు తగ్గించే విధానాలు: -

* ఆహారం:-జలుబు ఉన్నప్పుడు,కొవ్వు పదార్ధాలు, మాంసము, పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం మంచిది.
* తాజా పళ్ళ రసాలను, కాయకూరలు అధికంగా తీసుకోవాలి.
* మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది.
* వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.
* గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది.



అంతా బాగానే ఉంది. మరి వారం రోజులపాటు జలుబు పెట్టే నరకయాతనతో భరించేదెలా... ? జలుబు బాధలు తగ్గేందుకు ఇంగ్లీషు వైద్యంలో ఇప్పుడు బేషైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే జలుబులాంటి కారణాలకు కూడా అదేపనిగా మందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అని ప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు...

వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడి తగ్గకుండా చేస్తే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.
ఓ గిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్ వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కు వెంటనే తెర్చుకుంటుంది.
వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబు తీవ్రత వెంటనే తగ్గుతుంది.
ఓ గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది.

ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైన వాటిని పాటిస్తే జలుబు తీవ్రత ఓ నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రత తగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.

చికిత్స :

జాగ్రత్తలు
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వలన మనలోని రోగనిరోధక యంత్రాంగం బలోపేతమవుతుంది. తద్వారా జలుబులాంటి అస్వస్థతలు మన దరికి రాకుండా ఉంటాయి.నడక, జాగింగ్‌, ఈతకొట్టడం, సైకిల్‌ తొక్కడం వంటివి రోజుకు ఒక అరగంట చేస్తే సరిపోతుంది.

మానసిక వత్తిడి
మీరుగమనించారో లేదో కాని, పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు లేదా ఏవైనా తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎక్కువగాజలుబు చేస్తుంటుంది. మాన సిక వత్తిళ్లు మనలో రోగ నిరోధక శక్తిని దెబ్బ తీయటం అందుకు కారణం.

నీళ్లు ఎక్కువ తాగాలి
మంచినీరు, టీ, పళ్ల రసాలు మొదలైన ద్రవ పదార్థాలు పుష్కలంగా లోపలికి తీసుకుంటే మనం జలుబుకు దూరంగా ఉంటామని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

తలుపులు తెరిచి ఉంచండి
జలుబు చేసిన మనిషి దగ్గినా, తుమ్మినా మిలియన్ల కొద్దీ వైరస తుంపరలు గాలిలో వ్యాపిస్తాయి. అందుకే జలుబు చేసిన మనిషి దగ్గుతున్నప్పుడూ, తుమ్ముతున్నప్పుడూ నోటికి చేతిని అడ్డంపెట్టుకోవటం మంచిది. జలుబు చేసిన మనిషి ఇంట్లో ఉండి, ఆ ఇంటి కిటికీ తలుపులు మూసేసి ఉంటే, అతడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు జలుబు వైరస్‌లు బైటికిపోయే వీలులేక ఇంటిలోపలే ఉండిపోయి మిగతా వాళ్లకు తేలికగా అంటుకుంటాయి.

తేమ వాతావరణం
పొడి వాతావరణంలో జలుబు వైరస్‌లు తేలి కగా వ్యాప్తి చెందుతాయి. తేమ వాతావరణంలో వ్యాప్తి చెందవు.
విశ్రాంతి
కొందరు జలుబు చేసినప్పుడు ఒంట్లో బాగులేదంటూ ఆఫీసునుంచి లేదా, కాలేజినుంచి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. జలుబు చేసిన ప్రతివారూ ఈ పద్ధతి పాటించడం మంచిది. దాని వలన ఇతరులకు జలుబు అంటకుండా కాపాడిన వారవుతారు.

తగ్గించే మార్గాలు
విటమిన్‌ సి : విటమిన్‌ సి, పెన్సిలిన్‌ లేదా యాంటి బయాటిక్స్‌లాంటివి జలుబును తగ్గిస్తాయనుకోవడం భ్రమ మాత్రమే. యాంటిబయాటిక్స్‌ వంటివి బాక్టీరియా వలన వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి ఉపకరిస్తాయి తప్ప వైరస్‌ వలన వచ్చే జలుబులాంటి అస్వస్థలకు ఉపయోగపడవు. విటమిన్‌ సి మన శరీరంలో ఉండే నానాచెత్తనూ బైటికి పారదోలే స్కావెంజర్‌లా పని చేస్తుంది. జలుబును అది పూర్తిగా తొలగించలేదు కాని, వారం రోజుల పాటు ఉండే దాని రెండు మూడు రోజుల్లో తగ్గిపోయేట్లు చేస్తుందని అంటున్నారు ఈ విషయంలో నిష్ణాతులైన డాక్టర్లు.

ఆహారం
జలుబు చేసినప్పుడు కొవ్వు గల ఆహార పదా ర్థాలు, మాంసం, పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోండి. తాజా పళ్ల రసాలు, కాయగూరలను ఎక్కువగా తీసుకోండి.

సిగరెట్లు మానండి
పొగ తాగడం వల్ల గొంతు మండుతుంది. జలుబు ఆ మంటను మరింత పెంచుతుంది. ముక్కులోపల ఉండే సిలియా అనే చిరు వెంట్రుకల లైనింగ్‌ ముక్కులోనికి ప్రవేశించే బాక్టీరియా గొంతులోకీ, ఊపిరితిత్తులకూ పోకుండా అడ్డుకుంటుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం జరిపే సిలియా చర్యలను పొగతాగడం నిరోధిస్తుంది. కనుక జలుబు రోజులలోనైనా పొగ తాగడాన్ని తగ్గించడం లేదా మానుకోవడం మంచిది.

ఉప్పునీటి పుక్కిలింత
జలుబుతో బాధపడుతున్నప్పుడు ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్పునీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల కొంత రిలీఫ్‌ లభిస్తుంది.

ఆవిరి కాపడం
ఇది మన పెద్దవాళ్లు పాటించే పద్ధతే. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్స్‌ను కాని, అమృతాంజన్‌ను కాని కలిపి తల మీద దుప్పటి కప్పుకుని ఆ ఆవిరిని గాఢంగా ముక్కుద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.

జలుబుకి ... మార్కెట్ లో దొరికే (Anticold)జలుబు మాత్రలు వాడవచ్చు . ఉదా : Zincold , Coldact ,
జ్వరానికి : పారాసెటమోల్ (Paracetamol)
దగ్గుకి : ఏదైనా దగ్గుమందు ను తీసుకోవచ్చు . ఉదా : DM , Tossex , instaryl.
వాళ్ళు నొప్పులకు : Combiflame , dolomed , acelonac 750 ,
అప్పటికి తగ్గకపోతే వైద్య సలహా పొందాలి .

ఆవిరితో జలుబుకు చెక్‌
చినుకుల కాలమిది. జలుబు, ముక్కుదిబ్బడ, సైనస్‌ వంటి సమస్యలు కొందరిని తరచూ బాధిస్తాయి. వాటిని నివారించాలంటే అదేపనిగా మందులు వేసుకోవడం కాదు.. ఇలాంటి చిట్కాలు పాటించి చూడండి.

పెద్ద గిన్నెలో మరిగించిన నీరు తీసుకుని మధ్యకు కోసిన రెండు ఉల్లిపాయ మక్కలు వేయండి. ఈ నీళ్లతో కనీసం పదిహేను నిమిషాలు ఆవిరిపట్టండి. జలుబుతో మూసుకుపోయిన ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. జలుబు ఉన్నా లేకపోయినా సరే.. వారానికోసారి యూకలిప్టస్‌ నూనె వేసిన నీటితో ఆవిరిపట్టండి. దీనివల్ల శ్వాససంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.

ముఖానికి చేసే మర్దనతో సైనస్‌ చాలామటుకు అదుపులో ఉంచుతుంది.చూపుడు వేళ్లను రెండు కనుబొమల మధ్యలో ఉంచి.. సున్నితంగా మర్దన చేయాలి. ఇప్పుడు కనుబొమల చివర్ల వేళ్లను ఉంచి... గుండ్రంగా తిప్పాలి. ఇలా తరచూ చేస్తుంటే.. సమస్య అదుపులో ఉంటుంది.

తులసి, మిరియాలతో చేసే కషాయం జలుబు సమస్యను అదుపులో ఉంచుతుంది. జలుబు, ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్‌ నూనెను రుమాలుపై వేసుకుని వాసన పీల్చితే మార్పు ఉంటుంది.




-- డా.వందనా శేషగిరిరావు యం.బి.బి.యస్ .

Tuesday, November 17, 2009

అందం గా ఉండడానికి టిప్స్ , Tips for beauty




అందం గా ఉండాలనే కోరిక ప్రతిఒక్కరిలొనూ ఉంటుంది . నేడు ఆ అందచందాల్ని పొందడానికి బ్యుతీపార్లర్లను ఆశ్రయిస్తునారు . .. లేదా వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చరం సమస్యలు తలెత్తుతున్నాయి .

కుంకుమ ,కాటుక , తిలకం వంటివన్నీ సౌందర్య సాధనాలే . పసుపు , పెరుగు , మీగడ , కోడిగుడ్డు వంటివాటివన్నీ ఉపయోగించుకొని చర్మ సౌందర్యం పెంచుకోవచ్చును . కొన్ని టిప్స్ చూద్దాం .

టిప్స్ :

1 . ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది .

2. ముకం మీద ముడతలు వస్తే ముసలితనాన్ని ఎత్తిచుపుతుంది .. దీనికిగాను పైనాపిల్ రసం , యాపిల్ రసం , నిమ్మరసము ఒక్కో స్పూను చొప్పున్న తీసుకొని బాగా కలియబెట్టి ముఖానికి పట్టించి , ౧౫ -౨౦ నిముషాలు ఉంచి ముఖం కడుగుకోవాలి . ముడతలు తగ్గిపోతాయి ..ఒక వారం రోజులు చేస్తే .. ఇలా ప్రతి వారం ఒకసారి చేయాలి .

3 . జిడ్డు ముఖం ఉన్నవారు విచారించానవసరం లేదు ... ముఖం మీద గుడ్డు సొనను రాసుకోండి . ముఖం ఎండిన రీతిలో నుంటే పచ్చ సోన ను తీసుకొని బాగా గిలకకొట్టి ముఖానికి రాసుకొని 15 నిముషాలు ఉంచి కడుక్కోవాలి . గుడ్డు సోనలు రెండు చరం మీదుండే రంధ్రాల వెడల్పును తగ్గించి , ముఖకారమం ముడుతలు రాకుండా చూస్తాయి . మడుదటలు తగ్గిస్తాయి . ప్రతి వారం ఒక రోజు చేయాలి .

4 . ముఖానికి వెలుగుకోసం ... గులాబి రంగుకోసం కాళ్ళు కొంచం ఎత్తు లో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి ,తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖం పై వెలుగుతుంది . వారానికి మూడు రోజులు చేస్తే సరిపోతుంది .

5. అందానికి పండ్లు పనికొస్తాయి ... ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు , ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి , 15 - 20 నిముషాలు ఉంది ముఖం కడుక్కోవాలి . ముఖ చర్మం బిగుతుగాను , కాంతివంతం గాను ఉంటుంది .

6 . ముఖం తజదనానికి ... తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు ౧౫ నిముషాలు చేసి కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.

7 . ముఖం అందం లో శిరోజాల పాత్ర ... అందుకే వాటికి తగిన కన్డిసనర్ వాడాలి . అరటి , దోస , తమటోల గుజ్జు పెరుగు కలిసి తయారు చేసుకున్న ముద్దను శిరోజాలకు పట్టించి ఒక గంటసేపు ఉంది , ఆ తర్వాత శాంఫో తో తలస్నామం చేయాలి . శిరోజాలు చక్కగా వెలుగునిస్తూ కొత్త అందాన్నిస్తాయి .

8 . అందానాని కి ఆహారము పాత్ర .... అందం కోసం ఎన్ని రకాల భాహ్య సాధనాలు వాడినా అసలు అందం శరీర ఆరోగ్యం ద్వారానే వస్తుంది . ఆకుకూరలు , పండ్లు , పాలు , వారి , గోధుమ మున్నగు వాటితో సంపూర్ణ ఆహారము తినాలి . యాంటి ఆక్షిదేంట్లు ఎక్కువగా తీసుకోవాలి ... క్యారత్స్ , గుడ్లు , పాలు మున్నగునవి .

9 . అందానికి కళ్లు పాత్ర .... ముఖానికి అందం కల్లనుండే వస్తుంది . కళ్లు కాతివంతం గా ఉండాలి , అలసిన కళ్లు అందాన్ని పాడు చేస్తాయి . కీర ముక్కలు కళ్లు మీద పెట్టుకుంటే అలసతపోతుంది . చల్లని దోసముక్కలైతే మంచిది . కనుబొమలు , కనురెప్పలు అందం గా ఉంచాలి . కాటుక కొద్దిగా పెట్టుకోవాలి .

10 . ముఖం మీద నల్ల మచ్చలు ముఖం అందం పాడుచేసతాయి . " బ్లాక్ హెడ్స్ గా " పేర్కొన్న వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి . పెరుగు , నల్లమిరియాలపొడి , కలిపిన ముద్దను ముఖం మీద ఉంచి ౧౫- ౨౦ నిముషాల తరువాత కడుక్కోవాలి ... బ్లాక్ హెడ్స్ రారిపోతాయి .

11 . అందానికి వ్యాయామము పాత్ర .... వ్యాయామం చేయడం వల్ల శరీరం లోని మలినాలు పోయి చర్మమ కాంతివంతం గా తయారువుతుంది . వ్యాయామము వలన రాకతప్రసరణ పెరిగి శరీర ఆరోగ్యం బాగుపడుతుంది .. అందువల చర్మ కణాలు కాన్తివంతమవుతాయి .

12. అందానికి నిద్ర పాత్ర .... ఆరోగ్యానికి , నిద్రకు ప్రత్యక్ష సంభందం ఉన్నది . తగినంత నిద్ర లేకపోతె దాని ప్రభావం శరీర ఆరోగ్యం పై పడుతుంది . నిద్ర లేమి కళ్లు అలసటగా కనిపిస్తాయి . అందవిహీనం గా కనిపిస్తాయి . నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగు తాయి . కొత్తకనాలు తయారవుతాయి . కొత్త కణాలు కొత్త అందాన్ని నిస్తాయి .

సౌందర్యానికి అమ్మ చెప్పిన చిట్కాలు :
1. కళ్ళు :
మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.

2, ఉబ్బసం తో బాధ పడేవారికి :
ఉబ్బసం తో బాధ పడేవారికి ఒక మంచి "మన అమ్మ" చిట్కా.. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు (ఇలాచి)ను, దంచి లోపలి గింజలను తినాలి. అంతే ఇక ఆ రాత్రి ఉబ్బసం మిమ్మల్నిబాధించదు .

3 . అందమైన పాదాల కోసం :
పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి. పాదాలు ఎక్కువగా నీటిలో తడవకుండా , బాక్టీరియా పాదాలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . వారానికి ఒకసారైనా పాదాలకు యాంటిఫంగల్ క్రీమ్‌ ను రాయాలి . పాదాలకు ధరించే సాక్స్ విషయము లో పర్తిరోజూ ఉతికినవి మార్చాలి . పాదాలకు పగుళ్ళు ఏర్పడితే వైట్ పెట్రోలియం జెల్లీ రాస్తుండాలి .

4. అందమైన చేతుల కోసం :
చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి. రోజుకి నాలుగు సార్లైనా మాయిశ్చరైజర్ క్రీమ్‌ చేతులకు రాస్తుండాలి . గోళ్ళు అందం గా కనిపించడానికి కాల్సియం ఎక్కువగా లబించే ఆహారము తినాలి .

5 .అందమైన పెదవుల కోసం :
పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా. జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

5 .అందమైన మోము కోసం :
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు "మన అమ్మ" చిట్కాను తెలుసుకుందాం.. గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.
a) అందమైన మోము కోసం పచ్చిపాలతో..
ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..
పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.

b) అందమైన మోము కోసం.- టొమాటో, బీట్రూట్, క్యారట్...సౌందర్య చిట్కా- అందమైన మోము కోసం.
ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో..
టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

చలికాలంలో చర్మం సహజమెరుపును కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది. ఒకింత నల్లగా మారుతుంది కూడా. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే...
  • * చలికాలం ఎండ ఒంటికి అంత మంచిది కాదు. బయటికి వచ్చేటప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.
  • * సబ్బును ఉపయోగించకుండా వీలైనన్నిసార్లు మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
  • * పాలు సహజ వైటెనర్‌గా పనిచేసి చర్మం నల్లగా అవకుండా రక్షిస్తాయి. గోరువెచ్చటి పాలలో మెత్తటి వస్త్రాన్ని ముంచి దాంతో ముఖంపై అద్దాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగెయ్యాలి. రోజూ ఇలా చేస్తుంటే... చలి కారణంగా మెరుపు కోల్పోయిన చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.
  • * ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్‌, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • * పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
  • * సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది.
  • * రెండు నిమ్మచెక్కలను తీసుకుని ముఖంపైనా మెడపైనా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది.

ముఖం ప్రకాశవంతంగా అందంగా కనిపించడానికి : మార్కెట్లో రకరకాల సబ్బులూ క్రీములూ దొరుకుతాయి. కానీ వాటి కన్నా చర్మాన్ని శుభ్రపరిచే సహజగుణాలు కలిగిన పసుపు, శనగపిండి, తేనె వంటివి వాడటం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

* అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి, చెంచాడు పసుపు కలపండి. తయారైన మిశ్రమాన్ని ముఖానికీ మెడకూ పట్టించండి. ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. జిడ్డు చర్మం గలవారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.
* ఒక దోసకాయ తీసుకుని దాని రసం తీయండి. అందులో నాలుగైదు టేబుల్‌స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాయండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ ప్యాక్‌ స్వేదరంధ్రాలను శుభ్రపరచి బిగుతుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
* ఒక కప్పు పెరుగులో టేబుల్‌స్పూన్‌ తేనె కలపండి. బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
* అరకప్పు గోరువెచ్చటినీళ్లలో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె వేయండి. మందుల షాపులో దొరికే ఎ, ఇ విటమిన్‌ టాబ్లెట్లను ఒక్కొక్కటి తీసుకొని వాటి పొడిని తేనె, నీళ్ల మిశ్రమంలో వేసి బాగా కలపండి. తరచుగా ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తొలగిపోతాయి.

Monday, November 16, 2009

ఆహారము జీవితకాలము , Food and Lifespan



ఆహారం అందరికి అవసరం ... అది లేకుంటే బతకడం కష్టం . అందరు ఒకే వయసు వరకు బ్రతకరు ... కొందరు చిన్న వయసు లోనే అనారోగ్యానికి గురై మందులు మింగుతూ బ్రతుకుతుంటారు . షష్టి పూర్తీ చేసుకున్న తరువాత కుడా ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా జీవితాన్ని గడుపుతున్న వారుంటారు . అటువంటి తేడాకు కారణం వారు తీసుకునే ఆహారము . ఆహారము పోషక పదార్ధాలను అందిస్తుంది . ఈ పోషక పదార్ధాలు అందించే శక్తి అనేక రోగాలను నిరోధిస్తుంది . ఆరోగ్యం చెడి పోకుండా కాపాడే ఆహారపదార్ధాలకు తగినంత ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు . పోషక పదార్ధాలకు కాక రంగు , రుచి కి ప్రాధాన్యత పెంచినందునీ పిల్లలు "జంక్ ఫుడ్" పట్ల మక్కువ చూపుతున్నారు . ఒకప్పడు మనది ఋతువులకు తగిన ఆహారపదార్ధాలను తిన్న సంస్కృతీ . ఆ ఋతువులో ఏ ఆహార పదార్ధాలను తీసుకోవాలో ఆ పదార్ధాలను కనీస మోతాదు లో ప్రతి ఒక్కరు తీసుకునేలా పండుగ ప్రసాదాలను నిర్దేశించారు మన పెద్దలు .

అంత ముందు చూపుతో రూపొందించిన జీవన విధానానికి దూరం గా జరిగినందునే భారతీయులు అనారోగ్యాలకు గురవుతున్నారు . తిరిగి తమ జీవన విధానాన్ని , ఆహారపు పద్దతులను , ఆహారపదార్ధాల విషయం లో పట్టింపులను వెనక్కు తెచ్చుంటే తప్ప జీవిత కాలాన్ని ఎవరు మెరుగు పరుచుకోలేరు .

టిప్స్ :
1 . మన శరీరం లో తయారయ్యే రసాయనాల వల్ల కణాలు దెబ్బతింటాయి . చర్మము మీద ముడతలు రావడం , చర్మం కాంతిని కోల్పోవడం వంటివన్నీ ఆ రసాయనాలు తీసుకువచ్చే మార్పులే . కాబట్టి అటువంటి రసాయనాలను నిలువరించే యాంటి ఆక్షిడెంత్స్ ను శరీరానికి అందించాలి . యాంట్ ఆక్షి డెంత్స్ (AtiOxidents) ఎక్కువగా ఉన్నా ఆహారము తీసుకోవల్లి .
బాసం , నిమ్మ , బత్తాయి , క్యారెట్లు , ఆకుకూరలు , టమాటోలు , రంగు మిరపకాయలు , వంటివి ఆహారము లో ప్రతి రోజు భాగం గా చేసుకోవాలి .

2. సలాడ్లు అనగా పచ్చి కాయకురకాయల ముక్కలు , పండ్లు ముమ్మలు , టమాటో ముక్కలు , క్యారట్ ముక్కలు సలాడ గా చేసుకొనే తింటే మంచిది . పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది కావున విరోచనం సాఫీగా అవుతుంది . విటమిన్లు , మినరల్స్ ఉంటాయి .

3. ఇంట్లో పండ్లు నిలువ ఉంచుకోవాలి , భోజనానికి ... భోజనానికి మధ్యలో శక్తి కోసం పండ్లు తినాలి . ఒక్కో ఋతువులో ఒక్కో రకం పండు లభిస్తాయి. అవి తినడం ఎంతో మంచిది .

4 . బలం గా , ద్రుడం గా ఉండాలంటే గట్టి ఎముకలున్డాలి .. చక్కని ఎముకలు , దంతాలు ఉన్నవారు ఆకర్షణీయం గా ను ఆరోగ్యం గాను కనిపిస్తారు ... అటువంటి బలాన్ని అందించేవి పాలు , పాల ఉత్పత్తులు ప్రతి రోజు తీసుకోవాలి .

5 . అల్ఫారం గురించి ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు .. రాత్రి ౯ గంటలకు భోజనం చేస్తే తిరిగి ఉదయం ౭ గంటల వరకు ఆహారం లేకుండా ఉంటుంది శరీరం . అటువంటి శరీరానికి మధ్యలో అలపాహారం అందిస్తే మంచిది , వారి ,గోధుమ , మినప , పెసర లతో చేసే టిఫిన్లు తింటే మంచిది .

6 . ఆహారపదార్ధాలు తీసుకునేటపుడు ఎక్కువ పోషక పదార్ధాలు , పీచు ఎక్కువగా ఉండేటట్లు చూడాలి . పీచు పదార్ధము వల్ల రక్తం లోని కొలెస్టిరాల్ తగ్గుతుంది , షుగర్ స్థాయి తగ్గుతుంది , పెగుఅలకు సంభండిచి న క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది .

7. ఆహారము తీసుకునే తప్పుడు మితిమీరి తినకూడదు ... కొంత ఆకలిగానే భోజనం ముగించాలి . భోజనానికి ,భోజనానికి మధ్య కనీసం ౩-౪ గంటలు వ్యవధి ఉండాలి . ఆరోగ్యానికి మంచిది .

8 . కొవ్వు పదార్ధాలు ఉన్నా ఆహారము పరిమితం గా తీసుకోవాలి . కొవ్వు శరీరానికి అవసరమే కాని ... కొవ్వు ఎక్కువగా చేరిన శరీమము అనేక రోగాలకు దారితీస్తుంది . అందుకే కొవ్వుపదార్ధాలు అతి తక్కువగా తినాలి . తీపి పదార్ధాలు , వెన్న , జున్ను , జంతు మాంసాలు ఎక్కువగా తినకూడదు . చేపలు , పిట్ట(పక్షి) మాంసము తినవచ్చును .

9 . పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది . ప్రతిరోజూ పండ్లు మార్చి మార్చి రకరకాల పండ్లు తినాలి .

10. తాజా కూరగాయలు తినడానికి ఎంచుకోవాలి . కూరలు వందే టపుడు మసాల వస్తువులు తక్కువగా వాడాలి .

11. నీరు ఎక్కువగా తాగాలి . దాహం వేసే తపుడే నీరు తాగడం కాదు . మధ్య మధ్య లో కావాలని నీరు తాగాలి . కడుపు ఖాళీ గా ఉన్నప్పుడే ఎక్కువ నీరు తాగితే చాలా మంచిది . ఆహారము ముందు నీరు తాగం వలన తక్కువ భోజనం చేయడం జరుగుతుంది .. మిత ఆహారము ఆరోగ్యానికి చాలా మంచిది . భోజనం తరువాత నీరు తాగాలి ... నీరు జీర్ణక్రియకు తోడ్పడుతుంది .
12. భోణం తిన్న వెంటనే పడుకోకూడదు ... పది నిముషాలు అటు ఇటు నడవాలి . టీవీ చూస్తూ తినకూడదు ఎందుకంటే మనకు తెలియకుండానే ఎక్కువగా తేనె అవకాశముంది కనుక . ఒకవేళ టీవీ ముందు తింటే ముందే ఆహారము కొలపెట్టి వడ్డించుకోవాలి .