Tuesday, March 30, 2010

వీడీఅర్ఎల్ పరీక్ష అంటే ఏమిటి?, VDRL Test - about




సిఫిలిస్ వ్యాధి నిర్థారణ కోసం విడీఆర్ఎల్ పరీక్ష చేస్తుంటారు. ఈ పరీక్షలో నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పడం కష్టమే. సిఫిలిస్ వ్యాధి లేకపోయినా కొన్ని సందర్భాలలో వ్యాధి ఉన్నట్లు విడీఅర్ఎల్ పరీక్షలో తేలుతుంటుంది. న్యుమోనియా, మలేరియా వంటి వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని రకాల టీకాలు వేయించుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిద్ర మాత్రలు వాడే వారిలో లెప్రసీ ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన ఫలితం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విడిఆర్ఎల్ పరీక్ష మీద ఆధారపడడం తగదు. అయితే సిఫిలిస్ తో బాధపడుతున్న తల్లి నుంచి శిశువు గర్భస్థ శిశువుకు సోకడానికీ అవకాశముంది. అందుకని అనుమానం ఉంటే విడిఆర్ఎల్ పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం. ఎందుకంటే శిశువుకు సిఫిలిస్ సోకితే అనేక అనారోగ్య లక్షణాలతో బాధపడుతుంటుంది.
గర్భస్థ శిశువుకు వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత కొద్దికాలానికే చనిపోవచ్చు. శిశువు సిఫిలిస్ తో బాధపడుతున్నప్పటికీ ఆ లక్షణాలు పుట్టిన వెంటనే కొందరిలో కనపడవు. క్రమంగా కొద్దికాలానికి సిఫిలిస్ లక్షణాలు బయతపడతాయి.
శిశువు జన్మించిన కొద్దివారాలకి ఈ లక్షణాలు బయటపడవచ్చు. లింఫ్ గ్రంథులు వాయడం, పాలు త్రాగాకపోవడం, నీరసంగా ఉండడం, ఎర్రటి దద్దుర్లు కనపడడం, జననేంద్రియాల వద్ద పుండ్లు రావడం వంటివి జరగవచ్చు. ఇంకా అనేక లక్షణాలు కనపడతాయి. ఇటువంటప్పుడు వైద్యులను సంప్రదించి, సిఫిలిస్ అని అనుమానం ఉంటే ఆ విషయమూ చెప్పడం మంచిది. సిఫిలిస్ లక్షణాలు మొదటిసారి శిశువులో కనిపించినప్పుడే జాగ్రత్త పడాలి. కొంతమందికి మొదటిసారి ఎటువంటి మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. అది పూర్తిగా తగ్గిపోవాడం మాత్రం కాదు. కొద్దికాలానికి వ్యాధి రెండవ దశలోకి అడుగుపెట్టి మరల వ్యాధి లక్షణాలు కనబడతాయి.
తల్లి నుంచి సిఫిలిస్ వ్యాధికారాక క్రిములు సంక్రమించిన శిశువులో అరుదుగా కొందరికి చాలాకాలం వరకు అసలు సిఫిలిస్ లక్షణాలనేవే కనిపించకపోవచ్చు. ఇదేమీ వ్యాధి లేదనడానికి చిహ్నం కాదు. వయసు పెరుగుతున్నప్పుడు ఎప్పుడో మెల్లగా ఆ లక్షణాలు బయటపడతాయి. ఇలాంటి పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే ముందే చికిత్స చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం.
  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు , Amniotic Fluid More and less




ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు... హెచ్చరికలే

అమ్మకడుపులో తొమ్మిదినెలలు.. ఈ సమయంలో గర్భస్థ శిశువులో ఎన్నెన్నో మార్పులు. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనే తల్లులు కొన్ని సందర్భాల్లో కలవరపడుతుంటారు కూడా.

శిశువు ఎదుగుదలలో.. సౌకర్యాన్నందించడంలో కీలకం ఉమ్మనీరు. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయికన్నా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సాధారణంగా అయితే.. గర్భం ధరించినప్పటి నుంచీ ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఇది 30 ఎం.ఎల్‌.. ఆ తరవాత అంటే తొమ్మిదో నెలకు ఇది వెయ్యి ఎం.ఎల్‌వరకు చేరవచ్చు. గర్భస్థశిశువు ఇందులో కదలడమే కాదు అప్పుడప్పుడు స్వీకరించడం.. మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం కూడా బిడ్డ ఎదుగుదలలో భాగమే.

ఉమ్మనీరు చేసే మేలు..
బిడ్డ గర్భంలో సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డ చుట్టూ సమాన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.. వేడి తగ్గినప్పుడు ఉమ్మనీరు రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. బయటి నుంచి శిశువుకు గాయాలు కాకుండా కాపాడే బాధ్యత కూడా ఉమ్మనీరుదే.

తగ్గినా, పెరిగినా ప్రమాదమే...
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఎలా తలెత్తుతాయో చూద్దాం..

ఓలిగోహైడ్రామ్నియోస్‌: ఉమ్మనీరు ఉండాల్సిందానికన్నా తక్కువగా ఉండటాన్నే ఇలా పరిగణిస్తారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని మూత్రం ద్వారా విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి బాగా తగ్గిపోతుంది. అలాగే శిశువులో మూత్రం తయారు కాకపోయినా, విసర్జించిన మూత్రం ఉమ్మనీరు ఉన్న సంచిలోకి చేరకపోయినా, మూత్రనాళం ఏర్పడకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మనీటికి కారణమైన పొరలు రాసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వవచ్చు. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, గర్భస్థ శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్నిరకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం.. (వైద్యులు చెప్పిన తేదీ దాటి రెండు వారాలు గడిచినా ప్రసవం కాకపోవడం..) వంటి కారణాల వల్ల కూడా ఉమ్మనీరు స్థాయి బాగా తగ్గిపోతుంది.

పాలీహైడ్రామ్నియోస్‌: గర్భంలో బిడ్డ చుట్టూ ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉండటాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా పరిగణిస్తారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అసలు స్వీకరించకపోయినా.. శిశువు ఉదర సంబంధ పేగు (గ్యాస్ట్రోఇంటస్త్టెనల్‌ ట్రాక్‌) మూసుకుపోవడం వల్లకూడా ఇలా జరుగుతుంది. సహజ ప్రక్రియలో శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలేదంటే.. అందుకు ఉదరం, మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు.. మరికొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉండటం, తల్లికి జెస్టేషినల్‌ డయాబిటీస్‌.. వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో కారణాలు విశ్లేషణకు అందకపోవచ్చు.

ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, సమస్యలు: నెలలు నిండకుండానే నొప్పులు రావొచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ (ప్లాసెంటా) వేరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ(మాల్‌ప్రెజెంటేషన్‌) స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ.

ఇలా తెలుసుకోవచ్చు...
ఉమ్మనీరు పెరుగుతోందా.. తగ్గుతోందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చక్కటి పరిష్కారం. అలాగే బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డాప్లర్‌ ఫ్లో స్టడీలతో బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. కాస్త అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే పండంటి పాపాయిని ఆహ్వానించవచ్చు.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 27, 2010

పచ్చదనంతో మనోల్లాసం , Mental Piece with Green fields





యాంత్రిక జీవనానికి దూరంగా.. ప్రకృతితో వీలైనంత ఎక్కువ సేపు స్నేహం చేస్తే తీవ్రమైన మానసిక సమస్యల బారిన పడకుండా ఉంటామనేది తాజా అధ్యయనాల్లో తేలిన వాస్తవం. దీని వల్ల ఒత్తిడికి దూరమై.. మనోల్లాసానికి దగ్గరవడం ఖాయం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ రిచర్డ్‌ వైద్యులు. వందల మందిపై జరిపిన పరిశోధన తర్వాత ఈ వాస్తవాన్ని వెల్లడించారు. దినచర్యలో భాగంగా ఎక్కువ సమయం మొక్కల పెంపకం, లాన్‌లో నడవడానికి సమయం కేటాయించగలిగితే మనసు తేలిక పడుతుంది. కొత్త ఆలోచనలు అంకురిస్తాయి. అంతేకాదు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.. ప్రకృతిలో ఉన్న మహత్తే అది అంటారు శాస్త్రవేత్తలు. అందుకే నిపుణులు యోగా, ధ్యానానికి అనువుగా పచ్చని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తారు. అలానే తోటపని చేయడానికి, మొక్కల పెంపకానికి వీలు కాకపోతే కనీసం పచ్చని చెట్లు ఉన్న చిత్రాలనయినా ఇంటి గదుల్లో అలంకరించుకుంటే హాయిగా ఉంటుంది.


  • =================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 22, 2010

కంప్యూటర్ వర్కర్స్ కి యోగ , Yoga for Computer workers

యోగ ఎన్నో విధాలుగా ఆరోగ్య పరిరక్షణలో ఉపయోగపడుతుంది . యోగ అనేది ఒక రకమైన మనసును నిలకడచేసి నిదానము గా చేసే శరీరవ్యామాము .
స్పెసలిస్ట్ వ్రాసిన వ్యాసం చదవండి - > Yoga for Computer workers
  • ====================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Psoriasis, సోరియాసిస్




*పొలుసులు చేపలకు అవసరం, అందం కూడా! కానీ నున్నగా, మృదువుగా ఉండాల్సిన మన చర్మం ఉన్నట్టుండి పొట్టుపొట్టుగా రాలిపోతూ.. పొలుసుల్లా మెరవటం మొదలుపెడితే..? తీవ్రమైన మానసిక వేదన మొదలవుతుంది. ఆ ఇబ్బందేమిటో అర్థం కాక.. నలుగురిలోకి రాలేక.. కంటి మీద కునుకుండదు. శారీరక సమస్య కంటే కూడా మానసిక వేదన మరింతగా అతలాకుతలం చేస్తుంది. అందుకేనేమో పొలుసుల వ్యాధి.. 'సొరియాసిస్‌' పేరు వింటూనే చాలామంది బెంబేలెత్తి పోతుంటారు. చర్మం మీద ఎలాంటి మచ్చ కనబడినా సోరియాసిస్‌ మచ్చేమోనని అనుమానిస్తుంటారు. ఇది దీర్ఘకాలం వేధించే తీవ్రమైన సమస్యే కావొచ్చు. కానీ సరైన చికిత్స తీసుకుంటూ, తగు జాగ్రత్తలు పాటిస్తే చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి దీని గురించి అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.
 సోరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వ్యాధి. అంటువ్యాధి కాదు. ఎక్కువగా వంశపారపర్య కుటుంబాలలో కలిగి ఉన్నవారికి వస్తుంది.
* ఇది స్వల్పమైన వ్యాధి దీని వల్ల చర్మం ఎర్ర బారడం,పొలుసులుగా రావడం, మచ్చలు పడటం జరుగుతుంది.
* ఈ సోరియాసిస్ లక్షణాలు కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. (క్రానిక్ డిసార్డర్) దీర్ఘకాలపు చర్మ వ్యాధి.
* ఈ వ్యాధి లక్షణాలు జీవితాంతము వస్తుంటాయి పోతుంటాయి.
* ఈ వ్యాధి స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది.
* ఇది అన్ని జాతుల వారికి సంక్రమిస్తుంది.

సోరియాసిస్ కి కారణాలేమిటి?
* ఖచ్చితమైన కారణమనేది తెలియదు. ప్రస్తుత సమాచారం మాత్రం సోరియాసిస్ కి సంబంధించి రెండు కారణాలను సూచిస్తుంది.

1. పూర్వీకుల నుండి పొందడం,
2. ఆటోఇమ్యూన్ ప్రతి స్పందన.

* వ్యక్తులలో కొన్ని జన్యు పరమైన ప్రేరేపణ వల్ల తప్పుడు సూచనలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధకు పంపబడతాయి. దీని వల్ల చర్మకణాల పెరుగుదల చక్రం ఎక్కువవుతుంది. ఈ చర్మకణాలు ఒక దానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇవి త్వరగా రాలిపోవు. సోరియాసిస్ సంక్రమించిన కొందరు వ్యక్తులు కుటుంబ చరిత్ర కలిగి ఉండరు. కొన్ని జన్యువులు దీనికి సంబంధితమైనవి.

ఎర్రటి మచ్చలు, పొలుసులు రాలడం ఎందుకు జరుగుతుంది ?

* చర్మం మీది పైన పొరలోవున్న చర్మ కణాల సంఖ్య ఎక్కువ అవడం వలన చర్మం పొలుసులుగా రాలడం ఎర్ర మచ్చలు పడటం జరుగుతుంది.* సాధారణంగా చర్మ కణాలు నాలుగు వారాలలో పరిపక్వత చెంది శరీరం మీది ఉపరితలం నుండి రాలిపోతుంటాయి
* సోరియాసిస్ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ ప్రక్రియ ప్రతి 3 -4 రోజుల లోపు త్వరగా జరుగుతుంది.* అత్యధికంగా చర్మకణాల ఉత్పత్తి జరగడం వలన సోరియాసిస్ లో చర్మం మీద కణాలు ఏర్పడుతాయి

  • సోరియాసిస్ ను ఎలా గుర్తిస్తారు ?
* చర్మం ఎర్ర బారడం, పొలుసులుగా రాలడం, దురద, గట్టిపడటం, పగుళ్ళు, అరిచేయి, అరికాలు మీద బొబ్బలు ఏర్పడటం మొదలగునవి సోరియాసిస్ లక్షణాలు.
* స్వల్పంగా ఉండచ్చు లేకపోతే ఆకృతి కోల్పోవడం, చేతకాని స్ధితికి రావడం లాంటి తీవ్రమైన స్ధాయికి చేరుకోవచ్చు.
  • సోరియాసిస్ లో వివిధ రకాలు ఏమిటి ?
* చర్మ కణాలు తీరు మరియు చర్మంమీది మచ్చలు ప్రకారంగా సోరియాసిస్ పలు విధాలుగా విభజించబడింది.

1. ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ చర్మంమీద తీవ్రమైన ఎర్రదనం వాపు వస్తుంది.
2. ప్లేక్ సోరియాసిస్ ఇది సోరియాసిస్ లో అతిసాధారణమైనది.
(80% సోరియాసిస్ ఉన్న ప్రజలకు ఇదే ఉంటుంది.)* ఇది చర్మం మీద ఎర్రగా పొంగిన కనాలను కలుగజేస్తుంది. * ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులను వృద్ధి చేస్తుంది. ఇవి ఎక్కడైనా ఏర్పడినా, మోకాలు, మోచేతులు,తలమీది చర్మం పైన, మొండెము మరియు గోళ్ళమీద ఎక్కువగా ఏర్పడతాయి.

3. ఇన్వర్స్ సోరియాసిస్ ఇది చర్మం ముడతలలో నున్నగా, ఎర్రటి వ్రణాలను
లిగిస్తుంది.
4. గట్టేట్ సోరియాసిస్ ఇది నీటి బొట్లులాంటి చిన్న చర్మ వ్రణాలను కలిగిస్తుంది.
5. పుస్య్టులార్ సోరియాసిస్ ఇది తెల్లటి, చిక్కటి పదార్ధంతో నింపబడిన బొబ్బలను
కలిగిస్తుంది.
6. సోరియాటిక్ ఆర్రైటిక్ ఇది రుమటాయిడ్ ఆర్రైటిక్ లాంటి ఒక రకమైన కీళ్ళకు
సంబందించిన వ్యాధి.
  • సోరియాసిస్ ప్రేరేపించే లేక దుర్భరం చేసే కారణాలు ఏమైనా ఉన్నాయా?
సోరియాసిస్ ఉన్న వ్యక్తులలో కొన్ని కారణాలు గారను వృద్ధి చేస్తాయి. వాటిలో కొన్ని కారణాలు చర్మహాని చేసే రసాయనాలు, ఇన్ఫెక్షన్, గోకటం, రక్కుటం, ఎండకు చర్మం కములుట, మద్యము, హార్మోన్ల (అసమౌతుల్యం), పొగత్రాగడం, కొన్నిమందులు బీటాబ్లాకర్స్,నాన్ స్టీరాయిడల్ ఆంటి-ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్, ఒత్తిడి.

సోరియాసిస్‌ వ్యాధిని ప్రేరేపించే కారకాలు ,Predisposing factors in Psoriasis

చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి, పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్‌ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ, తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. కాబట్టి వాటి గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.

ఒత్తిడి: ఒత్తిడితో సోరియాసిస్‌ మరింత తీవ్రం అవుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఒత్తిడిని దరిజేరకుండా చూసుకోవటం ఎంతో అవసరం. ఇందుకు గట్టిగా శ్వాస పీల్చుకొని 1 నుంచి 10 వరకు అంకెలు లెక్కబెట్టటం, సానుకూల దృక్పథంతో ఆలోచించటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటి పద్ధతులను పాటించాలి.

అలర్జీలు: సోరియాసిస్‌, అలర్జీలు రెండింటిలోనూ రోగనిరోధకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. అలర్జీని ప్రేరేపించే మాస్ట్‌కణాలు సోరియాసిస్‌ బాధితుల్లోనూ అధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీరు దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు వంటివి పడనివాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది.

మద్యం: అతిగా మద్యం తాగితే వ్యాధి విజృంభించొచ్చు. పైగా కొన్ని సోరియాసిస్‌ మందులకు మద్యం సరిపడదు. అందువల్ల మద్యం జోలికి వెళ్లకపోవటమే మంచిది. రోజుకు 20 నిమిషాల సేపు ఎండ తగిలేలా చూసుకుంటే సోరియాసిస్‌ తీవ్రతను తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేసినా మంచి ఫలితం ఉంటుంది.

చల్లని/పొడి వాతావరణం: చర్మం పొడిగా ఉంటే పొలుసుల బాధ మరింత పెరగొచ్చు. కాబట్టి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. లోషన్లు, సబ్బులను వాసన లేనివి వాడితే మంచిది. దీంతో సున్నితమైన చర్మం దురద పెట్టకుండా చూసుకోవచ్చు.

మందులు: మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్‌ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్‌కు చెప్పాలి.

గాయాలు: సాధ్యమైనంతవరకు చర్మానికి గాయాలు కాకుండా చూసుకోవటం మేలు. ఎందుకంటే గాయాలు అయిన చోట చర్మం మీద ఏర్పడే కంతులు సోరియాసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. ఇంటిపనులు చేస్తున్నప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవటం.. షేవింగ్‌, గోళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పొగ తాగటం: ఈ అలవాటును ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. ఇది సోరియాసిస్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో రుజువైంది. పొగ మానేస్తే హఠాత్తుగా వ్యాధి విజృంభించటమూ తగ్గుతున్నట్టు తేలింది.

హార్మోన్లు: సోరియాసిస్‌ ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ 20-30 ఏళ్ల వయసులో.. అలాగే 50-60 ఏళ్ల వయసులో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. యవ్వనం ఆరంభంలో, మెనోపాజ్‌ దశలు సోరియాసిస్‌ పొడలను ప్రేరేపిస్తాయి. ఇందుకు హార్మోన్లు దోహదం చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
  • సోరియాసిస్ ఎలా నిర్ధారించబడుతుంది ?
* వ్యక్తి యొక్క వైద్య చరిత్ర మరియు బాహ్య పరీక్ష ఆధారంతో వైద్య నిపుణులు సోరియాసిస్ నిర్ధారిస్తారు. * ఈ వ్యాధిలోని ప్రత్యేకమైన వ్రణాలను బట్టి ఆ వ్యక్తికి ఏ రకమైన సోరియాసిస్ ఉందో తెలుసుకోవచ్చు. * నీళ్ళలో ఎక్కువగా ఉండకండి. మీ షవర్ స్నానం, స్నానం సమయం తగ్గించండి. ఈత కొట్టడం తగ్గించుకోండి. * చర్మాన్ని గోకటం, రక్కుటం  మానుకోవాలి. * చర్మాన్ని రుద్దకుండా ఉండే వీలైన దుస్తులను ధరించాలి.
* ఇన్ఫెక్షన్, కానీ మరే ఇతర అస్వస్ధతకు గురియైన మీ వైద్యుణ్ణి సంప్రదించండి.
  • సమతుల ఆహారం ముఖ్యమా?
* ఏ ఆహారమైతే వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచుతుందో అదే సమతుల ఆహారం. ఎందుకంటే సోరియాసిస్ తో ఉన్నవ్యక్తులు మిగతా వారికంటే ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఆహారపుటలవాట్ల నుండి లాభం పొందుతారు. * కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరిస్ధితిని దుర్బరం కానీ, చర్మ స్ధితిని మెరుగు పరుస్తాయి అని చాలా మంది అంటుంటారు.
* సోరియాసిస్ కలిగి ఉన్నవ్యక్తులు పాటించవలసిన ప్రత్యేకమైన ఆహారం ఏదీ లేదు. అయినప్పటికీ కొన్ని ఆహార పద్ధతులు సూచించబడ్డాయి.
  • సోరియాసిస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి?
సోరియాసిస్ వ్యక్తుల పైన మానసిక మరియు శారీరక ప్రభావం చూపుతుంది.
సోరియాటిక్ కీళ్ళవాపు, ఒక రకమైన కీళ్ళరోగం, ఉన్నకొద్ది మంది వ్యక్తులో వచ్చి వారికి నొప్పిని మరియు చేతకాని స్ధితిని తీసుకువస్తుంది.
  • సోరియాసిస్ అంటు వ్యాధా ?
 కాదు సోరియాసిస్, అంటు వ్యాధి కాదు. ఒకరి నుండి ఇంకొకరు పట్టుకోలేరు. ఈ వ్యాధి అదుపులో ఉంచడానికి ఏది సహకరిస్తుంది ? ఈ క్రింది ప్రతిపాదనలను పాటించండి.

* చర్మానికి హాని కలిగించే దెబ్బల నుండి ,గాయాల నుండి, ఎండ తీవ్రతకు కూడ దూరంగా ఉంచండి. * మీ చర్మాన్ని ఎండ తీవ్రతకు కమిలేంతగా బయలు పర్చకండి. * మద్యాన్ని మరియు పొగ త్రాగటం మాని వేయండి. * మీ పరిస్ధితిని దుర్బరం చేసే మందులకు దూరంగా ఉండండి. * ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి
  • వ్యాధి నివారణ
సోరియాసిస్ తీవ్రతను బట్టి వ్యాధి చికిత్స -సోరియాసిన్ వ్యాధి ఉధ్రుతమైనది,  దీర్ఘకాలికమైనది. కావున ఒక రోగికి , మరో రోగికి వ్యాధి తీవ్రతలో తేడా ఉంటుంది. జబ్బు తీవ్రతను బట్టి చికిస్త చేయవలసిన అవరముంటుంది. తగినంత శరీరకశ్రమ , విశ్రాంతి, సమతుల్య ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మరక్షణకు సంబంధించిన జాగ్రత్తలూ, ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా సుచి-శుబ్రత పాటించడం, పొడి చర్మానికి తేమకోసం ఆయిల్ పూయడం మంచిది.
  • చికిత్స : 
ఈ కింద ఆయింట్మెంట్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి .
1. CALDOC Oint.
2, PROPYSALIC Oint.రెండుపూటలా రాయాలి .
చర్మము దురదగా ఉంటే " cetrazine 10 mg "రోజుకి ఒకటి -- అవసరమైనంతకాలము వాడాలి .

స్కిన్ స్పెసలిస్ట్ గారి ... వ్యాసాన్ని చదవండి . క్లిక్ చేయండి - > సోరియాసిస్
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 17, 2010

ముట్లు ఆగిపోవడము , Menopause




మెనోపాజ్‌ సహజం-- మెనోపాజ్ సమయములో దానికి ముందు ఈస్ట్రోజన్‌తో సహా స్త్రీ సెక్ష్ హార్మోనులు స్థాయి తగ్గిపోతుంటుంది. మేల్ హార్మోన్‌ యాండ్రోజన్‌ అలాగే ఉంటుంది.

  • గర్భధారణ వయసు పదిహేనేళ్ల నుంచి నలభై తొమ్మిదేళ్లు వరకు ఉంటుంది. నలభై ఐదేళ్ల నుంచి అండాలు క్రమంగా తగ్గుతాయి. ఒక దశకొచ్చే సరికి అండాలు మాయమవుతాయి. దీంతో మెదడు నుంచి సంకేతాలు పంపినా ప్రయోజనం ఉండదు. అండాలు తగ్గి, పరిపక్వమవడానికి అవకాశం ఎప్పుడు ఉండదో అప్పుడు మెనోపాజ్‌ దశ (రుతుక్రమం నిలిచిపోవడం) వస్తుంది. ఇవన్నీ మహిళల జీవితంలో పెనవేసుకున్న మార్పులు. పుట్టినప్పటి నుంచి రుతుక్రమం మొదలయ్యే దాక ఒక దశ, రుతుక్రమం నుంచి రుతుక్రమం నిలిచేదాక ఒక దశ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మెనోపాజ్‌ దశ రావడం సహజం.

మెనోపాజ్‌ ఆడవారి జీవితాన్ని చికాకుగా తయారు చేస్తుంది. పెరుగుతున్న వయసులో వచ్చే 'మెనోపాజ్‌' ఓ గ్రీకు పదం. మెనో అంటే 'నెల' అని, పాజ్‌ అంటే 'ఆగి' పోవటమని అర్థం. అంటే నెల నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోవడమన్నమాట.

45--50 సంవత్సరాల వయసు మహిళల్లో పీరియడ్స్‌ సరైన సమయంలో రావు. అండాశయం నుండి అండాలు వెలువడటం ఆగిపోతుంది. కొన్ని నెలల పాటు పీరియడ్స్‌ ఆగిపోతాయి. స్త్రీలోని సెక్స్‌ హోర్మోన్స్‌ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది.

ఇది ఆడవారి జీవితంలో అందరూ పొందే సామాన్య స్థితే. దీనివల్ల ఓవరీస్‌ నుండి వెలువడే అండోత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి క్రమంగా ఈస్ట్రోజెస్‌ (స్త్రీ సెక్స్‌ హోర్మోన్స్‌) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.

స్థితి మూడు దశల్లో ఉంటుంది.

ప్రీ మెనోపాజ్‌ : ఈ స్థితిలో ఓవరీస్‌ నెమ్మదిగా పని చేస్తాయి. ఋతుక్రమం మామూలుగానే వస్తుంది. కానీ కొన్ని లక్షణాలు బయటపడతాయి.

మెనోపాజ్‌ రెండవదశ : ఈ దశలో ఋతుక్రమం తప్పుతుంది. దీని లక్షణాలు బాధాకరంగా ఉంటాయి.

మూడవ దశ (పోస్ట్‌ మెనోపాజ్‌) : ఒక్కోసారి పీరియడ్స్‌ సంవత్సరం వరకూ పూర్తిగా ఆగిపోతాయి. దీనిని పోస్ట్‌ మెనోపాజ్‌ అంటారు.

మెనోపాజ్‌ లక్షణాలు ఇలా కూడా వుండే అవకాశం వుంది.

  • రాత్రి నిద్ర పట్టకపోవటం,
  • చెమట పట్టటం,
  • ఆకస్మికంగా గుండె,
  • మెడ, ముఖం మీద ఎరుపుదనం రావటం,
  • వేడిగా అనిపించటంలాంటి ముఖ్య లక్షణాలు మెనోపాజ్‌లో కనిపిస్తాయి.
  • ఈ సమయంలో యోని ద్వారం ఎండిపోయినట్టుగా ఉంటుంది.
  • యోని చర్మం పల్చగా ఉంటుంది. ఈ కారణాల వల్ల యోని మూత్ర విసర్జన నాళంలో అంటు రోగాలు వ్యాపించే అవకాశముంటుంది.

సెక్స్‌ హోర్మోన్స్‌ తక్కువ కావటం వల్ల 'కలయిక' పట్ల ఆసక్తి తగ్గు ముఖం పడుతుంది. అయితే బాధలు తగ్గి, ఋతుక్రమం ఆగిపోయిన తరువాత ఆసక్తి మామూలు స్థితికి చేరుకుంటుంది. నెలనెలా వచ్చే పీరియడ్స్‌ సక్రమంగా రాక క్రమంగా ఆగిపోతాయి. కొంతమందిలో ఎక్కువ సమయం తీసుకుంటాయి.

ఈ లక్షణాలే కాకుండా మెనోపాజ్‌ స్థితిలో స్త్రీ మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. విసుక్కోవటం, చిరాకు పడటం జరుగుతుంది. అదే సమయంలో రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, ఆస్టియోపొరోసిస్‌, మూత్ర విసర్జనలో బాధ లాంటివి కూడా వచ్చే అవకాశం వుంది.

అలా అని సమస్య మరీ తీవ్రంగా వుంటుందని అనుకోవలసిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరంలో మెనోపాజ్‌ దశ ఒక వ్యాధి లక్షణం కాదు. ఇది ఒక సామాన్య స్థితి మాత్రమే.

మెనోపాజ్‌ దశకు చేరుకొన్న వారిలో రాత్రిపూట నిద్రాభంగం సహజం. కనీసం 3--4 సార్లు మెలకువ వస్తుంది. మళ్లీ నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రలేకపోవడంతో పాటు అలసట, నీరసం కలుగుతాయి. దాంతో మరుసటి రోజు చిరాకు, కోపం, విసుగువస్తాయి.

తల తిరగడం, ఒళ్లు తూలడం, దురదలు, తిమ్మిర్లు, మంటలు కనబడతాయి. కొందరిలో తలనొప్పి విపరీతంగా ఉంటుంది. దేనిమీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మతి మరుపు ఎక్కువ అవుతుంది. డిప్రెషన్‌ లక్షణాలు కలుగుతాయి.

మెనోపాజ్‌ బాధలు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు హోర్మోను రీప్లేస్‌మెంట్‌ థెరఫీ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు చేయించుకోవడం అవసరం. హిస్ట్రక్టమి ఆపరేషను చేయించుకున్న స్త్రీలకి కేవలం ఈస్ట్రోజను హోర్మోను ఇస్తే సరిపోతుంది. హిస్ట్రక్టమి ఆపరేషను అవని వాళ్లకి ఈస్ట్రోజను హోర్మోనుతోపాటు ప్రొజిస్టరోన్‌ హార్మోను కూడా ఇవ్వడం అవసరం.

మెనోపాజ్‌ వచ్చిన స్త్రీలు మానసికంగా కృంగిపోక హోర్మోను రీప్లేస్‌మెంట్‌ థెరఫీ పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తే సంసార సుఖం, మానసిక ఆనందం అలాగే నిలచి ఉంటాయి.

జీవితంలో మలిదశ.. మెనోపాజ్‌... అత్యంత కీలకం. ఇది ఆనందంగా సాగాలంటే.. శారీరకంగా చోటు చేసుకునే ప్రతి మార్పునీ గుర్తించగలగాలి.అవగాహన ఉంటేనే ఆ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండగలం. ఇంతకీ మెనోపాజ్‌ అంటే ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా కొనసాగిన రుతుక్రమం ఒక వయసొచ్చాక ఆగిపోవడం. ఈ దశకు ముందు, తరవాతా చోటు చేసుకునే రకరకాల మార్పులు స్త్రీని ఎంతో ప్రభావితం చేస్తాయి.

ఒక వయసు వచ్చాక నెలసరి ఎందుకు నిలిచిపోతుందో తెలియాలంటే.. అసలు రుతుక్రమం విధానం.. దానిని నియంత్రించే అంశాలపై అవగాహన అవసరం.

తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయిలో అండాశయాలు లేక ఓవరీల్లోని అండాలు (ఓవ ఎగ్స్‌) తయారవుతాయి. అవి ఇరవై వారాల గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు 70 లక్షల అండాల పూర్వదశ ఉండి, క్రమంగా తగ్గి పాప జన్మించేటప్పటికి 20 లక్షలు, రజస్వల సమయానికి మూడు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో పునరుత్పత్తి వయసులో నాలుగైదు వందల అండాలు మాత్రమే విడుదలవుతాయి. మిగిలినవి వాటికవే అట్రీషియా అనే ప్రక్రియతో నశించిపోతాయి.

ఇలా అండాల సంఖ్య క్షీణించడంతో హార్మోన్ల విడుదల స్థాయీ తగ్గుతూ వస్తుంది. చివరకు అండాశయాల్లోని ఊసైట్స్‌ బాగా తగ్గిపోయినప్పుడు పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే గోనాడోట్రోపిన్‌ హార్మోన్లు కూడా ఇతర హార్మోన్ల, అండాల విడుదలకు ప్రేరేపించవు. ఈ మార్పులు మెనోపాజ్‌కి దాదాపు పదేళ్ల ముందే చోటు చేసుకుంటాయి. నెలసరి పూర్తిగా ఆగిపోవడమనేది చివరి మెట్టు. అందువల్లే హార్మోన్ల స్థాయి తగ్గుముఖం పట్టినప్పటి నుంచీ కొందరు స్త్రీలకు మెనోపాజ్‌ సంబంధ సమస్యలు మొదలవుతాయి.

అండాశయాలు పూర్తిగా ముడుచుకుపోయి పని చేయడం ఆగిపోయే దశలో శరీరంలో అనేక మార్పులు తప్పవు. మెదడు నుంచి చర్మం దాకా, గోళ్ల నుంచి శిరోజాల వరకు, జ్ఞాపకశక్తి మొదలుకొని లైంగిక సంపర్కం.. ఇలా స్త్రీ శరీర ధర్మాలన్నింటిపై హార్మోన్ల లేమి ప్రభావం ఉంటుంది.

చెప్పాలంటే.. ఈ దశ 45-55 ఏళ్ల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. విదేశాలలో ఈ సగటు వయసు 51 ఏళ్లయితే, మన దేశంలో 48. ఇది ఎప్పుడు ఆగిపోతుందో గుర్తించలేం కానీ.. తల్లి మెనోపాజ్‌ వయసును తెలుసుకోగలిగితే... కొంతవరకు అంచనా వేయవచ్చు.

కొందరికి అసాధారణంగా నలభయ్యేళ్ల కంటే ముందే ఆగిపోతుంది. దీన్ని 'ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌', అరవయ్యేళ్ల దాకా కొనసాగుతుంటే... 'డిలేయిడ్‌ మెనోపాజ్‌'గా పేర్కొంటాం. ఇవి రెండూ అసహజమైనవే. ఇతర సమస్యలు తెచ్చిపెట్టేవే.

సహజమైన మెనోపాజ్‌ అయితే.. వయసు వల్ల అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లు విడుదల ఆగిపోవడమే కారణం. అయితే అండాశయాలను నిర్వీర్యం చేసే ఇతర కారణాలూ మెనోపాజ్‌ సంభవించేలా చేస్తాయి.

సర్జికల్‌ మెనోపాజ్‌: ఏ కారణం వల్లనైనా అండాశయాలను తొలగించడమే సర్జికల్‌ మెనోపాజ్‌. సహజ మెనోపాజ్‌ అయితే.. హార్మోన్లు క్రమేపీ తగ్గుతాయి కాబట్టి శరీరం అలవాటు పడుతుంది. కానీ ముందురోజు వరకూ మామూలుగానే ఉన్న హార్మోన్లు మర్నాటికల్లా మాయం కావడంతో మెనోపాజ్‌ లక్షణాలన్నీ ఒక్కసారి విజృంభించి వేధిస్తాయి.

రేడియేషన్‌, కీమోథెరపీ: జనేంద్రియాల క్యాన్సర్ల చికిత్సలో భాగంగా ఇచ్చే ఈ థెరపీలు అండాశయాలపై ప్రభావం చూపి మెనోపాజ్‌కు దారితీస్తాయి.

ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ (పీఓఎఫ్‌): నలభయ్యేళ్లు నిండకుండానే మెనోపాజ్‌ రావడాన్ని పీఓఎఫ్‌ అంటారు. జన్యు సమస్యల వల్ల అండాశయాలు లోపభూయిష్టంగా ఉండటం.. లేదా శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ గాడితప్పడమే ముఖ్యకారణం.

హిస్టెరెక్టమీ లేదా గర్భాశయాన్ని తొలగించిన తరవాత మామూలుగా కన్నా నాలుగేళ్లు ముందుగానే మెనోపాజ్‌ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే పౌష్టికాహారలోపం ఉన్నవారికి ఇది రెండేళ్లు ముందుగానే వస్తుంది.

మెనోపాజ్‌ దశలో వయసు పైబడటం వల్లా మధుమేహం, కీళ్లనొప్పులు వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు కమ్ముకొని పీడిస్తాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే శారీరక, మానసిక దృఢత్వం అవసరం. వృద్ధాప్యం వచ్చాక కాక ముందునుంచీ ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరి.

మహిళల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే దశ (మెనోపాజ్) ఎప్పటినుంచి మొదలవుతుందో ముందుగానే పసిగట్టవచ్చునని అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. మెనోపాజ్ దశను ముందుగా గుర్తించే ఓ వినూత్న పరీక్షా విధానాన్ని వీరు కనుగొన్నారు.

మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ పరిశోధన గురించి వివరాలందించారు. ఈ పరిశోధన ప్రకారం... రక్తంలోని హార్మోన్ల స్థాయిని బట్టి, ప్రత్యుత్పత్తి దశ ఇంకెంత కాలం ఉంటుందో అంచనా వేయవచ్చు. మెనోపాజ్ దశ వచ్చేందుకు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలుసుకోవడం వల్ల గర్భం పొందే ఆలోచన ఉన్న నడివయసు మహిళలు ముందుగా, సంసిద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

పై పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరీ ఫ్రాన్ సోవర్స్ "డైలీ మెయిల్" పత్రికకు అందించిన వివరాల ప్రకారం... తమ పరిశోధనలకుగానూ సుదీర్ఘ కాలం పాటు 600 మంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను అధ్యయనం చేసినట్లు తెలిపారు.

యాంటీ మల్లెరియన్ హార్మోన్, ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ లాంటి హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పులను పసిగట్టడం వల్ల మెనోపాజ్‌ను ముందుగానే గుర్తించవచ్చని సోవర్స్ వెల్లడించారు. ఈ రకంగా మెనోపాజ్‌ను దశను ముందుగానే గుర్తించటం, దానికి మహిళలు సంసిద్ధంగా ఉండటం వల్ల... వారు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వీలుంటుందని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెనోపాజ్‌ దశలో స్త్రీలు పడే ఇబ్బందులు , Sympotoms of Menopause :

అతి కోపం.. చిరాకు.. విపరీతమైన ఆందోళన..జ్ఞాపకశక్తి క్షీణించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే.. మెనోపాజ్‌ దశలో స్త్రీలు రకరకాల భావోద్వేగాలకు లోనవుతారనే భావన ఎప్పట్నుంచో ఉంది. అలాంటి పరిస్థితులకు దారితీసే అంశాలు, తద్వారా ఎదురయ్యే ఇతర సమస్యలపైన దృష్టి సారిద్దాం.

మలిదశలో స్త్రీలకు ఎదురయ్యే మానసిక సమస్యలకు ఎన్నో కారణాలున్నాముఖ్యమైనవి .... ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోవడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపడటం. వేడి, చెమటలతో నిద్ర పట్టకపోవడం. ఆ వయసులో తరచూ ఎదురయ్యే ఒత్తిళ్లు... ప్రధానమైనవి.

నిరాశ : పురుషులతో పోలిస్తే.. మహిళల్లో నిరాశ పాళ్లు ఎక్కువని ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. రుతుక్రమం మొదలైనప్పుడు, ఆగిపోయేప్పుడు.. నెలసరికి ముందు, కాన్పుల తరవాతా డిప్రెషన్‌ ఎక్కువగా ఉంటుందని తేల్చిచెప్పాయి. అయితే ఇది కచ్చితంగా మెనోపాజ్‌ వల్లే వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాల్లేవు. ఈ సమయంలో బాధించే డిప్రెషన్‌కు పరిష్కారంగా యాంటీ డిప్రెసెంట్‌ మందుల్నే మొదటి చికిత్సా విధానంగా పరిగణిస్తారు.

ఒత్తిడి : అకారణంగా ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, అర్థంలేని భయాలు దీని లక్షణాలు. ఇవి ఎక్కువైతే 'ప్యానిక్‌ ఎటాక్స్‌' కనిపిస్తాయి. కొందరు స్త్రీలలో మెనోపాజ్‌ దశలో హాట్‌ ఫ్లషెస్‌ వచ్చేముందు ఇవి కనిపించవచ్చు.

జ్ఞాపకశక్తి: ఏకాగ్రత లేదని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇది మెనోపాజ్‌ లేని స్త్రీలలోనూ కనిపిస్తుంది. దీనికి మెనోపాజ్‌ కారణాలకన్నా... వయసుతో పాటూ కలిగే ఒత్తిడి, డిప్రెషన్‌, పని భారం, ఆరోగ్యం క్షీణించడం వంటివి ప్రధానంగా దోహదం చేస్తాయి.

నిద్ర: వయసు మీరినకొద్దీ నిద్ర పట్టడంలేదని, చీమ చిటుక్కుమన్నా మెలకువ వస్తోందనీ వయసు మళ్లిన స్త్రీలు చెబుతుంటారు. శారీరక శ్రమ తగ్గడం, వయసు పెరగడంతోపాటు ఒత్తిడి, హార్మోన్లు తగ్గిపోవడం కూడా దీనికి కారణాలు కావచ్చు.

సాధారణంగా మెనోపాజ్‌ సమయంలో వేధించే హాట్‌ఫ్లషెస్‌, మానసిక సమస్యలతో పాటు శరీరంలోని ఇతర వ్యవస్థలలోనూ కొన్ని మార్పులుకనిపిస్తాయి. చర్మం, జుట్టు, కండరాలు... ఇలా శరీరంలో దాదాపుగా మార్పులుంటాయి. వీటిలో చాలావరకూ వయసుతో వచ్చే మార్పులయితే కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోవడం వల్ల చోటుచేసుకుంటాయి.

చర్మం: దీనిపై ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రభావం చాలానే ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ రిసెప్టార్స్‌తో కలిసి చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. మెనోపాజ్‌ తరవాత ఈస్ట్రోజెన్‌ లభించనప్పుడు చర్మం పొడిబారుతుంది. కొలాజిన్‌ తగ్గిపోవడం వల్ల ముడతలు కనిపిస్తాయి. చర్మం పల్చబడి నరాలు తేలి కనిపిస్తాయి. గోళ్లూ నిగారింపు కోల్పోయి పెళుసుగా మారి.. తరచూ విరిగిపోతూ ఉంటాయి.

అవాంఛిత రోమాలు: మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ తగ్గడంతో ఆండ్రోజెన్‌ లేక పురుష హార్మోను నిష్పత్తి ఎక్కువవుతుంది. దాంతో పురుషుల నుదురులా పెద్దదైపోవడం... పై పెదవి, చుబుకంపై అవాంఛిత రోమాలు పెరిగే ఆస్కారమూ ఉంటుంది.

కీళ్లూ, కండరాలు: నడివయసులో తరచూ ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు బాధిస్తున్నాయంటారు చాలామంది. వయసు కారణంగా కీళ్లు అరిగిపోవడం సహజమే. మెనోపాజ్‌తో ఎముకల్లోని కొలాజిన్‌ తగ్గిపోవడంతో ఆ ఇబ్బందులు మరింత వేధిస్తాయి. మెనోపాజ్‌ మొదటి అయిదేళ్లలోనే ముప్ఫై శాతం కొలాజిన్‌ తగ్గిపోతుందని అంచనా.

కళ్లు: ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కీ, కళ్లకీ దగ్గరి సంబంధం ఉంది. నెలసరి సమయంలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. అంతెందుకు శరీరంలో హార్మోన్లు మార్పు చెందినప్పుడల్లా కంటి తడిలో, చూపులోనూ మార్పులు వస్తాయనేది నిజం. తడి తగ్గిపోయి కళ్ల మంటలు, ఎర్రగా మారడం, నలుసులు.. వంటివి పొడిబారిన కళ్లకు లక్షణాలు. అలాగే ఈ దశలో చత్వారం రావడం కూడా సహజమే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ శుక్లాలు లేక క్యాటరాక్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్‌ తరవాత కాటరాక్ట్‌ పెరుగుదల ఎక్కువవుతుంది.

బరువు: రుతుక్రమం నెలనెలా అవుతుంటే బరువు పెరగమనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అందుకే మెనోపాజ్‌ రాగానే బరువు పెరిగాం అనుకుంటారు. సాధారణంగా ఈ వయసులో ఎక్కువ మంది రెండు నుంచి రెండున్నర కేజీల బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి ముఖ్యకారణం.. ఆహారపుటలవాట్లు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడమే.మెనోపాజ్‌తో కండరాల పరిమాణం, బలం తగ్గుతాయి. పెరిగే బరువులో అధికశాతం నడుము, పిరుదుల చుట్టూనే పెరుగుతుందనేది వాస్తవం. ఆహారం విషయంలో నియమాలు, తగిన వ్యాయామం చేస్తే... మునుపటిలా అందమైన ఆకృతి కొనసాగుతుంది.

  • ===================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 10, 2010

క్రీములతో జాగ్రత్త , Creams Usage and Precautions




చర్మాన్ని తెల్లబరిచే క్రీములు (స్కిన్‌ లైటెనింగ్‌) మితిమీరి వాడితే హైపర్‌టెన్షన్‌ను పెంచుతాయనీ కాలక్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయనీ డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. వైటెనింగ్‌ క్రీముల తయారీలో వాడే కొన్ని రకాల స్టీరాయిడ్‌లు, మెర్క్యురీ వంటివి కాలక్రమంలో నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. హైడ్రోక్వినైన్‌ వంటి రసాయనాలున్న క్రీములను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు వాడితే అనేక రకాల శాశ్వత దుష్ఫలితాలు కలుగుతాయంటున్నారు. శరీరఛాయ తక్కువగా ఉండటం తప్పేమీ కాదనీ మానసికంగా దృఢంగా ఉండి ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తే రంగును ఎవరూ పట్టించుకోరనీ వారు చెబుతున్నారు.
  • =====================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 3, 2010

తామర , Ringworm





తామర (Ringworm) అనేది ఒక శిలీంధ్ర సంబంధిత చర్మవ్యాధి. ఎరుపురంగు(Reddish) పొలుసులతో గుండ్రటి (Ring)మచ్చలు ఏర్పడతాయి. వీటికి దురద ఎక్కువగా ఉంటుంది. తామర అనేది దాదాపుగా శుభ్రతకు సంబంధించినది. ఒక చర్మ వ్యాధి. పరిశుభ్రత లేకపోతే ఈ వ్యాధి బారిన పడక తప్పదు.

ఈ తామర వ్యాధి మనుషుల లోను , కొన్ని జంతువులు ... కుక్కలు , పిల్లులు , గొర్రెలు , మేకలు , వంటి వాటికి కుడా అంటుకుంటుంది . ఫంగస్ లో చాలా రకాలు జాతుల వలన ఇది సంభవిస్తుంది . చర్మము లోని కేరాటిన్ పొరను తింటూ ఆ పోరాపైన , వెంట్రుకలు పైన బ్రతుకుతూ ఉంటుంది . ముఖ్యం గా తడిగా ఉన్నచర్మం ముడతలలోని ప్రదేశాలలో నివాసముంటుంది .
ఎన్నో రకాల బుజులు ఉన్నాప్పటికీ తామరను కలుగజేసే ఫంగస్ ను " దేర్మతోఫిట్స్ (Dermatofytes)" అంటారు అందులో ముక్యమైనవి .
Scientific names for the most common of the dermatophyte fungi include
Trichophyton rubrum,
Trichophyton tonsurans,
Trichophyton interdigitale,
Trichophyton mentagrophytes,
Microsporum canis,
Epidermophyton floccosum

రింగ్ వరం ముఖ్యం గా చర్మము , గోళ్ళు , వెంట్రుకలు కేరాటిన్ పొరపై తన ప్రతాపము చూపుతుంది .

రాకుండా జాగ్రత్తలు :
  • ఇతరుల వాడిన బట్టలు , తువ్వాళ్ళు , రుమాళ్ళు షేర్ చేసుకోకూడదు .
  • ఇన్ఫెక్షన్ అయినట్లు అనుమానము ఉంటే డెట్టాల్ , కిటోకేనజోల్ సబ్బు తో బాగా కడుగుకోవాలి .
  • చెప్పులు లేకుండా బేర్ -ఫుట్ గా నడవకూడదు .
  • బూజుపట్టిన వస్తువులను పట్టుకోకూడదు .
  • గజ్జి , తామర ఉన్న పెంపుడు జంతువుఅలను తాకరాదు .

ట్రీట్మెంట్ :
యాంటి ఫంగల్ మందులు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి చర్మమ పై రాయాలి . ఆయింట్మెంట్
  • Miconazole,
  • Terbinafine,
  • Clotrimazole,
  • Ketoconazole,
  • Tolnaftate

నోటిద్వారా ...
  • గ్రిసోఫుల్విన్ (Grisofulvin) రోజుకి 250 మీ.గ్రా. 4 సార్లు చొ. 5-7 రోజులు వాడాలి
  • ఫ్లుకనజోలె (Canex-150 mg) మీ.గ్రా. రోజు ఒకటి - 7 - 10 రోజులు వాడాలి ,
  • దురద తగ్గడానికి ... సిత్రజిన్ (Cet) ౧౦ మీ.గ్రా . రోజు ఒకటి వాడాలి
  • పెన్సిలిన్ మాత్రలు గాని , ఇంజెక్షన్ గాని 5- 6 రోజులు వాడాలి (penudureLA6WeeklyFor4Weeks )

  • ================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నోటి దుర్వాస , Bad Breath (Halitosis)









నలుగురిలోకి రావడం మాట అటుంచి నలుగురిలో నోరు విప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మనిషిని భయపెట్టే శక్తి ఒకే ఒక్క అంశానికి ఉంది ప్రపంచంలో. అదేంటో కాదు నోటి దుర్వాసనే... దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతగా అది మనిషిని వణికిస్తుంది. దీని దెబ్బతో నలుగురిలో సహజంగా ఉండలేరు. హాయిగా నోరువిప్పి నవ్వలేరు..

ఒకటి మాత్రం ఖాయం... ఇది వస్తే చాలు మనిషి జీవితమే మారిపోతుంది. నోరు విప్పలేని జీవితం. మనసారా నవ్వుకోలేని జీవితం. పగవాడికి కూడా రావద్దు బాబోయ్ అనిపించేంత ఫీలింగ్.. నోటి దుర్వాసనకే సాధ్యం.

మన నోరు మనకే కంపు వేసే పరిస్థితి వస్తే ఇతరులకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరి దీన్ని పోగొట్టుకోవడం ఎలా.. మనచేతిలోనే ఉంది పరిష్కారం. మన ఆహార అలవాట్లలో కాస్త మార్పులు చేసుకుంటే చాలు.. దుర్వాసన దెబ్బకు దిగి కిందికి వస్తుంది

మనం తినే పదార్ధాల వాసనల ప్రభావం మనం విడిచే గాలి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన పదార్ధాల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత రక్తప్రసరణ వ్యవస్థలో కలిసిపోతాయి. అయినా ఆయా పదార్ధాల తాలూకూ వాసనలు పూర్తిగా పోవు. అక్కడి నుంచి ఆ రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్తుంది. అందుకే మనం శ్వాస విడిచిపెట్టినప్పుడు.. మనం ఎప్పుడో తిన్న పదార్ధాల వాసన బయటకు వస్తుంటుంది. మన శరీరం ఆ ఆహారాన్ని పూర్తిగా బయటకు విసర్జించేంత వరకూ కూడా ఏదో రూపంలో ఆ వాసన వెలువడుతూనే ఉంటుంది.

నోటి దుర్వాసనకారణాలు

అన్నాశయం లోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన కల వాయువులను ఏర్పరుస్తుంది. ఇవి నోటినుండి బయటకు వదలబడుతాయి.
గొంతు నందలి ఇన్ఫెక్షన్ మరియు పళ్ళ యందలి వాపు కారణంగా ఎర్పడిన చీము మరియు రక్తము అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగించును.
చిగుళ్ల వ్యాధులు, దంతాల మధ్య పాచిపేరుకోవటం వంటివి కూడా ముఖ్యకారణాలే.
మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళలో ఇది సాధారణం గా ఉంటుంది .
సాధారణంగా పళ్ళు, నోరు అపరిశుభ్రంగా వున్నందున నోటి దుర్వాసన వస్తుంది.
నోటిలోని చిగుళ్ళు ఇన్ ఫెక్షను వల్ల కూడ రావచ్చును.
మసాల పదార్ధములతో తయారు చేసిన ఆహార పదార్ధములు తీసుకొన్నపుడు దుర్వాసన వచ్చే అవకాశం వుంది.
సాధారణంగా నోరు తడిలేని వారికి రావచ్చును.
దీర్ఘకాలక, శ్వాసకోశవ్యాదులు, ముక్కుకు సంబంధించిన వ్యాదులు కూడ కారణం కావచ్చును.
పొగాకు నమలడం, బీడీ, సిగరెట్ మొ||నవి వాడడం కారణంకావచ్చును.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-
దీనికి ఇది కేవలం బ్రష్‌ చేసుకోవటం, మౌత్‌వాష్‌ల వంటివి వాడటంతో తగ్గిపోయే సమస్య కాదు.
ఇలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే దంతవైద్యులను సంప్రదిస్తే తగిన కారణాలను అన్వేషిస్తారు.
నోటిని శుభ్రంగావుంచాలి.
రోజుకు రెండు సార్లు పళ్ళను శుభ్రము చేయాలి.
ఆహారం తీసుకొన్నతరువాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
మెత్తని ప్లాస్టిక్ నాలుక పుల్లతో నాలుకను శుభ్రపరచాలి.
కట్టుడు పళ్ళువున్న క్రమము తప్పక శుభ్రము చేసుకోవాలి.
వీలైనంత ఎక్కువగా నీరు తీసుకొవాలి.
అన్నివేలల నాలుకను తడిగా వుండే విధంగా చూసుకోవాలి.
నోటిని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే దీనర్థం మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలనే.. మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే షుగర్ ఫ్రీ గమ్ నమలడం. దీనిని నమిలితే నోటిలో లాలాజలం ఊరుతుంటుంది.
చిగుళ్ల సమస్యల్ని తగ్గించుకోవటం,
అవసరమైతే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవటం వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన

aayurvaedik chitkaalu :

ప్రతి రోజూ లవంగం నోట్లో వేసుకుని చప్పరించండి. దీంతో దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది.

** ప్రతి రోజూ గురివింద వేరును తింటేకూడా నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుందని kontamandi వైద్యులు చెబుతున్నారు.

** నిత్యం ఒక గ్లాసు నీటిలో తాజా నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే నోటి దుర్వాసన తొలగిపోతుంది.

** నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతి రోజూ తులసి ఆకులు నమిలి తింటే నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుంది.

** రాత్రిపూట పడుకునే ముందు బ్రష్ చేస్తారు కదా. దానికి ముందుగా రెండు మిరియాల గింజలను నోట్లో వేసుకుని నమలండి. ఆ తర్వాత బ్రష్ చేయండి. దీంతో నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుంద.

** వేంచిన జిలకర నమిలితేకూడా ఉపశమనం కలుగుతుంది.

పుదీనా ఆకులు నమిలి తినాలి. పుదీనా రసం నీటిలో కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకులు పొడుముతో దంతధావన చేయాలి. దంతవ్యాధులకు పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ ఆకులు బాగా, ఎక్కువసేపు నమిలి తింటుంటే దంత సంబంధిత సమస్యలు తలెత్తవు.

ఒక కప్పు రోజ్ వాటర్‌లో అర చెక్క నిమ్మకాయ రసాన్ని అందులో కలపండి. దీనిని ఉదయం-సాయంత్రం రెండుపూటలా పుక్కలించండి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది. దంతాలుకూడా గట్టిపడుతాయ.

నిప్పుమీద కాల్చిన మొక్కజొన్నను తింటే దంతాలు దృఢంగా తయారవుతాయి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది


  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, March 2, 2010

సైనసైటిస్ ,Sinusitis




కొంచం దూరం నడిస్తే ఆయాసం రావడం , ముక్కు పట్టేయడం , తరచూ జలుబు , నిద్ర పట్టకపోవడం , తలనొప్పి వంటి లక్షణాలు తో భాదపడుతుంటే అది సైనసైటిస్ కావచ్చును .

కపాలంలో గాలితో నిండిన కేవటీలను సైనస్ అంటారు . సైనస్ మ్యూకస్ మెంబ్రేన్ అనబడే మెత్తటి పొరతో కప్పబడి ఉంటాయి. ఈ మ్యూకస్ మెంబ్ర్రేన్ అనే పలుచటి ద్రవపదార్ధాన్ని తయరుచేస్తుంది .ఇవి ముఖ్యంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్టోగ్రత మరియు తేమ కల్పించడానికి తయారు చేయబడ్డాయి. అందువల్ల ఆర్బిట్ మరియు క్రేనియంలోని వివిధ భాగాలు ఉష్టోగ్రతలోని తేడాల వల్ల దెబ్బతినకుండా వాటికి తగిన ఉష్టోగ్రత కల్పించడానికి తోడ్పడతాయి. సైనస్ లు కపాలంలో ఎముకలలో గాలిని ఉంచడంవల్ల వాటి బరువును తగ్గిస్తాయి .ఇవి మాట్లాడేప్పుడు తగిన శబ్ధం రావడానికి కూడా తోడ్పడతాయి .అన్ని రకాల శ్వాసకోశ అంటువ్యాధులు సైనస్ ల పైన ప్రభావం చూపుతాయి. ఒక వేళ సైనస్ లు ఎటువంటి అడ్డులేకుండా ముక్కు రంధ్రాలలోనికి తెరుచుకున్నట్లైతే అంటు త్వరగా తగ్గిపొతుంది. కాని సైనస్ ల నుండి స్రవించు స్రావాలు వాటి మార్గంలో అడ్దువల్ల అంటు (infection) వ్యాప్తి చెందవచ్చు .దీనినే సైనసైటిస్ అంటారు. కొన్ని సార్లు ఈ అంటు చాలా ప్రమాదకరంగా కూడా మారవచ్చు

అక్యూట్ సైనసైటిస్ లక్షణాలు:

    -    సైనస్ లు ఉన్న భాగాల్లో నొప్పి మరియు ఒత్తిడి.
    -    చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు వచ్చుట.
    -    ముక్కు దిబ్బడ.


కారణములు

    ముక్కులో వచ్చే ఇన్ ఫెక్షన్స్ : సైనస్ ను కప్పబడిన మ్యూకస్ మెంబ్రేన్ ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన ఎటువంటి అంటు అయినా ముక్కు నుండి చాల సులభంగా సైనస్లకు చేరుతుంది. ఈ సైనస్లు ముక్కు రంధ్రాల లోకి తెరుచుకొని ఉంటే అంటు త్వరగా తగ్గిపోతుంది . ఒక వేళ వాటిలో ఏదైనా అడ్డు ఉంటే అంటు త్వరగా తగ్గిపోదు. ఇది ముఖ్యంగా వైరస్ వల్ల వస్తుంది.

    ఈతకొట్టడం: ఒక్కొక్క సారి సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్న నీళ్ళలో ఈత కొట్టడం వల్ల ఆ నీళ్ళు సైనస్ లలోకి ప్రవేశించి వ్యాధిని కలుగ చేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ  గ్యాస్ ముక్కు రంధ్రాల ద్వారా సైనస్ లలోని చేరి సైనస్ల లోకి మ్యూకస్ మెంబ్రేన్ వాచేటట్లు చేస్తుంది.అది క్రమంగా సైనసైటిస్ ను కలుగచేస్తుంది.

    ట్రోమా:ఒక్కొక్కసారి సైనస్ లను తయారు చేసిన ఎముకలు విరగడం వల్ల వాటికి అంటు చేరి సైనస్ మ్యూకోసాకు అంటును కలుగచేస్తుంది.
    దంతాలలో వచ్చే ఇన్ ఫెక్షన్:మోలార్ మరియు ప్రీ మోలార్ దంతాలలో ఇన్ ఫెక్షన్ కలుగచేయవచ్చు.
    ఇతర కారణాలు:
    1. సైనస్ లో సరైన వెంటిలేషను లేకపోవడం మరియు సైనస్ లలో అడ్డు: సాధారణంగా సైనస్ లలో బాగా వెంటిలేట్ అయి ఉంటాయి సైనస్ ను కప్పి ఉంచిన మ్యూకోసా మ్యూకస్ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ ద్రవాలు సీలియరీ మూమెంట్ వల్ల సైనస్ ఆస్టియాను చేరి అక్కడ నుండి ముక్కురంద్రాలలోకి చేరుతాయి. ఒక వేళ ఇలా జరగడానికి సైనస్లలో ఏదైన అడ్డుకుంటే సైనస్ లో తయారయ్యే పదార్ధాలు అక్కడే నిలవ ఉండి సైనస్లో విధులకు ఆటంకం కలిగిస్తాయి.ముఖ్యంగా సైనస్ లో నాసల్ పేకింగ్, స్ఫుటం యొక్క నిర్మాణంలో తేడా రావడం, మేలిగ్నెంట్/నియొప్లాసం వల్ల అడ్డు ఏర్పడుతుంది.

    2. నాసల్ కేవిటిలో ద్రవాలు నిలువ ఉండటం: ఒక్కొక్క సారి ముక్కులోని ద్రవాల చిక్కదనం వల్ల లేదా ఏదైనా అడ్డు ఉండటం వల్ల  నాసోఫారింగ్స్ లోకి వెళ్ళకుండా ఉండి అవి అంటు కలగజేస్తాయి.
    3. పూర్వం వచ్చిన సైనసైటిస్ అటాక్స్:ఎక్కువసార్లు సైనసైటిస్ రావటం వల్ల సైనస్ మ్యూకోసా దెబ్బతిని ఉండటం వల్ల మళ్ళీ సైనసైటిస్ వచ్చేటట్లు చేస్తుంది.
    4. వాతావరణం: వాతావరణం తేమగా మరియు చల్లగా ఉన్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
    5. ఇతర అంటువ్యాధులు: పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, మీసిల్స్, చికెన్ పాక్స్, కోరింత దగ్గు వంటి అంటువ్యాధులతో బాధపడటం మరియు డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
    6. సూక్ష్మజీవులు: చాలా కేసుల్లో సైనసైటిస్ వైరల్ ఇన్ ఫెక్షన్   లా ప్రారంభమవుతుంది.తరువాత నెమ్మదిగా బాక్టీరియా చేరి సైనసైటిస్ వస్తుంది.ఈ హానికర సూక్ష్మజీవులలో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియ,హీమోఫిలస్ ఇంప్లూయంజా,స్టెఫైలోకోకస్ ఆర్.ఇ.యస్ .ముఖ్యమైనవి.
     సైనసైటిస్ వలన సైనస్ లను కప్పి ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ ఫ్ల మేషన్ కు గురవుతుంది.దాని వల్ల అవి ఎక్కువగా ద్రవాలను ఉత్పత్తి చేయడమే కాకుండా పాలీమార్పో న్యూక్లియర్ కణాలను కూడా తయారుచేస్తాయి.సైనస్ ఆస్టియమ్ ఈ విధంగా తయారైన ద్రవాలను బయటకు పంపించగలిగి,శరీరానికి తగిన వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.అలాకానప్పుడు అంటు అధికమై మ్యూకోసల్ మెంబ్రేన్ మరియు సైనస్ ఎముకల మీద కూడా ప్రభావం కనబడుతుంది.దంతాలకు అంటు ఉన్నట్లయితే అది చాలా సులభంగా సైనస్లకు వ్యాపించి సైనసైటిస్ లను కల్పించవచ్చు.అందువల్ల దంతాలలోకి అంటును ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి.

వ్యాధి నిర్ధారణ

    వ్యాధి లక్షణాలను పూర్తిగా తెలుసుకొనుట వలన మరియు సైనస్ ఎక్స్-రే ద్వార ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స

        వైద్యుని సహకారంతో అమాక్సిసిల్లిన్ లేదా ఆంపిసిల్లీన్ మందులు యివ్వవచ్చు.
        పెన్సిలిన్ మందులకు రోగి అలర్జీ కలిగి ఉన్నట్లైతే ట్రైమితోప్రిం లేదా సల్ఫోమితాక్సజోల్  మందులు యివ్వచ్చు.
        ఓరల్ డ్రిక్సోరాల్ మరియు డిమెటాప్ యివ్వవచ్చ.
        సెలైన్ యిరిగేషన్ వలన గట్టిగా ఉన్న స్రావాలు మెత్తబడి  బయటకు స్రవించే అవకాశం ఉంది.
        స్టీమ్ పీల్చుకొనుట ద్వారా మరియు ఎక్కువ ద్రవాలను లేదా పానీయాలను సేవించుట  ద్వారా మరియు లోకల్ హీట్ (వేడి తడి బట్టలను సైనస్ల మీద ఉంచటం)ను కలిగించుట ద్వారా ముక్కు నుండి స్రావాలు బయటకు వచ్చి రోగికి ఉపశమాన్ని కలిగిస్తుంది.
        నేసల్ స్ప్రేలు రోగికి కోంత ఉపశమనాన్ని కలిగిస్తాయి.కాని నేసల్ స్ప్రేలు అవసరం కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ముక్కు దిబ్బడ కలిగే ప్రమాదమున్నది కాబట్టి రోగి జాగ్రత్తగా ఉపయోగించవలెను.
        సాధారణంగా సైనసైటిస్ మందుల ద్వారా తగ్గుతుంది. కాని కొన్నిసార్లు మందులకు తగ్గనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు.

నివారణ

    (ఎ)ఎలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉంచాలి.

    (బి) తగిన పోషకాహారం తీసుకోవడం,వ్యాయామం చేయటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలి.

    (సి) శ్వాసకోశ అంటువ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.

    (డి) శ్వాసకోశ వెలుపలి భాగాల్లో అంటు 7 - 10 రోజుల కంటే ఎక్కువ కాలము ఉన్నట్లయితే వైద్యుని సలహా పాటించవలెను.

    (ఇ) సైనస్ లలో నొప్పి ఉన్న, ముక్కు నుండి వచ్చు స్రవాల రంగు మారిన లేదా చెడువాసన వస్తున్నా, వెంటనే వైద్యుని సంప్రదించాలి.

    సైనస్ వ్యాధి మరియు టాన్సిలైటిస్ తో బాదపడుతున్నవారికి ఇ.ఎన్.టి (చెవి, ముక్కు,గొంతు) నిపుణుల ఆసుపత్రి హైదరాబాదులో ఉంది.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 1, 2010

సర్వైకల్‌ క్యాన్సర్‌ , Cervical Cancer






ప్రతి ఏడు నిమిషాలకు ఒకరు... ఏటా డెబ్భై ఐదు వేల మంది మహిళలు... మనదేశంలో సర్వైకల్‌ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోలిస్తే..దీని బారిన పడుతున్న వారిలో భారతీయులే అత్యధికం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్త్రీలను ఇంతలా మరణానికి చేరువ చేసే ఈ క్యాన్సర్‌ కబళించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • ఎందుకువస్తుంది..
ఒక్కమాటలో చెప్పాలంటే.. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్‌ ఈ వ్యాధికి అసలు కారణం. ఈ వైరస్‌ దాదాపు వందరకాలున్నా 15-20 రకాలు మాత్రమే క్యాన్సర్‌కు దారితీస్తాయి. వీటిలో ఎక్కువగా 16, 18 రకాల వల్ల 70 శాతం క్యాన్సర్లు, 45, 31, 33, 52, 58, 35, రకాల కారణంగా మిగిలిన 30 శాతం క్యాన్సర్లు వస్తాయి. ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఒకరి నుంచి మరొకరికి నేరుగా.. చర్మం ద్వారా గానీ మ్యూకస్‌ పొరల వల్ల గానీ వ్యాపిస్తుంది.

ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ లైంగిక సంపర్కంతో వస్తుంది. చాలా అరుదుగా మాత్రమే ఇతరత్రా కారణాల వల్ల వ్యాపించవచ్చు. అయితే 90 శాతం మందికి మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు. వారిలోని వ్యాధినిరోధక శక్తి సమర్థంగా పనిచేసి ఈ వైరస్‌ను నిర్మూలిస్తుంది. అదీ ఏడాది లోపలే. 5-10 శాతం స్త్రీలల్లో మాత్రం ఈ వైరస్‌ సర్విక్స్‌లోని కణజాలంలో చొచ్చుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తుంది. అదీ మూడేళ్ల వ్యవధిలో. ఈ ఇన్‌ఫెక్షన్‌ 25 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 630 మిలియన్ల మంది హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ కలిగి ఉన్నారు. అదీ లైంగిక సంపర్కంలో పాల్గొనడం మొదలుపెట్టాక నాలుగింట మూడొంతుల మంది స్త్రీ పురుషులకు కనీసం ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది.

హెచ్‌పీవీ కారణంగా క్యాన్సర్‌తోపాటు వచ్చే ఇతర వ్యాధులు
* జననేంద్రియాలపై పులిపిరులు (వార్ట్స్‌), పాపిలోమాలు
* ఇతర క్యాన్సర్లు.. అంటే.. టాన్సిల్స్‌, లారింక్స్‌, మూత్రనాళాల క్యాన్సర్లు..
* అరుదుగా వచ్చే చర్మం, కంటి క్యాన్సర్లు.. ఎక్కువమందితో విశృంఖలమైన లైంగిక సంబంధాలు (హైరిస్క్‌ సెక్సువల్‌ బిహేవియర్‌) కలిగినవారిలో ఇవి రావచ్చు.
* లైంగికంగా సంక్రమించే ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, పొగతాగేవారికి హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ఆస్కారమెక్కువ.
* చిత్రమేంటంటే, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా నిరోధించే కండోమ్‌ ఈ హెచ్‌పీవీని మాత్రం ఆపలేదు.

  • హెచ్పీవీ వ్యాక్సిన్లు
‌గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మూడు విడతలుగా ఇవ్వాలి.

12-16 ఏళ్లలోపు అమ్మాయిలకు (సెక్సులో పాల్గొనడం మొదలుపెట్టని) ఇవ్వడం మంచిది. ఈ వ్యాక్సిన్లలో ఒకటి (బైవాలెండ్‌) 10-45 ఏళ్లలోపువారికి, రెండోది (క్వాడ్రివాలెండ్‌) 9-26 సంవత్సరాలలోపు యువతలకూ ఇవ్వొచ్చు. వ్యాక్సిన్‌ తీసుకునేముందు హెచ్‌పీవీ పరీక్ష అవసరంలేదు. లైంగిక జీవితం ఆరంభించిన స్త్రీలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తే ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఇప్పటికే ఉన్నా మిగిలినవి రాకుండా చూడవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడేందుకు ఇచ్చేవి మాత్రమే. అప్పటికే ఉన్న వాటిని నయం చేయడానికి పనికి రావు. వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదాని.. పాప్‌ స్మియర్‌ పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే ఉండాలి.

  • Image courtesy with Vaartha newspaper.

  • మరిన్ని జాగ్రత్తలు...
* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నెలసరి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
* శరీరంలో ఏ చిన్న ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా.. తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ముప్ఫై ఏళ్లు దాటినప్పటి నుంచీ.. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
* వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో సందేహాలుంటే.. నిరభ్యంతరంగా వెల్లడించాలి.

మరికొంత సమాచారము :
సెర్విక్స్‌కి వచ్చే క్యాన్సర్‌నే గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్‌ అంటారు. మహిళ ల్లో ప్రధానంగా వచ్చే క్యాన్సర్‌లలో ఇది ఒకటి. 25 నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఎప్పుడైనా రావచ్చు. భారత్‌లో 1లక్ష 35 వేల మంది ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతి సం వత్సరం 74 వేల మంది చనిపోతున్నారని వైద్యరీత్యా నిర్ధారణ అయింది. సెరె్వైకల్‌ క్యాన్సర్‌ బాగా ముదిరిపోయేంతవరకు ఎలాం టి లక్షణాలు కనబడదు. దీంతో ఎక్కువ మంది ఈ క్యాన్సర్‌ బారి న పడుతున్నారు. ఈ క్యాన్సర్‌ వంశపారంపర్యంగా రాదు. పట్ట ణాల్లోని వారికంటే, గ్రామీణ ప్రాంతంలోని వారికి ఎక్కువగా వస్తుంది. దేశం మొత్తం మీద 2-3 శాతం మందికి సరె్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

కారణాలు: ఈ క్యాన్సర్‌ రావడానికి ప్రత్యేకమైన కారణాలు తెలియవు. కొంతమంది పేద మహిళల్లో శరీరం పట్ల శుభ్రత తక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో ఈ క్యాన్సర్‌ రావడా నికి అవకాశాలు ఎక్కువ. ఇంకా... చిన్న మయసులోనే రసజ్వల కావడం, 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులో పెళ్లి చేయ డం, లేత వయసులోనే పిల్లలు పుట్టడం.

ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, ఎక్కువమందితో సెక్స్‌లో పాల్గొనడం వంటి వాటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సుఖవ్యాధులు ఉన్నవారిలో అధికంగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌వీపీ)ద్వారా ఎక్కువమందిలో ఈ క్యాన్సర్‌ వస్తుంది. ఈ వైరస్‌లో ముఖ్యంగా 16,18, 31, 35 రకాలలో ఇది వస్తుం ది. హెర్పిస్‌ టైప్‌ వైరస్‌ వల్ల వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. డీబీస్‌ వంటి కొన్ని ఔషధాలను గర్భం దాల్చినప్పుడు స్ర్తీలు తీసు కుంటే, వారికి పుట్టబోయే అమ్మాయిలకు ఈ క్యాన్సర్‌ రావచ్చు. పొగతాగే వారిలో వచ్చే అవకాశం ఉంది.

హెచ్‌పీవీ లాంటి వైరస్‌ వల్ల సెర్విక్స్‌లో దీర్ఘకాలంలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీస్తాయన్న విషయం ఆందోళన కలిగిం చవచ్చు. అయితే సెర్విక్స్‌ క్యాన్సర్‌ ముందుగా వచ్చే ప్రీ- క్యాన్సర్‌ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగు తుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముం దస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్‌ కాకముందే లేజర్‌, ఎల్‌.ఎల్‌.ఈ.టీ.జడ్‌ వంటి విధానాలతో చికిత్స చేయడం సాధ్యపడుతుంది. తొందరగా తెలుసుకుంటే చికిత్స సులభంగా ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలి?
గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రధానంగా మూడు పరీక్షలున్నాయి.
  • 1. పాప్‌ స్మియర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ : ఎంతో సులువుగా, తక్కువ ఖర్చుతో చేయగల పరీక్ష ఇది. దీంతో సెర్వి క్స్‌ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్‌ దశలోనే గమనించి సమ ర్థంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. ఇందులో గర్భాశయ ముఖద్వారం వద్ద వైట్‌ డిశ్చార్జ్‌ కణాలను స్లైడ్‌ మీద వేసి హిస్టో పెథాలజీకి పంపిస్తారు. ఈ పరీక్ష చేయించుకున్న వెంటనే ఇంటికి వెళ్లవచ్చు. 20 సంవత్సరాలకు పైబడిన వారు రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. కనీసం ఐదు సంవత్సరాలకు చేయించుకోవడం అవసరం.

ఇంట్లోనే హెచ్‌పీవీ పరీక్ష!
  • గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ను పాప్‌స్మియర్‌ పరీక్ష ద్వారా గుర్తిస్తుండటం తెలిసిందే. అయితే ఈ పరీక్షను ల్యాబ్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎంతోమంది.. ముఖ్యంగా పేద దేశాల మహళలు ఈ పరీక్షను చేయించుకోవటంపై అంతగా ఆసక్తి చూపటం లేదు. దీంతో చాలామందిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ ముదిరిన తర్వాతే బయటపడుతోంది. ఇలాంటి బెడద నుంచి తప్పించుకోవటానికి ఇంట్లోనే ఎవరికివారు యోని స్రావాలను తీసి పరీక్షించుకునే విధానం (వజైనల్‌ హెచ్‌పీవీ టెస్ట్‌).. పాప్‌స్మియర్‌కు ప్రత్యామ్నాయం చూపగలదని పరిశోధకులు భావిస్తున్నారు. హెచ్‌పీవీ పరీక్ష ఫలితాలపై అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో 20 వేల మంది పేద మహిళలు పాల్గొన్నారు. వీరికి పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవటం గానీ వజైనల్‌ హెచ్‌పీవీ పరీక్ష గానీ చేసుకోవాలని సూచించారు. పాప్‌స్మియర్‌ కన్నా హెచ్‌పీవీ పరీక్ష నాలుగు రెట్లు ఎక్కువగా క్యాన్సర్‌ కేసులను గుర్తించింది. అంటే ప్రతి 10వేల మందిలో ఏడుగురికి వ్యాధి ఉన్నట్టు పాప్‌స్మియర్‌ తేల్చగా.. హెచ్‌పీవీ పరీక్ష 30 మందిని గుర్తించింది. ఈ పరీక్షలో ఫాల్స్‌ పాజిటివ్‌ రేటు (వ్యాధి లేకపోయినా ఉన్నట్టు గుర్తించటం) ఎక్కువగా ఉంటోందని ప్రయోగశాలల నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. పేద దేశాల్లో ఇదెంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తప్పుగా వచ్చిన ఫలితాలు కూడా క్యాన్సర్‌ లక్షణాలకు దగ్గరగానే ఉంటున్నాయని వివరిస్తున్నారు. పాప్‌స్మియర్‌ చేయించుకోవటానికి వెనకాడే ప్రాంతాల్లో ఇంట్లో చేసుకునే హెచ్‌పీవీ పరీక్షతో మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.

2. కాల్పోస్కోపీ : ప్రత్యేక పరికరం ద్వారా సెర్వెక్‌ ప్రాం తాన్ని పరీక్షిస్తారు.వాపు, పుండు, ఒరుపు వంటి వాటిని గమనిస్తారు. అసాధారణంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలి స్తారు. అవసరమైతే ముఖ పరీక్ష చేస్తారు.

3. సెర్వికల్‌ బయాప్సీ : క్యాన్సర్‌ అని అనుమానం వచ్చినప్పుడు సర్విక్స్‌లోని కొంత భాగాన్ని తీసి పరీక్షిస్తా రు. ఈ పరీక్షల ద్వారా ఏ రకం క్యాన్సరో, ఏ దశలో ఉందో గుర్తించవచ్చు.ఈ క్యాన్సర్‌ ముదిరిపోతే రక్తపరీక్ష, హిమోగ్లోబిన్‌ టోటల్‌ కౌంట్‌, బ్లడ్‌ సుగర్‌, బ్లడ్‌ గ్రూప్‌, బ్లడ్‌ యూరి యా, యూరిన్‌ ఎగ్జామినేషన్‌లు చేయించాలి. కొంత మందిలో అవసరమైతే సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి వ్యాధి తీవ్రతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

లక్షణాలు: ప్రారంభ దశలో ఏ లక్షణాలు ఉండవు. పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు.
తొలి దశ క్యాన్సర్‌ : ఈ సమయంలో పాప్‌ స్పియర్‌, కాల్పోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు. ఇందులో మెల్ట్‌, మోడరేట్‌, సివియర్‌ అని మూడు రకాలుంటాయి. ఈ దశలో చిన్న పద్ధతుల్లో ఈ వ్యాధిని నయం చేయవచ్చు. క్రయో, లేజర్‌, లూప్‌ ఎక్సేషన్‌, కొనైజేషన్‌ ద్వారా నయం చేయవచ్చు. భవిష్యత్తులో పాప్‌ స్మియర్‌ ద్వారా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

లక్షణాలు: క్యాన్సర్‌గా మారిన తర్వాత ఈ కింది లక్షణాలుంటాయి.అధిక రక్తస్రావం, నెల మధ్యలో రక్తస్రావం కాకుండా లేదా అప్పుడప్పుడు రక్తస్రావం అవుతుంది. దంపతుల కలయిక తరువాత రక్తస్రావం జరుగుతుంది. నెలలు ఆగిన తరువాత (మెనోపాజ్‌) రక్తస్రావం రావడం. వైట్‌ డిశ్చార్జ్‌ కావడం. రక్తంతో కలిసి వైట్‌ డిశ్చార్జ్‌, వాసనతో కూడిని వైట్‌ డిశ్చార్జి కావచ్చు.

ముదిరిన తరువాత : బరువు తగ్గిపోవడం, ఆకలి మంద గించడం, రక్తహీనత, బలహీనత, తలనొప్పి. కడుపునొప్పి. యూరిన్‌ పోసేటప్పుడు నొప్పి, మోషన్‌కు వెళ్లినప్పుడు నొప్పి వంటి సమస్యలుంటాయి. కొందరిలో కిడ్నీ సమస్యలు రావచ్చు. దీంతో కిడ్నీ పూర్తిగా దెబ్బతిని చనిపోయేందుకు ఆస్కారం ఉంది.

రెండు రకాలుగా: క్యాన్సర్‌లో గ్రోత్‌, అల్సర్‌గా రెండు రకా లుంటాయి. ఇది వైద్యుల పరీక్షలో తెలుస్తుంది.

గ్రోత్‌ : ఈ రకమైన క్యాన్సర్‌లో బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ముక్కలు, ముక్కలుగా వస్తుంటుంది. గర్భాశయం చుట్టు ప్రదేశాల్లోని అవయవాలు, కండరాల కదలిక తగ్గిపోతుం టుంది. అల్సర్‌ రకంగా పుండు మాదిరిగా ఉంటుంది.

నాలుగు దశల్లో ఉంటుంది : మొదటి దశలో క్యాన్సర్‌ గర్భాశయ ముఖద్వారం వద్దే ఉంటుంది. రెండవ దశలో గర్భాశయానికి పాకుతుంది. మూడో దశ గర్భాశయం చుట్టు పక్కల ప్రాం తాలకు చేరుతుంది.

నాల్గో దశలో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

చికిత్స మూడు రకాలు : 1. ఆపరేషన్‌, 2. రేడియో థెరఫీ 3. కీమోథెరపీ 4. కంబైడ్‌గా చేస్తారు.ఈ క్యాన్సర్‌ను మొగ్గ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు.

వ్యాక్సిన్‌: వ్యాక్సిన్‌ ద్వారా ముందుగానే హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ వల్ల వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. పది సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దీనిని మూడు డోస్‌లలో ఇస్తారు. ఒకటో నెల, తరువాత రెండవ నెల, ఆ తరువాత ఆరవ మాసంలో టీకాలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు అయితే పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయకుండా వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. పెద్దవారైతే పాప్‌ స్మియర్‌ పరీక్ష చేసుకుని టీకాలు తీసుకోవడం మంచిది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం చాలా సులభం. కనుక పరీక్షలు చేయించు కుంటూ ఉండాలి. తొలి దశలో గుర్తిస్తే వెంటనే చికిత్స తీసు కుని అందరిలా జీవితాన్ని కొనసాగించవచ్చు.

జాగ్రత్తలు

* పాప్‌ ిస్మియర్‌ పరీక్షలు 2,3 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
* 20 సంవత్సరాలు నిండిన తరువాత పెళ్లి చేసుకోవాలి. ముందుగా పెళ్లి చేసుకున్నా 20 ఏళ్ల వయసు వచ్చిన తరువాతనే పిల్లల్ని కనాలి.
* శరీర పరిశుభ్రతపై దృష్టి సారించాలి
* సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి.
* నెలసరి ఆగిన వారిలో బ్లీడింగ్‌ అయితే వెంటనే చెకప్‌ చేసుకోవాలి.
* గర్భ సంచి తొలిగించినప్పుడు ఆ సమ యంలో కొన్ని కారణాల వల్ల ముఖద్వారాన్ని తీయలేక పోవచ్చు. వారిలో కూడా క్యాన్సర్‌ రావచ్చు. అశ్రద్ధ చేయకుండా చెకప్‌ చేయించు కోవాలి.



  • =================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

చెవిలో చీము , Ear Pus discharge(Otitis Media)




చిన్న పిల్లలలో చెవిలోంచి చీము కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలో చీమేగా...! చిన్నపిల్లల్లో ఇవన్నీ మామూలే అనుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి.

పిల్లలకు ఏం పనులు చేయాలో, ఏం పనులు చేయకూడదో తెలియదు. ముఖ్యంగా స్నానం చేసినపుడు చెవిలో నీరు పోయినా, లేదా చెవిలో ఏదైనా చీమో, దోమో దూరినా వారికి తెలియదు కాబట్టి చెవిలో నొప్పి అని ఏడుస్తారు తప్పితే కారణాన్ని చెప్పలేరు.

చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధానంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా వస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్లు జలుబు చేయడం వలన, మధ్య చెవిలో నీరు ఉండిపోవడం వల్ల (సరిగ్గా స్నానం చేయన ప్పుడు), చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకో బెట్టడం వల్ల వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, పంటి నొప్పి వలన కూడా చెవిపోటు రావచ్చు.
లక్షణాలు
చెవి నొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పాలు తాగలేరు. ఏడుస్తారు. చెవిలోపల ఎర్ర బడి, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. చాలా సార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చును. మీజిల్స్‌, డిఫ్తీరియా వ్యాధులతో పాటు చెవి బాధలు రావచ్చును. మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. తలనొప్పి, గొంతు నొప్పి ఉండవచ్చును. అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవినుండి చీము కారవచ్చును. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చును. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. నొప్పి ఉండదు. చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి.
గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవిలోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయినట్లు ఉంటుంది. ఇటువంటి కేసులు చికిత్సకు తొందరగా స్పందించవు. కుటుంబంలో పెద్దవారికి ఇటువంటి సమస్య ఉంటే, వారికి కూడా కొంతకాలం తరువాత పూర్తిగా చెవుడు వస్తుంది. ఈ రోగుల చెవులను ద్రవరూపంలోని మందులతో శుభ్రం చేయకూడదు. కొన్నిసార్లు అది ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది.


టాన్సిల్‌ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. గ్రహణ పెదవి (మొర్రి) వలన తరచూ చెవిలో చీము కారడం ఇన్ఫెక్షన్ వలన జరుగుతూ ఉంటుంది .

చెవిలో చీము కారడం (OtitisMedia) : మూడు రకాలు --
Acute otitis media (AOM),
Otitis media with effusion (OME)
Chronic suppurative otitis media


వ్యాధి లక్షణాలు :
  • ఒక చెవి లేదా రెండు చెవులలోంచి చీము,
  • నీరు, దుర్వాసనతో చీము వస్తుంటాయి.
  • జలుబు చేసినపుడు ఎక్కవగుతుంటుంది.
  • చెవినొప్పి, పోటు, జ్వరం కూడా రావచ్చును.

జాగ్రత్తలు :
  • నీరు చెవిలో పోనివ్వకూడదు.
  • దూదిపెట్టి స్నానం చేయించాలి. ఈదనివ్వకూడదు.
  • చిన్నపుల్లకి దూదిచుట్టి కనిపించినంత మేరకు చీము తుడిచి శుభ్రం చేయాలి.
  • నూనె, పసర్లు పోయనివ్వకూడదు.
  • డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి.

మూడు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చెవుల్లోనూ చీము కారడంతో మధ్య చెవి, లోపలి చెవి దెబ్బతిని శాశ్వతంగా మాటలు రాని, వినికిడి లేనివారుగా తయారవుతారు. అందుకని చిన్న పిల్లలకు చెవిలో చీము కారుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

ట్రీట్మెంట్ : డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి

Drep ear drops --- రెండు చుక్కలు ఉదయం , సాయంత్రం వేయాలి .
నొప్పి తగ్గడానికి -- combiflam మాత్రలు ఒక్కొక్కటి ఉదయం , సాయంత్రం తీసుకోవాలి ,
ఇన్ఫెక్షన్ తగ్గడానికి - Oflaxin 200 మగ్ రోజుకి రెండు చొప్పునన 5-7 రోజులు వాడాలి
ఎలర్జీ తగ్గడానికి ... సిట్రజిన్ ట్యాబు రోజుకొకటి వాడాలి .
చిన్నపిల్లలకు పై మందులు సిరప్ రూపం లో దొరుకును .

చెవిపోటు వచ్చినపుడు తమలపాకులను మెత్తగా నూరి శుభ్రమైన తడి వస్త్రంలో ఆ ముద్దను వేయాలి. తర్వాత ఆ గుడ్డను పిండి అలా వచ్చిన రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.


  • ======================================

Visit my website - > Dr.Seshagirirao.com/

ముక్కునుండి రక్తం కారుట , Epistaxis




ముక్కునుండి రక్తం కారుట : రెండు రకాలు , 1 ముందునుండి కారుట , 2 వెనకనుండి కారుట .

కారణాలు:-
1. ఏదైనా బలమైనది ముక్కుపైన తగిలినప్పుడు.
2. బలమైన పని చేసినా.
3. రక్తపోటు ఎక్కువ అయినా.
4. ఎత్తైన ప్రదేశములో ఉన్నా.
5. ఎక్కువ వత్తిడి తో ముక్కును చీదినా.

ముక్కునుండి రక్తం కారితే ఏమి చెయ్యాలి?

1) ప్రశాంతంగా కూర్చోవాలి.
2) కొంచెం ముందుకు వంగాలి,కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి.
3) ఒక సైడు ముక్కునుండి రక్తం వస్తుంటే,ఆ ముక్కు నరానికి పైభాగంలో గట్టిగా వత్తిపట్టుకోవాలి.
4) ఐస్ గాని లేక తడి(చల్లటి) బట్టను ముక్కుపై ఉంచాలి.దీని ద్వారా ముక్కుకు సంబధించిన రక్తనాళాలు సంకోచించటం జరుగుతుంది.
5) రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నచో ముక్కులు రెండింటినీ గట్టిగా నొక్కి పట్టుకోవాలి,కనీసం 10 నిమిషాల పాటు పట్టుకొని ఉంచాలి.ఇంకనూ రక్తప్రసరణ ఉన్నచో,ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టి ఉంచాలి.
6) ముక్కుకు బలమైన గాయం అయినచో చాలా సున్నితంగా పట్టి ఉంచాలి.
7) రక్తస్రావం ఎక్కువగా గాని లేక మరలా మరలా రక్తం కారుతున్నా వెంటనే డాక్టర్ ని కలవ వలసి ఉంటుంది.


దోహదం చేసే కారణాలు :

ఎలర్జీ ,
ఇన్ఫెక్షన్ (CommonCold),
రక్తపోటు ,

కొన్ని రకాల మందులు వాడడం వల్ల :
  • Aspirin,
  • Fexofenadine/Allegra/Telfast,
  • warfarin,
  • ibuprofen,
  • clopidogrel,
  • isotretinoin,
  • desmopressin,
  • ginseng
  • బాగా సారా త్రాగడము వలన
  • రక్తహీనత ఉన్న కొంతమందిలోను ,
  • కీళ్ళ సంభందిత వ్యాదులతో భాదపడుతున్న వారిలోనూ ,
  • కొన్ని రకాల రక్త కాన్సర్లు లోను ,
  • గుండె జబ్బులున్నవారిలోను (HeartFailure),
  • కొంతమంది గర్భిణీ స్త్రీలలోను ,
  • కొన్ని రక్తనాల వ్యాధులలోను ,
  • విటమిన్ ' సి' , విటమిన్ ' కే ' లోపమున్నవారిలోను , యవాది కనిపించును ,

ఏవిదం గా ముక్కు నుండి రక్తం కారును :
నాసికా రంద్రం పైబాగం లో చిన్న చిన్న రక్తనాళాలు ఒకేచోట గుమి కుడి ఉంటాయి . ఇలా ఉండటాన్ని " కిసేల్స్ బాచ్ ప్లెక్షెస్ (KiesselbachsPlexus)" ఈ ప్రదేశాన్ని లిటిల్స్ ఏరియా (LittlesArea) అని అంటారు . సాదారనము గా ఈ ప్రదేశం లో చిన్న దెబ్బ తగిలినా , వత్తిడికి లోనైనా రక్తనాళాలు పగిలి రక్తస్రావము జరుగును . ఈ ప్రదేశం ప్రమాదకరమైనది .
చికిత్స :


1) ప్రశాంతంగా కూర్చోవాలి.
2) కొంచెం ముందుకు వంగాలి,కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి.
3) ఒక సైడు ముక్కునుండి రక్తం వస్తుంటే, ముక్కు నరానికి పైభాగంలో గట్టిగా వత్తిపట్టుకోవాలి.
4) ఐస్ గాని లేక తడి(చల్లటి) బట్టను ముక్కుపై ఉంచాలి.దీని ద్వారా ముక్కుకు సంబధించిన రక్తనాళాలు సంకోచించటం జరుగుతుంది.
5) రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నచో ముక్కులు రెండింటినీ గట్టిగా నొక్కి పట్టుకోవాలి,కనీసం 10 నిమిషాల పాటు పట్టుకొని ఉంచాలి.ఇంకనూ రక్తప్రసరణ ఉన్నచో,ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టి ఉంచాలి.
6) ముక్కుకు బలమైన గాయం అయినచో చాలా సున్నితంగా పట్టి ఉంచాలి.
7) రక్తస్రావం ఎక్కువగా గాని లేక మరలా మరలా రక్తం కారుతున్నా వెంటనే డాక్టర్ ని కలవ వలసి ఉంటుంది.


  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కండ్లకలక , Conjunctivitis






కండ్లకలక ( Conjunctivitis) ఒక రకమైన కంటికి సంబంధించిన అంటువ్యాధి.

వ్యాధి లక్షణాలు

వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలొ మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు

* కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
* రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
* రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.

కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. ఇది ఒక అంటువ్యాధి, చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం వలన, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వలన తొందరగా వస్తుంది.

చికిత్స :
వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో తరచూ కళ్ళు కడగాలి. వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు తుండుగుడ్డ ఇతరులని వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి.

  • ఒఫ్లక్షాసిన్ కంటి చుక్కల మందును 4 - 5 రోజులు వాడాలి .
  • సిట్రజిన్ (Tab-Cetzine) 10mg రోజుకి ఒకట చొ. దురద తగ్గినా వరకు 4-5 రోజులు వాడాలి .
  • జ్వరము , నొప్పి తగ్గడానికి నిమ్సులిడ్ మాత్రలు (Nimulid) 100 మగ్ రోజుకి రెండు చొప్పున్న 4-5 రోజులు వాడాలి .
  • ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటి బయోటిక్ మాత్రలు (Megapen) 250/500 మగ్ రోజుకి మూడు సార్లు 4-5 రోలులువాడాలి


  • ===================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

స్త్రీ ఆరోగ్యము , Woman Health





స్త్రీ లేదా మహిళ (Woman) అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.

pUrti vivaraalakosam -> స్త్రీ ఆరోగ్యము

  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

తలనొప్పి , Headach






ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేక యంత్రాలతో పరుగెడుతూ, నిద్రాహారాలు లేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తలనొప్పి. తలనొప్పితో బాధపడేవారిలో అధికం స్త్రీలే. దీనికి కారణం - అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం. తలనొప్పి వల్ల ఏ పని సరిగ్గా చేయలేక, ఎవరికి చెప్పుకోలేక అంతర్గతంగా మథనపడి, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు.

దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే. సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గు పడకూడదు. వైద్యుడు తలనొప్పి తీవ్రంగా ఉన్నా, మరల -మరల వస్తున్నా లేదా జ్వరంతో పాటువస్తున్నదేమో పరీక్షించాలి.

మనిషికి ... మరే ఇతర సమస్యా . . తలనొప్పంత ఇబ్బందికరం కాదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధికంగా వైద్యుడిని సంప్రదించేందుకు కారణమయ్యే సమస్యలను ఒక పట్టికగా తయారు చేస్తే అందులో తలనొప్పిదే అగ్రస్థానం. తలనొప్పి కారణంగా వైద్యుడిని సంప్రదించే రోగులు మొత్తం రోగుల్లో 40 శాతం ఉంటారని అంచనా. ఒక సంవత్సరంలో సుమారు 90 శాతం మంది పురుషులు, 95 శాతం మంది స్త్రీలు తలనొప్పికి గురవుతారు. 99 శాతం మంది వ్యక్తులు జీవితకాలంలో కనీసం ఒకసారైనా తలనొప్పికి గురవుతారు.

తలనొప్పి కలవారిలో అధిక శాతం 'స్వయం చికిత్స చేసుకుంటూ ఉంటారు. అయితే మనం వాడే వాడే నొప్పి మాత్రలు (నాన్‌ స్టీరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ -NSAIDS ఔషధాలు. ఉదాహరణకు - ఇండోమెథాసిన్‌, అసిటామిన్‌ , డైక్లోఫెనాక్ , అసిక్లొఫెనాక్ , మొదలైనవి) కూడా తలనొప్పిని కలుగజేస్తాయి.

తలనొప్పి గురించిన కొన్ని అపోహలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1) అన్ని తీవ్రమైన తలనొప్పులకూ మెదడులో కంతులు కారణమా?.కాదు .
2) సైనస్‌ లేదా కంటి సమస్య తరచుగా కలిగే తలనొప్పికి ముఖ్యమైన కారణం. అవును .

లక్షణాలు
తలనొప్పి ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురును చూడలేకపోవడం, చూపు మసకబారి వాంతి వచ్చినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పి తలలో ఏదో ఒక వైపునే అధికంగా ఉంటే పార్శ్వ నొప్పి (మైగ్రేన్‌)గా భావించాలి.
పార్శ్వనొప్పి క్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండా ఉండి, తల దిమ్ముగా ఉంటుంది.

ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోక పోవడంలో వల్లా లేదా కండరాల ఉద్రిక్తతవల్ల కలుగుతాయి, వాటికి తగుజాగ్రత్తలు ఇంటిదగ్గర తీసుకుంటే సరిపోతుంది. మరికొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు మరియు వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది.

మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం:

* తీవ్రమైన, ఆకస్మికంగా తలనొప్పి వేగంగా, చెప్పలేని విధంగా వచ్చి "ఇది నా జీవితము లో దారుణమైన తలనొప్పి" అనిపించేది
* స్పృహతప్పటం, గందరగోళం, కంటి చూపులో మార్పులు లేదా యితర శారీరక బలహీనతలతో కూడిన తలనొప్పి
* మెడ బిగుసుకుపోవటం మరియు జ్వరంతో కూడిన తలనొప్పి

మీరు ఈ క్రిందితలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీరు వైద్య సహాయం అవసరం:

* నిద్ర నుంచి మిమ్మల్ని మేలు కొలిపే తలనొప్పి
* తలనొప్పి స్వభావములో గానీ లేదా తరచూ ఎందుకొస్తుందో వివరించలేని మార్పులు
* మీ తల నొప్పి స్వభావం గురించి మీకు స్పష్టత లేనట్లైతే వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం.

  • ఆందోళన తలనొప్పి , 
  • క్లస్టర్ తలనెప్పి, 
  • పార్శ్వశూల ,
అనేవి తలనెప్పులలోని రకాలు. తల పగిలిపోయేంత, పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ . . తలనొప్పి బాధను అధికం చేస్తుంది. తలచుట్టూ ఉండే కణజాలములోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి, దానివల్ల తల నెప్పితో బాధపడతాము. తల పగిలిపోయేంత (క్లస్టర్) తలనెప్పి పార్శ్వశూల తలనెప్పి కన్నా తక్కువగానే వస్తుంది, ఇది రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో సాధారణమైనది.
క్లస్టర్ తలనెప్పి వరుసగా అతివేగంగా వస్తుంది-వారాలు లేదా నెలలపాటు ఉంటుంది. క్లస్టర్ తలనెప్పి ఎక్కువగా మగవారికి వస్తుంది మరియు భరించరానంత బాధాకరమైనది.

కారణాలు
- అధిక మానసిక ఒత్తిడి వల్ల మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది.
- మెదడు కణాల్లో కంతులు ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
- తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల కాని, కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్ల వల్ల కాని తలనొప్పి వస్తుంది.
- కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల తలనొప్పికి గురి కావడం జరుగుతుంది.
- రక్తపోటు అధికంయ్యేతపుడు (BP) ముందుగా కొందరికి తలనొప్పి ఉంటుంది .

జాగ్రత్తలు
మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు శబ్దాలు లేని గదిలో, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పినుండి ఉపశమనం లభిస్తుంది.
పౌష్టికాహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌కు స్వస్తి చెప్పాలి.
ఆకు కూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
నీరు అధికంగా తీసుకోవాలి. వేళకు నిద్ర, ఆహారంపట్ల శ్రద్ధ చూపాలి.
సాయంత్రం ఆలస్యంగా తినడం, టి.వి. చూస్తూ ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం మానుకోవాలి.
ప్రతిరోజు 45 నిముషాలు ఉదయం నడవటం, లేదా ఇతర వ్యాయామాలు ఏమైన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి తలనొప్పి తగ్గుతుంది.


వ్యాధి నిర్ధారణ

అధికభాగం తలనెప్పులు తీవ్రస్థితిలో కలిగేవి కావు మరియు దుకాణాలలో దొరికే మందులతో చికిత్స చెయ్యవచ్చు. పార్శ్వశూల తలనెప్పి మరియు యితర తీవ్రమైన తల నెప్పులకు వైద్య పర్యవేక్షణ మరియు ఔషధచీటి అవసరమవ్వవచ్చు.


ఆందోళనవల్ల కలిగే తలనెప్పి(Tension headach):

* ఆందోళన వల్ల లేదా కండరం ముడుచుకోవటం వల్ల కలిగే తలనెప్పి అన్నది అత్యంత సాధారణమైన తలనెప్పి, మరియు అవి వత్తిడి పెరిగే దశలతో తరచూ ముడిపడి ఉంటాయి.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నది స్థిరంగా మరియు మందంగా ఉండిమరియు నుదురు, కణతలు మరియు మెడవెనుక భాగం లో లోనవుతాము.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నదాన్ని తలచుట్టూ గట్టిగా కట్టివేసినట్లుంటుందని ప్రజలు తరచూ వర్ణిస్తారు.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి దీర్ఘకాలం ఉండవచ్చు కానీ వత్తిడి తగ్గగానే సాధారణముగా మాయమవుతాయి.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి కి మరేయితరలక్షణాలతో సంబంధం లేదు మరియు పార్శ్వశూలతలనెప్పిలాగా తలనెప్పికి ముందు వ్యాధిలక్షణాలు ఏవీ కనిపించవు. అన్నిరకాల తలనెప్పులలో ఆందోళన వల్ల కలిగే తలనొప్పులు 90శాతము.



సరణి(సైనస్)తలనొప్పులు

సరణి(సైనస్)తలనొప్పులకు సరణి సంక్రమణం(అంటువ్యాధి) లేదా సహించకపోవటం(ఎలర్జీ) వల్ల కలుగుతాయి. జలుబు లేదా ఫ్లూ జ్వరము తరువాత ముక్కు ఎముకలకు ఎగువన, దిగువున ఉండే గాలి కుహరాలు సరణి మార్గాలు మంటకుగురికావడం, సరణితలనెప్పు కలుగుతుంది.ఈ సరణి చిక్కబడటం లేదా క్రిమిపూరితం అయినా తలకు నెప్పి కలిగించేకారణమవుతుంది. ఈ నెప్పి తీవ్రంగా,కొనసాగుతూ ఉంటుంది,ఉదయాన్నే మొదలవుతుంది మరియు ముందుకు వంగితే మరింతదారుణంగా మారుతుంది.

సరణి(సైనస్)తలనొప్పుల సాధారణ లక్షణాలు:

* చెక్కిళ్ళమీదుగా మరియు నుదుటిపై,కళ్ళచుట్టూ నెప్పి మరియు వత్తిడి,
* పైపళ్ళు నెప్పిగా ఉన్న భావన,
* జ్వరము మరియు వణుకు,
* ముఖం వాయటం,

సరణి(సైనస్)తలనొప్పులలో వచ్చే ముఖం నెప్పులకు వేడిద్వారా మరియు  మంచుద్వారాఉపశమనం కలిగిస్తారు.

మైగ్రేన్

తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి(మైగ్రేన్)ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషికి మనిషికి  వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.

లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును  శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.

* ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది.
* కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది.
  • ఆకలి మందగిస్తుంది.
  • ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది.
  • స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.

కారణాలు

* మానసిక వత్తిడి – తలనొప్పి,
* అధిక శ్రమ,
* ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు,
* రుతు క్రమములో తేడాలు.
* కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది.
* మత్తుపానీయాలు – పొగత్రాగుట,

 మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వల్ల ... తలనొప్పి వస్తుంది.

మెదడుకు నొప్పి తెలియదు
శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకే చేరుతున్నా, నిజానికి మెదడుకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. మెదడు (బ్రెయిన్‌ పారంకైమా) నొప్పిని గ్రహించలేదు. అయితే మెదడుపై ఉన్న రక్షణ కవచాలు (డ్యూరా), 5, 7, 9, 10 క్రేనియల్‌ నరాలు, రక్తనాళాలు, తల చర్మం, మెడ కండరాలు, సైనస్‌లలోని మ్యూకోసా, దంతాలు మొదలైనవి నొప్పిని గ్రహించ గలవు.

మైగ్రేన్‌ రకాలు :
మొత్తం జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారు. మళ్లీ మళ్లీ కలిగే తీవ్రమైన తలనొప్పులకు మైగ్రేన్‌ సమస్య ఒక ప్రధాన కారణం. మైగ్రేన్‌ను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు. అవి - క్లాసికల్‌ మైగ్రేన్‌, కామన్‌ మైగ్రేన్‌.

క్లాసికల్‌ మైగ్రేన్‌ : ఈ రకం ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమపక్క కలుగవచ్చు. ఈ తలనొప్పిని 'థ్రాబింగ్‌, పల్సేటివ్‌, పౌండింగ్‌ తలనొప్పిగా వర్ణిస్తారు.ఎక్కువగా పల్సేటివ్‌ తలనొప్పి కనిపిస్తుంటుంది. మద్యం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం అవుతాయి. విశ్రాంతి, నిద్ర, చీకటి గదిలో పడుకోవడం వల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సుమారు 20 శాతం మందిలో ఆరా(Aura) కనిపిస్తుంది. కంటి ముందు మెరుపులు, కొంతభాగంలో చూపు కోల్పోవడం, అడ్డదిడ్డంగా మెరిసే రంగురంగుల కాంతులు కనిపించడం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు మొదలైనవాటికి తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు.

కామన్‌ మైగ్రేన్‌ : సాధారంగా కనిపించే మైగ్రేన్‌ రకం ఇది. మధ్యవయస్కుల్లో, స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాంటల్‌, టెంపొరల్‌, ఆక్సిపిటల్‌, ఆర్బిటాల్‌ భాగాల్లో ఎక్కడైనా ఈ తలనొప్పి కలుగవచ్చు. తరచూ రెండువైపులా ఈ రకమైన తలనొప్పి కలుగుతుంది. నొప్పి మంద్రంగా, కళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది.

మైగ్రేన్‌ ట్రిగ్గర్స్‌ : కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది. పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.

క్లస్టర్‌ హెడేక్‌
ఇది 30 - 50 సంవత్సరాల వయస్కుల్లో, ముఖ్యంగా పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది. తలనొప్పి 30 నిముషాలనుంచి రెండు గంటలపాటు ఉంటుంది. రాత్రిపూట అధికంగా ఉంటుంది. కంటి లోపలా, కంటి చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. కన్ను ఎరుపుగా మారి నీరు కారుతుంది. ముక్కు కూడా మూసుకుపోయి నీరు కారుతుంది. మద్యం తీసుకునే వారిలో ఈ సమస్య కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ తలనొప్పి వరుసగా 6 నుంచి 12 వారాలు కలుగుతుంది. ప్రతియేటా ఒకే సమయంలో వస్తుంది. కనురెప్ప తెరవడం కష్టమవుతుంది.

టెన్షన్‌ హెడేక్‌
స్త్రీ, పురుషులిద్దరికీ ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. తలచుట్టూ లేదా తలపైన వెర్టెక్స్‌ భాగంలో నొక్కుతున్నట్లు నొప్పి ఉంటుంది. తలచుట్టూ ఏదో గట్టిగా కట్టిన భావన కలుగుతుంది. ఒత్తిడి సమయంలో తలనొప్పి ఎక్కువ అవుతుంది. సాయంత్రం, లేదా రాత్రి సమయంలో అధికమవుతుంది. తలలో కంతులున్నాయేమోననే భయం నొప్పిని అధికం చేస్తుంది. ఇతర ఆందోళనా లక్షణాలు కనిపిస్తాయి. తల, మెడ భాగంలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం (స్పాజమ్‌) ఈ నొప్పికి కారణమని భావిస్తారు.

సైకోటిక్‌ హెడేక్‌
మధ్య వయస్కుల్లో, స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. నొప్పి ఒక స్థలంలో ఉందని చెబుతారు. ఏదో నొక్కుతున్న, లేదా బరువు పెట్టిన భావన ఉంటుంది. అన్ని సమయాల్లోనూ తలనొప్పి ఉంటుంది. ఏ పనీ చేయనివ్వదు. నొప్పి తగ్గడమంటూ ఉండదని బాధితులు చెబుతారు. నిద్రలేమి, తరచుగా ఏడవడం, బరువు తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వాస్తవానికి వీరికి సైకోసిస్‌ ఉండదు.

రోగి తన నొప్పిని ఒక వేలితో చూపిస్తాడు. తలలో గడ్డ తగులుతున్నదని, క్రిములు తిరుగుతున్నాయని చెబుతారు. వీరికి అక్కడ ఏమీ లేదని చెప్పినా ధైర్యం కలగదు. వీరు తమకు స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తారు. పరీక్షల్లో ఏమీ తేలకున్నా వీరికి నమ్మకం ఉండదు.

క్రేనియల్‌ ఆర్టిరైటిస్‌
అరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో తలనొప్పి కలిగినప్పుడు ముందుగా ఈ స్థితి గురించి పరీక్షించాలి. టెంపొరల్‌ లేదా ఇతర క్రేనియల్‌ ఆర్టరీస్‌ ఉన్న భాగంలో వాపు, ఎరుపుదనం, తాకితే నొప్పి ఉంటాయి. తల మొత్తం నొప్పిగా ఉండవచ్చు. ఇ.ఎస్‌.ఆర్‌., సి.ఆర్‌.పి. (సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌) అధికంగా ఉంటాయి. ఈ పరీక్షల్లో వీటి పరిమాణం పెరిగినట్లు ఉంటే వెంటనే స్టీరాయిడ్స్‌ ఆరంభించాలి. లేనిపక్షంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో 50 శాతం మందికి చూపు పోయే అవకాశాలుంటాయి.

నివారణ

* ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి
* ఇంటిలో వున్నప్పుడు చీకటి రూములో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
* ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి.
* నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది.
* ఏ మాత్రము సందేహము వున్నా గర్బ నిరోధక మాత్రలు తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలి.
* కొందరు స్త్రీ ల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
* డాక్టరు ను సంప్రదించి మాత్రమే వైద్యం చేయించుకోవాలి.

పార్శ్వనొప్పికి బొటాక్స్‌
తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.



తలనొప్పికి చికిత్స :
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి ,
  • పారాసిటమాల్ + ఇబుఫ్రోఫెన్ కలిసిఉన్న మాత్రలు (Combiflam) ఒక మాత్ర ఉదయము , ఒకమాత్ర సాయంత్రముతీసుకోవాలి .
  • దైక్లోఫెనాక్ + పారసేతమాల్ కలిసిఉన్న మాత్రలు (Dipal-F) ఉదయము , సాయంత్రము తీసుకోవాలి
పై మాత్రలు భాదనివారనకే పనిజేస్తాయి , ఇలా మూడు రోజులు వాడినా తగ్గక పోతే డాక్టర్ని సంప్రదించాలి .


వేసవిలో తలనొప్పా?
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రత కారణంగా కొందరికి విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. దీని నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలి?

* 3 లీటర్ల నీరు: ఒంట్లో నీటిశాతం తగ్గిపోకుండా చూసుకోవటం ప్రధానం. ఇందుకు రోజుకి 2-3 లీటర్ల నీరు తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరినీరు వంటి వాటితోనూ డీహైడ్రేషన్‌ ఏర్పడకుండా చూసుకోవచ్చు. అయితే కెఫీన్‌ ఎక్కువగా ఉండే పానీయాల జోలికి వెళ్లకపోవటమే మంచిది.
* నియమిత వ్యాయామం: వేసవిలోనూ వ్యాయామాన్ని మానరాదు. అయితే వ్యాయామం చేసినపుడు చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, డీ హైడ్రేషన్‌ ఏర్పడకుండా ఆ సమయంలో తగు మోతాదులో నీరు తాగటం మరవరాదు.
* మసాలాలకు దూరం: మసాలాలతో నిండిన ఆహారంతో తలనొప్పి మరింత పెరగొచ్చు. సాధ్యమైనంతవరకు మసాలాలు, నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. అలాగే మరీ చల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌ల వంటి వాటికి అలవడటానికి శరీరం కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అలాంటివీ మానెయ్యాలి
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/