Monday, October 21, 2013

Hints to reduce body fat,శరీరంలో కొవ్వు తగ్గాలంటే...పాటించవలసిన సూచలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints to reduce body fat,శరీరంలో కొవ్వు తగ్గాలంటే...పాటించవలసిన సూచలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




చాలా మంది పురుషులు , మహిళల్లో కొవ్వు శాతం పెరగడంతో చర్మం ముడతలు పడడం కనిపిస్తుంది. వయసు మీద పడే సరికి మహిళల్లో ఏర్పడే ప్రధాన సమస్య ఇదే. అందుచేత శరీరంలో అవసరానికి మించిన కొవ్వు ఎందుకు పేరుకుంటుందో తెలుసుకొంటే దానిని నివారించుకొని చక్కని ఆరోగ్యాన్ని, తీరైన ఆకౄఎతిని సొంతం చేసుకోవచ్చు.

కొవ్వు సమస్య ఎక్కువుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు చర్మం మధ్య పొరలో కొవ్వు కణాలు ఒక్కచోట చేరుతాయి. దాంతో చర్మంలో సొట్టలు పడినట్లు కనిపిస్తుంది. ఇలాంటి సమస్య సాధారణంగా పొట్ట, నడుం కింది భాగం, పిరుదులు వంటి భాగాల్లో ఎక్కువుగా బాధిస్తుంది. పురుషులలో పొట్టభాగములో బెల్లీ గా కొవ్వు పేరుకుపోతుంది. శారీకంగా చోటు చేసుకునే మార్పులే కాదు. ఇతర కారణాలు దీనికి దారితీస్తాయి.

ప్రాధమికంగా తినుబండారాలు మూడు రకాల (కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, కొవ్వు) పదార్ధాలతో ముడిపడివుంటాయి.  జంక్‌ఫుడ్ తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరిగి, హృద్రోగ సమస్యలకు దారితీయవచ్చు. జంక్‌ఫుడ్‌లోని షుగర్, కొవ్వు కారణంగా అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తక్కువ స్థాయిలో లభిస్తాయి. ఊబకాయంతో పాటు మధుమేహ సమస్యలకు జంక్‌ఫుడ్ కారణమవుతోంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్ తినే చిన్నారులకు- రోగ నిరోధక శక్తి తగ్గడం, ఊబకాయం, నీరసం, వత్తిడులు వంటివి తప్పవు. ముఖ్యంగా పీచుశాతం తక్కువగా, కొవ్వు, పిండి పదార్థాలు ఎక్కువుగా ఉన్న ఆహారం అదే పనిగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు విపరీతంగా పేరుకుంటాయి. ముఖ్యంగా వేపుళ్ళు శుద్ధి చేసిన ఆహారం, హానికర కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారంవల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

దీనికోసం ముందుగా జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు అంటే తృణధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి. ఏదో ఒక వ్యాయామం రోజూ అరగంటైనా చేయడం మీ జీవనవిధానంలో భాగం కావాలి. వారంలో ఐదు రోజులు రోజూ అరగంటకి తగ్గకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటిని పాటించండి
హెల్తీ డైట్: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్ కొవ్వు తగ్గిస్తాయి.
నడకతో ఫిట్: వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుని గంటల కొద్దీ పని చే సేవారిలో కొవ్వుపెరిగే అవకాశం ఎక్కువ. అందుకే రోజు అరగంటపాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
స్మోకింగ్‌కు స్వస్తి: పొగతాగని వారితో పోల్చితే పొగతాగే వారిలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. పాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అలవాటు లేకపోతే అట్రాక్ట్ కాకండి.
కొలెస్ట్రాల్: టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ పరిమితిని దాటకుండా చూసుకోండి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులు వాడండి.
హెల్తీ వెయిట్: అధిక బరువు మూలంగా కొ్వ్వు పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నీ అధిక బరువు మూలంగానే వస్తాయి. కాబట్టి లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
కోపాన్ని తగ్గించుకోండి: ఒత్తిడి, కోపం హార్ట్ఎటాక్, స్ట్రోక్‌కు కారణమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడిపితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు ఉపయోగపడతాయి. జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, మందులు వాడటం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Perfumes-Awareness,పెర్‌ ఫ్యూమ్స్‌-అవగాహన,సెంట్స్-అవగాహన‌,సుగంధ ద్రవ్యాలు-అవగాహన

  •  




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సుగంధ ద్రవ్యాలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


Introduction :
మంచి వాసనను సువాసన, పరిమళము, సుగంధం అంటారు. పువ్వులు రకరకాలైన సువాసనలను వెదజల్లుతాయి. ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు.
అష్టగంధాలు:
  1.     కర్పూరం
  2.     కస్తూరి
  3.     పునుగు
  4.     జవ్వాజి
  5.     అగరు
  6.     పన్నీరు
  7.     అత్తరు
  8.     శ్రీగంధం
సుగంధ ద్రవ్యాల ఉపయోగం క్రమంగా పెరుగుతుంది. ధనిక, పేద అని తేడా లేకుండా పెర్‌ఫ్యూమ్స్‌ వాడుతున్నారు. ఏ పార్టీకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా అక్కడి ఆవరణం అంతా పెర్‌ ఫ్యూమ్‌ వాసనతో నిండిపోతుంది. ఇకపోతే Lifts లో గాలికి బదులు సెంట్‌ వాసనలను ఆస్వాదిస్తుంది ముక్కు. ఒక పెర్‌ఫ్యూమ్‌  వలన అనేక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Side  effects :
సెంట్స్‌ కారణంగా కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్‌ డర్మటైటిస్‌, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్‌ తలనొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని క్యాంటర్‌ బరీ కెంట్‌ ఛాసర్‌ హాస్పటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్‌ సుసానా బ్యారన్‌ సెంట్స్‌ ఉపయోగించే సమయంలో అవి చర్మానికి తగలడం, వాటి వాసనతో అలర్జీలు, మైగ్రేన్‌ తరహా తలనొప్పుల తో పాటు అనేక రకాల చర్మవ్యాధులు వస్తువులున్నాయని పేర్కొన్నారు.
కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్‌ పార్ట్‌ వద్ద సుగంద ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. వాళ్ళు తమ అండర్‌ గార్మెంట్స్‌ వద్ద టాల్కం పౌడర్‌ వంటివి జల్లుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటి కప్పుడు ఫ్రేష్‌ అండర్‌ గార్మెంట్స్‌ తొడుక్కోవడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.

Uses :
నిత్య జీవితంలో సువాసనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి మన నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. అప్పుడప్పుడు మనం ఒత్తిడికి గురౌతుంటాం. డిప్రెషన్ అవుతుంటాం అలాంటప్పుడు మంచి వాసనలు చూడడం వల్ల మన శరీరంలోని సువాసనలతో మనం చేసే పనుల్లో మనసును కేంద్రీకరించగలుగుతాం. మంచి సువాసనలు రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటి రకం శరీరంపై ఉపయోగిస్తే, రెండవది పరిసర ప్రాంతాలను వాతావరణాన్ని పరిమళ భరితం చేసేవి. శరీరం విషయంలో చాలా మంది ఒకే రకమైన సంట్ ను తరచూ వాడుతుంటారు. దీన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. వాళ్లు ఎలాంటి ఆశయాలు కలిగినవాళ్ళ?మొదలైన విషయాలను వాళ్లు ఉపయోగించి సుగంధాలతో తెలుసుకోవచ్చు. ఫ్లోరల్: ఇందులో మీకు రకరకాల సంప్రదాయ పుష్పాల సుగంధాలు వస్తాయి. ఇది మనషి మెదడులో స్త్రీ సంబంధ ఆలోచనలను కలిగిస్తాయి. వీటిలో గులాబీ, మల్లెపూల సువాసనలు ఎక్కువ జనాదరణ పొందాయి. గ్రీన్: రోజ్ మెరీ, చామోమిలీ, యూకలిప్టస్ ఎక్కువ ప్రజాదరణ పొందినవి, వీటిని ఉపయోగించి రిలాక్సింగ్, బాతింగ్ ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి గ్రీన్ సువాసనలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి....

ఉపయోగించడంలో అవగాహన(Hints in use  of Scents of perfumes) :
సాధారణంగా  పెర్‌ఫ్యూమ్స్‌ సువాసనను మెచ్చని వారుండరు. శుభ కార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొందరు మహిళలు పెర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగిస్తారు. అయితే పెర్‌ఫ్యూమ్స్‌ను ఉపయోగించడంలో కూడా సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా వేసవిలో పెర్ ఫ్యూమ్ స్పెల్ ఎక్కువ సేపు ఉండాలా జాగ్రత్తపడాలి. వేసవిలో మన శరీరం గురించి వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వేసవిలో రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పెర్ ఫ్యూమ్ లేదా డియోడరెంట్ వంటివి రాసుకోవాలి. చాలా మంది నేచురల్ డియోడరెంట్స్ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. నేచురల్ గా దొరికే ఎసెన్సియల్ ఆయిల్స్ లేదా ఎక్సాస్ట్ మంచి సువాసనలు కలిగి ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి. ఇవి చెడువాసనలు రానీయకుండా కాపాడుతాయి.

సువాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాంటే పాటించాల్చిన పద్దతులు(Hints for long sustainance of smell) :  
1. పెర్ ఫ్యూమ్ కానీ, డియోడరెంట్స్ కానీ ఉపయోగించే ముందు బాటిల్ ను బాగా షేక్ చేయాల్సి ఉంటుంది.
2. పెర్ ఫ్యూమ్ ను డైరెక్ట్ గా చంకల క్రింద వాడకూడదు. మీరు డ్రెస్ ధరించిన తర్వాత స్పే చేసుకోవడం వల్ల ఎక్కువ సమయం తాజాగా సువాసనతో నిలిచి ఉంటుంది.
3. మీరు డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించినట్లైతే, శరీరం మీద తేమ లేకుండా చేసుకోవాలి. తర్వాత దుస్తులను ధరించాలి.
4. డియోడరెంట్స్ ఇరవై నాలుగు గంటలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. .

పెర్‌ ఫ్యూమ్స్‌ ,సెంట్స్‌,సుగంధ ద్రవ్యాలు వాడేవారికి కొన్ని జాగ్రత్తలు(Precautios for users of Scents of Perfumes) :
 1. శరీరంలో బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాల్సి ఉంటుంది. శరీరంపై పడే దుమ్ము ధూలి నుండి ఏర్పడ బ్యాక్టీరియా, క్రిములు దుర్వాసన ఏర్పడటానికి కారణం. ఆ దుర్వాసనను తొలగించడానికి వేడినీళ్ళతో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేయడంతో ఆ వేడికి శరీరంలో మళ్ళీ చెమట పడుతుంది.
2. చెమటలు పట్టించేలా ఉండే దుస్తులను ధరించకపోవడమే మంచిది. పాలిస్టర్, థిక్ ఫ్యాబ్రిక్ దుస్తులు వేసుకోకూడదు. వీటి ద్వారా చెమట తొందరగా పడుతుంది.
3. వేసవిలో కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. చెమట పట్టినా కూడా కాటన్ దుస్తులు చెమటను పీల్చుకొంటాయి.
4. డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించేట్లైతే టాల్కమ్ పౌడర్ ను కూడా అప్లై చేస్తే సుగంధపరిమళాల వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి.
5. చంక క్రింది ఎప్పటికప్పడు హెయిర్ ను తొలగిస్తుండాలి. లేదంటే చెమటకు బ్యాక్టీరియా చేరి దుర్వాసను పెంచుతుంది.
6. డియోడరెంట్ వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే స్నానానికి ముందే చంకల కింద టూత్ పేస్ట్ అప్లై చేసి, పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
7. ఫుల్ స్లీవ్స్ లేదా ఫుల్ షర్ట్స్ ధరిస్తున్నట్లైతే పెర్ ఫ్యూన్ దుస్తులపై పూర్తిగా అప్లై చేసుకోవాలి.
8. పన్నీటిలో సువాసన కలిగిన పెర్‌ఫ్యూమ్‌ను ఒకటి రెండు చుక్కలు కలిపి, శరీరం మీద చల్లుకోవచ్చు.
9. పెర్‌ఫ్యూమ్‌ కొనబోయేముందు ఆ పెర్‌ఫ్యూమ్‌ను చేతిమీద రాసుకుని, ఆ వాసన నచ్చిందా, అది తమ చర్మానికి పడిందా అని చెక్‌ చేసుకోవాలి. పెర్‌ఫ్యూమ్‌ వాసన మారకుండా అలాగే ఉంటే, ఆ పెర్‌ఫ్యూమ్‌ను ఉపయోగించవచ్చు.
10. పెర్‌ఫ్యూమ్‌ సువాసనలో తేడాలుంటాయి. రకరకాల మూలికలతోనూ, పరిమళాల పుష్పాలతోనూ, సుగంధాలు కలిగిన ఆకులతోనూ కూడా పెర్‌ఫ్యూమ్స్‌ను తయారుచేస్తారు. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా తయారు చేయబడిన పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటంవల్ల సువాసన కాకుండా దుర్వాసన కలుగుతుంది. అంతే కాకుండా చర్మానికి ఎలర్జీ కలుగుతుంది. ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారు, చర్మానికి సరిపడే పెర్‌ఫ్యూమ్‌ను ఎన్నుకోవాలి. అంతే కానీ, తోటివారు ఉపయోగిస్తున్నారు కదాని, దాన్నే వాడకూడదు.

Source : wikipedia.org/

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Crack lips,పెదవుల పగుళ్లు


-




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Crack lips,పెదవుల పగుళ్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




బ్రతికినంతకాలము మనిషి బాధలులేకుండా బ్రతకాలనే అనుకుంటారు . . . అనుకోవడమేమిటి అలానే బ్రతకాలి. పగిలి పెదవులు  బాధతో పాటు ముఖ అందాన్ని కూడా ప్రబావితం చేస్తాయి.  పొడి వాతావరణం పెదవుల పగుళ్ళకు ముఖ్యమైన కారణం. వాతావరణంలోని గాలి పొడిగా ఉన్నప్పుడు చర్మంలోని పై పొరలు ఆరిపోతాయి. పెదవులమీద ఉండే చర్మం సున్నితంగా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ముందుగా వాతావరణ ప్రతికూలతలు పెదవుల మీద పడతాయి.
పెదవులు పగులుతాయి. పెదవులు చిట్లిపోయి నొప్పిగా తయారవుతాయి. కొంతమంది పెదవులు తడారిపోతున్నప్పుడు వాటిని నాలికతో తడుపుతూంటారు. తడి ఆరిపోతూ పెదవుల్ని మరింత చిట్లిపోయేలా చేస్తుంది కాబట్టి ఇలాగా తడారిన పెదవుల్ని నాలికతో తడపకండి. దీనికి బదులు ఆముదాన్ని గానీ, వెన్నపూసను గానీ పెదవులకు రాసుకోండి. వీటితో పెదవుల మీద ఉండే తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఎండలోకి వెళ్ళినపుడు అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఉండేందుకుగాను సన్‌రిఫ్లెక్షన్‌ ఫ్యాక్టర్‌ కలిగిన క్రీముల్ని పైపూతగా రాసుకోండి.

శీతాకాలం వస్తే  చర్మాన్ని సంరక్షించుకోవడానికి అనేక పాట్లు పడుతుంతాం . అలాగే చలికాలంలో పెదవుల పగుళ్ల కోసం ఏవేవో చేస్తుంటాం. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. చర్మం పైన  పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే  పొరలు సున్నితం గా ఉంటాయి. అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే పెదవుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి.

అల్లోపతి చికిత్స:
  • అల్లోపతిలో వేజలైన్‌ జెల్లీ పైపూతగా రాసుకోవడమే గాని స్పెషిఫిక్  గా ట్రీట్మెంట్ ఏమీలేదు. బి.కాంప్లెక్ష్ లోపము రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

ఆయుర్వేదం చికిత్స :
  •  చండ్రబెరడు చూర్ణం చిటికెడు తేనె అరటీస్పూన్‌. రెంటినీ కలపండి. పేస్టులాగా తయారు చేయండి. దీనిని రాత్రి పడుకునే ముందు పెదవుల మీద పూసుకోండి.ఉదయం కడిగేసుకోండి. దీంతో పెదవుల పగుళ్లు తగ్గుతాయి.
  • చలికాలంలో వీసే గాలుల వల్ల మీ పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుతాయి. 8,9గంటలపాటు లిప్ స్టిక్ ఉంచుకుంటే పెదవులు పొడిబారతాయి. కాబట్టి లిప్ గార్డ్ గానీ, వాజలిన్ గానీ రాస్తే మంచిది.లిప్ స్టిక్ పెదవులపై ఎక్కువ సేపు ఉండాలంటే అదిపెట్టుకునే ముందు పెదాలపై పౌడర్ గానీ, లైట్ గా ఫౌండేషన్ గానీ వేసుకోవాలి. అప్పుడు లిప్ స్టిక్పెట్టుకుంటే చాలా సేపటివరకూ పోకుండా ఉంటుంది.మాయిశ్చరైజర్ లిప్ స్టిక్ పెదవులను మెరిసేలా చేస్తుంది.
  • పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్ రూట్ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.
  • నెయ్యిని రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రాసుకోవాలి.
  •  కొబ్బరి నూనెను కూడా తెల్లవారుజామున స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
  • 2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి
  • చలికాలంలో మీ పెదవులకు అలొవెరా ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్స్‌ను వాడినా మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా మిల్క్‌ క్రీమ్స్‌ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చునని బ్యూటీషన్లు చెబుతున్నారు.
  • నిమ్మరసం, ధనియాల పొడి కలిపి పేస్ట్‌ చేయండి. పెదవులపై ఈ పేస్ట్‌తో ప్రతిరోజూ పదినిమిషాలు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • నిమ్మరసం, గ్లిజరిన్‌, తేనె కలపి ఈ మిశ్రమంతో పెదవులపై పదినిమిషాలు మర్దన చేయాలి.
  • నిద్రించేముందు కొబ్బరి నూనెలో వైట్‌ పెట్రోలియం జెల్లీ కలపి, పెదవులకు రాయాలి.
  • కొత్తిమీర రసంతో పెదవులను మర్దనా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
  • నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.
చిట్కాలు-జాగ్రత్తలు :    
చలికాలంలో తరచుగా పెదాలు పగలుతుండటం సహజమే. దీంతో మంట, నొప్పి, చిరాకు వంటివి వేధిస్తాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే పెదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

* చలి, పొడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు పెదాలకు సన్‌స్క్రీన్‌తో కూడిన క్రీమ్‌ రాసుకోవాలి. తర్వాత పెదాలను చేతి రుమాలుతో గానీ స్కార్ఫ్‌తోగానీ కప్పి ఉంచాలి. అలాగే ఆరుబయట ఎక్కువసేపు గడిపే సమయాల్లో తరచుగా పెదాలకు క్రీమ్‌ రాస్తుండాలి.

* పెదాలను తడిగా ఉంచుకోవటానికి కొందరు నాలుకతో అద్దుతుంటారు. ఇది సరికాదు. లాలాజలం త్వరగా ఆవిరవుతుంది. దీంతో పెదాలు అంతకుముందుకన్నా మరింత పొడిగా తయారవుతాయి.

* తగినంత నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. చర్మంతో పాటు పెదాలూ నిగనిగలాడతాయి. వీలైనవారు ఇంట్లో తేమ తగ్గకుండా చూసే పరికరాలు (హ్యూమిడిఫయర్‌) కూడా వాడుకోవచ్చు.

* కొన్నిసార్లు అలర్జీ కారకాలు కూడా పెదాలు పగలటానికి దారితీయొచ్చు. కాబట్టి సౌందర్య సాధనాలు, రంగుల్లో శరీరానికి సరిపడని అలర్జీ కారకాలు ఉంటే.. వాటికి దూరంగా ఉండాలి.

* కొందరు తరచుగా నోటితో గాలిని పీల్చుకుంటూ ఉంటారు. దీంతో పెదాలు పొడి బారతాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి.

* చిన్న చిన్న చిట్కాలతో పెదాలు పగలటం తగ్గకపోతే వెంటనే డాక్టరుని సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు తీవ్రంగా పెదాలు పగలటమనేది ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా రావొచ్చు. కాబట్టి ముందే జాగ్రత్త పడితే మంచిది.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Chances of Common cold changes to Asthma,జలుబు ఉబ్బంసంగా మారే అవకాశం






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Chances of Common cold changes to Asthma,--జలుబు ఉబ్బంసంగా మారే అవకాశం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జలుబు చేయడం సర్వసాధారణమే అయినా పిల్లల్లో జలుబును నిర్లక్ష్యం చేస్తే ఉబ్బంసంగా మారే అవకాశం ఉంటుంది. సంకేతాలను గుర్తించకపోవడం, చికిత్స ఇప్పించడంలో ఆలస్యమయినప్పుడు ఉబ్బసం తీవ్రమవుతుంది. ఫలితంగా ఇన్‌హేలర్ వాడాల్సి రావడం, ఆసుపత్రిలో చేర్పించాల్సి రావడం జరుగుతుంది. దీని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. అందుకే పిల్లల్లో జలుబును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ టి.పి. కార్తీక్.

చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే దీర్ఘకాలం ఈ సమస్య కొనసాగితే ఉబ్బసం లేదా ఆస్తమాగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధానంగా వాతావరణ మార్పులు, అలర్జీ లేక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ కారణమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే వారి పిల్లల్లో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఏం చేయాలి?
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు తరచుగా జలుబు బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో చలువరాళ్లే ఉంటున్నాయి. రిస్క్ ఎక్కువగా ఉన్న పిల్లలు ఈ చలువరాళ్లపై నడిచినా త్వరగా జలుబు అంటుకుంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పులు ధరించేలా చూడాలి. జలుబు ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. 'రెండు, మూడు రోజులు చూద్దాం. అదే తగ్గిపోతుందిలే' అని వదిలేస్తే అది క్రమంగా ఆయాసంగా మారుతుంది. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. కొందరు చిన్న పిల్లల్లో గురక సమస్య కనిపిస్తుంది. ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్స్ వాయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఎడినాయిడ్స్ వాపు వల్ల టాన్సిల్స్ వాచే అవకాశం ఉంటుంది. ముక్కులో చుక్కల మందులు వేసుకోవడం లేదా ఆవిరిపట్టడం వల్ల రిలీఫ్ వస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ మందులు వాడాల్సి ఉంటుంది.

ఉబ్బసం పట్ల జాగ్రత్త
పిల్లల్లో జలుబును చాలా కాలం నిర్లక్ష్యం చేస్తే ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చలి తీవ్రత పెరగడం వల్ల శ్వాసకోశాల్లోని నాళాలు కుంచించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. రాత్రివేళ పిల్లలు దగ్గుతుంటారు. ఈ లక్షణాన్ని ఆస్తమాకు ప్రాథమిక సంకేతంగా భావించాలి. చాలా మంది ఆస్తమా ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ తగ్గదని అనుకుంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులు వాడటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను శాశ్వతంగా నయం చేయవచ్చు.

ఆస్తమాను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి మైల్డ్, మోడరేట్, సివియర్ ఆస్తమా.
మైల్డ్ ఆస్తమా అయితే కొద్ది రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. మోడరేట్ ఆస్తమా అయినట్లయితే ఇన్‌హేలర్ వాడాల్సి ఉంటుంది. నాలుగైదు నెలలు చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది. ఆస్తమా తగ్గింది కదా అని ఒకేసారి ఇన్‌హేలర్ వాడకం ఆపేయకూడదు. క్రమపద్ధతిలో ఇన్‌హేలర్ వాడకాన్ని ఆపుతూ రావాలి. మద్యలో మందులు మానేయడంలాంటివి చేయకూడదు. సివియర్ ఆస్తమా అయితే ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది. ఆస్తమా బారినపడిన పిల్లల్లో శ్వాసకోశాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి సమయంలో నెబ్యులైజర్ ఉపయోగించవచ్చు. సాధారణ జలుబు, దగ్గుకు నెబ్యులైజర్ వాడటం మంచిది కాదు. ఆస్తమా ఉన్న వారికి నెబ్యులైజర్‌ను ఉపయోగించవచ్చు. కొందరు పిల్లలు ముక్కు రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతుంటారు. నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు. ఇటువంటి వారికి నాసల్ డ్రాప్స్ వేస్తే ఫలితం ఉంటుంది.

గుర్తుపట్టడం ఎలా?
పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం ఉంటుంది. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. రాత్రివేళ దగ్గు ఉంటుంది. పరుగెత్తినప్పుడు ఎక్కువగా ఆయాసపడతారు. మాట్లాడుతున్నప్పుడు ఆయాసపడటం గమనించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆస్తమాగా భావించి వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

తగిన జాగ్రత్తలు
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు దుమ్ము దులపకూడదు. తడిగడ్డతో తుడవాలి. పర్‌ఫ్యూమ్స్, సెంట్స్ వాడకూడదు. అగరబత్తీలు వెలిగించకూడదు. పిల్లలను బయటకు తీసుకెళ్తున్నట్లయితే తప్పనిసరిగా మాస్క్ పెట్టాలి. ఇల్లు శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలి. పెట్స్ కూడా అలర్జీకి కారణమవుతాయి. కాబట్టి పిల్లులు, కుక్కలు వాటికి దూరంగా ఉంచాలి. జలుబు చేసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆవిరిపట్టించడం, వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించడం చేయాలి. అప్పుడే పిల్లలు ఆస్తమా బారినపడకుండా కాపాడుకోగలుగుతాం.

Courtesy with : డాక్టర్ టి.పి. కార్తీక్,పీడియాట్రిషియన్,యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్, హైదరాబాద్@sakala of http://www.andhrajyothy.com/

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

If platelets count decrease?,ప్లేట్‌లెట్లు తగ్గిపోతే?

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - If platelets count decrease?,ప్లేట్‌లెట్లు తగ్గిపోతే?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



డెంగ్యూ లాంటి కొన్ని వ్యాధుల్లో ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం సహజం. అలా ప్లేట్లు తగ్గడం మొదలెట్టగానే అయిన వాళ్లంతా బెంబేలెత్తిపోతారు. వెంటనే ప్లేట్‌లెట్‌లు ఎక్కించేందుకు పరుగు తీస్తారు. వాస్తవానికి,రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతిసారీ వాటిని బయటినుంచి ఎక్కించవలసిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఆ అవసరం ఉంటుంది. శరీరం ప్లేట్‌లెట్లను తిరిగి ఉత్పత్తి చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా కొందరు ప్లేట్‌లెట్లు ఎక్కించడానికే సిద్ధమవుతారు. అలా అవసరం లేనివారికి కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ పోతే, అత్యవసరమైన కొందరికి అవి అంద కుండా పోతాయని నిపుణులు అంటున్నారు. ప్లేట్‌లెట్ల లోపాల మూలాలు, వాటి నివారణోపాయాల గురించిన వివరాలకు వెళితే....

శరీర వ్యవస్థలో ప్లేట్‌లెట్లకో ప్రత్యేక స్థానమే ఉంది. రక్తంలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు అనే మూడు రకాల మౌలిక కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్ మేరో) నుంచే ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు శరీరం రోగగ్రస్తం కాకుండా చూసే రక్షక దళంగా అంటే వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ద్వారానే శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్‌లేట్లు. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య శరీర ధర్మాన్ని అనుసరించి వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. సాదారణంగా ఒక వ్యక్తిలో ఒకటిన్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల దాకా ఉంటాయి. అంతే తప్ప అందరికీ ఒకే సంఖ్యలో ఉండాలని లేదు. పైగా అవి స్థిరంగా కూడా ఉండవు. ఒక వ్యక్తిలోనే ప్లేట్‌లెట్లల సంఖ్య రోజుకో పరిమాణంలో ఉంటుంది. వీటి సంఖ్య ఒకటిన్నర నుంచి నాలుగున్నర లక్షల మధ్య ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే. ప్లేట్‌లెట్ కణం జీవిత కాలం 7 నుంచి 10 రోజుల దాకా ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్టేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి.

రక్తస్రావాన్ని నివారిండంలో...
శరీరానికి గాయమైనప్పుడు కాసేపు ర క్తం స్రవిస్తుంది. ఆ తరువాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనుక రక్తనాళం, ప్లేట్‌లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల (కోయాగులేషన్ సిస్టం) పాత్ర కీలకమైనది. రక్తనాళం లోపల సహజంగానే 'ఎండో థీలియం' అనే పొర ఉంది. ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతోంది. ఏదైనా కారణం వల్ల ఈ పొరకు దెబ్బ తగిలితే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్లేట్‌లెట్‌లు సిద్ధమవుతాయి. కొన్ని ప్లేట్‌లెట్లు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి గడ్డగా మారతాయి. ప్లేట్‌లెట్లకు తోడుగా రక్తం గడ్డకట్టే వ్యవస్థ నుంచి 'ఫిబ్రిన్' విడుదలవుతుంది. ప్లేట్‌లెట్లు, ఫిబ్రిన్ గాయమైన చోట గడ్డగా ఏర్పడతాయి. ఫలితంగా రక్తస్రావం ఆగిపోతుంది. అయితే ప్లేట్‌లెట్లు మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకుండానే రక్తస్రావం అవుతుంది.

ర క్తస్రావం ఎందుకు ?
తమ విధులు నిర్వహించడంలో ప్లేట్‌లెట్లు విఫలమవుతూ ఉంటాయి. అప్పుడిక రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్‌లెట్ల నాణ్యత త గ్గిపోవడం గానీ, కారణం కావచ్చు. ప్లేట్‌లెట్ల సంఖ్య నార్మల్ గానే ఉన్నా, రక్తస్రావం ఆగకపోవడానికి ఉన్న ప్లేట్‌లు నాణ్యంగా లేకపోవడమే మూలం. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండడానికి మౌలికంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది ప్లేట్‌లెట్ల ఉత్పత్తే తక్కువగా ఉండడం. దీనికి ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడమే కారణం. ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడానికి పలు కారణాలున్నాయి. వాటిలో ఎముక మజ్జ బలహీనపడటం ఓ కారణం. కొందరిలో మజ్జ బాగానే పనిచేస్తూ ఉంటుంది. ప్లేట్‌లెట్‌ల ఉత్పత్తి బాగానే ఉంటుంది. కానీ, అవి క్షీణించే వేగం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లడ్ క్యాన్సర్ వల్ల ఇలా క్షీణిస్తాయి. మామూలుగా మన శరీరంలో ఉండే ప్లేట్‌లెట్లలో మూడోవంతు ప్లీహం(స్ప్లీన్)లో నిలువ ఉంటాయి. అయితే కొన్ని రకాల జబ్బుల మూలంగా ఒక్కోసారి ప్లీహం బాగా పెద్దదవుతుంది. అప్పుడు ప్లేట్‌లెట్లలో మూడోవంతు కన్నా ఎక్కువగా ప్లీహంలోకి వెళతాయి. ఇందువల్ల రక్తంలో ఉండే ప్లేట్‌లెట్లు సంఖ్య బాగా తగ్గుతుంది.

మరికొన్ని మూలాలు
ప్లేట్‌లెట్ ఉత్పత్తి లోపాలు కొన్ని పుట్టుకతో వచ్చేవి కావచ్చు. మరికొన్ని బాహ్యమైన ప్రభావాలతో వచ్చేవి కావచ్చు. ఈ రెండవ రకం సమస్యకు కారణం హృద్రోగులు రక్తం పలచబరచడానికి వాడే మాత్రలు. ఈ మాత్రల వల్ల కొందరిలో ప్లేట్‌లెట్‌లు సంఖ్యా పరంగానో లేదా నాణ్యతా పరంగానో తగ్గిపోతుంటాయి. కొన్ని యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ప్లేట్‌లెట్లు త గ్గే ప్రమాదముంది.ప్లేట్‌లెట్లు తగ్గడంలో ఇన్ఫెక్షన్ల పాత్ర కూడా ఉంటోంది. వాటిలో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల్లో ఈ తరహా ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎముక మజ్జలో క్షయ మొదలైనప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కూడా ప్లేట్‌లెట్లు పడిపోవడానికి దారి తీస్తోంది. కొందరిలో ఎముక మజ్జలో ఫైబ్రోస్ టిష్యూ చోటుచేసుకుంటుంది. మైలో డిస్‌ప్లేషియా అనే జబ్బులో కూడా ఎముక మజ్జ దెబ్బతిని ప్లేట్‌లెట్లు బాగా పడిపోతాయి.

ఎలా తెలుస్తుంది ?
ఎప్పుడైనా రక్తస్రావం అయితే తప్ప సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేలకు తగ్గేదాకా ఏ లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా పడిపోతే మాత్రం వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. సూక్ష్మ రక్తనాళాల్లోంచి చిట్లినట్లు కొందరి చర్మం మీద చుక్కల్లా చిన్న చిన్న రక్తం మచ్చలు కనిపిస్తాయి. ఇక స్త్రీలలో అయితే బహిష్టు సమయంలో రక్తస్రావం మామూలుగా కన్నా చాలా ఎక్కువగా (మెనొరేజియా)అవుతుంది. స్త్రీలలో అతిగా రక్తస్రావం కావడానికి ఎంతసేపూ గర్భాశయ సమస్యలే కారణమని అనుకోకుండా, ప్లేట్‌లెట్లు తగ్గాయేమోనని అనుమానించాలి. శస్త్ర చికిత్స అయిపోయిన కొన్ని గంటల తరువాత కొందరిలో రక్తస్రావం మొదలవుతుంది. కాకపోతే ప్లేట్‌లెట్ల సంఖ్య సరిగానే ఉందని శస్త్ర చికిత్స చేసేస్తే వాటిని నాణ్యతలో లోపాల కారణంగా రక్తస్రావం కావచ్చు. ఇది అతి తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అలాంటి స్థితిలో ప్లేట్‌లెట్ కణాల నాణ్యతను తెలుసుకునేందుకు ''రిస్టాసెటిన్'' అనే పరీక్ష చేయవలసి రావచ్చు.

కొందరిలోనే...
ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని కాదు. కొందరిలో ఏ లక్షణమూ కనిపించకపోవచ్చు. నిజానికి ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేలకు పడిపోయే దాకా రక్తస్రావాలేమీ ఉండవు. డెంగ్యూ సోకిన వారి విషయంలో వారికి 30 వేలకు పడిపోగానే విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. ఒకవేళ 10 వేల కన్నా తక్కువయినా... అప్పుడే శస్త్ర చికిత్స చేయవలసి వచ్చినా... అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. ఎముక మజ్జ లోపాలతో ప్లేట్‌లెట్లు తగ్గిపోయిన వారిలో తెల్ల రక్తకణాలు, ఎర్రరక్తకణాల్లో కూడా లోపాలు ఉంటాయి. వాటి ప్రభావంతో వేరే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.

డెంగ్యూ ఉన్నప్పుడు ఆ వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ప్లేట్‌లెట్లు బాగా పడిపోయినప్పుడు రక్తస్రావంతోనూ రావచ్చు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, పేగుల్లోంచి రక్తస్రావం అయితే నల్లటి విరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. రక్తస్రావం మొదలయ్యిందీ అంటే ఇక ప్లేట్‌లెట్లు ఎక్కించవ లసిందే. రక్తస్రావమేదీ లేకపోతే 10 వేలకు వచ్చేదాకా ప్లేట్‌లెట్లు ఎక్కించవలసిన అవసరం లేదు. ఒక వేళ ఎక్కడైనా రక్తస్రావం అవుతూ ఉంటే అప్పుడింక 20 వేలు ఉన్నప్పుడు కూడా ఎక్కించవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్‌లు ఏ సంఖ్యలో ఉండాలన్నది వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా ప్లేట్‌లెట్లు 10 వేల కన్నా త గ్గినప్పుడు రక్తస్రావం మొదలవుతుంది. అయితే ఈ రక్తస్రావం శరీరంలోని కీలక భాగాల్లో జరిగితే అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. ఉదాహరణకు మెదడులో రక్తస్రావం కావడం. ఇక మిగతా భాగాల్లో లివర్, కిడ్నీల్లో రక్తస్రావం సమస్య ఉండదు. కానీ, ముక్కులోంచి గానీ, నోటి నుంచి గానీ, పేగుల్లోంచి గానీ, గర్భాశయం లోంచి గానీ, రావచ్చు.

చికిత్స
కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స చేయాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతూ ఉంటే వెంటనే ఆ మందులు మానేయాలి. మానేసిన వెంటనే ప్లేట్‌లెట్లు వాటికవే పెరుగుతాయి. ముందు కారణానికి చికిత్స చేస్తూ వెళ్లాలి. ఒకవేళ అప్పటికీ రక్తస్రావం ఉంటే ప్లేట్‌లెట్ల తోడ్పాటు కూడా తీసుకోవాలి. డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల వచ్చే సమస్య. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. డెంగ్యూ జ్వరం తగ్గేలోపే కొందరిలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో రక్తస్రావం కూడా కావచ్చు. అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించి పరిస్థితిని నిలకడగా ఉంచవలసి ఉంటుంది.

చాలా మంది ప్లేట్‌లెట్లు ఏకాస్త తగ్గినా వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలనే అభిప్రాయంతో ఉంటారు. అది సరికాదు. సాధారణంగా 10 వేల కన్నా తగ్గితే గానీ, ప్రమాదం రాదు. ఒకవేళ 10 వేల కన్నా ఎక్కువే ఉన్నా రక్తస్రావం ఉంటే మాత్రం ఎక్కించక తప్పదు. ఐటిపి (ఇడియోపతిక్ థ్రాంబోసైటోపేనిక్ పర్‌ప్యూరా) అనే సమస్యలోనూ ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోతుంటాయి. ఏ కార ణంగా వస్తుందో మాత్రం తెలియదు. అన్ని రిపోర్టులూ నార్మల్ అనే వస్తాయి. కానీ, ప్లేట్‌లెట్లు మాత్రం పడిపోతుంటాయి.. కొందరిలో ఆటో ఇమ్యూన్ డిసీస్ కారణంగా కూడా ప్లేట్‌లెట్లు పడిపోవచ్చు.ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్లు మరీ తీవ్రమైన ప్పుడు డి ఐసి ( డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగులేషన్) అనే సమస్య తలెత్తుతుంది. ఇందులో కూడా ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గిపోతుంటాయి. అలాగే టిటిపి ( థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపేనిక్ పర్‌ప్యూరా) సమస్యలోనూ, హెచ్‌యుఎస్ (హెమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్) ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోతుంది.తగ్గిపోయిన ప్లేట్‌లెట్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి సహజంగానే శరీరానికి ఉంటుంది. చాలాసార్లు మనం చేయవలసిందల్లా వ్యాధి దుష్ప్రభావాలను నియంత్రిస్తూ ఉండడమే. ఇక అనివార్యమమైనప్పుడు ప్లేట్‌లెట్లు ఎలాగూ ఎక్కిస్తాం. అంతే గానీ ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడల్లా వాటిని ఎక్కించవలసిన అవసరం లేదు. ప్లేట్‌లెట్ అనేది నిజంగా ఎంతో అరుదుగా లభించే ఉత్పాదన. అందువల్ల అత్యవసరమైనప్పుడే వాటిని వినియోగించాలి. అంతేగానీ, అవసరం లేకపోయినా వాటిని వినియోగించుకుంటూ పోతే... అత్యవసరమైన వారికి అవి లభించవు. అమూల్యమైన ప్లేట్‌లెట్లను అత్యవసర పరిస్థితులల్లో వినియోగించడానికే పరిమితమైతే నిజంగా వాటి అవసరమున్న ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.


Courtesy with : సకల@http://www.andhrajyothy.com/
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Can not we prevent heart diseases?,గుండె జబ్బులను నివారించలేమా?

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Can not we prevent heart diseases?,గుండె జబ్బులను నివారించలేమా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండె జబ్బులు వచ్చిన తరువాత పరుగులు తీయడమే తప్ప, ఆ జబ్బులు రాకుండా నివారించే విధానాల పట్ల చాలా మంది ఆసక్తి చూపడం లేదు. దాని పరిణామంగానే గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదే క్రమంలో గుండె సర్జరీల సంఖ్య పెరుగుతోంది. ఆ పరిస్థితికి తావు లేకుండా జీవన శైలి మార్పులతో, ప్రకృతితో జీవనం సాగించడం ద్వారా గుండెను జీవితాంతం సురక్షితంగా ఉంచుకోవచ్చని అంటున్నారు వేమన యోగ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె. సత్యలక్ష్మి. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే....

గుండె జబ్బు అనగానే గుండెపోటు రావడం, విలవిల్లాడుతూ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం. దాదాపు ప్రతి ఒక్కరి మనసులో ఇదే దృశ్యం కదలాడుతూ ఉంటుంది. సమస్య ఏ స్థాయిలో ఉన్నా గుండె జబ్బు నుంచి బయటపడటానికి సర్జరీ ఒక్కటే పరిష్కారం అన్న భావన కూడా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ స్థిరపడిపోయింది. దీనికంతా సినిమాలా? నవలలా? విస్తృతమైన వ్యాపార ప్రకటనలా? ఏవైతేనేమిటి? ఆ భావనైతే అందరిలో మకాం వేసింది. దీనికి గుండె శస్త్ర చికిత్సలు బాగా అందుబాటులోకి రావడం కూడా ఒక కారణమే. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులకు సంబంధించి రొటీన్ టెస్ట్‌లలో వచ్చే రిపోర్టుల ఆధారంగా డాక్టర్ ప్రమేయం లేకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు . కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారూ నాకు సర్జరీ చేయండి అంటూ తమకు తామే సిద్ధమయ్యే పరిణామాలు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఒక అనివార్య పరిస్థితిలోనే యాంజియోగ్రామ్ చేయించుకోవాలనే విషయం మరిచిపోయి అదొక రొటీన్ విధానంగా తీసుకోవడం మొదలలయ్యింది. పేషంట్లు తమకు తామే నిర్ణయించుకుని ఉదయం హాస్పిటల్‌కు వెళ్లి యాంజియోగ్రామ్ చేయించుకుని సాయింత్రానికి డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోవడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. కానీ, యాంజియోగ్రామ్ వల్ల కూడా ఒక్కోసారి దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న విషయం వారు తె లుసుకోవడం లేదు. అయితే, సమస్య ఉందో లేదో తెలుసుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ వారికి సమస్య రాకుండా నివారించుకునే విధానాల పట్ల ఉండడం లేదు. సైన్స్ బాగా అందుబాటులోకి వ చ్చే క్రమంలో దాని సద్వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయమైన అవగాహనలో మనకన్నా పాశ్యాత్యులే ముందు ఉన్నారు. అందులో భాగంగా 1970లోనే డీన్ అర్నిష్ అనే వ్యక్తి 'లైఫ్ స్ట్రైల్ హార్ట్ ట్రయల్స్' అన్న పేరిట సరియైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులనుంచి ఎలా బయటపడవచ్చో తెలియచేశారు. ఎంతో లోతైన అధ్యయనం చేసి, క్లినికల్ ట్రయల్స్ చేసి గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకుల్ని ఏ సర్జరీ లేకుండానే అవి కరిగిపోయేలా చేసి తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావచ్చో కనుగొన్నారు. కాకపోతే జీవన శైలి విషయంలో బాగా నిక్కచ్చిగా ఉండాలి.

ఏది విశిష్ట జీవన శైలి?
గుండె జబ్బులకైనా, మరే ఇతర జబ్బుల కైనా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విష పదార్థాలే కారణం. అయితే, శరీరంలో పేరుకుపోయిన కలుషితాలు, మలినాలే కాదు, శరీర అవసరం లేని లేదా శరీర అవసరానికి మించి శరీరంలో ఏది ఉన్నా, అది విషపదార్థంగానే పరిగణించబడుతుంది. ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉన్నా అవి విషపదార్థమే అవుతాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. వ్యాధికి మూలం విషపదార్థాలు కారణం కాబట్టి, వాటిని తొలగించడమే ఆ వ్యాధికి చికిత్స. ప్రకృతి వైద్య చికిత్సలోని మూల సూత్రమే ఇది.

గుండె రక్తనాళాల్లో అడ్డుంకులు రావడానికి కూడా శరీరంలోని విషపదార్థాలే కారణం. కాకపోతే ఒకప్పుడు గుండె నాళాల్లో అడ్డంకులు రావడానికి ఒకప్పుడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే కారణం అనుకునే వారు. అయితే ఆ అడ్డంకులు రావడానికి రక్తనాళాల్లో చేరిన కొవ్వు కణాల్లో వాపు ఏర్పడటం రక్తస్రావం కావడమే కారణమని కొత్తగా కనుగొన్నారు. ఈ రక్తస్రావం వల్ల రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు రావడానికి దారి తీస్తోందని స్పష్టం చేశారు. దీనికి శరీరంలో జరిగే ప్రతికూల చర్యలే కారణంగా కనపడుతున్నాయి. దీనికి తీసుకునే ఆహార పానీయాలు, మలబద్దకంతో పాటు మానసిక ఒత్తిళ్లు కూడా కారణంగా ఉంటున్నాయి. మన శరీరంలో కొన్ని వేల మైళ్ల నిడివిగల రక్తనాళాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ అనేది అంతటి సంకీర్ణమైన వ్యవస్థ. ఈ స్థితిలో ఎవరైనా ఎన్ని చోట్ల అని బైపాస్ సర్జరీ చేయించుకుంటారు? ఎన్నిసార్లని చేయించుకుంటారు? ఇది అవసరమా?

అసలైన ప్రత్యామ్నాయం
సర్జరీ కాకుండా ఆ స్థితినుంచి కాపాడే శాస్త్రీయమైన మరే మార్గమూ లేదా? రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండగలిగే స్థితిని కలిగించలేమా? అంటే చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా....క్రమం తప్పకుండా రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం. శ్రమ లేదా వాయామాల ద్వారా రక్తనాళాలు వ్యాకోచించి, అడ్డంకులు ఏర్పడిన సమయాల్లో కూడా ప్రాణాపాయం ఏర్పడకుండా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అలా కాకుండా మందుల మీదే పూర్తిగా ఆ«ధారపడితే, ఆ మందుల తాలూకు దుష్ప్రభావాలతో సమస్య మరింత తీవ్రం కావచ్చు. అందుకే శరీర వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.
8 ఆహార విషయాలు కూడా అంతే ముఖ్యం.

అందుకు వీలైనంత మేరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే ఉడికించిన వాటి కంటే ప్రకృతి నుంచి నేరుగా తీసుకునే ఆహార పదార్థాలు ఎంతో శ్రేష్టమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీన్ ఆర్నిశ్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతాడు. అందులో 90 శాతం మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవాలంటాడు. అలాగే ఉప్పు, మసాలాలు అతిగా వాడటం, రసాయనాలు, వస్తువుల్ని నిలువ ఉంచే ప్రిజర్వేటర్లు లేని పదార్థాలు తీసుకోవడం ఎంతో మేలు. అలాగే పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాల మోతాదును గణనీయంగా తగ్గించడం అవసరం. హెచ్‌డిఎల్ లేదా కొలెస్ట్రాల్ మన శరీరంలో కొవ్వుగా మన శరీరంలో నిలువె ఉంటుంది. అది మన అవసరానికి ఉపయోగపడుతుంది. అదే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అయితే రక్తంలో కలిసిపోయి రక్తనాళాల్లో అడ్డుపడి గుండె జబ్బులకు దారి తీస్తుంది.

ఆహార నియమాలు
8 రక్తప్రసరణలో ఈ అంతరాయాలేవీ రాకుండా ఉండాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. ఆహార పానీయాల్లో సిట్రస్ అంటే సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, విరివిగా తీసుకోవాలి. శరీరం బరువును బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో బియ్యం, గోదుమలకే పరిమితం కాకుండా, కొర్రలు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తీసుకోకపోవడం అన్ని విధాలా మేలు.

రోజూ ఒకే రకమైన ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరం అందులోని పోషకాలను సంగ్రహించే విషయంలో అనాసక్తి చూపుతుంది. అందువల్ల వాటిని తినడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. పైగా గోదుమల్లో గ్లూటన్ అనే జిగట పదార్థం పలురకాల అలర్జీలకు కారణమవుతుంది. అంతకు మించి ఇది మలబద్దకానికి కూడా కారణమవుతుంది. మలబద్దకం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇవి పరోక్షంగా గుండెజబ్బులకు రక్తనాళాల అంతరాయానికి కారణమవుతాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పీచుపదార్థాల్లో జీర్ణమయ్యేవి, జీర్ణం కానివి అంటూ రెండు రకాలుగా ఉంటాయి. వీటిలో జీర్ణమయ్యే పీచుపదార్థం ఎక్కువ మేలు చేస్తుంది. ఇది పేగుల్లో ఉంటూ మనకు ఉపయోగకరంగా ఉండే బ్యాక్టీరియాను పోషించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ జాగ్రత్తలన్నీ జీవక్రియలు సవ్యంగా జరిగి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

Courtesy with : డాక్టర్ కె. సత్యలక్ష్మి,డైరెక్టర్, వేమన యోగ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్,బేగంపేట్, హైదరాబాద్@salaka of Andhrajyoti newspaper.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No fear of heart attack if change in lifestyle,లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకుంటే హార్ట్ ఎటాక్ భయం ఉండదు






-


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --No fear of heart attack if change in lifestyle,లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకుంటే హార్ట్ ఎటాక్ భయం ఉండదు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



45 ఏళ్లు పైబడిన వారికే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అనుకుని మీరు గుండెపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉండిపోతే... ఏ క్షణమైనా గుండెపోటు రావచ్చు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్ల ఇప్పుడు యుక్త వయస్సులోనే గుండె జబ్బులు వచ్చిపడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవడంతో పాటు లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవాలి. అప్పుడే హార్ట్ ఎటాక్ భయం ఉండదని అంటున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండల్‌రావు.

అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో 60 ఏళ్లు పైబడిన వారిలో గుండె జబ్బులు కనిపిస్తే మనదేశంలో 40 ఏళ్లకే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కువ మరణాలు గుండె జబ్బుల మూలంగానే సంభవిస్తున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, జీవనవిధానమే అయినా ఇతర కారణాలు కూడా గుండె జబ్బులను తెచ్చిపెడుతున్నాయి.
ఫ్యామిలీ హిస్టరీ : కుటుంబంలో తల్లి లేక తండ్రికి గుండె జబ్బు ఉన్నట్లయితే వారి పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

స్మోకింగ్ : టీనేజ్‌లోనే గుండె జబ్బులు రావడానికి మరో కారణం స్మోకింగ్. ఫ్యాషన్‌గా మొదలైన ఈ అలవాటు తరువాత వ్యసనంగా మారుతుంది.
లైఫ్‌స్టయిల్ : సెడెంటరీ లైఫ్‌స్టయిల్ గడిపే వారిలోనూ గుండెపోటు అవకాశాలు ఎక్కువ. అంటే శారీరక శ్రమ లేకపోవడం, పిల్లలు టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, శారీరక శ్రమ ఉండే ఆటలకు దూరం కావడం వంటివి కారణమవుతున్నాయి.

స్థూలకాయం : అధిక బరువు మరో కారణం. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు అలవాటు పడటం, పిజ్జాలు, బర్గర్లు తినడం, వేపుళ్లు ఎక్కువగా ఇష్టపడటం, స్వీట్స్ తినడం వంటి ఆహారపు అలవాట్లు అధిక బరువుకు కారణమవుతాయి. అధిక బరువు గుండె జబ్బులు రావడానికి దోహదం చేస్తుంది.
డయాబెటిస్ : కొందరు యుక్త వయసులోనే షుగర్ వ్యాధి బారినపడతారు. అటువంటి వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది.
ఒత్తిడి : వృత్తి పరమైన ఒత్తిడి, కుటంబపరమైన ఒత్తిడి కూడా గుండె జబ్బులకు కారణమవుతోంది.

డిప్రెషన్ : డిప్రెషన్ కూడా గుండె జబ్బులకు కారణమవుతుంది. డిప్రెషన్ వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్ఎటాక్ రిస్క్ పెరుగుతుంది.
హై బీపీ : అధిక రక్తపోటు కూడా ఒక కారణం. యుక్తవయస్కుల్లో ప్రిహైపర్‌టెన్షన్ కనిపిస్తుంది. అంటే రక్తపోటు 130/90 లేక 140/100 ఉంటుంది. ఈ దశలో బీపీని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావచ్చు. లేదంటే రిస్క్ పెరుగుతుంది.

ఏం జరుగుతుంది?
రక్తంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినపుడు రక్తనాళాల్లోని గోడల్లో పేరుకుపోతుంది. ఫలితంగా గుండె రక్తసరఫరా జరగక హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోకుండా చూస్తుంది. ఒకవేళ మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు బ్లాక్స్ ఏర్పడి హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది.

తల్లిదండ్రుల పాత్ర కీలకం
పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా స్థూలకాయం సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ కొరవడితే వాళ్లు యుక్తవయస్సు వచ్చే సరికే గుండె జబ్బులు వస్తాయి. దీంతోపాటు స్మోకింగ్ వల్ల కలిగే నష్టాన్ని పిల్లలకు వివరించాలి. బాల్యంలో నేర్పించిన అలవాట్లు జీవితాంతం ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఏం చేయాలి?
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. నూనె ఎక్కువగా వాడకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేకన్నా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. పిల్లలకు బాల్యం నుంచే మంచి ఆహారపు అలవాట్లను నేర్పించాలి. కుటుంబసభ్యుల్లో ఎవరైనా గుండె జబ్బులతో బాధపడుతుంటే వారి పిల్లలు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. చెమట అధికంగా వస్తున్నా, ఆయాసంగా అనిపిస్తున్నా, ఏమాత్రం సందేహంగా అనిపించినా వైద్యులను సంప్రదించాలి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే ఆహార నియమాలు పాటించాలి. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే డైట్ కంట్రోల్ చేయడం ద్వారా తగ్గేలా చూసుకోవాలి. మందుల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చిన్న వయసులో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

Courtesy with : డాక్టర్ కొండల్‌రావు,సీనియర్ కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్, హైదరాబాద్@sakala of andhrajyothy news paper
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, October 18, 2013

Stomach-స్టమక్‌ ఫ్లూ








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Stomach-స్టమక్‌ ఫ్లూ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఫ్లూ అనగానే తుమ్ములు, ముక్కు కారటం, గొంతునొప్పి గుర్తుకొస్తాయి. కానీ  స్టమక్‌ ఫ్లూ అనే సమస్యలూ ఉన్నాయని మీకు తెలుసా?

నిజానికి స్టమక్‌ ఫ్లూ మామూలు ఫ్లూ ఒకటి కాదు. జలుబు లక్షణాలతో కూడిన మామూలు ఫ్లూ వైరస్‌ల వల్ల వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల వంటి పలు కారకాలతో వచ్చే స్టమక్‌ ఫ్లూ ఒక జీర్ణకోశ సమస్య. కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీరు, లాక్టోజ్‌ పడకపోవటం మూలంగా ఇది రావొచ్చు. మల విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం కూడా దీనికి దారితీయొచ్చు. గర్భిణులకు, చిన్నపిల్లలకు, పోషణ లోపంతో బాధపడేవారికి, రోగ నిరోధకశక్తి తక్కువగా గలవారికి, వృద్ధులకు దీని ముప్పు ఎక్కువ.

లక్షణాలు
* కడుపు కండరాలు పట్టేయటం
* కడుపు నొప్పి
* వికారం
* వాంతి
* నీళ్ల విరేచనాలు

స్టమక్‌ ఫ్లూ కారక సూక్ష్మక్రిములను బట్టి జ్వరం, తలనొప్పి, లింఫ్‌ గ్రంథుల వాపు వంటివీ ఉండొచ్చు. ఈ ఫ్లూ తీవ్రమైతే ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి తరచుగా ద్రవాలు తీసుకుంటే డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు.

  • ====================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Stomach migrine-స్టమక్‌ మైగ్రేన్‌








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Stomach migrine-స్టమక్‌ మైగ్రేన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మైగ్రేన్‌ అనగానే మనకు తీవ్రమైన తలనొప్పి గుర్తొస్తుంది.  కానీ స్టమక్‌ మైగ్రేన్‌ అనే సమస్యలూ ఉన్నాయని మీకు తెలుసా?
ఇది పార్శ్వనొప్పుల్లోని ఒకరకం. పెద్దల్లో అరుదు గానీ పిల్లల్లో తరచుగా కనిపిస్తుంది. సాధారణంగా కుటుంబంలో పార్శ్వనొప్పి బాధితులు గలవారి పిల్లలకు వస్తుంది. దీని బారినపడ్డ పిల్లలకు పెద్దయ్యాక పార్శ్వనొప్పి వచ్చే అవకాశమూ ఉంది. స్టమక్‌ మైగ్రేన్‌లో కడుపు మధ్యలో, బొడ్డు సమీపంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ సమస్యకు కచ్చితమైన కారణమేంటో బయటపడలేదు. కానీ హిస్టమిన్‌, సెరటోనిన్‌ రసాయనాల్లో మార్పుల మూలంగా వస్తుందని భావిస్తున్నారు. మానసిక అంశాలూ దోహదం చేస్తాయి. అలాగే నైట్రేట్లతో కూడిన మాంసం, చాక్లెట్లు కూడా దీన్ని ప్రేరేపిస్తాయి.

లక్షణాలు
* కడుపు మధ్యభాగంలో తీవ్రమైన నొప్పి
* వికారం
* వాంతి
* చర్మం పాలిపోవటం
* ఆకలి లేకపోవటం, ఆహారం తీసుకోకపోవటం

స్టమక్‌ మైగ్రేన్‌లో కడుపు నొప్పి ఒక గంట నుంచి మూడు రోజుల వరకు ఉండొచ్చు. ఇది ఎలాంటి హెచ్చరికలు లేకుండానే హఠాత్తుగా రావొచ్చు. మామూలు కడుపునొప్పికీ దీనికీ తేడాలను గుర్తించటం అంత తేలిక కాదు. అందువల్ల దీన్ని నిర్ధరించటం కష్టం. దీన్ని గుర్తించటంలో కుటుంబ చరిత్రే కీలకం. ప్రస్తుతానికి దీనికి కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. ఇతర పార్శ్వనొప్పులకు ఇచ్చే మందులే ఇందులోనూ ఇస్తారు. కొందరికి సెరటోనిన్‌ బ్లాకర్లు, ట్రైసీలిక్‌ యాంటీడిప్రెసెంట్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఏయే పదార్థాలు కడుపునొప్పిని ప్రేరేపిస్తున్నాయో గుర్తించి వాటికి దూరంగా ఉంటే స్టమక్‌ మైగ్రేన్‌ను నివారించుకోవచ్చు. పెద్దవాళ్లు ఒత్తిడిని నియంత్రించుకోవటం, ఆరోగ్యకరమైన జీవనశైలితో దీన్ని దూరంగా ఉంచుకోవచ్చు.


  • =======================

 Visit my website - > Dr.Seshagirirao.com/

Intra uterine Foetal defects awareness , తల్లిగర్భంలో బిడ్డకు తలెత్తే లోపాలు-అవగాహన








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తల్లిగర్భంలో బిడ్డకు తలెత్తే లోపాలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిండం ఎదిగే క్రమంలో తల్లిగర్భంలో తలెత్తే లోపాలు, పుట్టుకతో వచ్చే చాలా అవకరాలను నేడు సమర్థంగా చక్కదిద్దే అవకాశం ఉంది. కాబట్టి బిడ్డకు ఏదో సమస్య ఉందని తెలియగానే విపరీతంగా ఆందోళనలో కూరుకుపోవాల్సిన పనిలేదు. ఆ సమస్య ఏమిటి? దాన్ని అధిగమించేందుకు మన ముందున్న మార్గాలేమిటి? దీనికి వైద్యులు ఎటువంటి సహాయం అందిస్తారన్నది తెలుసుకుని.. అవగాహన పెంచుకుని.. దాన్నిబట్టి ఒక నిర్ణయానికి రావటం ప్రధానం.

లోపం..
స్త్రీపురుష సమాగమంలో ఏకమయ్యేది సూక్ష్మాతిసూక్ష్మమైన అండం, శుక్రం! కంటికి కనిపించని ఆ రెండూ కలిసి ఏర్పడే ఓ అతి చిన్న ఏక కణం... ఎన్నో అవయవాలతో, వ్యవస్థలతో నడయాడుతుండే.. ఓ పండంటి బిడ్డగా పురుడుపోసుకోవటం.. ప్రకృతిలోకెల్లా ఓ అత్యద్భుత పరిణామం! పైకి చాలా సహజంగా జరిగిపోతున్నట్టే అనిపించినా నిజానికి ఇదో సంక్లిష్టమైన జీవ నిర్మాణ ప్రక్రియ. అందుకే ఈ క్రమంలో ఎక్కడైనా తేడాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా పిండం వేగంగా మార్పులు చెందే క్రమంలో 3 నుంచి 8 వారాల మధ్య ఇటువంటి తేడాలొచ్చి.. అవే లోపాలుగా తయారవుతుంటాయి. చాలా రకాల లోపాలకు బీజాలు 5వ వారంలో పడుతుంటాయి. కొన్నిసార్లు ఒక్కటే లోపం ఉండొచ్చు.. కొన్నిసార్లు చాలారకాల లోపాలు కలగలిసి ఉండొచ్చు. వీటిని గుర్తించేందుకే గర్భిణులకు వైద్యులు మధ్యమధ్యలో స్కానింగులు చేస్తుంటారు. సాధారణంగా పిండదశలో తలెత్తే పలురకాల లోపాలు 18-28 వారాల మధ్య చేసే స్కానింగులో బయటపడతాయి. అయితే ఈ లోపాలన్నీ కూడా ప్రమాదకరమైనవేం కాదు. వీటిలో చాలా లోపాలు తల్లి కడుపులోనే... కాన్పు అయ్యేలోపే సర్దుకుంటుంటాయి కూడా. కొన్ని లోపాలు అలా మిగిలిపోయినా వాటివల్ల తీవ్రమైన నష్టమేమీ ఉండదు. ఇక కొన్ని లోపాలను బిడ్డ పుట్టగానే ఆపరేషన్‌ చేసి చాలా వరకూ చక్కదిద్దచ్చు. ఇటువంటి ఆపరేషన్ల విషయంలో ఇప్పుడు 'పీడియాట్రిక్‌ సర్జరీ' విభాగం ఎంతో పురోగమించింది కూడా.

గుర్తించేదెలా?
కడుపులో పిండం ఎదుగుదలను అంచనా వేసి లోపాలేమైనా తలెత్తుతున్నాయా? అన్నది తేల్చిచెప్పేందుకు ఇప్పుడు చాలా రకాల పరీక్షా పద్ధతులున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌. దీనిలో- ఏ వారానికి పిండం ఎదుగుదల ఎంత ఉండాలో అలాగే ఉందా? ఆ క్రమంలో ఏవైనా లోపాలు తలెత్తుతున్నాయా? ఉమ్మనీరు తగినంతగా ఉందా? మాయ ఎలా ఉంది? తల్లి నుంచి బిడ్డకు బొడ్డు తాడు గుండా రక్తప్రసారం బాగుందా? తదితర అంశాలన్నీ తెలుస్తాయి. 11-14 వారాల మధ్య స్కానింగు (ఎన్‌టీ స్కాన్‌) చేసి పిండం మెడ దగ్గరి ముడతల మందం ఎంత ఉందన్నది చూస్తారు. ఈ మందాన్ని బట్టి బిడ్డకు తీవ్రస్థాయి క్రోమోజోముల లోపాలుగానీ, బుద్ధిమాంద్యం వంటి తీవ్ర సమస్యలుగానీ తలెత్తే అవకాశం ఉందేమో అంచనా వేస్తారు. ఇక 18-23 వారాల మధ్య ఇలాంటిదే మరో స్కానింగు (టిఫా స్కాన్‌) చేసి... బిడ్డలో నిర్మాణపరంగా ఎక్కడెక్కడ లోపాలు తలెత్తే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలన్నీ ఒక పద్ధతి ప్రకారం క్షుణ్ణంగా పరీక్షిస్తారు. సాధారణంగా ఎటువంటి పెద్ద, చిన్న లోపాలున్నా దీనిలో గుర్తించే వీలుంటుంది. ఇక పిండం గుండె పనితీరు ఎలా ఉంది? దానిలో రక్తప్రసారం బాగుందా? తదితర వివరాలు తెలుసుకునేందుకు 'ఫీటల్‌ ఎకోకార్డియోగ్రఫీ' పరీక్ష చేస్తారు. ఇది కూడా తల్లి పొట్ట మీది నుంచి చేసే స్కానింగు వంటిదే. ఇవి కాకుండా సాధారణంగా 23-28 వారాల మధ్య చేసే 'త్రీడీ', 'ఫోర్‌డీ' స్కానింగులతో బిడ్డ స్వరూపం, కొంత వరకూ అంతర్గత అవయవాల నిర్మాణాన్ని కూడా తెలుసుకోవచ్చు. వీటికి తోడు గర్భిణులందరికీ కొన్ని రక్తపరీక్షలు చేసి 'ఆల్ఫా ఫీటో ప్రోటీన్‌' వంటివి చూస్తే మరికొంత సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ బిడ్డలోని లోపాలను పట్టిచూపించే సాధారణ పరీక్షా విధానాలు. అయితే ఏదైనా బలమైన అనుమానం తలెత్తితే.. 10-12 వారాల మధ్య మాయ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం (కోరియానిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌), 15-20 వారాల మధ్య తల్లి పొట్ట మీది నుంచి సూదితో ఉమ్మనీరు తీసి పరీక్షించటం (ఆమ్నియోసెంటిసిస్‌) వంటివి కూడా చాలా సమాచారాన్ని అందిస్తాయి.

లోపాలుంటే...?
ఏదైనా లోపం తలెత్తుతోందని గుర్తించినప్పుడు రకరకాల విభాగాలకు చెందిన వైద్యనిపుణులతో చర్చించి.. లోపం స్వభావం ఏమిటి? దానివల్ల బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? చక్కదిద్దే మార్గాలేమిటి? అన్నది చర్చించి.. తల్లిదండ్రులకు సమగ్రంగా వివరిస్తారు. తల్లీబిడ్డలిద్దరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరాన్ని బట్టి ఐసీయూ వంటి సదుపాయాలున్న పెద్ద ఆసుపత్రిలో కాన్పు చేసి.. వెంటనే బిడ్డ సంరక్షణ బాధ్యత చేపడతారు.

లోపాలుంటే.. మార్గాలు?
1. పిండ దశలోనే మరమ్మతులు చెయ్యటం.. ఇది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న వినూత్న విధానం. ప్రస్తుతానికి ఇలా చాలా కొద్ది సమస్యలను మాత్రమే చక్కదిద్దచ్చు. ముఖ్యంగా పిండానికి మూత్రాశయం మూసుకుపోయి, మూత్రం లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలను షంట్‌ అమర్చటం ద్వారా కొంత వరకూ సరిచేస్తున్నారు. పిండంలో గుండె సమస్యల వంటివి చక్కదిద్దే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తానికి పిండానికే మరమ్మతులు చేసే నైపుణ్యం ఇంకా అందుబాటులో లేదనే చెప్పాలి.

2. గర్భాన్ని అలాగే కొనసాగించి.. బిడ్డ పుట్టగానే లోపాన్ని చక్కదిద్దటం: ప్రస్తుతం చాలా సమస్యల విషయంలో ఇది సాధ్యమవుతోంది. గర్భంలోనే సమస్యను గుర్తించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని.. మంచి సదుపాయాలున్న ఆసుపత్రిలో కాన్పు చేసి వెంటనే బిడ్డకు సంరక్షణ కల్పించి.. క్రమేపీ లోపాన్ని సరిదిద్దటం.. ఇప్పుడిలా చాలా సమస్యలను చక్కదిద్దచ్చనే చెప్పొచ్చు.

3. గర్భస్రావం చెయ్యటం: బిడ్డలో లోపాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, ఏ రకమైన వైద్యసేవలు అందించినా బిడ్డ మనుగడ, సాధారణ జీవనం కష్టమని గుర్తించినప్పుడు గర్భస్రావం చేయించుకునే అవకాశం గురించి కూడా వైద్యులు చర్చిస్తారు.

ఆదుకునే వైద్యం
మన మెదడు, వెన్నుపాము చుట్టూ నీరులాంటి ద్రవం (సీఎస్‌ఎఫ్‌) ఉంటుంది. దీని ప్రవాహ మార్గంలో ఎక్కడన్నా అవరోధాలు తయారైతే ఈ ద్రవం ఎక్కువైపోయి.. తల పెద్దగా కనబడుతుంటుంది. మెదడులోని ఆ చుట్టుపక్కల భాగాలన్నీ నొక్కుకుపోయి.. మెదడు దెబ్బతినొచ్చు. దీన్నే 'హైడ్రోసెఫాలస్‌' అంటారు. దీనివల్ల తర్వాత్తర్వాత బిడ్డ కదలికలు దెబ్బతినటం, మేధస్సు పెరగకపోవటం వంటి రకరకాల దుష్ప్రభావాలు రావచ్చు. ఈ సమస్యను 18-23 వారాల మధ్య చేసే 'టిఫా స్కానింగు'లోనే గుర్తించొచ్చు. ప్రతి 2000 కాన్పుల్లో ఒకరు ఇటువంటి లోపంతో పుడుతుంటారు. ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువ. వీరిలో చాలామందికి ఇతరత్రా సమస్యలూ ఉండే అవకాశమూ ఉంది. కొన్నిసార్లు వీరిలో క్రోమోజోముల లోపాలూ ఉండొచ్చు కాబట్టి ఉమ్మనీరు తీసి పరీక్షిస్తారు. ఇక అప్పటి నుంచీ బిడ్డ మెదడు సైజు గమనిస్తూనే ఉంటారు.

* సాధారణంగా- బిడ్డ పుట్టిన తర్వాత.. మెదడు చుట్టూ చేరిపోయిన నీరు తగ్గేందుకు ఒక ఆపరేషన్‌ చేసి మెదడు నుంచి పొట్టలోకి ఒక గొట్టం (వి.పి.షంట్‌) అమరుస్తారు.

* ఆందోళనకరం- మెదడులో నీరు చేరే ప్రాంతమైన వెంట్రికల్స్‌ 15ఎంఎం కంటే పెద్దగా అయినా.. మెదడు కార్టెక్స్‌ పరిమాణం 1.5 సెం.మీ. కన్నా తక్కువగా ఉన్నా... తలసైజు వేగంగా పెరుగుతున్నా పరిస్థితి బాగలేదనే అర్థం. ఇటువంటి బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధారణ జీవనం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
తల్లి కడుపులో పెరుగుతున్న పిండానికి కిడ్నీల్లో నీరు చేరి, అది పెరగుతుండటం సమస్యే. దీన్ని 'హైడ్రోనెఫ్రోసిస్‌' అంటారు. కిడ్నీల్లో నుంచి బయటకొచ్చే మూత్రనాళాల దగ్గర ఏదైనా అవరోధం ఏర్పడితే కిడ్నీల్లో ఇలా మూత్రం పెరిగి నీరు చేరినట్లవుతుంది. దీనికి చాలా అంశాలు కారణం కావచ్చు. దీన్ని 20-24 వారాలప్పుడు చేసే స్కానింగులో గుర్తిస్తారు. వాపు స్వల్పంగా ఉంటే (మైల్డ్‌ హైడ్రోనెఫ్రోసిస్‌) దీనివల్ల బిడ్డ కిడ్నీలకు పెద్దగా ఇబ్బందేం ఉండదు.

* సాధారణంగా- సమస్య ఒక కిడ్నీకే ఉన్నప్పుడు క్రమేపీ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత 4 వారాలకు పరిస్థితి ఒకసారి గమనించి.. అప్పుడు అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచెయ్యచ్చు. ఇలా హైడ్రోనెఫ్రోసిస్‌ సమస్యతో పుట్టిన బిడ్డల్లో 33% మందికే ఇటువంటి సర్జరీ అవసరమవుతుంటుంది. మిగతా వారికి ఏ ఇబ్బందీ ఉండదు.

* ఆందోళనకరం- పిండం రెండు కీడ్నీల్లోనూ నీరుచేరినా, కిడ్నీలతో పాటు మూత్రనాళం-మూత్రాశయం కూడా ఉబ్బిపోయినా, ఉమ్మనీరు చాలా తక్కువగా ఉన్నా, కిడ్నీల నుంచి మూత్రాన్ని బయటకు తెచ్చే నాళం వ్యాసార్థం 20 ఎంఎం కంటే ఎక్కువగా ఉన్నా, కిడ్నీల కణజాలం బాగా క్షీణించినా తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
పిండం దశలో మన మెదడు, వెన్నుపాము వంటివన్నీ కూడా ఒకే రకమైన గొట్టం కణజాలం (న్యూరల్‌ ట్యూబ్‌) నుంచి తయారవుతాయి. ఈ క్రమంలో ఈ గొట్టం ఎక్కడన్నా ఒకచోట పూడకుండా ఉండిపోతే.. అక్కడి నుంచి లోపలి నాడులు, పొరలన్నీ ఒక బుడిపెలా బయటకు తోసుకొస్తాయి. దీన్నే 'మైలో మినింగోసీల్‌' అంటారు. ఇది 4-6 వారాల మధ్యే తలెత్తే లోపం.

* దీన్ని సాధారణ స్కానింగుల్లో గుర్తించొచ్చు. అనుమానం వస్తే స్పష్టత కోసం ఎమ్మారై చేయిస్తారు. ఇతరత్రా మరేమన్నా సమస్యలున్నాయేమో కూడా చూస్తారు. వెన్ను లోపం అంత తీవ్రంగా లేనప్పుడు కొందరిలో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. పుట్టగానే సాధ్యమైనంత త్వరగా వెన్ను పూడ్చేందుకు ఆపరేషన్‌ చేస్తారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో నడవలేకపోవటం, మలమూత్రాలపై పట్టులేకపోవటం వంటి తీవ్ర ఇబ్బందులూ ఉండొచ్చు.

* ఆందోళనకరం- వెన్ను మీద సమస్య మరీ పెద్దదిగా ఉన్నప్పుడు, పిండం కదలికలు సరిగా లేనప్పుడు, పిండం మూత్రాశయం నిండటం-ఖాళీ అవ్వటం సరిగా లేనప్పుడు, దీనితో పాటు మెదడులో నీరు చేరే 'హైడ్రోసెఫాలస్‌' సమస్య కూడా ఉన్నప్పుడు ఫలితాలు తీవ్రంగా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో వైద్యులు రకరకాల మార్గాల గురించి చర్చిస్తారు.
పొట్టలోని పేగులనూ, ఛాతీలోని వూపిరితిత్తులనూ వేరుచేస్తూ మధ్యలో డయాఫ్రమ్‌ పొర ఉంటుంది. అన్నవాహిక.. ఈ మందపాటి పొర మధ్య నుంచే కిందికి వెళుతుంటుంది. పిండం ఎదుగుదలో కొందరికి కింది నుంచి పేగులు ఈ పొర గుండా పైకి తోసుకొచ్చి.. వూపిరితిత్తులను నొక్కేస్తుంటాయి. (డయాఫ్రమాటిక్‌ హెర్నియా) ఇది స్కానింగులో బయటపడుతుంది. ఇలా నొక్కేస్తుండటం వల్ల వీరిలో వూపితిత్తులు సరిగా తయారవ్వకపోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే గుండె, రెండు వూపిరితిత్తులూ కూడా నొక్కుకుపోతాయి.

* ఒకవైపు వూపిరితిత్తి మాత్రమే నొక్కుకుపోతూ సమస్య అంత తీవ్రంగా లేనప్పుడు పరిస్థితిని గమనిస్తూ కాన్పు అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చేయటం మంచిది. తర్వాత బిడ్డకు కృత్రిమ శ్వాస కల్పించి ఆపరేషన్‌ చేస్తారు.

* ఆందోళనకరం- దీన్ని తొలివారాల్లోనే గుర్తించినా, ఇది కుడివైపున్నా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉన్నా, కొంత లివర్‌ కూడా ఛాతీలోకి తోసుకుపోయినా, వూపిరితిత్తుల ఎదుగుదల తీవ్రంగా దెబ్బతిన్నా.. ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
వూపిరితిత్తుల్లో నీటితిత్తుల్లాంటి గడ్డ తయారవ్వటం (సీసీఏఎమ్‌) మరో సమస్య. సాధారణంగా ఇది పిండంలో ఒకవైపు వూపిరితిత్తిలో వస్తుంది. మగపిల్లల్లో ఎక్కువ. ఇది స్కానింగుల్లో బయటపడేదే.

* సాధారణంగా వీటిలో కొన్ని కాన్పు అయ్యేలోపే.. లోపలే తగ్గిపోతాయి. కాన్పు వరకూ ఉంటే.. ప్రసవం తర్వాత సర్జరీతో తొలగిస్తారు. శ్వాస బాగుంటే సర్జరీ కూడా 2-6 నెలల తర్వాత చెయ్యచ్చు.

* ఆందోళనకరం- గడ్డ పెద్దగా ఉండి, గుండె మరో వైపునకు తోసుకుపోయినప్పుడు, ఒళ్లంతా నీరు చేరినప్పుడు, బిడ్డలో లక్షణాలన్నీ తల్లిలో కూడా కనబడుతూ తల్లికి కూడా హాని జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు... దీని గురించి తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది.
పిండం కిడ్నీలు 5వ వారం నుంచే పని చేస్తుంటాయి. ఇవి తయారు చేసిన మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండి.. అప్పుడప్పుడు ఉమ్మనీటిలో కలుస్తుంటుంది. కొన్నిసార్లు ఈ విసర్జన మార్గం మూసుకుపోయి విసర్జన ఆగిపోతుంది. ఇది మగపిల్లల్లో ఎక్కువ. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సమస్య ఓ మోస్తరుగా ఉంటే కాన్పు తర్వాత దశలవారీగా సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.

* ఆందోళనకరం- ఉమ్మనీరు బాగా తక్కువున్నప్పుడు, పిండం మూత్రాశయం ఎప్పుడూ ఖాళీగానే కనబడుతున్నప్పుడు, పిండం కిడ్నీల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు, కిడ్నీలూ, మూత్రనాళాలన్నీ ఉబ్బిపోయి, మూత్రాశయం మాత్రం చిన్నగా ఉండిపోయినప్పుడు సమస్య తీవ్రంగా ఉందని అర్థం.
అరుదుగా మరికొన్ని...
* బయటే పేగులు: చాలా అరుదుగా.. అంటే 5-10 వేల కాన్పుల్లో ఒకరికి... పొట్టలోపలి పేగుల వంటివి బయటే ఉండిపోతాయి. ఇలాంటివి మగపిల్లల్లో ఎక్కువ. వీటిని స్కానింగులో గుర్తిస్తారు. పేగులు మరీ ఎక్కువగా బయట లేకపోతే.. పుట్టగానే వాటిని లోపలికి నెట్టేస్తూ సర్జరీ ద్వారా చక్కదిద్దచ్చు. పేగులు చాలా భాగం బయట ఉంటే.. ముందు పేగులను బయట ఒక సైలాస్టిక్‌ తిత్తిలో ఉంచి, 7-10 రోజుల్లో క్రమంగా వాటిని లోపలికి పంపిస్తూ లోపాన్ని సరిచేస్తారు.

* గొట్టాలు కలిసిపోవటం: అన్నవాహిక, గాలి గొట్టం పక్కపక్కనే ఉంటాయి. పిండం దశలో ఈ రెండూ ఒక గొట్టం నుంచే తయారవుతాయి. కానీ అరుదుగా.. ప్రతి 4000 కాన్పుల్లో ఒకరికి.. ఈ అన్నవాహిక సరిగా తయారవ్వక ఈ గొట్టాలు రెండూ కలిసిపోయే ఉండొచ్చు. (ట్రెకియో-ఈసోఫేగల్‌ ఫిస్టులా) ఇది కూడా మగపిల్లల్లోనే ఎక్కువ. అన్నవాహిక లేకపోవటం వల్ల లాలాజలం వంటివి నేరుగా వూపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి న్యుమోనియా వంటి సమస్యలు ముంచుకొస్తాయి. బిడ్డ పుట్టగానే సర్జరీలతో దీన్ని చక్కదిద్దుతారు.

* పొట్టలో కణుతులు.. పొట్టలో ఏ ప్రాంతంలోనైనా నీటి తిత్తుల వంటివి రావచ్చు. ఇవి ఎక్కడొచ్చినా పొట్టకు సాగే గుణం ఉంది కాబట్టి వీటి ఒత్తిడి వల్ల ఇతరత్రా సమస్యలు రావటం తక్కువే. వీటిని స్కానింగుల్లో గుర్తిస్తారు. వీటితో పాటుగా ఇతరత్రా సమస్యలు కూడా ఉంటే తప్పించి... సాధారణంగా వీటివల్ల పెద్ద సమస్యలేమీ ఉండవు. కాన్పు తర్వాత.. వీటిని సర్జరీ చేసి తొలగించొచ్చు. ఫలితాలు కూడా బాగుంటాయి.

--Courtesy with Dr.A.Narendrakumar , professor , Paediatric surgery , hyderabad@eenadu sukhibhava.

  • =========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Wednesday, October 9, 2013

Hints to reduce body,సన్నబడేందుకు సూచనలు


  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సన్నబడేందుకు సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 ఈ క్రింది సూచన్లు సన్నబడేందుకు సహకరిస్తాయి .
సన్నబడేందుకు ఆహారంలో చేసుకునే మార్పులతో పాటూ రకరకాల వ్యాయామ పద్ధతుల్నీ మనం ఎంచుకుంటాం. కానీ ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామాలూ, యోగాసనాలూ అంటే విసుగు రావడం సహజం. అలాగని వాటిని చేయకుండా ఉండటమూ సబబు కాదు. అందుకే కొన్ని రోజులు డాన్స్‌ చేసి చూడండి. ఆనందంగానూ ఉంటుంది. వ్యాయామమూ అందుతుంది. చాలామంది మహిళలకు నడుమూ, పిరుదుల భాగాల్లో చేరిన కొవ్వు కరిగించడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటి వారు నడుముని గుండ్రంగా తిప్పుతూ బెల్లీ డాన్స్‌ చేయడంతో సన్నబడొచ్చు. దీనివల్ల నడుము కింది భాగం తీరైన ఆకృతిలోకి వస్తుంది. రోజులో ఓ గంట బెల్లీ డాన్స్‌ చేయడం వల్ల 250 నుంచి 300 కెలొరీలు ఖర్చవుతాయి. ఒక్కరే డాన్స్‌ క్లాసుకి వెళ్లడం విసుగు అనుకునే వారు, జంటగా సల్సా చేయొచ్చు. దీనివల్ల సన్నబడటం ఒక్కటే కాదు... భార్యాభర్తల మధ్య అనుబంధమూ పెరుగుతుంది. గంటసేపు సల్సా చేస్తే చాలు.. దాదాపు ఐదొందల కెలొరీల ఖర్చవుతాయి. ఇక తక్కువ సమయంలోనే సన్నబడాలి అనుకునే వారు హిప్‌హాప్‌ని ఎన్నుకోవాలి. ఇది చేయడానికి కొద్దిగా శక్తి అవసరమే. కానీ ఏకాగ్రతగా గంటసేపు చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఏ డాన్స్‌ని ఎంచుకుని, ఎన్ని రోజులు శిక్షణ తరగతులకి వెళ్లాలి అనేది డాక్టర్‌ సలహా ప్రకారం చేయాలి.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Hints for good sleep,హాయి నిద్రకు కొన్ని సూచనలు

  •  
 
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - హాయి నిద్రకు కొన్ని సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిత్యం వేధించే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. దీనికి ఆహారపుటలవాట్లూ, అనారోగ్య సమస్యలతో పాటూ జీవనశైలీ కారణమే. అందుకే ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో సరి చూసుకుని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. తీసుకున్న ఆహారానికి తగిన శారీరక శ్రమలేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. అలాని ఎప్పుడు పడితే అప్పుడు వ్యాయామం చేయొచ్చు అనుకోవద్దు. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందు వ్యాయామం చేయకూడదు. వాటివల్ల కండరాలు ఉత్తేజితమై శరీరం చురుగ్గా మారుతుంది. దాంతో వెంటనే నిద్రపట్టదు. అలాగే నిద్రపోవడానికి కనీసం నాలుగైదు గంటల ముందు కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. వీటిల్లో ఉండే కెఫీన్‌ నిద్రను దూరం చేస్తుంది.

తరచూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లూ, అంతర్జాలంలో శోధన చేసే అలవాటు మీకుందా? ఇదీ నిద్రలేమికి దారితీస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. ఇలాకాకుండా పడుకోబోయే ముందు కాసేపు మంచి పుస్తకం చదివే అలవాటు చేసుకోండి. చాలామంది పడుకొనే ముందు స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది అనుకుంటారు. దానివల్ల శరీరానికి చురుకుదనం వస్తుందే తప్ప ఓ పట్టాన కునుకు రాదంటున్నారు అధ్యయన కర్తలు. అందుకే పడుకోవడానికి కనీసం గంట ముందు మాత్రమే స్నానం చేయాలి. నిద్రపోయే ముందు ఎక్కువగా హింస ఉండే టీవీ కార్యక్రమాలూ... రణగొణధ్వనులతో వస్తోన్న మ్యూజిక్‌ వినడం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఇలాంటివి కలత నిద్రకు కారణమవుతాయి.

సుఖనిద్రకు కొన్ని సూచనలు...

    * నిద్రపోయే ముందు బ్రష్‌ చేసుకొని, ముఖం, కాళ్ళూ, చేతులూ కడుక్కోవాలి.
    * నిద్రపోయే రెండు గంటల ముందు ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు.
    * నిద్రకు ముందు మద్యం సేవించరాదు.
    * ప్రశాంతంగా, చల్లగా, గాలీ వెలుతురు వచ్చే ప్రదేశంలో నిద్రించాలి.
    * మంచి నిద్ర కోసం కుడివైపు తిరిగి పడుకోవడం మంచిది.
    * నిద్రించే సమయంలో వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
    * నిద్రకు గంట ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.,
    * నిద్రపోయే ముందు మాడుకు, అరికాళ్ళను నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్‌ చేసుకుంటే ఉపయుక్తం.,
    * నిద్రకు ముందు ఒక కప్పు వెచ్చటి పాలు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది.
    * పడకపై చేరిన తరువాత  టివి చూడడం, రాయడం లేదా ఆలోచించడం వంటివి చూయవద్దు.
    * చక్కటి సంగీతాన్ని వినడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకోగలం.
    * పడుకోవటానికి 2 గంటల ముందు నుంచి ఇంట్లో తక్కువ కాంతినిచ్చే దీపాలు వాడుకోవాలి.

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, October 7, 2013

Hormone replacement therapy(HRT)in woman,స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)


  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    కొన్నిరకాల అనారోగ్యాలు రావడానికి హార్మోన్లలో మార్పులు చోటుచేసుకోవడం ఎంత వాస్తవమో.. కొన్నిరకాల సమస్యల్ని నివారించడంలోనూ వాటి వాడకం అంతే కీలకం. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)గా పరిగణించే ఆ వైద్యం వల్ల లాభాలెంతో.. సమస్యలూ అంతే స్థాయిలో ఎదురవుతాయి. అందుకే వాటిని అవసరాన్ని బట్టే వాడాలి తప్ప అతిగా కాదు.

చాలామంది మెనోపాజ్‌ తరవాత మాత్రమే హార్మోన్లతో అవసరం ఉంటుందనుకుంటారు కానీ.. మహిళలకు ఎదురయ్యే కొన్నిరకాల అనారోగ్యాలకు హార్మోన్లనే మందులుగా ఇస్తారు. రుతుక్రమం మొదలైంది మొదలు మెనోపాజ్‌ వరకూ ఈ హార్మోన్లను వివిధ దశల్లో ఎప్పుడో ఒకప్పుడు వాడాల్సి రావచ్చు. హార్మోన్‌ థెరపీ అంటే స్త్రీ హార్మోన్లుగా పరిగణించే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ల మేళవింపుతో చేసే చికిత్స. ముందు వీటిని ఎందుకు వాడతారో తెలుసుకుందాం.

  • అధిక రక్తస్రావం అదుపులో..
కొందరికి నెలసరి సమయంలో అధికరక్తస్రావం బాధిస్తుంది. అప్పుడు సమస్య తీవ్రతను బట్టి హార్మోన్లను గర్భనిరోధక మాత్రల రూపంలో ఇస్తారు. దాంతో అధికరక్తస్రావం తగ్గి, నెలసరి ఓ క్రమపద్ధతిలో వస్తుంది. అవి గర్భనిరోధక సాధనంగానూ పనిచేస్తాయి. ప్రొజెస్టరాన్‌ అనే హార్మోన్‌ని మాత్ర రూపంలో ఇవ్వడం వల్ల హార్మోన్ల అసమతుల్యతతోపాటూ, అధికరక్తస్రావం కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు ఐయూడీ (మిరేనా) రూపంలోనూ చిన్న పరికరాన్ని అమరుస్తారు. ఇది తక్కువ స్థాయిలో లెవనోజెస్ట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ని విడుదల చేస్తుంది. దాంతో అధికరక్తస్రావం, నెలసరిలో వచ్చే నొప్పీ తగ్గుతాయి. గర్భం కూడా రాదు.

  • ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌):
నెలసరికి రెండువారాల ముందునుంచీ కొందరిలో శారీరక, మానసిక మార్పులు మొదలవుతాయి. అదే పీఎంఎస్‌. ముఖ్యంగా మూడ్‌స్వింగ్స్‌, చిరాకు, ఒత్తిడి, ఆందోళన, అతికోపం, నిద్రలేమి, తలనొప్పి, ఆకలి తగ్గడం, కొన్నిరకాల పదార్థాలు మాత్రమే తినాలనిపించడం, వక్షోజాల్లో నొప్పి, చర్మం, జుట్టులో తేడా.. లాంటివి ఆ రోజుల్లో తొంభైశాతం మందిలో కనిపిస్తాయి. అవి చాలా తీవ్రస్థాయిలో బాధించి, భరించలేని పరిస్థితి ఉన్నప్పుడు హార్మోన్లను మాత్రలుగా ఇస్తారు. కేవలం ఈస్ట్రోజెన్‌ని ప్యాచ్‌ రూపంలో సూచిస్తారు. ఈ ప్యాచ్‌ ప్రొజెస్టరాన్‌ హార్మోను విడుదలయ్యేలా చేస్తుంది. అయితే ఇది గర్భనిరోధక సాధనంగా పనిచేయదు. దీన్ని వాడుతున్నప్పుడు గర్భం కూడా దాల్చకూడదు.

  • ఎండోమెట్రియోసిస్‌:
కొన్నిసార్లు ఎండోమెట్రియం పొర కటివలయం, గర్భసంచి చుట్టూ, అండాశయాలు, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో ఏర్పడుతుంది. దాంతో నెలసరి నొప్పి, అధికరక్తస్రావం, కలయిక సమయంలో బాధ, పొత్తికడుపు నొప్పి, గర్భం రాకపోవడం, అలసట లాంటివి ఎదురవుతాయి. ఇలాంటప్పుడు హార్మోన్ల చికిత్స వల్ల అండం విడుదల అవదు. అదే సమయంలో ఎండోమెట్రియం పొర కూడా పల్చబడుతుంది. ఈ సమస్యకు సాధారణంగా కంబైన్డ్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్‌ లేదా ప్యాచ్‌ని సూచిస్తారు. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ కలిపి వాడటం వల్ల కూడా అండం విడుదల అవదు. అవసరాన్ని బట్టి ఆంగ్ల టి ఆకారంలో ఉండే చిన్న పరికరాన్నీ గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇది తక్కువ స్థాయిలో ప్రొజెస్టరాన్‌ని విడుదల చేస్తుంది. దానివల్ల కొందరికి నెలసరి కూడా రాకపోవచ్చు. గర్భం దాల్చాలనుకునేవారు మాత్రం డాక్టర్‌ సలహాతో ఇతర మాత్రల్ని వాడాల్సి రావచ్చు.

  • గర్భధారణ వాయిదాకీ..
గర్భం రాకూడదనుకున్నప్పుడు కూడా హార్మోన్లనే రకరకాల పద్ధతుల్లో సూచిస్తారు వైద్యులు. అలాంటప్పుడు ఉపయోగించే పద్ధతుల్లో కాంట్రాసెప్టివ్‌ ఇంప్లాంట్‌ ఒకటి. సన్నగా ప్లాస్టిక్‌ ట్యూబ్‌లా ఉండే దీనిలో ప్రొజెస్టరాన్‌ హార్మోను ఉంటుంది. దీన్ని శరీరంలో అమరుస్తారు. ఫలితంగా అండం విడుదల కాదు. వీర్యకణాలూ స్త్రీ శరీరంలోకి చేరకుండా గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉండే మ్యూకస్‌ చిక్కబడుతుంది. ఇది వద్దనుకుంటే ప్రొజెస్టరాన్‌ని ఇంజెక్షన్‌గా తీసుకోవచ్చు. ఇది కూడా ఇంప్లాంట్‌లానే పనిచేస్తుంది. బదులుగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ కలిపి ఉండే గర్భనిరోధక మాత్రలూ ఉంటాయి. ప్రొజెస్టరాన్‌ మాత్రమే ఉండే మినీపిల్‌, ప్రొజెస్టరాన్‌ ప్యాచ్‌ ఇలా చాలా రకాలుంటాయి. ఇవన్నీ కాదనుకుంటే హార్మోన్లను విడుదలచేసే వెజైనల్‌ రింగ్‌ని జననేంద్రియభాగంలో అమరుస్తారు. అనుకోకుండా గర్భం వస్తుందని భయపడేవారికి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ సరైన ప్రత్యామ్నాయం. గర్భం రాకుండా చేసే ఈ మాత్రల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. మరికొన్నింట్లో కేవలం ప్రొజెస్టరాన్‌ ఒక్కటే డబుల్‌డోస్‌ రూపంలో ఉండొచ్చు.

  • ముందే కాన్పు కాకుండా:
రకరకాల కారణాల వల్ల నెలలు నిండకుండానే కాన్పు అవుతుందని భయపడేవారికీ డాక్టర్లు ప్రొజెస్టరాన్‌ సప్లిమెంట్లను ఇస్తారు. ఇందువల్ల ముందే ప్రసవం రాదు. వీటిని ఎలా వాడాలనేది డాక్టర్లే సూచిస్తారు.

  • మెనోపాజ్‌ దశలో..
ఏళ్లు గడిచి మెనోపాజ్‌ దశ వస్తోందంటేనే భయపడతారు చాలామంది మహిళలు. దానికి కారణం ఆ సమయంలో బాధించే హాట్‌ఫ్లషెస్‌, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గడం, నెలసరిలో తేడా, రాత్రిళ్లు చెమటలుపట్టడం, అలసట, జుట్టురాలడం, నిద్రలేమి, జననేంద్రియభాగం పొడిబారడం, కలయిక సమయంలో బాధ.. ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బందిపెడతాయి. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు హార్మోన్లను సూచిస్తారు.

  • సమస్యలు :
ఇన్నిదశల్లో హార్మోన్లు వాడటం అనేది ఓ కోణం అయితే వాటివల్ల కొన్ని సమస్యలూ ఉంటాయనేదీ రెండో కోణం. అవి తాత్కాలికంగానే కాదు, దీర్ఘకాలికంగానూ బాధించవచ్చు.తాత్కాలికంగా ఎదురయ్యే ఇబ్బందుల్లో.. వికారం, రొమ్ముల్లో వాపు, మొటిమలు (కేవలం ప్రొజెస్టరాన్‌ మాత్రమే వాడేవారిలో) వెజైనల్‌ డిశ్ఛార్జి, రక్తస్రావం, తలనొప్పి లాంటివి బాధిస్తాయి. వీటిని గుర్తించడం సులువే కానీ దీర్ఘకాలంలో బాధించేవీ కొన్ని ఉంటాయి. ఈ సమస్యల్ని గుర్తించడం కొద్దిగా కష్టం. ముఖ్యంగా..

క్యాన్సర్‌:
హార్మోన్ల వల్ల ఎండోమెట్రియల్‌, రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈస్ట్రోజెన్‌ని వాడితే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కాస్త పెరుగుతుంది. ప్రొజెస్టరాన్‌ కూడా తీసుకుంటేఇంకా పెరుగుతుంది. అలాగే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ని నాలుగేళ్ల కన్నా ఎక్కువగా వాడేవారిలో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని తేలింది. దాంతోపాటూ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉండటం, నెలసరి త్వరగా మొదలుకావడం, ఆలస్యంగా గర్భం దాల్చడం, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మెనోపాజ్‌ ఆలస్యంగా మొదలుకావడం, స్థూలకాయం, రొమ్ముపై రేడియేషన్‌ ప్రభావం లాంటివన్నీ ఈ సమస్యని ఇంకా పెంచుతాయి.

గుండెజబ్బులు:
ఒకప్పుడు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ని తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రావు అనుకునేవారు.అధ్యయనాల ప్రకారం ఈ రెండూ వాడటం వల్ల గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని తేలింది. మెనోపాజ్‌ దశ మొదలై, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు డాక్టర్ల సలహాతో హార్లోన్ల వాడకాన్ని ఎంచుకోవాలి.

ఎవరు వాడకూడదు..
గుండెజబ్బులూ, రొమ్ముక్యాన్సర్‌తోపాటూ కొన్నిరకాల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నవాళ్లూ, అకారణంగా రక్తస్రావం అయ్యేవారూ, కాలేయ సమస్యలు ఉన్నవారూ హార్మోన్లు వాడకూడదు. అలాగే అధికరక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌, గర్భం దాల్చాలనుకునేవారూ వీటికి దూరంగా ఉండాలి. డాక్టర్‌తో ప్రతి విషయాన్నీ చర్చించుకున్నాకే వాడాలి తప్ప సొంతంగా వేసుకోకూడదు.

Courtesy with Dr.Praneetha reddy , Uro-Gynaecologist - Hyd
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, October 4, 2013

Shourder joint pain awareness, భుజంకీలు నొప్పి సమస్యలు అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- భుజంకీలు నొప్పి సమస్యలు అవగాహన-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



శరీరంలోని కీళ్లన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయడం నుంచి కీలు పక్కకు జరిగిపోవడం వరకు భుజంకీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. అలా మొదలైన భుజంనొప్పి కొన్ని నెలల నుంచి సంవత్సరాల తరబడి బాధించవచ్చు. అవగాహన పెంచుకుని సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్యను అధిగమించడం సులభమే.

నొప్పి ఎందుకు?
భుజం కీలు కూడా మోకాలి, తుంటికీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతి లాగా ఉన్న ఎముక ముందు భాగం అమరివుంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచడానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రొమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజంనొప్పి మొదలవుతుంది.

భుజం నిర్మాణం చూసినట్లయితే చేతి పైఎముక (హ్యూమరస్‌) చివరి భాగం బాల్‌లా గుండ్రంగా (కార్టిలేజ్‌) ఉంటుంది. ఇది భుజపుటెముక (స్కాప్యూలా) చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్‌ లాంటి అమరికతో చేయి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతూ ఉంటుంది.ఈ నిర్మాణంలో భుజ పుటెముక (స్కాప్యూలా) స్థిరంగా ఉండి కండరాలు, టెండెన్స్‌ సహాయంతో చేయి కీలును గట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది.

భుజం నొప్పికి కారణాలు:

    భుజంపై చేయి కీలు (హ్యూమరస్‌)లోని ‘కార్టిలేజ్‌’లో మార్పు రావడం.
    భుజం కప్‌ ప్రాంతంలో చీలిక రావడం.
    భుజపుటెముక ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం.
    అనుకోకుండా భుజానికి దెబ్బ తగలడం వంటి కారణాల వల్ల భుజం నొప్పి వస్తుంది.

    లక్షణాలు:
    భుజం కదలిక కష్టంగా మారుతుంది, చేయిని పైకి ఎత్తలేకపోవడం.
    చేయితో వస్తువులను పట్టుకోవాలన్నా, రాత రాయాలన్నా భుజం నొప్పి వస్తుంది.
    కంప్యూటర్ల కీ బోర్డ్‌ వాడాలన్నా నొప్పి వస్తుంది.
    నొప్పి భుజం నుండి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది.
    రాత్రిపూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

    జాగ్రత్తలు:
    భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తుడం చేయకూడదు.
    నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సుమారు ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది.
    భుజం నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్లు అతిగా వాడకూడదు.
    చేయి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ‘ఫిజియోథెరపీ’ వైద్యుల సలహా తీసుకోవాలి.

   పరీక్షలు:
    ఎక్స్‌రే, ఎమ్‌.ఆర్‌.ఐ లాంటి పరీక్షలు భుజం నొప్పి తీవ్రతను తెలుపుతాయి.

Frozen shoulder-కీలు పొరలో వాపు.. ఫ్రోజెన్ షోల్డర్

40 ఏళ్లు దాటినవాళ్లలో భుజంనొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజెన్ షోల్డర్. భుజంకీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజెన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు గానీ సాధారణంగా మధుమేహ వ్యాధిక్షిగస్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్టుగా ఉంటుంది. కీలు దగ్గరి గుళిక భాగం సాగడానికి కావలసిన ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజుల వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గడానికి మందులు వాడితే సరిపోతుంది. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ తరువాత అదేరోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. నొప్పి నుంచి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. త్వరగా కోలుకోవడానికి భుజం ఎక్సర్‌సైజులు చేయాల్సి వుంటుంది.

Rotatory cup weakness-కండరం బలహీనమైతే...

ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావడం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. ఈ నొప్పి క్రమంగా పెరుగుతూ కండరాలు కోసినట్టుగా కావడానికి దారితీస్తుంది. దీన్నే రొటేటర్ కఫ్ అంటారు. దీనివల్ల భుజాన్ని కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక వయసులో ఉన్నవాళ్లలో రొటేటర్ కఫ్ రావడానికి దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు కారణమవుతాయి. క్రీడాకారుల్లో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ద్వారా పరిష్కరించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆర్థరైటిస్, తద్వారా కీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Shoulder dislocation-జారే కీలు..

యువతలో ఎక్కువగా కనిపించే సమస్య షోల్డర్ డిస్‌లొకేషన్. గిన్నె ఆకారంలో ఉండే గ్లెనాయిడ్ భాగం నుంచి బంతిలా ఉండే హ్యుమరల్ భాగం బయటకు వచ్చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొంద పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో కలిగే దెబ్బల వల్ల ఇలా బంతి కీలు జారిపోయే అవకాశం ఉంటుంది. డిస్‌లొకేషన్ వల్ల తీవ్రమైన భుజంనొప్పి ఉంటుంది. ఇందుకు చికిత్సగా జారిపోయిన కీలు భాగాన్ని తిరిగి అమరుస్తారు. కొందరిలో ఎన్నిసార్లు సరిచేసినా తిరిగి పదే పదే బంతికీలు జారిపోతూ ఉంటుంది. ఆటలాడేటప్పుడే కాదు రోజువారీ పనులు చేసుకునేటప్పుడు, కొన్నిసార్లు నిద్రలో కూడా ఇలా జారిపోవచ్చు. దీనివల్ల బంతి గిన్నె కీలు పూర్తిగా దెబ్బతిే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటివాళ్లకు లాబ్రమ్ అనే ప్రత్యేక నిర్మాణం సహాయంతో దెబ్బతిన్న కీలును మరమ్మతు చేస్తారు. ఇందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.

Arthritis-ఆర్థరైటిస్

మోకాలి కీలు మాదిరిగానే భుజంకీలుకు కూడా ఆర్థరైటిస్ రావచ్చు. వయసు మీరిన వాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల భుజంకీలు కూడా దెబ్బతినవచ్చు. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్లలో అన్ని కీళ్లతో పాటు భుజంకీలు కూడా దెబ్బతింటుంది. ప్రమాదాల్లో గాయపడటం, భుజం కండరాలు బలహీనపడటం కూడా ఆర్థరైటిస్‌కి దారితీస్తుంది. ఆర్థరైటిస్ వల్ల విపరీతమైన నొప్పి, కీలు వాపు, కదిలినప్పుడల్లా గీసుకున్నట్టు అవుతుంది. తొలిదశలో ఉన్నప్పుడయితే ఫిజియోథెరపీ, మందులు సరిపోతాయి. కానీ వ్యాధి తీవ్రమైతే మాత్రం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువైతే కీలుమార్పిడి కూడా అవసరం అవుతుంది. కీలు ఏ రకంగా దెబ్బతిన్నదన్న దాన్ని బట్టి కృత్రిమ కీలు రకాన్ని ఎంచుకుంటారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కీ హోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా, ఆసుపవూతిలో ఉండే అవసరం లేకుండా సులువుగా చికిత్స అందించవచ్చు. కాబట్టి భుజంనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

-Courtesy with Dr.M.V.Ramana Rao MS(ortho) Kakinada.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/