Tuesday, August 26, 2014

Vaginal discharge-వెజినల్ డిశ్చార్జ్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Vaginal discharge-వెజినల్ డిశ్చార్జ్ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మహిళల్లో వచ్చే కొన్ని ప్రత్యేక సమస్యల గురించి చెప్పుకోవడము కష్తముగాను , ఇబ్బందిగాను ఉంటుంది. ఒక్కోసారి వైద్యుల వద్దకు వెళ్ళడానికి సైతం సందేహ పడుతుంటారు. వాటిలో ఒకటి వెజినల్ డిశ్చార్జి . ఇది చాలా స్త్రీలలో సర్వసాధారణము . దుర్వాసన , లోదుస్తులపై మరకలు , దురద  లేదా మంట  వంటి ఇతర ప్రభావాలతో సతమతం అవుతూ ఉంటారు. వెజినల్ పరిశుభ్రత , వాష్ లు , మొదలైన వాటిగురించి అపోహలు , సంశయాలు ఉంటుంటాయి. అసలు వాస్తవాలు తెలుసుకుంటే సంశయాలు వేధించవు .

వెజీనా మహిళ శరీరము లోపల ఉండే మజిల్ ట్యూబ్ .ఇది సర్విక్స్ నుండి వెజైనల్ ఓపెనింగ్ వరకూ సాగుతుంది. బయటి భాగాన్ని " వల్వా" గా పిలుస్తారు. భాహ్య సెక్స్ అవయవాలు వెజైనల్ ఓపెనింగ్ చుట్తూ ఉంటాయి. సహజ సెక్రిషన్ల ద్వారా దానికదే క్లీన్‌ చేసుకునే మాదిరిగా వెజైనా డిజైన్‌ చేయబడి ఉంటుంది. సహజ ఋతుక్రమము తో పాటు... క్లియర్ లేదా తెల్లని ద్రవాల ఉత్పత్తి సహజముగా సాగుత్తూ ఉంటాయి.వెజైనల్ దిశ్చార్జి ప్రతిసారీ చెడ్డ లక్షణము కాదు . ఇన్‌ఫెక్షన్‌ లేదా మరే ఇతర సమస్యలతోనో ఇబ్బంది పడుతున్నట్లు కాదు. వైట్ డిశ్చార్జి సెక్సువల్ గా ట్రాన్స్ మిట్ అయ్యే ఇన్‌ఫెక్షన్‌ అనుసంధానము అయివుంటుందని చాలా మంది అపోహ . డిశ్చార్జి మోతాదులో మార్పులు 100 శాతము హార్మోనల్ ... ఇంకా చెప్పాలంటే ఇది ఋతుక్రమం సైకిల్ కు లింకై ఉంటుంది. ఋతుక్రమ సైకిల్ లో వెజైనల్ డిశ్చార్జి లక్షణం , మోతాదు మారుతూ ఉంటాయి. అండం విడుదల సమయములో చిక్కగా సాగినట్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన డిశ్చార్జి  గాఢమైన వాసన , రంగు ఉండదు. . . కాకుంటే అసౌకర్యవంతమైన తడి ఉంటుంది. అంతే.

ప్రేగులు తర్వాత స్త్రీల శరీరములోకెల్లా అత్యధిక బ్యాక్టీరియా ఉండే శరీరభాగము వెజైనా. అత్యంత సాధారణ వెజైనల్ బ్యాక్టీరియా ల్యాక్టోబాసిల్లస్ . ఇది లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడము ద్వారా వెజైనా ఎసిడిటీ ని కాపాడుతూ ఉంటుంది. దీనివలన ఏర్పడే యాంటీ-బ్యాక్టీరియల్ యాక్టివిటీ వెజైనా ను విభిన్న ఇన్‌ఫెక్షన్‌ ల నుండి పరిరక్షిస్తుంది.  దురదలు , డిశ్చార్జి , ఇన్‌ఫ్లమేషన్‌  మొదలైన వాటికి ప్రధాన కారణము సహజ బ్యాక్టీరియల్ సమతుల్యత ఉల్లంఘన , ఎసిడితీ స్థాయిలలో మార్పులు . వెజైనా పి.హెచ్ . అంటే తక్కువ ఎసిడిటీకి లేదా ఎక్కువ ఆల్కలైన్‌ ఉన్నట్లైతే ల్యాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మోతాదు పడిపోతుంది. . . ఇతర బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల  " బ్యాక్టీరియల్ వెజినోసిస్  లేదా థ్రష్  వంటి ఇన్‌ఫెక్షన్‌  వచ్చి దురద , ఇర్రిటేషన్‌ , అసాధారణ డిశ్చార్జి  వంటి సమస్యలు వస్తాయి.

ప్రవేటు భాగాల్లో ---పరిశుభ్రత సరిగా పాటించక పోవడము , ఎక్కువ సోప్ నీరు వాడడము , బిగుతు దుస్తులు ధరించడము , సింథటిక్ లోదుస్తులు వాడడము , సురక్షితం కాని సెక్స్ , సెంటెడ్ ట్యాయ్లెట్ పేపర్లు , సెంటెడ్ టాంపన్లు లేదా స్ప్రేలు వంటి పరిమళాల ఉత్పత్తులు అతిగా వాడడము , ఎక్కువ సార్లు వాష్ చేయడము  మున్నగు వాటివలన మంచి బ్యాక్టీరియా ఫ్లుష్-అవుట్ కావడము ముఖ్యకారణము ,.

ప్యూబిక్ హెయిర్ --- సాధారణ సబ్బుతో శుభ్రము చేసుకోవాలి . పేలు , గజ్జి , తామరల వంటి ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా జాగ్రత్తపడాలి. యానస్ , వెజైనా నడుమ ఉండే ప్రదేశాన్ని నీట్ గా స్క్రబ్ చేయాలి . ముందుగా వెజైనా వాష్ చేసి యానస్ ను వాష్ చెయ్యాలిగాని ... యానస్ వాష్ తరువాత వెజైనాను టచ్ చెయ్యకూడదు ... ఇక్కడ ఉండే క్రిములు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌ కి కారణమవుతాయి. ప్యూబిక్ హెయిర్ ను ఎప్పటికప్పుడు  సేవ్ చెయ్యాలి . సెక్స్ తరువాత తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఋతుస్రావ సమ్యములో పరిశుభ్రత మరింత ఎక్కువగా పాటించాలి. ప్యాడ్స్ తరచు మారుస్తూ ఉండాలి. కాటన్‌ అండర్ వేర్ లను ధరిస్తుండాలి. లోదుస్తులు బాగా గాలి ఆడే విధంగా ఉండాలి.

వెజైనా ఆరోగ్యానికి .--- . వెజైనల్ డిశ్చార్జీలు ఎప్పుడూ మహళల్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఈ రోజుల్లో సరియైన పరిశుభ్రతకోసము అనేక ఫార్ములేషన్లు లేదా వెజైనల్ వాష్ లు అందుబాటులో ఉంటున్నాయి. .సబ్బుల ష్తానే ఈ వాష్ లను క్రమము తప్పకుండా వాడుకోవచ్చు . ఇవి వెజైనా ఆరోగ్యాన్ని , పరిశుభ్రతను మెయింటైన్‌ చెయ్యడము లో సహకరిస్తాయి. కొన్ని పార్ములేషన్లు ఎలర్జిక్ అవునా కాదా చూసుకోవాలి. వెజైనల్ డిశ్చార్జీలు సాధారణంగా ఉన్నట్లైతే ఎవరికీ ప్రత్యేకమైన వాష్ లతో పని ఉండదు. డిశ్చార్జి ఇబ్బందిగా  , అసాధారణముగా ఉన్నప్పుడు గైనొకాలొజిస్ట్ ను సంప్రదించి మంది సలహా ను తీసుకోవాలి.



  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, August 25, 2014

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఉపాయాలు పాటించాలి?

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --దోమలు కుట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఉపాయాలు పాటించాలి?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రస్తుతం వేసవి కాలం వస్తోందంటే చాలు ఎక్కువగా దోమల బెడద ఉండనే ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల పెట్టే దురద, మంట చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల మనం గోకడం తో మచ్చలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి వాటి నుండి మనం బయట పడాలంటే సులువైన మార్గాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

1).దోమలు కుట్టిన తర్వాత కలబందను పూస్తే కలబంద లో ఉండే కొన్ని యాంటీ సెప్టిక్ లక్షణాలు వల్ల చర్మానికి హాని కలగకుండా చేస్తాయి.

2). దోమలు కుట్టినట్లుయితే ఆ ప్రదేశంలో కాస్త తేనె రాస్తే కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో వాటిని శుభ్రం చేయడం వల్ల తేనెలో వుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం వల్ల.. దురద,వాపు లో నుంచి ఉపశమనం కలుగుతుందట.

3). దోమ కుట్టిన చోట కొబ్బరి నూనెను రాయడం వల్ల అందులో ఉండే కొన్ని మైక్రో బిల్స్ వల్ల దోమకాటు కుట్టినచోట.. ఈ కొబ్బరి నూనెను రాయడం వల్ల దోమ కుట్టిన మచ్చలు వాపులు ఉండవు.

4). ఇక మరొక టిప్స్ ఎమిటంటే.. పసుపు దోమ కుట్టిన చోట రాయడంవల్ల పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ వల్ల దోమ కాటు నుండి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా దోమలు ఇంటి లోపలికి రాకుండా ఉండాలి అంటే.. ఎక్కువగా కిటికీలను, మెయిన్ డోర్ తెరవకుండా ఉండాలి. ఒకవేళ అలా ఓపెన్ చేసుకోవాలంటే వాటి చుట్టూ ఒక మెసేజ్ లు లాంటివి ఏర్పాటు చేసుకోవడం అవసరం.

ఇక మరొకటి ఏమిటంటే కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే దోమలు బయటికి వెళ్లిపోతాయి.

రోజు మిల్స్ చెట్టు కాండాలు మొక్కలను కాల్చడం వల్ల.. ఆ పొగ కు దోమలు పరార్ అవుతాయి.

దోమలు ఇంట్లో ఎక్కువగా ఉన్నట్లయితే కాఫీ పొడిని ఒక పాత్రలో కానీ, ఒక పేపర్లో కానీ పోసి పొగ పెడితే దోమలు ఉండవు.

  • ========================
Courtesy with Eenadu vasundhara
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, August 23, 2014

Diabetes less with good sleep-చక్కని నిద్రతో మధుమేహం దూరం




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Diabetes less with good sleep-చక్కని నిద్రతో మధుమేహం దూరం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గాఢనిద్ర లేకుండా, తరచూ అంతరాయాలతో సతమతమైతే మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహానికి నిద్ర నాణ్యతకూ మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యుక్తవయస్కుల్లో గాఢనిద్ర తగ్గితే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే శక్తి తగ్గటం వల్ల టైప్‌-2 మధుమేహం తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. కేవలం మూడు రోజులపాటు ఇలా గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఇన్సులిన్‌ సెన్సిటివిటీ వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించటానికి ఎక్కువ మోతాదుల్లో ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఇది మధుమేహానికి ముందస్తు సంకేతంగా భావించవచ్చు.

నిద్ర గంటలు తగ్గినకొద్దీ మధుమేహం ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రస్తుత తాజా అధ్యయనంలో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తోంది. గాఢనిద్ర వయసు మీద పడుతున్న కొద్దీ తగ్గిపోతుంటుందనీ, ఫలితంగానే మధుమేహం వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోందనీ పరిశోధకులు అంటున్నారు.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Seven events to prevent paralysis-పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడే 7 అంశాలు.

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Seven events to prevent paralysis-పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడే 7 అంశాలు.-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పక్షవాతం చాలా తీవ్రమైన సమస్య. సకాలంలో చికిత్స అందకపోతే దీర్ఘకాలం వైకల్యం బారినపడే ప్రమాదముంది. కొన్నిసార్లు ప్రాణాలకూ ముప్పు ముంచుకు రావొచ్చు. అయితే మంచి విషయం ఏంటంటే.. జీవనశైలి మార్పులతో అసలు పక్షవాతం రాకుండా చూసుకునే వీలుండటం. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం, పొగ తాగకపోవటం.. ఈ ఏడు అంశాలు పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సూత్రీకరించింది. ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు తాజా అధ్యయనం కూడా బలపరుస్తోంది. పరిశోధకులు ఇటీవల 23వేల మందిపై ఐదేళ్ల పాటు అధ్యయనం చేసి, పక్షవాతం ముప్పుల ప్రభావాలను అంచనా వేశారు. వీటిల్లో అధిక రక్తపోటు అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటున్నట్టు బయటపడింది. ''రక్తపోటు అదుపులో లేనివారితో పోలిస్తే రక్తపోటు బాగా అదుపులో ఉన్నవారికి పక్షవాతం ముప్పు 60% తక్కువగా ఉంటోంది'' అని వెర్మాంట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మేరీ కష్‌మన్‌ చెబుతున్నారు. అలాగే పొగ తాగనివారికి, పొగ అలవాటు మానేసిన వారికి కూడా పక్షవాతం ముప్పు 40% తగ్గినట్టు వెల్లడైంది. అందువల్ల తేలికైన జీవనశైలి మార్పులతో పక్షవాతాన్ని దూరంగా ఉంచుకునే అవకాశముందని గుర్తించాలని సూచిస్తున్నారు.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Necesity of fresh air and light for health-ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి వెలుతురు అవశ్యకము

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Necesity of fresh air and light for health-ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి వెలుతురు అవశ్యకము
--
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    గాలి దూరే దారి లేకుండా తలుపులన్నీ ముయ్యగట్టుకుని గదిగదికీ ఏసీలు పెట్టుకోవటం.. వెలుతురు చొరబడే సందు లేకుండా చేసుకుని పట్టపగలు కూడా కృత్రిమ లైట్ల కింద గడపటం.. ఇదో ఘనతగా, ఇదే ఆధునికతగా భావిస్తున్న ఈ రోజుల్లో మనమేం కోల్పోతున్నామో.. దేనికి చేరువ అవుతున్నామో.. చదవండి!
    మంచి మాటలు.. ఎప్పుడూ చప్పగానే అనిపించొచ్చు. ఏవో సుద్దులు చెబుతున్నారని విసుక్కోవచ్చు. ఉదాహరణకు ఇంట్లోకి 'గాలీ-వెలుతురూ' ధారాళంగా రావాలని ఎవరైనా చెప్పారనుకోండి.. ఏదో పాత పాటేలెమ్మని మనం తలకంతగా ఎక్కించుకోకపోవచ్చు.
    కానీ మీకో విషయం తెలుసా?
    ఆరుబయటి గాలికీ, చక్కటి వెలుతురుకూ... ఔషధాలను తలదన్నే గొప్ప ప్రభావం ఉంది. ఎంత గొప్ప అంటే... ఇప్పుడు మనం ఘనంగా చెప్పుకుంటున్న శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ను మించిన సత్ఫలితాలు వీటితో కనబడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధనా రంగంలో అనూహ్యంగా కొన్నికొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. అప్పటికి అవేమంత పెద్ద విషయాల్లా అనిపించకపోవచ్చుగానీ.. వాటి ప్రాముఖ్యం తర్వాతెప్పుడో తెలిసొస్తుంది. అలాంటిదే ఈ సంఘటన!
1968. వేడి గాలి చెవులను తాకుతున్న ఓ వేసవి రాత్రి.
మైక్రోబయాలజిస్టులు హెన్రీ డ్రూట్‌, కేఆర్‌ మే ఇద్దరూ బ్రిటన్‌ రక్షణ పరిశోధనా భవనం మేడ మీద నిలబడి తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. బయట ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థులు ఏ సమయంలోనైనా జీవాయుధాలను ప్రయోగిస్తే ఏం చెయ్యాలి? బాంబుల్లో వ్యాధికారక సూక్ష్మక్రిములను దట్టించి.. ఏ లండన్‌ మీదో జారవిడిస్తే మన పనేమిటి? ఆ సూక్ష్మక్రిములు వాతావరణంలో ఎంతకాలం బలీయంగా ఉంటాయి? వాటిని ఎదుర్కొనేదెలా? సమాధానం కోసం చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. ఒక దువ్వెన చుట్టూ సాలెగూడు దారాలు చుట్టి.. దాని మీద మనకు సర్వసాధారణంగా జబ్బులు తెచ్చిపెడుతుండే 'ఈ.కోలీ' బ్యాక్టీరియా ఎక్కించి.. మేడ మీద గాలిలో ఉంచారు. ధారాళంగా గాలి వీస్తున్న ఆ ఆరుబయలు వాతావరణంలో.. 2 గంటలు కూడా తిరక్కముందే ఆ బ్యాక్టీరియా పూర్తిగా చచ్చిపోయింది. ఇక అదే రకం దువ్వెనను తీసుకువెళ్లి.. అంతే వెచ్చదనం, అంతే తేమ ఉన్న ఒక పెద్ద పెట్టెలో పెట్టిచూశారు.. 2 గంటల తర్వాత కూడా బ్యాక్టీరియా బ్రహ్మాండంగా బతికే ఉంది. బ్యాక్టీరియా లోపల బతికి ఉండటానికీ, ఆరుబయటి గాలిలో అట్టే సమయం బతకలేకపోవటానికీ కారణం ఏమిటి? దీనర్థం.. ధారాళమైన గాలిలో బ్యాక్టీరియాను చంపేదేదో ఉంది! లోపల వాతావరణంలోకి వచ్చేసరికి అది కరవు అవుతోంది! విషయం అర్థమైంది. ఇక అదేమిటో కనిబెట్టాలని లోతుగా పరిశోధనలు మొదలుపెట్టారు ఇద్దరూ. తాత్కాలికంగా దానికి 'ఓపెన్‌ ఎయిర్‌ ఫ్యాక్టర్‌' అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతలోనే జీవయుధాల భయాలు వీడిపోయాయి, వీళ్ల పరిశోధనలూ నిలిచిపోయాయి!

కానీ ఇన్నేళ్ల తర్వాత.. ఇప్పుడీ పరిశోధనా పత్రాల దుమ్ముదులిపి.. వీటి ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం కనబడుతోంది. కారణం.. అద్భుత అస్త్రాలనుకుని రంగం మీదికి తెచ్చిన యాంటీబయాటిక్స్‌.. వ్యాధికారక బ్యాక్టీరియా ముందర పూచికపుల్లల్లా ఎందుకూ కొరగాకుండాపోతున్నాయి! ఈ యాంటీబయాటిక్స్‌కు అలవాటుపడిపోతున్న సూక్ష్మక్రిములు మహా మొండిగా.. దేనికీ లొంగకుండా తయారై.. మన ఉనికికే పెనుసవాల్‌ విసురుతున్నాయి. దీంతో క్షయ, న్యుమోనియా, గనోరియా వంటి సమస్యలను ఎదుర్కొనటం ఇప్పుడు మహా కష్టంగా తయారవుతోంది. మరి ఈ మొండి బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు వాళ్ల పరిశోధనల్లో వెల్లడైన కిటుకులేమైనా ఉపయోగపడతాయేమో..?
నైటింగేల్‌ చెప్పిందిదే!
ధారాళమైన, స్వచ్ఛమైన గాలిలో ఏదో మహత్తు ఉందన్న విషయం కొత్తగా కనిబెట్టిందేం కాదు. క్రిమియన్‌ యుద్ధ సమయంలోనే ఇది బయటపడింది. ఆ యుద్ధ సమయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇరుకిరుకు ఆసుపత్రుల్లో కంటే.. యుద్ధక్షేత్రంలోనే ఉండిపోయిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవటాన్ని గమనించారు పరిశోధకులు. ఈ కిటుకు తెలుసుకున్న విఖ్యాత నర్సు ఫ్లారెన్స్‌ నైటింగేల్‌.. ఆసుపత్రి గదులకు ఉన్న కిటికీలూ, దర్వాజాలూ బార్లా తెరిచి ఉంచటం వంటి జాగ్రత్తలతో ఆసుపత్రుల్లో మరణాల రేటును గణనీయంగా తగ్గించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తర్వాత ఇదే సూత్రాన్ని ఆమె బ్రిటన్‌ ఆసుపత్రుల్లో కూడా ప్రవేశపెట్టారు. ''రోగి చుట్టూ ఎప్పటికప్పుడు కొత్తగాలి వస్తుండటం, తాజా గాలి ఆవరిస్తుండటం చాలా అవసరం. అప్పుడుగానీ రోగి వూపిరితిత్తుల్లోనూ, చర్మం మీదా ఉండే రుజాగ్రస్త కశ్మలాలు కొట్టుకుపోవు'' అని ఆమె తన నోట్సులో ప్రత్యేకంగా రాసుకున్నారు. ఈ జాగ్రత్తల వల్ల రోగులు త్వరగా కోలుకోవటం చూసిన ఆసుపత్రులు ఇదే నమూనాలను పాటిస్తూ రోగులను ఉంచే గదులకు- కింది నుంచి పైవరకూ పెద్దపెద్ద కిటికీలు అమర్చి.. లోపలికి గాలి ధారాళంగా ప్రసరించేలా చర్యలు చేపట్టారు. ఇలాంటి గదులను ప్రత్యేకంగా 'ఫ్లారెన్స్‌ వార్డులని' పిలవటం కూడా ఆరంభించారు. గాలి ధారాళంగా లోపలికి రావటం వల్ల- గాలి ద్వారా వ్యాపించే రోగకారక సూక్ష్మక్రిముల సంఖ్య పల్చబడి, వాటి ప్రభావం తగ్గటమే కాదు.. అవి చాలా వరకూ నశించిపోతున్నాయని కూడా పోర్టన్‌ డౌన్‌ పరిశోధనల్లో వెల్లడైంది.

నైటింగేల్‌ వార్డులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ పెద్దపెద్ద కిటికీలన్నీ దక్షిణం వైపు గోడలకు ఉంటాయి. దీనివల్ల గదుల్లోకి చక్కగా ఎండ కూడా పడుతుంటుంది. దీంతో సూర్యరశ్మికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో ప్రజలను విపరీతంగా కబళిస్తున్న క్షయ వ్యాధి పీడితులకు ఈ వార్డులు ఎంతో మేలు చేశాయి. సూర్యరశ్మి కేవలం గాలిలోనూ, చర్మం మీద ఉన్న క్రిములను నిర్మూలించటమే కాదు.. ఒంట్లో విటమిన్‌-డి ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక వ్యవస్థలో కొత్త ఉత్తేజాన్ని తేవటం ద్వారా క్షయ క్రిములను కూడా నిర్మూలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో క్షయ వ్యాధి పీడితుల కోసం ప్రపంచవ్యాప్తంగా గాలీవెలుతురూ ధారాళంగా వచ్చే 'సోలార్‌ క్లినిక్స్‌' పుట్టుకొచ్చాయి. మన దేశంలో కూడా ఇదే పద్ధతిలో 'టీబీ శానిటోరియాలు' నిర్మించారు. మెల్లగా శాస్త్రవేత్తలు పరిశోధించి.. సూర్యకాంతిలోని యూవీ కాంతి (అల్ట్రా వయొలెట్‌-అతినీల లోహిత కిరణాలు) సూక్ష్మక్రిములను అంతం చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆసుపత్రులన్నీ యూవీ కాంతిని ప్రసరింపజేసే ప్రత్యేక లైట్లను వినియోగించటం మొదలుపెట్టాయిగానీ వాటివల్ల చర్మం క్యాన్సర్లు, కంటి శుక్లాల వంటి దుష్ప్రభావాలు పెరుగుతుండటంతో వాటి వినియోగం తగ్గిపోయింది. (ఇప్పటికీ ఆపరేషన్ల కోసం వాడే పరికరాల మీద సూక్ష్మక్రిములేవీ లేకుండా శుభ్రం (స్టెరిలైజ్‌) చెయ్యటానికి యూవీ లైట్‌ను వాడుతూనే ఉన్నారు) మొత్తానికి వ్యాధికారక సూక్ష్మక్రిములను ఎదుర్కొనేందుకు 'గాలీ-వెలుతురు'.. ఈ రెంటికీ కీలక పాత్ర ఉందని ప్రపంచవ్యాప్తంగా అంతా గుర్తించారు.
ప్రపంచం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉంది. ఇది తీవ్రవాదాన్ని మించిన, చమురును మించిన, ఇంకా చెప్పాలంటే నీటిని కూడా మించిన సంక్షోభం. 'యాంటీబయాటిక్స్‌' సంక్షోభం! మానవాళి ఉనికికే పెను సవాల్‌లా తయారవుతున్న ఈ సమస్యకు.. ఎంతోకొంత పరిష్కారం మన చుట్టూ ఉన్న గాలీ-వెలుతురులోనే ఉందంటూ విఖ్యాత శాస్త్రపత్రిక 'న్యూసైంటిస్ట్‌' అందించిన కథనం కొత్త ఆలోచనలకూ.. సరికొత్త పరిష్కారాలకూ తలుపులు తెరుస్తోంది.

కొత్త అస్త్రాలు దొరికాయి!
అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ అత్యంత శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ మందు 'పెన్సిలిన్‌'ను ఆవిష్కరించటం ఆధునిక వైద్యరంగ చరిత్రలో పెను విప్లవం! ఎంత అంటే ఇక వ్యాధికారక సూక్ష్మక్రిములపై మనిషి విజయం సాధించేశాడనీ.. ఇన్ఫెక్షన్లన్నవి ఇక కనుమరుగైపోవటం తథ్యమని అంతా ఒక విపరీత విశ్వాసంలోకి వెళ్లిపోయారు కూడా. ఇక మీదట సూక్ష్మక్రిముల కారణంగా ఏ ఇన్ఫెక్షన్‌ వచ్చినా రామబాణంలా యాంటీబయాటిక్‌ మాత్రను ప్రయోగిస్తే చాలు, ఠకీమని అది తగ్గిపోవటం ఆరంభమైంది. కొత్తకొత్త యాంటీబయాటిక్స్‌ పుట్టుకురావటం కూడా మొదలైంది. ఈ కొత్త ఉత్సాహంలో 1960ల నుంచీ కూడా ఇటు వైద్యరంగం, అటు పరిశోధనా రంగం దాదాపుగా గాలీ, వెలుతురు గురించి పూర్తిగా పట్టించుకోవటం మానేశాయి. హాస్పిటళ్లలో నైటింగేల్‌ వార్డులూ కనుమరుగయ్యాయి. తలుపులు మూసేసి ఏసీలు పెట్టటం, అవసరమైతే లోపలి గాలి మార్పు కోసం యంత్రాలు, మెకానికల్‌ వెంటిలేషన్‌ మీద ఆధారపడటం పెరిగింది. కొత్త కొత్త యాంటీబయాటిక్స్‌ కుప్పలుతెప్పలుగా మార్కెట్‌ను ముంచెత్తాయి. గత 30 ఏళ్లుగా ఏడాదికి సగటున ఒక కొత్త యాంటీబయాటిక్‌ అయినా మార్కెట్లోకి వస్తూనే ఉంది. కానీ గత పదేళ్లుగా ఈ అస్త్రాల మీదా, వీటి శక్తిసామర్థ్యాల మీదా అనుమానాలు బయల్దేరాయి. ఎందుకంటే..
మనం ఎంత అత్యాధునికమైన, ఎంత ఖరీదైన యాంటీబయాటిక్‌ వాడటం మొదలుపెట్టినా సూక్ష్మక్రిములు లొంగటం లేదు. పైగా వాటికి త్వరగా అలవాటుపడిపోయి.. మహా మొండిగా తయారవుతున్నాయి. దీంతో 1970లలో, 80లలో యాంటీబయాటిక్స్‌తో చాలా తేలికగా తగ్గిపోయిన క్షయ, న్యుమోనియా, గనోరియా లాంటి వ్యాధులు కూడా ఇప్పుడు దేనికీ లొంగకుండా తిరిగి పెను సమస్యలుగా తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో మొండి ఇన్ఫెక్షన్లు వ్యాపించటమన్న సమస్య మరింతగా పెరుగుతోంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో అయితే కనీసం 9 శాతం మందికి ఆసుపత్రుల్లోనే కొత్తగా ఇన్ఫెక్షన్లు అంటుకుంటున్నాయి. వీటన్నింటికీ తోడు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే యాంటీబయాటిక్స్‌ సంఖ్య కూడా ఏటికేడాది తగ్గిపోతోంది. 1990ల తర్వాత ఇటువంటి కొత్తతరం యాంటీబయాటిక్స్‌ కోసం ప్రయత్నిస్తున్న సంస్థల సంఖ్య 18 నుంచి 4కు పడిపోయింది. దీనర్థం ఏమిటి??? మన తూణీరంలో అస్త్రాలు తగ్గిపోతున్నాయి. ఉన్నవి పదును కోల్పోయాయి.. కొత్తవి పుట్టటం లేదు. మరోవైపు శత్రువులు.. అంటే రోగ కారక క్రిములు మహా మొండిగా విజృంభిస్తున్నాయి! క్షయలాంటి వ్యాధులైతే ఎన్ని మందులు వాడినా లొంగని 'మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌' రకాలుగా ప్రబలుతున్నాయి. ఇదీ ఇప్పుడు మనం ఉన్న విపత్కర స్థితి!

ఏమిటి మార్గం???
సూక్ష్మ శత్రువులను ఎదుర్కొనటం కోసం పరిశోధనా రంగం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. వాటిని చంపటం కాకుండా కేవలం వాటి ఉద్ధృతిని అడ్డుకోవటం కోసం 'కోరం బ్లాకింగ్‌' మందుల కోసం ప్రయత్నిస్తున్నారు.. దీనివల్ల సూక్ష్మక్రిముల్లో నిరోధకత అంతగా రాదని భావిస్తున్నారు. అలాగే వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేందుకు జన్యుమార్పిడి వైరస్‌లను ప్రయోగించే 'ఫేజ్‌ థెరపీ' విధానాలూ ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ విజయానికి చాలా దూరంలో ఉన్నాయి. మరి మనం ఇప్పుడేం చెయ్యాలి? దీనికి చాలామంది శాస్త్రవేత్తల సమాధానం.. మూలాల్లోకి వెళ్లటమే మంచిదని! వైద్యాన్ని ఎక్కడ వదిలేశామో అక్కడికి వెళ్లి వెతుక్కుందామంటున్నారు. యాంటీబయాటిక్స్‌ రాక మునుపు మనం ఎక్కడున్నామో.. ఏయే విధానాలను అనుసరించామో.. మళ్లీ ఆ పాఠాలను ఒక్కసారి చదువుకుందామంటున్నారు.
కేవలం ఒంటి మీద ఎండ పడితేనో.. లేకపోతే గాలి తగిలితేనో.. జబ్బులన్నీ తగ్గిపోతాయని అనుకోవటం అత్యాశే అవుతుంది. అంతమాత్రాన ఆ రెంటికీ ఉన్న.. అమూల్యమైన శక్తిని మనం తక్కువచేసి చూడటానికి లేదు. పాతవిధానాల్లో ప్రయోజనకరమైనవి లేవనుకోవటం తప్పు. ఎందుకంటే తరచుగా చేతులు కడుక్కోవటం వల్లనే చాలా జబ్బులు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చనీ, చాలా జబ్బులు తగ్గిపోతాయని గుర్తించినప్పుడు చాలామంది దాని విలువను గుర్తించలేదు. కానీ ఇప్పుడు అదే విధానం.. అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఆసుపత్రుల్లో నర్సులు తరచుగా చేతులు కడుక్కోవాలన్న నిబంధన పెట్టిన తర్వాత బ్రిటన్లో ఎంఆర్‌ఎస్‌ఏ, క్లోస్ట్రీడియం వంటి మొండి బ్యాక్టీరియాల వ్యాప్తి బాగా తగ్గినట్లు గుర్తించారు. ఇళ్లలో కూడా మనం తరచుగా చేతులు కడుక్కోవటం వల్ల జబ్బుల బారినపడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఇదే తీరులో మనం గాలీ, వెలుతురు ప్రయోజనాలను కూడా గుర్తించాల్సిన అవసరం వచ్చిందంటున్నారు పరిశోధకులు. ఈ దిశగా లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు లిమా, పెరూ వంటి దేశాల్లోని ఆసుపత్రుల్లో అధ్యయనాలు కూడా చేశారు. యాంత్రికంగా పని చేసే మెకానికల్‌ వెంటిలేషన్‌ సదుపాయాల మీద ఆధారపడుతున్న ఆసుపత్రుల్లో కంటే కిటికీలూ, తలుపులూ తెరవటానికి వీలున్న పాత కాలపు ఆసుపత్రుల్లోనే గాలి ప్రసారం బాగుందని గుర్తించారు. దీంతో లిమాలోని కొన్ని ఆసుపత్రులకు కొత్తగా కిటికీలు అమర్చటం, వెలుతురు వచ్చేలా పైకప్పును సరిచెయ్యటం వంటి చర్యలూ చేపట్టారు. ఈ మార్పులు సాధ్యం కాని భవనాల్లో ఏం చెయ్యాలన్న దాని మీదా బోలెడంత కుస్తీలు పట్టి చివరికి.. క్షయ వార్డుల్లో యూవీ కిరణాలు ప్రసరించేలా ఆ లైట్లను పైకప్పు వైపు తిప్పి అమర్చారు. దీనివల్ల ఆ కిరణాలు నేరుగా రోగుల మీద పడవు.. గది పైభాగంలో ఉండే సూక్ష్మక్రిములను నిర్మూలిస్తాయి. ఇలా చేసిన తర్వాత వార్డుల్లో క్షయ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కూడా గుర్తించారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరూ, బ్రెజిల్‌, రష్యా వంటి దేశాలన్నింటిలోనూ ఆసుపత్రుల్లో ఈ ఏర్పాటు మీద ఆసక్తి పెరుగుతోంది, ముఖ్యంగా మహామొండి సమస్యగా భావించే 'హెచ్‌ఐవీ-క్షయ' రెండూ కలగలిసి ఉన్న వారి వార్డుల్లో ఈ ఏర్పాటు చాలా అవసరమని భావిస్తున్నారు. లండన్‌లోని సెయింట్‌ మేరీస్‌ హాస్సిటల్‌ కూడా ఛాతీ సమస్యలతో వచ్చే రోగులు వేచి ఉండే గదిలో ఈ రకం యూవీ లైట్లను ఏర్పాటు చేసింది. మన శరీరంలో జీవకణాల పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి యూవీ కిరణాలు కేవలం ఉపరితలం వరకే చేరుకుంటాయి. కానీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కణాలు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా యూవీ ప్రభావానికి లోనై సమూలంగా నాశనమైపోతాయి. అందుకే మనకే ఇబ్బందీ కలిగించకుండా, సూక్ష్మక్రిములను అంతం చేసే యూవీ లైట్ల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా గాలిలో ఏముందని ఈ లాభం???
సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాలు సూక్ష్మజీవులను నిర్మూలిస్తున్నాయి కాబట్టి ఎండతో లాభం ఉందని గ్రహించాం. బాగానే ఉందిగానీ.. మరి తాజా గాలి వల్ల జరిగేదేమిటి? పోర్టన్‌ డౌన్‌ పరిశోధకుల బృందం దీని మీదా విస్తృతంగా కృషి చేసి చివరికి- తాజా గాలిలో ఉండే 'హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌' అనేవి సూక్ష్మక్రిములను చంపుతున్నాయని గుర్తించింది. వాతావరణంలోని నీరు, ఓజోన్ల మధ్య నిరంతరం జరుగుతుండే ప్రతిచర్యల నుంచి ఈ హైడ్రాక్సిల్‌ మాలిక్యూల్స్‌ పుట్టుకొస్తున్నాయని, ఈ చర్యలకు గాలిలో మొక్కల నుంచి వెలువడే జీవ రసాయనాలు ఉత్ప్రేరకాలుగా దోహదం చేస్తున్నాయని వీరు గుర్తించారు. చిత్రమేమంటే ఈ హైడ్రాక్సిల్‌ మాలిక్యూల్స్‌ అట్టే కాలం ఉండవు, అందుకే ఎప్పటికప్పుడు తాజా గాలి వీస్తుండటం ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించటంతో బ్రిటన్‌కు చెందిన కొన్ని సంస్థలు ఈ హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌ను కృత్రిమంగా తయారుచేసే చిన్నచిన్న యంత్రాలను తయారుచేసి కూడా.
ఇదంతా చూసిన తర్వాత...
మన ఆసుపత్రుల్లోకి, మన ఇళ్లలోకి స్వచ్ఛమైన గాలీ వెలుతురు రావటం ఎంత అవసరమో ప్రత్యేకంగా గుర్తించటం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సాధ్యమైనంత వరకూ ఇళ్లలో, ఆసుపత్రుల్లో సహజ సిద్ధమైన, ధారాళమైన గాలీవెలుతురు ఉండేలా చూడాలని సిఫార్సు చేస్తోంది. ఈ విషయంలో ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ కృషిని మరువద్దని కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. కాబట్టి గాలీ వెలుతురూ.. ఇళ్లలోకి బాగా రావాలని ఎవరైనా చెబితే.. ఏదో పాతకాలం మాట అని కొట్టిపారెయ్యకండి! సాధ్యమైనంత సహజ సిద్ధమైన జీవితాన్ని గడపండి! ఈ ప్రకృతిలో మనల్ని కాపాడే సహజసిద్ధమైన ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. వాటిని గౌరవించటం ఒక్కటే.. మనం మనకు చేసుకోగలిగిన గొప్ప మేలు!
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 21, 2014

Excretion of toxins,De-Toxification,విష విసర్జనం

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Excretion of toxins,De-Toxification,విష విసర్జనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



శరీరములో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ  వ్యవస్థ మనశరీరములో వుంది . అయితే అత్యుత్సాహముతో తినే అనవసర పదార్ధాలవల్ల అనేక విషపూరిత పదార్ధాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసము వల్ల పరిమిత, సులువుగా జీర్ణమయ్యే అహార పదార్ధాలలో లభిస్తుంది.

విషపదార్ధాలతో ఇబ్బంది .

విషపదార్ధాలను శరీరము నుండి విసర్జించడాన్నీ డి-టాక్సిఫికేషన్‌ అంటారు. ఆల్కహాల్ , రసాయనిక పదార్ధాలు , ఫాస్ట్ ఫుడ్స్ , స్ప్రైసెస్ లతో ఉన్న తిళ్ళు , ఆహారము ద్వారా ఏర్పడే ఇతర విషపూరిత వాయువులు , విషపదార్ధాలు ఏవైనా కావచ్చు. ఇవి శరీరములో పేరుకుపోతే సహజ శరీర విసర్జక వ్యవస్థ పని చాలా కస్టమవుతుంది. అందువల్ల జీవన చర్యలు మందగిస్తాయి. ఫలితం గా జీర్ణవ్యవస్థ , హార్మోన్‌ వ్యవస్థ , విసర్జక అవయవముల పనితీరు అస్తవ్యస్తం అవుతుంది.
విషపదార్ధాలు - pre radicals : ఇవి స్వతంత్రముగా ఉండగలిగే మోలిక్యులా స్పీసెస్ -unpaired electron in an atomic orbital. ఇవి ఒక ఎలక్ట్రాన్‌ తీసుకోవడము గాని ఇవ్వడము గాని చేయుచూ oxidants గా లేదా reductants గా పనిచేయును .important oxygen-containing free radicals in many disease states are hydroxyl radical, superoxide anion radical, hydrogen peroxide, oxygen singlet, hypochlorite, nitric oxide radical, and peroxynitrite radical.కణజాలము డామేజ్ చేయును. ముఖ్యము గా కొవ్వుకణాలు , న్యూక్లియక్ యాసిడ్స్ , ప్రోటీన్లు లపై దాడిచేయును.

O2-,superoxide anion,
H2O2, hydrogen peroxide,
OH :hydroxy radical,
RooH : organic hydrogenperoxide,
RO : alkoxy and ROO:peroxy radicals,
HOCI : hypochlorous acid,
ONOO : peroxynitrite,

అలసట ఏ అవయాలకి :

చర్మము మీద పొక్కులు , తట్టు , కీళ్ళనొప్పులు , అజీర్ణము వంటివి అలసటను కలుగ జేస్తాయి. విసర్జక అవయవాలైన కాలేయం , మూత్రపిండాలు , పేగుల పని భారము ఎక్కువై దెబ్బతింటాయి. ఇతర ముఖ్య అవయవాలైన గుండె , ఊపిరితిత్తులు , మెదడు కూడా దీని ప్రభావానికి లోనై ఇబ్బంది పెట్టే అనేక వ్యాధులు కలుగుతాయి.

ఎలా తప్పించుకోవాలి :

ఈ అవస్థకు మూల కారణమైన పదార్ధాలను తినకూడదు . సహజసిద్ధమైన సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని మితముగా తీసుకోవాలి. అర్హులు ఉపవాసము చేసి పండ్లు , తాజా పండల రసాలు త్రాగగము వలన 1-2 రోజులలో విషపదార్ధాలను బయ్టకు పంపేయవచ్చును.

తినకూడని పదార్ధములు :
మాంసము , పాల ఉత్పత్తులు , ఆల్కహాల్ , ప్రోసెస్ చేసిన తీపిపదార్ధాములు , వేపుళ్ళు , ఊరగాయలు .అనవసరము గా చీటికి మాటికి మందులు వాడరాదు .

తినవససిన పదార్ధములు :

తాజా పండ్లు , కూరలు , ఆకుకూరలు ,
వనమూలికలతో చేసిన టీ , పానీయాలు ,
బాదం , వాల్ నట్ , జీడిపప్పు , పొద్దుతిరుగుడు , గుమ్మడి విత్తనాలు ,
బ్రౌన్‌ రైస్ , గోధుమ , జొన్న లతో చేసినవి .
ఎక్కువగా మంచినీరు త్రాగాలి ,
యాంటీ ఆక్షిడెంట్స్ -- విటమిన్‌ A,విటమిన్‌ C, విటమిన్‌ E, సెలీనియం ,వంటి విటములు తీసుకుంటుండాలి.

ఉపవాసము చేయకూడని వారు :

గర్భిణీలు , పాలిచ్చే తల్లులు , డయాబెటీస్ ఉన్నవారూ , తక్కువ రక్తపోటు ఉన్నవారు , ఫుడ్ ఎలర్జీ ఉన్నవారూ ,టీనేజర్స్ ఉపవాసము చెయ్యకూడదు. లంకణం పరమ ఔషము అనంటారు. ఇది అందిరికీ పనికిరాదు . ఉపవాసము ఉంటే జీర్ణాసయానికి విశ్రాంతి అభించి ఆరోగ్యము గా ఉంటుంది.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, August 12, 2014

ebola virus- ఎబోలా వైరస్




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ebola virus- ఎబోలా వైరస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా.. ఈ వైరస్ సోకితే మృత్యువాతే -- అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. అనేక ప్రపంచ దేశాలను ఎబోలా అనే వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఎయిడ్స్ వెలుగు చూసిన సమయంలోనూ ఇంతగా భయపడని అమెరికా వంటి సంపన్న దేశాలు ఎబోలా పేరు వింటేనే గజగజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒక్కసారి సోకిందంటే ప్రాణాలను హరించేదాకా విశ్రమించని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంగా 932 మంది మృత్యువాత పడగా, ఆగస్టు నెలలో ఇప్పటి వరకు 61 మందిని పొట్టనపెట్టుకుంది.

అసలు ఎబోలా సోకిన తన పౌరులను కాపాడుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన యత్నం, ఆ దేశ పౌరులను ఆగ్రహావేశాలకు గురి చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. చికిత్సే లేని ఎబోలా వ్యాధి నుంచి దూరంగా పారిపోవడం మినహా, సోకిన తర్వాత చేయగలిగిందేమీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అంతేనా, ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు కూడా వైద్య వర్గాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే, ఎబోలా సోకిన రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో ఓ వైద్యుడితో పాటు సదరు క్లినిక్‌లో పనిచేసిన ముగ్గురు నర్సులు కూడా ఈ వ్యాధి బారినపడి చనిపోవడమే ఇందుకు కారణం.

భారత్ నుంచి వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. అయితే ఎబోలా వ్యాప్తి కనిపించిన దేశాల్లో మాత్రం 45 వేల మందికి పైగా ప్రవాస భారతీయులున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదేదో ప్రైవేట్ సంస్థలు వెల్లడిస్తున్న విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ పార్లమెంట్ కు చెప్పిన లెక్కలు.

ఎబోలా కరాళ నృత్యం చేస్తున్న లైబీరియాలోనే ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారిలో 300 మంది భారత్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లున్నారు. వీరితో పాటు 2,700 మంది భారతీయులు ఇతర పనుల నిమిత్తం లైబీరియాలో ఉన్నారు. సియోర్రాలియోన్‌లో 1,200 మంది, గినియాలో 500 మంది భారతీయులు ఉన్నారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఎబోలా వ్యాప్తితో సతమతమవుతున్న దేశాలే. ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తే, పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నేపథ్యంలో కేంద్రం, ఈ గణాంకాలను సేకరించింది. అయితే, మన పౌరులు ఎబోలా బారిన పడకుండా దేశానికి తిరిగివస్తే, ఎలాంటి సమస్యా లేదు. అయితే పొరపాటున వ్యాధి సోకిన తర్వాత వస్తేనే అసలు సమస్య. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అన్ని విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు నిర్బంధ వైద్య పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఎబోలా అనుమానిత కేసును గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుల్లో ఎబోలా అలర్ట్‌ను ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాలుగు ఎబోలా స్క్రీనింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎబోలా నిర్దారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను ఎబోలా వైరస్‌పై చైతన్య పరచడం వల్లే ఈ వైరస్ బారిన పడకుండా చూడగలమని అధికారులు అబిప్రాయపడుతున్నారు.

  • ప్రయోగాత్మక చికిత్సలు :
సాధారణంగా ఏదైనా వ్యాధికి ఔషధాలను అందుబాటులోకి తేవడానికి ముందు వివిధ దశల్లో పరీక్షిస్తారు. అంతా సంతృప్తికరంగా ఉందనుకున్నాక.. ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధ్రువీకరించుకున్నాక.. చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ, ఎబోలా వైరస్‌ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్‌ పాలబడ్డ ఇద్దరు అమెరికన్‌ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశల్లో ఉన్న జడ్‌మాప్‌ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితీ ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే.. వారి శరీరాల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేక ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా.. లైబీరియాలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న స్పానిష్‌ మతప్రచారకుడొకరికి(75) కూడా ఈ వైరస్‌ సోకింది. దీంతో, ఆయనను స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి, ఆయనకు కూడా జడ్‌మాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే.. ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, జడ్‌మాప్‌ ఔషధాన్ని తమ దేశంలోని బాధితులకూ ఇవ్వాలని నైజీరియా ఆరోగ్య మంత్రి అమెరికాను కోరగా.. అందుకు ఆ కంపెనీ అంగీకరించాలని అక్కడి అధికారులు సమాధానమిచ్చారు. ఇదే రీతిలో దీంతో బాధపడుతున్న మిగతా దేశాలూ జడ్‌మాప్‌ ఔషధాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్న నేపథ్యంలో.. ఈ తరహా ఔషధాల వినియోగంలోని నైతికతపై అంతర్జాతీయస్థాయి వైద్యులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ఒక సమావేశం నిర్వహించాలని నిశ్చయించింది. ఎబోలా లాంటి ప్రాణాంతక వైరస్‌లు వ్యాపించినప్పుడు.. ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలను సైతం వినియోగించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం ఈ సమావేశం లక్ష్యం.

  • ఏమిటీ ఎబోలా?
ఎబోలా అలియాస్‌ జైరీ ఎబోలా.. ‘జీనస్‌ ఎబోలై వైరై’లోని ఐదు జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన జాతి ఇది. ఈ వైరస్‌ సోకినవారికి వచ్చే వ్యాధిని ఎబోలా వైరస్‌ డిసీజ్‌ గా వ్యవహరిస్తారు. గతంలో దీన్ని ఎబోలా హేమరేజిక్‌ ఫీవర్‌గా పిలిచేవారు.

  • మొదటిసారి.. ఎక్కడ? ఎప్పుడు?
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (జైరీ)లో తొలిసారి దీన్ని కనుగొన్నారు. అక్కడి ఒక నది పేరు ఎబోలా. ఆ పేరే ఈ వైరస్‌కు పెట్టారు. 1976లో పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల గ్రామాల్లో ఈ వైరస్‌ ప్రబలింది. అప్పుడే ప్రపంచానికి పరిచయమైంది.

  • ఈ వైరస్‌కు మూలమేంటి?
ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు శాస్త్రజ్ఞులు 1976 నుంచి ప్రయత్నించారు. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ ప్రబలిన ప్రాంతాల్లో 30 వేలకు పైగా జీవజాతుల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎట్టకేలకు 2005లో.. ‘ఫ్రూట్‌ బ్యాట్స్‌’గా వ్యవహరించే మూడు గబ్బిలం జాతుల ఆర్‌ఎన్‌ఏల్లో ఈ వైరస్‌ ఉన్నట్టు కనుగొన్నారు. ఈ గబ్బిలాల్లో ఆ వైరస్‌ దాగి ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగకపోవడంతో.. ఎబోలా వైరస్‌కు ఆ గబ్బిలాలే సహజ ఆశ్రయాలుగా ఉన్నట్టు గుర్తించారు.

  • మనుషులకు ఎలా సోకింది?
ఎబోలా వైరస్‌కు సహజ ఆశ్రయాలుగా ఉన్న గబ్బిలాలు సగం తిని పడేసిన వాటిని అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, దుప్పులు ... ఇతర జీవాలు తినడంతో వాటికి వైరస్‌ సోకింది. ఆయా జీవాలను చంపి తిన్న మనుషుల్లోకీ పాకింది. అలాగే గినియా, తోమా, కిస్సి, గుయెర్జ్‌ వంటి ప్రాంతాల్లో గబ్బిలాల సూప్‌ తాగే, గబ్బిలాలను మంట మీద కాల్చుకుని తినే అలవాటుంది. అది కూడా ఈ వైరస్‌ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. అందుకనే.. ఈ ఏడాది మార్చి 26న గినియా ప్రభుత్వం తమ దేశంలో గబ్బిలాల సూప్‌ తయారీని, వినియోగాన్ని నిషేధించింది.

చితిత్స :  జడ్‌మాప్‌ ఔషధం--
ఎబోలా వైరస్‌కు ఇప్పటికైతే పూర్తిస్థాయి చికిత్స లేదు. కానీ.. ప్రపంచం మొత్తం ఒక ఔషధం వైపు ఆసక్తిగా చూస్తోంది. అదే జడ్‌మాప్‌. ఈ ఔషధాన్ని శాన్‌డియోగోకు చెందిన బయోఫార్మాస్యూటికల్‌ ఇన్‌కార్పొరేషన్‌ సంస్థ తయారుచేసింది. దీంట్లో మూడు యాంటీబాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్‌ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండి.. ఆయా కణాలను సమర్థంగా నిర్మూలించేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.

ఎలా వ్యాప్తిచెందుతుంది ? :
ఎబోలా వైరస్‌ ఎంత ప్రమాదకరమైనదైనా మనం భయపడాల్సిన పని లేదు. దీనికి ప్రధాన కారణాలు రెండు.
1. ఈ వైరస్‌ జలుబు, దగ్గులను కలిగించే వైరస్‌లలాగా గాలిలో వ్యాపించదు. వైరస్‌ బారిన పడినవారి శారీరక స్రావాలను నేరుగా తాకితే మాత్రమే సోకుతుంది. మనదేశంలో ఎబోలా బాధితులు లేనందున ఈ పద్ధతిలో ఆ వైరస్‌ ప్రబలే ప్రమాదం దాదాపు మృగ్యం.
2. ‘‘ప్రస్తుతానికైతే, మన దేశంలో ఆ వైరస్‌ లేదు. కానీ, మనవాళ్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉంటారు. అలా పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా వ్యాపిస్తే?’’ అనే సందేహం కలగొచ్చు. ఆ ప్రమాదం లేకుండా.. భారత ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో హై-అలర్ట్‌ ప్రకటించింది. ఆయా దేశాల నుంచి వచ్చినవారిని పరీక్షిస్తోంది. ఆస్పత్రుల్లో వారిని ప్రత్యేకమైన ఏర్పాట్లుగల వార్డుల్లో విడిగా ఉంచి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఎబోలా గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు.
3.జలుబు, దగ్గు వైరస్‌లలా ఇది గాలిలో వ్యాపించదు. ఈ వ్యాధి వచ్చినవారి శరీర స్రావాలు.. లాలాజలం, కళ్లె, రక్తం, మలం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలో అక్కడి సంప్రదాయాల ప్రకారం మరణించినవారికి అంతిమ సంస్కారాల్లో చేసే కొన్ని క్రియల వల్ల ఎక్కువగా వ్యాపిస్తోంది.

 లక్షణాలు..
ఎబోలా వైరస్‌ సోకినవారిలో వెంటనే ఆ లక్షణాలు కనపడవు. ఇందుకు కనిష్ఠంగా రెండు రోజులు.. గరిష్ఠంగా 21 రోజులు పడుతుంది. ఎక్కువ మందిలో 5-10 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో ప్రధానంగా కనపడే తొలి లక్షణం.. కనీసం 101 డిగ్రీల జ్వరం. విపరీతమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పులుంటాయి. పొత్తికడుపులో నొప్పి వస్తుంది. నీరసంగా బలహీనంగా అనిపిస్తుంది.

గొంతు వాస్తుంది. తలతిరగడం, వాంతి వచ్చేటట్లు ఉండటం వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. ఆ తర్వాతి దశలో.. అంతర్గత రక్తస్రావం, రక్తపువాంతులు, రక్తవిరేచనాలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటిలక్షణాలు కనపడతాయి. ఈ వైరస్‌ సోకక ముందే ఏవైనా గాయాలు అయి అవి ఇంకా పూర్తిగా తగ్గకపోతే.. వాటి నుంచి కూడా ధారగా రక్తం కారిపోతుంటుంది. మొదటి దశ లక్షణాలను బట్టి చాలామంది దీన్ని మలేరియ జ్వరంగానో డయేరియాగానో పొరబడతారు. అసలు విషయం తెలుసుకునే సరికి చెయ్యిదాటిపోతుంది.

  • ఎబోలా చికిత్సకు ప్రయోగాత్మక ఔషధాలు
డబ్లూహెచ్‌ఓ అనుమతి--ఫలితాలు రుజువు కాకున్నా ఫర్వాలేదని స్పష్టీకరణ--
జెనీవా, మ్యాడ్రిడ్‌, న్యూఢిల్లీ: ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక ఔషధాల వినియోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) అనుమతించింది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా మరణించినట్లు తేలడంతో పాటు, స్పెయిన్‌కు చెందిన క్రైస్తవ మత గురువు కూడా మరణించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ''ఔషధం సామర్థ్యం, దాని దుష్ఫలితాల గురించి తెలియకున్నా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని ఉపయోగించడం నైతికమే.'' అని ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాకు చెందిన మ్యాప్‌ బయోఫార్మాస్యూటికల్‌ అనే ప్రైవేటు సంస్థ ఎబోలా వైరస్‌ చికిత్సకు జడ్‌మ్యాప్‌ పేరుతో ఒక ఔషధాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ఇంకా ప్రాథమిక ప్రయోగాల దశలోనే ఉంది. ఇప్పటి వరకు కోతులపై మాత్రమే ప్రయోగించారు. లైబీరియాలో ఎబోలా వైరస్‌ సోకిన రోగులకు సేవలందిస్తున్న క్రమంలో స్పెయిన్‌కు చెందిన మిగ్యూల్‌ పాజరెస్‌ (75) అనే మతగురువుకు ఆ వైరస్‌ సోకింది. ఆయన్ను అక్కడి నుంచి స్పెయిన్‌కు తరలించి జడ్‌మ్యాప్‌తో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మంగళవారం మరణించారు. ఈ వైరస్‌ నియంత్రణకు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ కానీ, చికిత్సకు ఔషధం కానీ లేదు. దీంతో నిబంధనలను సడలించి జడ్‌మ్యాప్‌ను దిగుమతి చేసుకోవడానికి స్పెయిన్‌ అనుమతిచ్చింది.

మేము వచ్చేస్తాం: భారతీయ వైద్యులు: మరోవైపు ఎబోలా వ్యాపిస్తున్న నైజీరియాలో పనిచేస్తున్న భారతీయ వైద్యులు నలుగురు స్వదేశానికి వచ్చేయాలనుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా ఎబోలా రోగులకు వైద్యసేవలందించాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని వారు ఆరోపిస్తున్నారు. భారత్‌కే చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారు పని చేస్తున్నారు. తమ పాస్‌పోర్టులను ఆస్పత్రి స్వాధీనం చేసుకుందని ఆ నలుగురు వైద్యులు ఆరోపించారు. ఈ విధంగా విధులకు దూరం అవడం వైద్య విలువలకు విరుద్ధమని, భారత్‌కు చెడ్డపేరు తేవడమేనని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ఆస్పత్రి ఉన్న పట్టణంలో అసలు ఎబోలా కేసులే లేవని స్పష్టం చేసింది. భారత హైకమిషన్‌ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.  

  • ఎబోలా గుర్తింపునకు చౌకైన నానో సెన్సర్‌
మెల్‌బోర్న్‌: ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌తోపాటు ఇతర వ్యాధులను వేగంగా నిర్ధరించేందుకు అత్యంత సున్నితమైన ఒక బయోసెన్సర్‌ను ఆస్ట్రేలియా విద్యార్థుల బృందం రూపొందించింది. ఇందులో భారత సంతతికి చెందిన అనిరుధ్‌ బాలాచందర్‌ కూడా ఉన్నారు. డీఎన్‌ఏ ఆధారిత ఈ నానోయంత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఏదో ఒకరోజు ఒక స్మార్ట్‌ఫోన్‌ లేదా పోర్టబుల్‌ యంత్రంలో రక్తం నమూనా ఉంచడం ద్వారా వ్యాధి నిర్ధరణకు సైతం ఇది వీలు కల్పిస్తుంది. బ్యాక్టీరియా లేదా వైరస్‌కు సంబంధించిన నిర్దిష్ట డీఎన్‌ఏ పోగును తాకగానే అది లైట్‌లా వెలుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది.. వ్యాధి ఉనికి గురించి శాస్త్రవేత్తలు, పరిశోధకులను వేగంగా అప్రమత్తం చేసే చౌకైన విధానమని చెప్పారు.

  • సేకరణ / డా.వందనా శేషగిరిరావు (శ్రీకాకుళం).--7 ఆగస్టు 2014

దేశంలో తొలి ఎబోలా కేసు గుర్తింపు--ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న అధికారులు.

దిల్లీ: దేశంలో తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి ఇక్కడికి వచ్చిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 'నవంబరు పదో తేదీన లైబీరియా నుంచి ఇక్కడికి చేరుకున్న ఓ 26 ఏళ్ల వ్యక్తి వీర్య నమూనాలు పరీక్షించగా ఎబోలా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నాం' అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాంతక వ్యాధికి సంబంధించి బాధితుడు గతంలో లైబీరియాలో చికిత్స కూడా తీసుకున్నాడని వివరించింది. వ్యాధి లక్షణాలు లేవని నిర్థరించిన తర్వాత ఇక్కడికి బయలుదేరి వచ్చాడని...అయితే ఇక్కడ జరిపిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు బపటపడ్డాయని తెలిపింది. పరిస్థితి అదుపులోనే ఉందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తామని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రాజస్థాన్‌లో మరో అనుమానిత కేసు
జయపుర: ఓ 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి తరహా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడికి ఇక్కడి సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. అనుమానిత రోగిని జయపుర నగరంలోని విద్యాధర్‌నగర్‌కు చెందిన మొహమ్మద్‌ రెహన్‌ ఖాన్‌గా గుర్తించారు.జ్వరం, బొబ్బలతో ఇబ్బందిపడుతున్న ఖాన్‌ను తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రికి మార్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఖాన్‌ బంధువులతో కలిసి దిల్లీకి బయలుదేరి వెళ్లిపోయాడని మాన్‌సింగ్‌ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్‌ సి.ఎల్‌.నేవల్‌ తెలిపారు.

courtesy with : eenadu news paper -6:48 PM 2014-11-19.
  • ===================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, August 2, 2014

ఆరోగ్య సమస్యలు రాకుండా మీ కోసం మీరు..తీసుకోవలసిన జాగ్రత్తలు




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ఆరోగ్య సమస్యలు రాకుండా మీ కోసం మీరు..తీసుకోవలసిన జాగ్రత్తలు
- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే దాకా విరామం లేకుండా పనిచేయడం వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* పనిలో పడి నీళ్లు తాగడం కూడా మర్చిపోతున్నారా? దానివల్ల తలనొప్పులూ, అలసటా, శరీరంలో శక్తిలేకపోవడం లాంటి సమస్యలు తప్పవు. అందుకే కాస్త దాహంగా అనిపించినా పనులన్నీ పక్కనపెట్టి మంచి నీళ్లు తాగండి.

* రోజంతా చురుగ్గా పని చేయాలంటే వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదు. అందుకే రోజూ కాసేపు వ్యాయామం చేసేలా చూసుకోండి. కాసేపు నడవండి. ఇంటిపనుల్లో భాగంగానే మెట్లెక్కి దిగండి.

* ఎంత హడావిడిగా ఉన్నా, రోజూ పొద్దున్నే టిఫిన్‌ని మాత్రం మానేయకండి. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది ఓ చక్కని పరిష్కారం. అలాగే వేళకు భోంచేయడమూ పాటించాల్సిన జాగ్రత్తే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

నమిలి తింటున్నారా?
   * జీవనశైలి మారిపోయింది. చాలామందికి కనీసం తినడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. కంగారులో ఏదో నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకోవడమే కానీ నమిలి తినడం గురించి శ్రద్ధ పెట్టట్లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

* హడావుడిగా తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదు. మరో వైపు గాలి కూడా లోపలికి వెళ్లిపోతుంది. కొద్ది సేపటికే ఆకలి వేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బాగా నమిలి తినడం మంచిది. అప్పుడు ఎంత తినాలో అంతే తింటాం. ఆకలి కూడా త్వరగా వేయదు. అంతేకాదు... లాలాజల గ్రంథులు కూడా చురుగ్గా మారతాయి.

* బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా అయి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది.

* ఆహారంలో ఉండే బ్యాక్టీరియా వల్ల కడుపులో గ్యాస్‌, ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటాయి. మరి ఆ బ్యాక్టీరియాను నాశనం చేయాలంటే బాగా నమలాలి. నములుతున్నప్పుడు నోట్లో లాలాజలం స్రవిస్తుంది. ఇందులో మేలు చేసే బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియాతో పోరాడతాయి.

* బాగా నమిలి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుంది. తక్కువ ఆహారమైనా సరే నమిలి తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలిగా అనిపించదు. మాటిమాటికీ తినాలనే కోరిక కూడా కలగదు. దాంతో లావయ్యే సమస్య ఉండదు.

* నమలడం వల్ల దంతాల మధ్యలో ఆహార పదార్థాలకు సంబంధించి ఏమీ ఇరుక్కోకుండా ఉంటాయి. దంతాలు కూడా గట్టి పడతాయి. ముఖ కండరాల దగ్గర కొవ్వు కూడా చేరుకోకుండా ఉంటుంది.

courtesy with : Eenadu vasundara news paper 02-08-2014

  • ===================================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, July 27, 2014

Ayurvedhi Tips for skin health and beauty, చర్మ సౌందర్యానికి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Ayurvedhi Tips for skin health and beauty, చర్మ సౌందర్యానికి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • అందుబాటులో ఉండే వాటితోనే అందంగా ఎలా కనిపించవచ్చో-

* తాజా మెంతి ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట పాటు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే యాక్నె, మొటిమలూ, ముడతలూ, బ్లాక్‌ హెడ్స్‌ వంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే

*స్ట్రాబెర్రీలు కొన్నప్పుడు ఆ బాక్స్‌లో అడుగున కొన్ని ఆకులు ఉంటాయి. వాటిని పారేయాల్సిన అవసరం లేదు. మొటిమలు అధికంగా ఉన్నవాళ్లు, ఆ ఆకుల్ని మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే, వాటి చుట్టూ ఉండే వాపు తగ్గుతుంది.

* రెండు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల రోజ్‌వాటర్‌ని కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ఎండిన తులసి ఆకులతో చేసిన టీలో దూది ముంచి దానితో ముఖాన్ని తుడుచుకొంటే ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు.

* యాక్నె అధికంగా ఉండేవారు అలొవెరా రసాన్ని రెండు పూటలా ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. గంధానికి రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించి, కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

  • కలబందతో కళగా..12/08/2014
కప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మెంతి పొడీ, టేబుల్‌ స్పూన్‌ తులసి ఆకుల పొడీ, రెండుటేబుల్‌ స్పూన్ల ఆముదం వేసుకుని బాగా కలపాలి. దీన్ని తలకు పూతలా రాసుకుని, షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ముప్పావు గంట తరవాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టును బలంగా మారుస్తుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మెరుగైన ఫలితాలు పొందేందుకు కనీసం వారానికోసారి ఈ పూతను వేసుకోవాలి.

అరకప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మందార పువ్వుల పేస్టును వేసి బాగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి పోషణనిస్తుంది.

    చర్మం మరీ పొడిగా, తాకితే గరుకుగా అనిపిస్తోందా! అయితే చర్మానికి తేమనందించే ఈ క్యారెట్‌ మాస్క్‌ని ప్రయత్నించి చూడండి. -- 17-Aug-14

చెంచా తాజా కీరదోస గుజ్జుకి చెంచా మీగడ, రెండు చెంచాల క్యారెట్‌ రసం కలిపి ఆ మిశ్రమాన్ని దట్టంగా మెడ నుంచి ముఖం వరకూ పట్టించాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మానికి పోషకాలు అంది మృదువుగా మారుతుంది. క్యారెట్‌ రసం, నిమ్మరసం, సెనగపిండిని సమపాళ్లలో తీసుకొని పావుకప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటూ కాళ్లూ, చేతులూ, మెడ దగ్గర పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా ఆలివ్‌నూనె, రెండు చెంచాల క్యారెట్‌ రసం, కాస్త పెరుగూ తీసుకుని బాగా గిలకొట్టాలి. దీనిని ముఖానికి రాసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు ఛాయలని వెనక్కి నెట్టేస్తాయి. క్యారెట్‌ తురుమూ, పాలపొడీ, పంచదారని సమపాళ్లలో తీసుకొని ముఖంపై రుద్దాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మృతకణాలు తొలగి ముఖం కాంతిమంతం అవుతుంది.

స్నానం ద్వారా చర్మ సమస్యలు మాయం

    వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా భాధిస్తాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు. ఈ ఇబ్బందులన్నీ తొలగించుకుని చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

ఈ కాలంలో పొగలొచ్చే వేణ్నీళ్లతో స్నానం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అలాకాకుండా గోరువెచ్చని నీళ్లలో కొబ్బరినూనె కలిపితే చర్మం మృదువుగా మారుతుంది. కాగుతున్న నీళ్లలో వేపాకు లేదంటే నిమ్మతొక్కలు వేస్తే వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి.

* సబ్బులూ, గాఢత ఎక్కువగా ఉన్న క్రీమ్‌లు వాడకపోవడం మంచిది. వాటివల్ల కొన్నిసార్లు చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. సున్నిపిండీ, నలుగు పిండి వంటి వాటికి ప్రాధాన్యమివ్వడం మంచిది.

* అప్పుడప్పుడూ కాసిని నీళ్లలో లవంగాల నూనె చేర్చి ఒంటికి మర్దన చేసుకోవాలి. ముఖ్యంగా పాదాలకు మసాజ్‌ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. అలానే వర్షంలో తడిసి ఇంటికెళ్లినప్పుడు స్నానం చేసే నీళ్లలో వెనిగర్‌ కలపాలి. దీంతో బురద వల్ల వెంట వచ్చిన ఫంగస్‌ వదిలిపోతుంది. రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి రాత్రిపడుకునే ముందు ముఖం, మెడా తుడుచుకుంటే కనిపించని క్రిములూ మురికీ దూరమవుతాయి. చర్మం చక్కటి నిగారింపును సంతరించుకుంటుంది.

  • అందానికి ఆలివ్‌
నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎలు చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడానికి తోడ్పడతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ముడతలూ, గీతలను తొలగిస్తాయి. చర్మానికి అవసరమైన తేమను అందించి, మృదువుగా మారుస్తాయి. స్నానానికి అరగంట ముందు ఆలివ్‌నూనెను ఒంటికి పట్టించి, తరవాత స్నానం చేసినా ఫలితం ఉంటుంది.

* తరచూ మేకప్‌ వేసుకునే వారి చర్మం త్వరగా పొడి బారుతుంది. ఈ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే మేకప్‌ను తొలగించడానికి ఆలివ్‌నూనెను వాడాలి. దాన్ని గోరువెచ్చగా చేసి ముఖానికి మర్దన చేసి, కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల, కఠిన రసాయనాల ప్రభావం చర్మంపై పడదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

* కొందరికి గోళ్లు ఇట్టే విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు రోజూ ఐదు నిమిషాలు ఆలివ్‌నూనెతో మర్దన చేస్తే గోళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.


పెసరపిండితో అందం
అందంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తప్పనిసరి. దీనికి అందుబాటులో ఉండే వంటింటి వస్తువులు సరిపోతాయి. అలాంటివాటిల్లో పెసరపిండి కూడా ఒకటి.

చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు కప్పు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

రెండుమూడు చెంచాల పెసరపిండీ, పావుకప్పు పెరుగూ, చెంచా తేనె, చిటికెడు పసుపూ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం శుభ్రంగా కడుక్కున్నాక పూతలా వేసి, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలూ, మొటిమల తాలూకు మచ్చల్ని తొలగిస్తుంది.

పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు కొద్దిగా పెసరపిండిలో చెంచా తేనె, పావు చెంచా కలబంద గుజ్జూ, అరచెంచా బొప్పాయి పేస్ట్‌ కలుపుకొని మెత్తగా చేసుకుని ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. తాజాగా కనిపిస్తారు.

గుడ్డులోని తెల్లసొనలో చెంచా పెరుగూ, చెంచా పెసరపిండీ, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటాగి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.

  • పాల మెరుపు
విటమిన్‌ 'ఎ', 'డి' వంటి వాటితో పాటూ ఎముకల్ని బలంగా ఉంచే క్యాల్షియం వంటి ఖనిజాలూ పాల నుంచి పెద్ద మొత్తంలో శరీరానికి అందుతాయి. దుమ్మూ, ధూళీ ప్రభావం పడినప్పుడు చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పాలను సహజ క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు. పాలు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రపరిచి బ్లాక్‌హెడ్స్‌, యాక్నె వంటి సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. దీనికోసం ఏం చేయాలంటే... పచ్చి పాలను ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచి దాానికి చెంచా సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. దీంతో మురికి తొలగిపోతుంది.

* చర్మం పొడి బారి ఇబ్బందిపెడుతోందా! దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది. పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి ఆరనివ్వాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది. పచ్చి పాలల్లో గులాబీ రేకల ముద్దా, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజు విడిచి రోజు ఒంటికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
  •  




* ఎండవేడితో తలెత్తే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలు అదుపులో ఉంచుతాయి. మేని ఛాయను మెరుగుపరుస్తాయి. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. పచ్చి పాలూ, తేనె మిశ్రమాన్ని రోజూ ఒంటికి రాసుకుని ఆరాక స్నానం చేస్తే సరి. స్నానం చేసే నీళ్లలో అరకప్పు పచ్చిపాలూ, చెంచా గులాబీ నీరూ, రెండు చెంచాల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. దీనితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అవసరమైన పోషకాలు అంది నిగనిగలాడుతుంది.

బంగాళాదుంప రసం పూత చర్మం నిగారింపుకు  ప్రయత్నిద్దాం

    ఎప్పుడూ వంటింట్లో అందుబాటులో ఉండే బంగాళాదుంప అందానికి ఎంతో మేలు చేస్తుంది.

చెంచా బంగాళాదుంప రసంలో రెండు చెంచాల నిమ్మరసం, ముల్తానీమట్టీ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. అది ఆరాక చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ఎండ వేడికి చర్మం రంగును కోల్పోయినప్పుడు ఫ్రిజ్‌లోపెట్టి తీసిన బంగాళాదుంప ముక్కలతో ముఖం మీద రుద్దుకుంటే సరిపోతుంది అలానే బంగాళాదుంపలో ఉండే పొటాషియం, విటమిన్‌ బి6, విటమిన్‌ 'సి'లు చర్మం మీద మృతకణాలను తొలగించేస్తాయి. విటమిన్‌ సి యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మ సమస్యలను దూరం చేసి మృదువుగా మారుస్తుంది. బంగాళాదుంప గుజ్జులో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేయాలి. ఈ పూత ముఖానికి బ్లీచ్‌లా కూడా పని చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది.

ఎండకు కమిలిన చర్మానికి సాంత్వన కలగాలంటే, బంగాళాదుంపల్ని తరిగి ఆ ప్రాంతంలో ఉంచాలి. పది నిమిషాలయ్యాక తీసి చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే పెరుగులో చెంచా బంగాళాదుంప గుజ్జును కలిపి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఆలూలో ఉండే విటమిన్‌ బి6 చర్మం మీద యాంటీ ఏజింగ్‌ కారకంలా పనిచేస్తుంది. ముడతలు రాకుండా కాపాడుతుంది.

కళ్ల కింద నల్లటి మచ్చలు బాధిస్తోంటే ఈ గుజ్జులో తేనె కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ పూత వల్ల నల్లటి మచ్చలు దూరమవుతాయి. కళ్ల మంటలూ, దురదా తగ్గుతాయి.

బంగాళా దుంప రసంలో సమపాళ్లలో కీరదోస రసం కలిపి అందులో దూది ఉండలు వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత దూదితో ముఖం తుడుచుకుంటే టోనర్‌గా పనిచేసి ముఖాన్ని మెరిపిస్తుంది. ఇక బంగాళాదుంపలను ఉడికించిన నీళ్లతో తరచూ ముఖం కడుక్కుంటే తాజాదనం సొంతమవుతుంది.

  • ముడతలు దూరం
కార్యాలయంలో కూర్చుని పనిచేసే వాళ్లతో పోలిస్తే... బయట తిరిగి పని చేసే వాళ్లకి ముప్ఫైల్లోనే చర్మంపై గీతలు పడటం, చర్మం పొడి బారడం వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లు క్రీముల కన్నా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.

*బాగా పండిన అరటిపండుని మెత్తగా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంటయ్యాక కడిగేసుకోవాలి. బయటికి వెళ్లొచ్చాక ఇలా చేస్తే గీతలు పడే అవకాశం తగ్గుతుంది.
*అనాస గుజ్జు కూడా చర్మంపై బాగా పనిచేస్తుంది. ఆ గుజ్జూ లేదా రసాన్ని ముఖానికీ మెడకీ రాసుకుని మర్దన చేస్తే ముడతలూ, గీతలు రాకుండా చూసుకోవచ్చు.
*ఒక టీ చెంచా ఆలివ్‌ నూనెకి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని బాగా రుద్దినా మంచిదే.
* తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
*బొప్పాయిని మెత్తగా చేసి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి వారానికోసారి ముఖానికి రాసుకోవాలి.
*అప్పుడప్పుడు తేనె, గులాబీ నీళ్లూ, పసుపూ కలిపి ముఖానికి రాసుకుని కాసేపు వదిలేసినా మంచిదే.

పై పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటే ముప్ఫైల్లోనే చర్మంపై గీతలూ, ముడతలూ రావడం... పొడిబారడం వంటి సమస్యలు దూరమవుతాయి.

  • గుడ్డుతో అందమే...

జుట్టుకి ఆరోగ్యాన్నీ అందాన్నీ అందించే వాటిలో గుడ్డు స్థానం ఎప్పుడూ ముందే. ఇందులో సల్ఫర్‌, సెలీనియం, ఫాస్ఫరస్‌, ఇనుమూ, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్‌ 'ఇ' కూడా కావల్సినంత ఉంటుంది. అది అతినీలలోహిత కిరణాల నుంచి వెంట్రుకలను కాపాడుతుంది. గుడ్డులోని తెల్లసొనకు ఒక చెంచా ఆలివ్‌ నూనెని కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని మాడుకు పట్టేలా రాసుకోవాలి. పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలాగే గుడ్డు పచ్చసొనలో మూడు చెంచాల ఆలివ్‌నూనెనీ కాస్త తేనెనీ కలిపి రాసి అరగంట తరవాత కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని పచ్చసొనకు కాస్త నిమ్మరసాన్ని కలిపి వెంట్రుకల కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ హెయిర్‌ ప్యాక్‌లను నెలలో కనీసం రెండుసార్లయినా ప్రయత్నిస్తే... మృదువైన, నిగనిగలాడే జుట్టు సొంతమవుతుంది.
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Asanas for sinus problem,సైనస్‌ సమస్య కి ఆసనాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Asanas for sinus problem,సైనస్‌ సమస్య కి ఆసనాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    ముక్కు పట్టేయడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, ముఖమంతా నొప్పులూ, తలనొప్పి.. ఇలా ఏడాది పొడవునా సైనస్‌ లక్షణాలు కొందరిని ఇబ్బంది పెడుతుఉంటాయి. వాటిని అదుపు చేయాలంటే... ఈ ఆసనాలు వేయాల్సిందే.

  • పూర్ణ భుజంగాసనం
బోర్లా పడుకుని ఛాతీ పక్కన రెండు చేతులూ ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచి పాదాల్ని పైకి లేపి తల దగ్గరకు తీసుకురావాలి. తరవాత శ్వాస తీసుకుంటూ మెల్లగా భుజాలను పైకి లేపుతూ సాధ్యమైనంత వరకూ తలను పాదాలకు ఆనించడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయాలి. దీన్ని చేయడం వల్ల ఛాతీ భాగం, పొట్ట బాగా సాగుతాయి. వెన్నెముకకు విశ్రాంతి అంది ఆరోగ్యంగా మారుతుంది. స్వాధీష్టాన చక్రం క్రమబద్ధం అవుతుంది. ఈ ఆసనం గర్భాశయం, అండాశయాలకూ మేలు చేస్తుంది. పొట్టలోని భాగాలన్నింటికీ మంచిది. అలాగే శ్వాస సమస్యలున్న వాళ్లకూ ఈ ఆసనం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. హెర్నియా, హైపర్‌ థైరాయిడ్‌ ఉన్నవాళ్లు ఆసనాన్ని గురుముఖంగా వేయడం మంచిది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, గుండె జబ్బులూ, అధికరక్తపోటు ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

  • భస్త్రిక ప్రాణాయామం
కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి, కొద్దిగా వేగంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా వందసార్లు లేదా మూడు నిమిషాలు చేయాలి. తరవాత వెంటనే లేవకుండా కళ్లు మూసుకుని నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. ఆ తరవాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.ఈ ప్రాణాయామం చేయడం వల్ల వూపిరితిత్తులు దృఢంగా మారతాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రోజులో రెండుసార్లు కూడా ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు.

  • విపరీత నౌకాసనం
బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులూ, కాళ్లూ, తలను సాధ్యమైనంత వరకూ పైకి లేపాలి. ఈ క్రమంలో శరీర బరువంతా పొట్టపై ఉంచాలి. మోకాళ్లు వంచకూడదు. ఈ స్థితిలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస వదులుతూ తలా, కాళ్లూ చేతులూ కింద పెట్టాలి. తరవాత మళ్లీ శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం వేయాలి. ఇలా ఆరుసార్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా సైనస్‌ సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎలర్జీల్లాంటివి రాకుండా ఉంటాయి. శరీరాన్ని సాగదీయడం వల్ల ఛాతీ భాగం, వూపిరితిత్తులూ దృఢంగా మారతాయి.

-- courtesy with eenadu vasundara
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, July 16, 2014

Hints for Flashing white teeth,దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే-చిట్కాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints for Flashing white teeth,దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే-చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయడం వల్ల మరియు కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా వసరం. ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. పసుపు రంగు దంతాలను నివారించే ఉత్తమ పదార్థాలు, ఏమేమి తింటే మీ దంతాల అలా ప్రభావితం అవుతున్నాయి తెలుసుకోవాలి.  ప్రస్తుతం దంతాలు తెల్లబడటానికి మార్కెట్లో అనేక విధానాలు మరియు ఖరీదైన దంత చికిత్సలు ఉన్నాయి. అయితే ఖరీదైన చికిత్సలతో పనిలేకుండా, సహజపద్దతులో మీ దంతాలు మిళమిళమిరిపంప చేసే  నేచురల్ టిప్స్ ఇక్కడ చూడండి .

*మౌత్ వాష్, కాఫీ మరియు సోడాల వంటి వాటికి దూరంగా ఉండండి: కాఫీ, సోడా మరియు కొన్ని సార్లు మౌత్ వాష్ లు కూడా మీ దంతాలు పసుపు వర్ణానికి దారితీస్తాయి. అందువల్ల మనం వాటికి దూరంగా ఉండాలి .

*రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి: 
ఒక రోజుకు కనీసం రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా అవసరం . అందువల్ల మీ దంతాలలో మరియు నాలు మీద అతుకొన్ని ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా సహాయపడుతుంది . అందువల్ల, ఎల్లో మరకలు నివారించాలంటే, రోజుకు రెండు సార్లు బ్రెష్ చేయడం తప్పనిసరి .

*పండ్లు తినాలి: కొన్ని సార్లు మీరు ఆతురతతో ఉన్నప్పుడు సరిగా బ్రష్ చేయరు. అటువంటప్పుడు మీరు ఫైవర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మీ దంతాలు నేచులర్ గా శుభ్రపడుతాయి. అలాగే సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి. అందుకు అవసరం అయ్యే సలివాను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఇది మీ దంతాలు శుభ్రపరచడానికి మరియు దంతాలను తెల్లగా మార్చడానికి సహయపడుతాయి. మరియు పండ్లలో విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి మీ దంతాలను బలోపేతం చేస్తాయి. ఆపిల్ మరియు పియర్స్ వంటివి చాలా ఉపయోగకరమైనవి, వీటిలో అధికంగా నీరు అధికంగా ఉంటుంది . ఇది లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది.

 *ఫ్లాసింగ్ : ఫ్లాసింగ్ చేయడం వల్ల చిగుళ్ళ నుండి అధిక రక్తస్రావం జరుగుతుందని చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ జాగ్రత్తగా మరియు ఓపికగా చేయడం వల్ల మీ దంత ఆరోగ్యాన్ని నిర్వహించడానికి మరియు మీ పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది.

*పాల ఉత్పత్తులు: జున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి మరియు దంతాల యొక్క స్వచ్ఛత మరియు అభివృద్ధి నిర్వహించడానికి సహాయపడుతుంది . ఎనామిల్ ను రక్షణ కల్పించడంలో మరియు బలోపేతం చేయడంలో హార్డ్ చీజ్ అంటే మృదువైన జున్నులు పళ్ళును శుధ్దిచేసి, అత్యంత సమర్థవంతంగా మరియు తెల్లగా మార్చుతాయి.

*నువ్వు గింజలు : నువ్వులు నాలుక మీద బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు ఇది పళ్లఎనామిల్ నిర్మాణానికి సహాయపడుతుంది. వీటిలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది, ఇది మీ దంతాల చుట్టూ ఉన్న ఎముకలను రక్షణకు సహాయపడుతుంది . పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్స్ మరియు విటమిన్ ఇ వంటివి మంచి మూలంగా ఉన్నది. ఇవి ఇంకా ముఖ్యమైన మినిరల్స్ అంటే మెగ్నీషియన్ ను అందిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు నమలడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు పడకుండా రక్షణ కల్పిస్తుంది.

* స్ట్రాను ఉపయోగించండి: స్ట్రాను ఉపయోగించడం వల్ల మీ దంతాల మీదు మరకలు పండకుండా నిరోధించవచ్చు. ఏదైనా కలర్ డ్రింక్ త్రాగుతున్నప్పుడు , దంతాల మీద మరకలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. స్ట్రాలను ఉపయోగించడం వల్ల దంతాలకు తగలకుండా నోట్లోకు పోవడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పడటానికి అవకావం ఉండదు.

* వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంది, ఇది పళ్ళు ఎనామెల్ యొక్క నిర్మాణంకు సహాయపడుతుంది. కాబట్టి, ఈ కూరగాయలరు పచ్చిగా తినడం వల్ల పళ్ల మద్య సహజంగానే మాసాజ్ చేస్తాయి దాంతో పళ్ళ మద్య శుభ్రం అవుతుంది. ఇంకా దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*నిమ్మ , ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించండి నిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి. మీ దంతాలు తెల్లగా మారాలంటే ఈ రెండింటి మిశ్రమంతో రెగ్యులర్ గా బ్రష్ చేయాలి.

*ప్రతి రెండు నెలల కొకసారి కొత్త బ్రష్ ఉపయోగించండి ఉత్తమ ఫలితాలు పొందడం కసం రెగ్యులర్ ఇంటర్వెల్స్(తరచూ)రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చుతుండాలి. ఒక నిర్ణీత కాలం తర్వాత టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ చాలా కఠినంగా మారుతాయి. దాంతో మీ దంతాల యొక్క ఎనామిల్ ను పాడుచేస్తుంది. దాంతో మీ దంతాల మీద మరకలు ఏర్పడటానికి దారితీస్తుంది.

* మీ కాల్షియం తీసుకోవడం మెయింటైన్ చేయండి తగినంత క్యాల్షియంను మీరు తీసుకోవడం వల్ల మీ దంతాలను బలోపేతం చేస్తుంది మరియు దంతాల అమరిక నిలబెట్టడానికి సహాయపడుతుంది .

*టాయిలెట్ నుండి కనీసం 6 అడుగుల దూరంగా మీ బ్రష్ ఉంచాలి: దంతాలు శుభ్రం చేసుకొనే బ్రష్ లు టాయిలెట్ నుండి కనీసం 6 అడుగుల దూరంగా ఉంచాలి. ఎందుకంటే గాలిలో ప్రయాణించే కణాలు నివారించేందుకు ఇలా ఉంచాలని గట్టిగా సిఫార్సు చేయబడింది. ఇది దంత పరిశుభ్రతను నిలబెట్టడానికి సహాయపడుతుంది మరియు మీ దంతాలకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది.

 *క్రమం తప్పకుండా దంత వైద్యుడు సందర్శించండి మీరు ఉత్తమ ఫలితాలను పొందడానికి క్రమం తప్పకుండా దంత వైద్యుడుని సందర్శించడం తప్పనిసరి. ఎవరైతే సంవత్సరం పొడవునా పరిశుభ్రం చేయకుండా ఉంటారో , వారుకి నిజానికి అప్పుడు పాడైపోయిన లేదా అధ్వాన్నంగా పళ్ళు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళకుండా అక్కడి ముగించేస్తుంది.

* పళ్ళు తెల్లబర్చుకోవడం కోసం చికిత్స టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్లు అంత అమోదకరమైనవి కాదు, ఒక వేళ మీ పళ్ళు చాలా చెడ్డగా మరకలు పడినప్పుడు మరియు ఇక వాటిని నయం చేయడం కాదు అన్నప్పుడు హోం రెమడీస్ చాలా బాగా సహాయపడుతాయి. మరియు దంతాలను తెల్లబర్చడంలో గొప్పగా సహాయపడుతాయి.

*ఒక బలమైన మింట్ టూత్ పేస్టును ఉపయోగించండి పుదీనాతోతయారుచేసిన టూత్ పేసట్ చాలా ప్రయోజనకారి, ఇది మీ దంతాలను తెల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతంది. ఇది తక్షణమే ఫలితాలను చూపించకపోవచ్చు. కానీ కొంత కాలం తర్వాత సానుకూల ఫలితాలను చూపిస్తుంది.

* వంశానుగత కారణాలు అనేక సార్లు ప్రజలు వారి వారసత్వ కారణంగా వారి దంతాలు మరకగాఉంటాయి. అందువల్ల దంతవైద్యుడు సందర్శించండి మరియు మీ పళ్ళు మీద మరకలు ఏర్పడటానికి గల సరైన కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

*అధిక మోతాదు కలిగిన యాంటీబయాటిక్స్ మానుకోండి అధిక మోతాదు కలిగిన యాంటీ బయోటిక్స్ ను మీ దంతాల యొక్క రంగును మార్చివేస్తుంది. అందువల్ల, అనవసరంగా యాంటీబయోటిక్స్ తీసుకోవడం నివారించడం చాలా ముఖ్యం.

* సోనిక్ టూత్ బ్రష్ ను ఉపయోగించండి: ఒక సోనిక్ టూత్ బ్రష్ మీ పని చాలా తేలికచేస్తుంది. మాన్యువల్ టూత్ బ్రష్ తో, ప్రజలు సాధారణంగా హార్డ్ బ్రష్ ను ఉపయోగిస్తుంటారు. దాంతో దంతాలు మరింత దెబ్బతీస్తాయి. ఈ నిజానికి గమ్ ప్రాంతంలో కోతకు దారితీస్తుంది మరియు టూత్ వేర్ ను పెంచుతుంది. అయితే, సోనిక్ టూత్ బ్రష్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది . మీ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*దంతాలు తెల్లబర్చే వస్తు సామగ్రి టీత్ వైటనింగ్ కిట్స్ మీ దంతాలు తెల్లగా నిర్వహించడానికి సహాయపడిందని నిరూపించబడింది. అయితే వాటిని తీసుకొనే ముందు మీ దంత వైద్యున్ని సంప్రదించి ఏ బ్రాండ్ సురక్షితమో కనుక్కోండి మరియు ఎటువంటి దుష్ర్పభాలు లేకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. .

*అక్రమ జీవక్రియ మెరుగుపరచుకోండి అక్రమ జీవక్రియ కూడా మీ దంతాలను రంగు మార్చడానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లును సరిచేసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తీవ్రమైన ఒత్తిడిని నివారించడంలో తగి జాగ్రత్తులు తీసుకోవాలి.


  • Written by: Derangula Mallikarjuna -March 20, 2014@http://telugu.boldsky.com
























  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/