Thursday, December 6, 2012

Gastric bypass surgery for obesity-భారీకాయులకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --భారీకాయులకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది.

మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

వ్యాధుల దాడి
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

బరువెందుకు పెరుగుతారు?
ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు.
*
కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు.
*
స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్‌ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి.

సాధారణంగా ఊబకాయం తగ్గడానికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, ల్యాప్‌బ్యాండ్, గ్యాస్ట్రిక్ బైపాస్ లాంటి చికిత్సపూన్నో అందుబాటులో ఉన్నాయి.

  • స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ
ఈ సర్జరీని పూర్తిగా లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తారు. పొట్ట మీద అయిదు చిన్న రంధ్రాలను వేస్తారు. ఒక గంటలో సర్జరీ పూర్తవుతుంది. జీర్ణాశయంలో 80 శాతాన్ని తొలగించి, ఒక చిన్న సంచిలా తయారుచేస్తారు. జీర్ణాశయ పేగులకు వెళ్లే చిన్న నాళాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. దీనితో జీర్ణాశయ పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. కొద్దిపాటి ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సర్జరీ చేయించుకున్నవారు రెండు మూడు రోజులు ఆసుపవూతిలో ఉండాల్సి వస్తుంది. రెండు వారాల్లో దైనందిన కార్యక్షికమాలను యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు.

  • ల్యాప్ బ్యాండ్
ఈ విధానంలో జీర్ణాశయం పై భాగంలో ఒక బ్యాండు వేస్తారు. దాంతో అది ఒక చిన్న సంచిలాగా తయారవుతుంది.
ఈ సర్జరీని కూడా లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే చేస్తారు. అయితే దీనికోసం ఒక రోజు ఆసుపవూతిలో ఉంటే సరిపోతుంది. తరువాతి కాలంలో అవసరాన్ని బట్టి ఈ బ్యాండ్‌ను వదులుచేసుకోవడం లేదా బిగుతుగా చేయడం సాధ్యపడుతుంది. అవసరమైతే ఈ బ్యాండ్‌ను తొలగించుకోవచ్చు. రిస్క్ ఉండకపోవడం, చికిత్సా విధానం సులువుగా ఉండడం, తిరిగి మార్చుకునే సౌకర్యం కలిగివుండడం వల్ల ఈ సర్జరీ పట్ల ఎక్కువ మంది మొగ్గు చూపుతారు.

  • గ్యాస్టిక్ బైపాస్
దీనిలో జీర్ణాశయాన్ని సుమారు 60 నుంచి 70 శాతం ఉపయోగంలోకి రానివ్వరు. ఈ క్రమంలో జీర్ణాశయాన్ని రెండు వేరు చేస్తారు. పైభాగాన్ని కోడిగుడ్డు పరిమాణంలో ఒక చిన్న సంచిలాగా తయారు చేస్తారు. కింది భాగాన్ని మాత్రం తొలగించరు. దీనివల్ల అందులోకి ఆహారం ప్రవేశించనప్పటికీ అక్కడ ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు జీర్ణక్షికియలో తోడ్పడుతాయి. జీర్ణాశయాన్ని వేరుచేయడానికి స్టాప్లింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. పైభాగంలో ఆహారం కింది భాగానికి చేరే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. ఈ సర్జరీ చేసుకున్న రోగులు రెండు మూడు రోజులు ఆసుపవూతిలో ఉండాల్సి ఉంటుంది.

  • సర్జరీ తరువాత...
ఆపరేషన్ అనంతరం రోగులు శరీరంలో చోటుసుకున్న మార్పులకు అలవాటు పడేందుకు కొద్దిరోజులు పడుతుంది. సర్జరీ తరువాత మొదటి ఆరు నెలలు మితంగా ఆహారం తీసుకోవడం, నెమ్మదిగి తినడం అలవాటు చేసుకోవాలి. రోజుకు మూడుసార్లు చేసే బదులు నాలుగు నుంచి ఆరుసార్లు మితంగా ఆహారం తీసుకోవాలి. స్థూలకాయం పోవడానికి సర్జరీ ఒక వైద్యవిధానం మాత్రమే. ఆహార అలవాట్లను, జీవనశైలిన మార్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి.

-- Courtesy with Dr. Venugopal pareek (MS.DNB,FAIS, FMAS,FIAGES) @Swathi weekly magazine.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.