Thursday, December 16, 2010

Painless Therapy (Treatment),నొప్పిలేని చికిత్సలు


మన దేశము లో అనేక ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు అమలులో ఉన్నాయి. వైద్యశాస్త్ర నిపుణులు , హేతువాదులు అయా వైద్యవిధానాల ప్రామాణికతను ప్రశ్నించడం జరుగుతోంది . గోమూత్రము , చేపమందు , లీచ్ థెరపి వంటివి వాటిలో కొని . అయినప్పటికీ సామాన్య ప్రజలతో పాటు చదువుకున్న వారుకూడా ఆ విధానాలను అనుసరిస్తున్నారు . మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు . వాటి ప్రామాణికత , నిజానిజాలను పరిశీలించుదాం.

గోమూత్ర చికిత్స : ఆవును భారతీయులు పవిత్రమైనదిగా భావిస్తారు . ఆవుపాలు , ఆవునెయ్యి వంటి వాటిలో మంచి పోషక విలువలున్నాయి . అయితే ఆవుయొక్క మూతం లో కూడా ఔషదవిలువలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది . గోమూత్రాన్ని వడగట్టి , స్టెరిలైజ్ చేసి ప్రజలకు బాటిల్స్ తో అందించే సంస్థలు కూడా ఉన్నాయి . నాగపుర్ లో ఈ చికిత్స అధికము గా అమలులో ఉన్నది .
విశ్వాసాలు : గోమూత్రం వలన చర్మవ్యాదులు , గుండెవ్యాదులు లతో పాటు ఎయిడ్స్ , కాన్సర్ వంటి మొండి వ్యాధులు నయమవుతాయయనే విశ్వాసము ఉంది . శరీరము విసర్జించే అనేక సూక్ష్మపోషక పదార్ధాలను పూరిస్తుంది . కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . లివర్ సక్రమముగా పనిచేసేటట్లు చేస్తుంది . జ్ఞాపక శక్తిని పెంచుతుంది . వృద్ధాప్యం దరిచేరనీయదు . గుండె , మెదడు లోని కణాల్ని బలపరుస్తుంది .
ఆయుర్వేద వైద్యప్రకారము : గోమూత్రము పైత్యం చేస్తుంది . కఫాన్ని తగ్గిస్తుంది . ఆయుర్వృద్ధిని ఇస్తుంది . జ్వరము , ఫైల్సు , దగ్గు , శ్వాసకోశవ్యాధులు , కుష్టు , ఉబ్బు వంటి వ్యాధులను నయము చేస్తుంది . క్రిములను వాటివల్ల వచ్చే రోగాలను నయం చేస్తుంది . మల , మూత్ర బద్దకం రాకుండా చేస్తుంది . ఆకలిని పుట్టించి జీర్ణం అవడానికి దోహదపడుతుంది .
డోసేజ్ : రోజుకో గ్లాసును (200 m.l) తాగాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు .
నిజమని తేలినవి : శాస్త్రీయముగా నిర్ధారణ జరగక పోయినా గోమూత్ర చికిత్సవల్ల కొన్ని వ్యాధులు తగ్గ్గుతాయని అంటున్నారు . అవి : కొలెస్టిరాల్ తగ్గిస్తుంది , జ్ఞాపక శక్తిని పెంపోందిస్తుంది , తొందరగా ముసలితనము రాకుండా ఏజింగ్ ని పొడిగిస్తుంది . కాలేయము సక్రమముగా పనిచేసేలా చేస్తుంది .
పోషకాలు : పరిశో్ధకుల అభిప్రాయం ప్రకారము గోమూత్రం లొ పోషకాలు ->A, B,C,D,E విటమిన్లు , సోడియం , మెగ్నీషయం , పొటాషియం , గంధకం , ఐరన్‌ , నత్రజని , వంటి మూలకాలు , మాలిక్ , సిట్రిక్ , టైట్రిక్ , సక్సీనిక్ ఆమ్లాలతో పాటు ఎంజైములు , హార్మోనులు , క్రియాటినిన్‌ , లాక్టోజ్ వంటివి ఉన్నాయి .

జలగ వైద్యము : జలగల్తో వైద్యము ఒక పురాతన పద్దతి . గ్రీస్ , రోమ్‌ , వంటి విదేశాలలో 80-40 BC లోనే ఇది అమలులో ఉన్నది . మనిషి శరీరం నుండి రక్తం పీల్చడం ద్వారా జలగ పొట్ట నింపుకుంటుంది . ఒక గంటలో 10 మి.లీ. రక్తం తాగుతుంది . రక్తం గడ్డకట్ట కుండా జలగ 12 రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది . జలగ తాగే రక్తాన్ని బట్టి ఇవి మారుతుంటాయి . ఈ రసాయనాలే జలగల తో వైద్యానికి ఆధారాలు . జగల వైద్యము యునానీ పద్దతిలో చాలా కాలము నుండి అమలవుతోంది .
విశ్వాసాలు : జలగ ఉమ్మిలోని " హైరుడిన్‌ " రక్తం గడ్డకుండా చేస్తుంది . రక్తం లోని ప్లేట్ లెట్స్ గుమిగూడ నివ్వదు కరోనరి ఆర్టిరీ లోని గడ్డలను కూడ కరిగిస్తుంది . రక్తం లోని కంతులను కరిగిస్తుంది . నొప్పిని తగ్గిస్తుంది . రక్తసరఫరాను క్రమపరుస్తుంది .
వైద్య పద్ధతి .: పసుపు జలగను ఉత్తేజపరుస్తుంది . అందువల్ల పసుపు కలిపిన నీటి టబ్ లో జలగను ఉంచుతారు . ఆ రరువాత ఇన్‌పెక్ట్ అయిన రోగి శరీరం పై ఉంచుతారు . అది గంటలో సుమారు 10 మి.లీ. రక్తం ఆ ప్రదేశము నుండి పీలుస్తుంది . ఆ తరువాత అది విడిపోతుంది . తదుపరి దెబ్బతగిలిన భాగము మీద డిజిన్‌ఫెక్టెంట్ రాసి బ్యాండేజ్ వేస్తారు . జలగను పసుపు కలిపిన నీటిలో వేస్తే అది పీల్చిన రక్తము వాంతి చేస్తుంది . తర్వాత దాన్ని 15 - 25 సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద సీసాలో బద్రపరుస్తారు . ఒక గుర్తింపు మార్క్ ఇచ్చి తిరిగి దానిని అదే రోగికి ఉపయోగిస్తారు . ఆరు వారాలు తర్వాత దానిని నాశనం (చంపేస్తారు)చేస్తారు . సూక్ష్మరక్తనాళాలు , చిన్న రక్తనాళాలలో రక్తము గడ్డకట్టినప్పుడు , రక్తం కంతులు ఏర్పడినప్పుడు రక్త సర్ఫరా ఆ ప్రదేశాలలో సరిగా జరుగదు . అందువల్ల అయాబాగాలు నీలంగా మారడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి .అప్పుడు జలగలతో రక్తం పీల్చడం ద్వారా ఆ వ్యాధులు నయము చెయ్యడానికి వీలుకలుగుతుంది .
నిజము అని తేలినవి : జలగల తో వైద్యం ద్వారా వాపులు , ఎన్నటికీ తగ్గని అల్సర్ లు , ఫైల్స్ , కొన్నిరకాల కంటివ్యాధులు , కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన బాధలు , మైగ్రేన్‌ తలనొప్పి , పాదాల మంటలు , పక్షవాతము , ఆస్టియో ఆర్థ్రైటిస్ , జుట్టు రాలడం , వివిధరకాల చర్మ వ్యాధులు వంటివి తగ్గించ వచ్చుననే నమ్మకాలు ఉన్నాయి .

పచ్చి ఉల్లిపాయతో వైద్యము :
ఎండలో వడదెబ్బ తగలకుండా తలపై ఉల్లిపాయ పెట్టుకొని టోపీ ధరించడం , ఉల్లివాసన చూడడం పరిపాటి ... అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాలలో పచ్చి ప్ల్లిపాయను తింటారు .
విశ్వాసాలు : పచ్చి ఉల్లిపాయలో బి 1 , బి2 , విటమిన్లు పుష్కలముగా ఉన్నాయి . మంచి శక్తిదాయకము అధికమొత్తంలో నీటిని కలిగిఉంటుంది . ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి ఉన్నది . కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది . టెస్టోస్టిరాన్‌ పోలిన హార్మోన్‌ వంటి కెమికల్స్ దీనిలో ఉంటాయి. రోజూ ఉల్లి తింటే పిల్లకు తల్లి చేసినంత మేలు చేస్తుందంటారు .
డోసేజ్ : రోజూ ఒక మోసతరు ఉల్లి గడ్డను పచ్చి గా తినాలి . పెరుగు ఉల్లి చెట్నీ , ఉల్లి సలాడ్ రూపాలలో తనవచ్చును . ఎక్కువగాతింటే కడుపులో ఎసిడిటీ పెరిగి మండుతుంది . నోరు ఉల్లి కంపు కొడుతుంది .
నిజమని తేలినవి : వడదెబ్బ రాకుండా చేస్తుంది . రక్త సరఫరాను క్రమబద్దం చేస్తుంది . బ్లడ్ ప్లసర్ ను తగ్గిస్తుంది , రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది .

చేపమందు :
ఆస్త్మా, ఇతర శ్వాసకోశవ్యాధులు తగ్గిండేందుకు చేపమందు ఇస్తున్నారు . సుమారు 150 ఏళ్ళుగా చేపమందు ఎంతోమంది ప్రజలు ఉపయోగిస్తున్నారు . చేపమందు విశ్వసనీయతను శాస్త్రజ్ఞులు హేతువాదులు ప్రశ్నిస్తున్నా .. వేలసంఖ్యలో దేశవిదేశాలలో ఈ మందుపై ఆసక్తి చూపిస్తున్నారు . ఉబ్బసానికి మంచి మందుగా పరిగణిస్తున్నారు . కృగశిర కార్తె మదటిరోజున చేపమందు ఉబ్బసవ్యాధిగ్రస్తులకు ఇస్తున్నారు .
విశ్వాసాలు : పసుపురంగు హెర్బల్ పేస్టు , చిన్న 'మ్యూరియల్ ' చేపపిల్ల ఈ విధానము లో వాడే పదార్ధములు . హెర్బల్ పేస్టు ఏ విధంగా తయారుచేస్తారనేది చాలా గోప్యము గా ఉంచుతారు . ఉచితముగా ఇచ్చే ఈ మందును ఇతరులు తయారుచేసి వ్యాపరము చెయ్యకుండా ఉంచడం ముఖ్యోద్దేశము .
డోసేజ్ : 2-3 అంగుళాలు పొడవుండే చిన్న మ్యూరియల్ చేపపిల్ల నోటిళొ పసుపురంగులో ఉండే హెర్బల్ మందు ఉంచుతారు ... దానిని ఉబ్బసరోగి చే మింగించుతారు .
నిజమని తేలినవి : చేప మందు + హెర్బల్ పేస్టు లలో ఏది పనిచేస్తుందో ఉబ్బసవయాది తగ్గుతుంది . . ఇది ఆయుర్వేదము మందు . వరుసగా 3 సంవత్సరాలు సంవత్సరానికి ఓకసారి తీసుకోవాలి .

బోన్‌ సెట్టింగ్ :
విరిగిన ఎముకలు అతుక్కోవడానికి , బెణుకులు వంటివి తగ్గడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు . ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరు ఇందుకు చలా ప్రసిద్ధి చెందిన ప్రదేశము . పుత్తూరు బోన్‌ సెట్టింగ్ హాస్పిటల్ లో బోన్‌ సెట్టింగ్ చేసే నిపుణులు ఎంతో మంది ఉన్నారు . ఇందుకోసము అనేక హెర్బల్ వాడుతారు .
విశ్వాసాలు : ఎములల్ని సరియైన స్థానములో అమరుస్తారు . దానిపైన హెర్బల్ పేస్ట్ పూస్తారు . దానిలో వాడే వనమూలికలను గోప్యము గా ఉంచుతారు . హెర్బల్ మందు ఎముకల్ను స్థాన చలనము చెందకుండా చూస్తాయని వారి విశ్వాసము ఇదెలా పనిచేస్తుందో శాస్త్రీయమైన వివరణలేదు . చర్మము పై రాసిన మందు లోపలి ఎముకల్ని ఎలా అతుక్కుందుకు దోహదపడుతుందో తలుసు కోవలసి ఉంది .
డోసేజ్ : ఆయా ప్రదేశాలను బట్టి వాడే వనమూలికలు , పద్దతులలో మార్పు ఉంటుంది . పుత్తూరులో బోన్‌ సెట్టింగ్ చాలా ప్రసిద్ధి చెందినది . ఏ పనిముట్లు వాడకుండా చేతులతో ఎముకలను స్వస్థానము లో ఉంచి సరిచేస్తారు .కాటన్‌ క్లాత్ తో కట్టుకడతారు . వెదురు కర్రలతో సపోర్టు ఇస్తారు . 45 రోజుల తర్వాత కట్టువిప్పుతారు . సాధారణముగా ఎముకలు అతుక్కుంటాయి లేకపోతే మరోసారి కట్టుకడతారు .
నిజమని తేలినవి : చిన్న చిన్న ఫ్రాక్చర్స్ నయమవు తాయి . సర్జరీ లేకుండా తగ్గుతాయన్నది విశేషము . మల్టిపుల్ ఫ్రాక్చర్స్ నయమవడం కస్టమే .

కధ :
హెర్బల్ టీకి మరాఠీవారి మరో పేరు ' కథ ' ఇది దగ్గు , జలుబు , గొంతునొప్పి , జ్వరము వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగించే హోమ్‌ రెమిడి .
విశ్వాసాలు : తులసి , ఫెన్నెల్ , నిమ్మగడ్డి , యల్లకులు కధలోని ముఖ్య దినుసులు . తులసిలో ఉండే సీనియోల్ , యూజెనాల్ , కాంఫీన్‌ వంటి రసాయనాలు బ్రాంకైటిస్ , ఇతర శ్వాసకోశ వ్యాధులు తగ్గిస్తాయి . లెమన్‌గ్రాస్ నిద్రపట్టకపోవడం , స్ట్రెస్ తగ్గించి ప్రశాంతత సేకూరుస్తుంది . కాలేయము , పాంక్రియాస్ , మూత్రాశయం , ఆహారనాళాలలోని విషపదార్ధాలను పోగొట్ట్ , జీర్ణకిరయ , రక్త ప్రసరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది .
డోసేజ్ : కధ తయారీకి కావలసినవి -> తులది ఆకులు కడిగినవి 8-10 , ఫెనెల్ సీడ్స్ ఒక టీ స్పూన్‌ , నిమ్మగడ్డి ఆకు ఒకటి , లవంగాలు 3-4 , శొంఠిపొడి చిటికెడు , లికొరిస్ చిటికెడు , ... ఇవన్నీ నీటిలో వేసి సగానికి మరిగించాలి . అవసరమైతే వడగట్తి వేడిగానే తాగాలి . లికోరిస్ లేదా తేనె కలుపుకోవచ్చును . ఏ వయసువారైనా తాగవచ్చును .
నిజమని తేలినవి : దగ్గు , జలుబు , గొంతునొప్పి , శరీరానికి సంబందించి న నొప్పులు , వికారము తగ్గుతాయి .

హీట్ థెరపీ :
ఆయుర్వేద వైద్యవిధానము లో వేడిని ఉపయోచించి వైద్యము చెయ్యడాన్ని హీట్ థెరఫీ అంటారు . హిమాలయాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రక్రియ వాడుకలో ఉన్నది . ఆరు నెలల నుండి ఓక సంవత్సరం లోపు పిల్లలకు ఇది తప్పనిసరి వైద్యచికిత్స . హీట్ థెరపీని థెర్మోథెరపీ అని కూడా అంటారు .
విశ్వాసాలు : దీనిలో 45 -50 సెం.మీ. పొడవు గల " టావ్ " అనే ఇనుము చువ్వను ఉపయోగిస్తారు . ఒక వైపు బాగా వంచబడి .. ఒకటి / రెండు చిల్లులు కలిగివుంటుంది . ఇనుప చువ్వను బాగా ఎర్రగా కాలుస్తారు దానిని దెబ్బతిన్న ప్రదేశముపై కొద్దిసెకనులు ఉంచుతారు . తర్వాత ఆప్రదేశము ను పత్తి , ఆలివ్ నూనె తో పూస్తారు .
నిజమని తేలినవి : వేదికి కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి . గాయమైన ప్రదేశము వేడి వలన రక్తప్రసరణ ఎక్కువై గాయం మానుతుంది . ఆలివ్ ఆయిల్ తో మసాజ్ కూడా నొప్పులు తగ్గింస్తుంది .


  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.