Tuesday, January 31, 2012

Human circulatory System Awareness, మానవ రక్తప్రసరణ వ్యవస్థ అవగాహన


  • image : courtesy with Eenadu news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Human circulatory System Awareness, మానవ రక్తప్రసరణ వ్యవస్థ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మానవ శరీరము లో రక్తప్రసరణ చాలా ముఖ్యమైంది . మన శరీరము లో ఆక్షిజన్‌ , కార్బన్‌డైఆక్షైడ్ , హార్మోనులు , వ్యర్ధపదార్ధాలు రవాణా చేయడానికి రక్తప్రసరణ వ్యవస్థ ఉపయోగపడుతుంది . విలియం హార్వే అనే శాస్త్రవేత్త రక్తప్రసరణ వ్యవస్థని కనుగొన్నారు . ఉన్నత స్థాయి జంతువులలో రక్తము రక్తనాళాలో ప్రవహిస్తుంది . గుండె నుంచి వివిధ శరీరభాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలను " ధమనులు " అని అంటారు . వీటిలో మంచిరక్తము ( ఆక్షిజన్‌ తో కూడిన రక్తము) ప్రవహిస్తుంది . ధమనుల గోడలు మందముగా ఉంటాయి. వీటిలో రక్తము ఎక్కువ పీడనముతో ప్రవహిస్తుంది . శరీర భాగాలనుంచి రక్తాన్ని గుండెకు తీసుకు వచ్చే రక్తనాళాలను " సిరలు " అని అంటారు . వీటిలో చెడు రక్తము (కార్బన్‌ డై ఆక్షైడ్ తో కూడిన రక్తము ) ప్రవహిస్తుంది . సిరల గోడలు పలచగా ఉంటాయి. . వీటిలో రక్తము తక్కువ పీడనముతో ప్రవహిస్తూంది . రక్తము వెన్నక్కి ప్రవహించకుండా సిరలలో కవాటములు ఉంటాయి.

సకశేరుకాల్లో అంటే వెన్నెముక ఉంటే జంతువులలో రక్తప్రసరణ వ్యవస్థ భాగా అభివృద్ధి చెంది ఉంటుంది. వీటిలో గుండె కండరయుతమై గదులుగా విభజన చెంది ఉంటుంది . చేపలలో రెండు గదుల గుండె , ఉభయచర జీవుల్లో మూడు గదుల గుండె , సరీసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదుల గుండె , పక్షులు , క్షీరదాల్లో నాలుగు గదుల గుండె ఉంటుంది .

రక్తములో ప్లాస్మా , రక్తకణాలు ఉంటాయి. రక్తకణాల మధ్య ఉండే ద్రవపదార్ధమే " ప్లాస్మా" దీంట్లో అనేక పదార్ధాలు కరిగి ఉంటాయి. రక్తకణాలు మూడు రకాలు . అవి 1) ఎర్ర రక్తకణాలు , 2)తెల్లరక్తకణాలు , 3) త్రాంబోసైట్లు .

ఎర్రరక్తకణాలను " ఎరిథ్రోసైట్లు " అని అంటాము . వీటిలో ఉన్న హీమోగ్లోబిన్‌ ద్వారా ఆక్షిజన్‌ రవాణా జరుగుతూ ఉంటుంది . ఎర్ర రక్తకణాలు కేంద్రము లేని కణాలు . ప్రతి సెకను కి సుమారు 2.4 మిలియన్ల కణాలు తయారవుతూ ఉంటాయి. ఇవి ఎముకల మజ్జ (Bone marrow)లో తయారవుతాయి. వీటి జీవిత కాలము 120 రోజులు . మనుషులలో 4-5 మిలియన్ల కణాలు /ఘనపు మి.మీ (cubic.mm) ఉంటాయి .

తెల్లరక్తకణాల (white blood cells) ను " ల్యూకోసైట్లు " అని అంటాము . ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పతాయి. శరీరములోని హానికర సూక్ష్మజీవులను భక్షిస్తాయి. . అందుకే వీటిని " శరీర రక్షకభటులు " అని పిలుస్తారు . వీటిలో నిర్ధిష్ట కేంద్రకం ఉంటుంది. ఇవి ఎముకల మజ్జ (Bone marrow)లో తయారవుతాయి. వీటి జీవితకాలము 12 నుండి 13 రోజులు . ఇవి ప్రతి క్యూబిక్ మి.మీ.కు సుమారు 4000-11000/mm^3 . వీటిలో న్యూట్రోఫిల్స్ (54-62%), ఇసినోఫిల్స్(1-6%) ,Basophils(<1%),Lymphocytes(25-33%), monocytes(2-10%), అనేవి రకాలు .

త్రాంబోసైట్లు రక్తము గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. వీటి జీవితకాలము 5-9 రోజులు . ఇవి కూడా ఎముకల మజ్జ (Bone marrow)లో తయారవుతాయి. మన రక్తము లో 1.5 - 4.0 లక్షల కణాలు /కూబిక్ మి.మీ ఉంటాయి. ప్రతిరోజూ 100,000,000,000 కణాలు తయారవుతాయి.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, January 26, 2012

COPD,సిఓపిడి(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -COPD,సిఓపిడి(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  •  తినే ఆహారం, తాగే నీరే కాదు. పీల్చేగాలి కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే వూపిరితిత్తులు దెబ్బతినొచ్చు. ఇది క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ), ఆస్థమా, అలర్జీ, బ్రాంకైటిస్‌ వంటి రకరకాల వ్యాధులకు దారితీయొచ్చు. అయితే తగు జాగ్రత్తలు, జీవనశైలి మార్పులతో వూపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

సిఓపిడి-COPD (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) ఏదో ఒక రోజులోనో, హఠాత్తుగానో వచ్చే వ్యాధి కాదు. కొన్ని ఏళ్లపాటు చాపకింద నీరులా వ్యాధి కొనసాగుతూ ఒక స్థాయికి వచ్చే సరికి మనిషిని కుంగదీస్తుంది. ఇప్పుడు చేయడానికి ఏమీ ఉండదని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇవ్వాళ సిగరెట్‌ తాగగానే దాని ఫలితం కనిపించదు. మెల్లగా దాని విషప్రభావం తాలూకు మార్పులు శరీరంలో ప్రారంభమవుతాయి. ఎన్నో ఏళ్లకు గానీ వ్యాధి బయటపడదు. ఈ లోగా లక్షణాలు అంత ప్రమాదకరంగా కూడా ఉండవు. దగ్గు వస్తుంది. కళ్లి (expectoration)పడుతుంది. మళ్లీ కొన్నాళ్లకు పరిస్థితి మామూలుగా ఉంటుంది. మళ్లీ దగ్గు, కళ్లి(expectoration) పడతాయి. ఇలా వ్యాధి ముదరిపోతూ చివరికి ఊపిరితిత్తులు మూలనపడిపోతాయి.

సిఓపిడిని ఒకప్పుడు రెండు వ్యాధులుగా పరిగణించేవారు. ఒకటి క్రానిక్‌ బ్రాంకైటిస్‌. రెండోది ఎంఫిసిమా. ఇపుడు రెండు వ్యాధుల్ని కలిపి సిఓపిడి గా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్‌ బ్రాంకైటిస్‌లో కళ్లి(expectoration) ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫిసిమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికీ కారణం ధూమాపానమే ! సిగరెట్‌ తాగినా, చుట్టతాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. ఈ వ్యాధి కేవలం పురుషుల్లోనే కాకుండా స్త్రీలోలనూ కనిపిస్తుంది. అయితే మన రాష్ట్రంలో స్త్రీలో ఇది వచ్చే అవకాశం అంతాగా లేదు. కానీ పంజాబ్‌, కాశ్మీర్‌ వంటి చలి ప్రదేశాల్లో స్త్రీలకు సిఓపిడి వస్తుంది. ఆస్తమా కూడా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధే కానీ, సామాన్యంగా ఏదో ఒక సీజనల్లో వస్తుంది. పోతుంది. సిఓపిడి అలా కాదు. వచ్చిదంటే పోదు... పైగా క్రమేపీ ముదురుతూంటుంది. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవడానికి వీలులేదు. కనీసం మూత్రవిసర్జన చేసేందుకు లేచి నాలుగు అడుగులు వేయలేని దుస్థితి వచ్చేస్తుంది. తరచూ దగ్గు, జ్వరం, కళ్లి (expectoration) సమస్యలు ఉంటాయి. వస్తుంటాయి. పోతుంటాయి ! కొందరు బరువు తగ్గుతారు. ఎంత తిన్నా బరువు తగ్గతుంటారు. ఎందుకంటే ఊపిరితిత్తులు గాలి తీసుకోవడానికి ఎంతో శక్తి అవసరం. తినే తిండి కేవలం ఊపిరితీసుకోవడానికి సరిపోతుందంటే నమ్మలేం కానీ నిజంగా జరిగేది అంతే ! కుటుంబపరంగా, వారసత్వంగా ఒకవేళ ఆస్తమా అనువంశికంగా వస్తుంటే ఉన్న సిఓపిడికి ఆస్తమా తోడవుతుంది. సిఓపిడి తీవ్రతను మనం ఇంకా సరిగా గుర్తించలేదని చెప్పాలి. ధూమపానం చేసే వ్యక్తి తన జీవితంలో సిగరెట్లు, బీడీలకు తన సంపాదనలో 15 శాతం ఖర్చు చేస్తుండగా, ఆనక వచ్చే వ్యాధులను తగ్గించుకునేందుకు వచ్చే సంపాదనలో 30 శాతం ఖర్చు చేస్తున్నట్లు అంచనా.


  • వ్యాధి లక్షణాలు

ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. రోజువారీ పనులు చేసుకోవడం తగ్గిపోతాయి. వ్యాధి ముదిరేకొద్దీ కదలికలు తగ్గిపోతూ వస్తాయి. కాస్త వంగున్నా ఊపిరాడదు. కాస్త జలుబు చేసినా ఊపిరి తీయడం కష్టమవుతుంది. ఎడతెగని దగ్గు ఉంటుంది. ఆకలి ఉండదు. బరువు తగ్గుతారు. కళ్లు తిరుగుతాయి.
స్పైరోమీటర్‌ అన్న ఒక పరికరం సహాయం ద్వారా,మీరు కొన్ని శ్వాస పరీక్షలు చెయ్యవలసి వుంటుంది. COPD తక్కువైనదా ( MILD), ఓ మోస్తరుదా ( MODERATE) లేదా విపరీతమైనదా (SEVERE) అనేది కనుక్కునేందుకు ఈ పరీక్షలు పనికొస్తాయి.

తక్కువ COPD లక్షణాలు :- ఎక్కువగా దగ్గతూ వుండవచ్చు, ఒక్కొసారి దగ్గులో శ్లేష్మం కూడా రావచ్చు.కాస్తగా గట్టిగా పనిచేస్తే లేదా త్వరగా నడిస్తే, తగ్గినట్లు అనిపించవచ్చు.

మోస్తరు COPD లక్షణాలు :- శారీరకమైన పని లేదా ఇంటి పనులు చేస్తూ వున్నప్పుడు, మీకు కష్టం అనిపిస్తూ వుండచ్చు. మిగతా వారి కంటే ఈ పనులన్నీ కాస్త మెల్లగా చేయవలసి రావచ్చు.జలుబు, ఛాతీ ఇన్‌ఫె క్ష్‌న్‌ల నుండి కోలుకోవడానికి చాలా వారాలు పట్టవచ్చు.

విపరీతమైన COPD లక్షణాలు :- మీరు మెట్లు ఎక్కలేరు. ఓ గదిలో ఈమూల నుంచి ఆ మూలకి సరిగ్గా నడవలేరు. ఎంత కొంచెం పని చేసినా లేదా మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా మీరు ఆలిసిపోతూవుంటారు.

  • కారణాలు

ఈ వ్యాధి ఎక్కువగా సిగరెట్లు తాగే వారిలోనే, చుట్టలు తాగేవారిలోనూ, బీడీలు తాగేవారిలోనూ కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువ. ఏళ్ల తరబడీ ధూమపానం చేసేవారికి ఈ వ్యాధి తప్పకుండా వస్తుంది. పరోక్ష ధూమపానం వల్ల క్రానిక్‌ బ్రాంకైటిస్‌ లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల కూడా సిపిఓడి వస్తుంది. కొన్ని వృత్తుల వల్ల కూడా సిపిఓడి వ్యాధి రావొచ్చు. వండ్రంగులూ, మైనింగ్‌లో పనిచేసేవారు కూడా ఈ వ్యాధి బారినపడతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు వాడే స్త్రీలు నిరంతరం పొగలో ఉండడం వల్ల ఈ వ్యాధి రావొచ్చు. కార్లు విడుదల చేసే కాలుష్య కారకాలను పీల్చే వారికి కూడా రిస్కు ఉంటుంది. ఇన్నీ కాకుండా వంశపారంపర్యంగా కూడా సిఓపిడి రావొచ్చు. ''ఏఏఎఫ్‌'' అల్ఫా ప్రోటీన్‌ లోపం వల్ల వ్యాధి అనువంశికంగా వస్తుంది. కాకపోతే ఇది అరుదు. అలాగే హెచ్‌ఐవి వ్యాధి ఉన్నవారు కూడా ఈ వ్యాధికిలోనవుతారు.

  • డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలి?

కొంచెం వ్యాయామాలు చేసేటప్పుడు శ్వాస కష్టంగా ఉంటే. ఎంతకీ మానని దగ్గు, కాస్త రంగుగా ఉన్న కళ్లెపడుతున్నప్పుడు. ఈ లక్షణాలు ఉన్న అందరికీ ఎంఫిసిమా ఉందని కాదు. ఇవన్నీ ఉంటే ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదని భావించొచ్చు. ఎంఫిసిమా ఉన్నదీ లేనిది డాక్టర్లు మాత్రమే నిర్ధారిస్తారు. పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ (PFT)ద్వారా ఊపిరిత్తులు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసినవారూ, చేస్తున్నవారూ కూడా ఒకసారి ''పి.ఎఫ్‌.టి'' చేయించుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నదీ లేదనిదీ తెలుస్తుంది. అలాగే కళ్లి పరీక్ష, ఎక్స్‌రేలు కూడా వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటిస్కాన్‌ చేయించుకుంటే బుల్లాలను ( ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న చిన్న వాయుకోశాలు కలిసిపోయి పెద్ద తిత్తిలా మారతాయి. ఇలాపాడైపోయిన ఈ తిత్తి శ్వాస ప్రక్రియను నిర్వహించలేదు. దీన్నే బుల్లా అని వ్యవహరిస్తారు) గుర్తించే వీలుంది.

  • చికిత్స

తక్షణ చికిత్స పొగమానేయడం. లేదంటే వ్యాధి ముదిరిపోతుంది. ఇన్‌హేలర్‌ ద్వారా మందులు వాడడం ప్రారంభిస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు కొద్దిగా వదులుగా మారి శ్వాస కాస్త తేలిగ్గా అందుతుంది. చాలాసార్లు ప్రాణవాయువును అందిచాల్సి వస్తుంది.
డాక్టర్‌ సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. COPD తీవ్రతను తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోండి. ప్రతి మందు పేరు, తీసుకోవలసిన మోతాదు, ఎప్పుడు తీసుకోవాలి అనవి రాసి ఉంచుకోండి. వాయునాళాలని వెడల్పు చేసే మందులను 'బ్రోంకో డైలేటర్స్‌' అంటారు. మీ ఊపిరితిత్తులలో గల వాయు నాళాల చుట్టూ వున్న కండరాలను గట్టిపరిచే చర్యను అవరోధించి, ఇంకా వెనక్క మరలించడం ద్వారా ఈ మందులు పని చేస్తాయి. ఉపశమనం కలిగి మరింత కులాసాగా శ్వాస పీల్చడానికి తోడ్పడ తాయి. శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. Infection  కోసము యాంటిబయోటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడాలి

  • ఆపరేషన్‌ అవసరమా?

సిఓపిడి వ్యాధి బాగా ముదిరి శ్వాస తీసుకోవడం మరీ కష్టంగా ఉన్నప్పుడు ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. దీన్ని లంగ్‌ రిడక్షన్‌ సర్జరీ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లోపల ఉన్న బుల్లాను కత్తిరించి తీసేస్తారు.


తీసుకోవలసిన జాగ్రత్తలు : 
  •  తేమకు దూరం :
తేమ వాతావరణం.. పిల్లికూతలు, దగ్గు, ఆస్థమా దాడులు పెరగటానికే కాదు. సీవోపీడీ వంటి వూపిరితిత్తి సమస్యలకూ దారితీస్తుంది. ఇంట్లో తేమ ఎక్కువగా ఉంటే తవిటి పురుగులు పెరగటానికీ తోడ్పడుతుంది. కాబట్టి ఇంట్లోకి తేమ వచ్చే అవకాశం గల అన్ని మార్గాలను మూసేయాలి.

  • ఇంటి కాలుష్యంతో జాగ్రత్త:
గ్యాస్‌ లీక్‌ కావటం, కట్టెపొయ్యిలు.. బొగ్గుపొయ్యిల నుంచి వచ్చే పొగ, మాడిపోయే వేపుళ్ల వంటివి ఇంట్లోనూ గాలిని కలుషితం చేస్తాయి. ఇలాంటి గాలిని పీల్చేవారికి సీవోపీడీ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి వంటగదిలో పొగను బయటకు పంపే ఫ్యాను, చిమ్నీలు ఏర్పాటుచేసుకోవాలి. ఎయిర్‌ కండిషన్ల వాడకాన్ని తగ్గించుకోవాలి.
  • సిగరెట్లు ప్రమాదం
వూపిరితిత్తులకు సిగరెట్లు, బీడీల పొగ ప్రధాన శత్రువు. సీవోపీడీ బాధితుల్లో 70% మంది సిగరెట్లను తాగేవారే కావటం గమనార్హం. ఇతరులు వదిలిన సిగరెట్‌ పొగను పీల్చటమూ ప్రమాదమే. దీంతో సీవోపీడీ ముప్పు 130% పెరుగుతున్నట్టు తేలిది. కాబట్టి సిగరెట్లు, బీడీలు తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. అలాగే ఇంట్లో ఎవరైనా వీటిని కాలుస్తుంటే వారించాలి.
  • గోబీపువ్వు సాయం
క్యాబేజీ, గోబీపువ్వు, బ్రకోలీ వంటి కూరగాయల్లో ఐసోథియోసయనేట్లు అధికంగా ఉంటాయి. ఇవి పొగ వల్ల వూపిరితిత్తులు దెబ్బతినటాన్ని అడ్డుకుంటాయి. పొగతాగేవారు ఇలాంటి కూరగాయలను తింటే వూపిరితిత్తి క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి క్యాబేజీ, గోబీపువ్వు, బ్రకోలీ వంటివి ఎక్కువగా తినాలి.
  • పట్టణాల్లో నుసి ముప్పు
దుమ్ము, ధూళి, నుసి, పొగ, వాహనాలు వెలువరించే కాలుష్య కారకాలు, ద్రవ బిందువులు.. గాల్లో చాలాసేపు ఉండిపోతాయి. వీటిని పీల్చితే నేరుగా వూపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. శ్వాస వ్యవస్థలో స్థిరపడి, అడ్డంకులు సృష్టిస్తాయి. వూపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. అందువల్ల వీలైనంతవరకు కాలుష్యం తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటి పనులు చేసుకోవటం మంచిది. అలాగే రద్దీ ప్రాంతాలు, రోడ్ల పక్కన వ్యాయామం వంటివి చేయకుండా చూసుకోవాలి.
  • వ్యాయామం --
వ్యాయామం మూలంగా వూపిరితిత్తులు ఆక్సిజన్‌ను బాగా గ్రహిస్తాయి. దీర్ఘంగా శ్వాస తీసుకునే ప్రాణాయామం వంటివీ వూపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి నిపుణుల సూచన మేరకు రోజుకి 10 నిమిషాల సేపు ప్రాణాయామం, అరగంట సేపు వ్యాయామాలు చేయటం మంచిది.
  • బరువు తగ్గటం--
అధిక బరువు వూపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో రక్తంలోకి తగినంత ఆక్సిజన్‌ సరఫరా కాదు. అందువల్ల బీఎంఐ 30 కన్నా ఎక్కువ గలవారు బరువు తగ్గించుకోవాలి.

references :
1.డా|| పి.అజయకుమార్‌,ఛాతివైద్యనిపుణులు-ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి-ఇఎస్‌ఐ దగ్గర హైదరాబాద్‌,
2.ఈనాడు సుఖీభవ వ్యాసము ,
3. - డా|| సుధీర్‌ ప్రసాద్‌-పల్మోనాలజిస్ట్‌--గ్లోబల్‌ హాస్పిటల్‌,-హైద్రాబాద్‌ ,
4.Text book of Lung diseases for P.G. students.,
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

బ్రాంకైటిస్‌,Bronchitis



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బ్రాంకైటిస్‌,Bronchitis- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి వాతావరణంలో కలిగే మార్పులు సమస్యలను సృష్టిస్తాయి. వేసవి కాలంలో తగ్గుముఖం పడుతున్నాయనుకునే శ్వాసకోశ వ్యాధులు ఆ తరువాత కాలాల్లో మళ్లీ విజృంభిస్తాయి. కాలానుగుణంగా అలవాట్లను మార్చుకోని పక్షంలో శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు పలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదాహరణకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వాటి కారణంగా ఫారింజైటిస్‌, టాన్సిలైటిస్‌, సైనుసైటిస్‌, బ్రాంకైటిస్‌, న్యుమోనియా వంటి వ్యాధులు సోకవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి వ్యాధులతో సతమతమవ్ఞతున్న వారికి చల్లని వాతావరణం ఒక శాపమనే చెప్పాలి. వారు వాడుతున్న మందుల కారణంగా వ్యాధి పూర్తిగా అదుపులో ఉన్నా, జలుబు, గొంతులో వచ్చే ఇన్‌ఫెక్షన్లు మొదలైన వాటితో వ్యాధి మరింత తీవ్రతరంగా పరిణమించే అవకాశం ఉంది.
  • బ్రాంకైటిస్‌
శ్వాసావయవాలను రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది- ముక్కు నుండి గొంతు వరకూ ఉండే వూర్ధ్వ భాగం. రెండోది- గొంతుక దాటి ఛాతీలోకి ఉండే అధో భాగం. ఈ అధో భాగంలో వాయునాళాలు, వాయుగోళాలు ఉంటాయి. వాయునాళాల లోపలి భాగాన్ని జిగురు పొరలు (మ్యూకస్‌ మెంబ్రేన్‌) కప్పి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే బ్రాంకైటిస్‌ అని వ్యవహరిస్తారు.

సాధారణంగా వూర్థ్వ శ్వాసావయవాలు ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడే ఈ బ్రాంకైటిస్‌ కూడా చోటుచేసుకోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా పెద్ద పిల్లల్లో ఎక్కువే అయినా వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల్లోనూ కనబడుతుంటుంది. ఈ ఇన్ఫెక్షన్‌కు అధికంగా వైరస్‌ క్రిములే కారణమవుతుంటాయి.

మొదటి దశలో పొడి దగ్గు కనిపిస్తుంది. కంగుకంగున దగ్గుతుంటారు. ఒకటి, రెండు రోజులు గడిచే సరికి తెమడ తోడవుతుంది. తెమడ పసుపు రంగులో, ఆ తర్వాత ఆకుపచ్చ రంగులో కన్పిస్తుంది. కఫం ఎక్కువగా ఉమ్మివేయకుండా మింగుతుంటారు. దగ్గుతో పాటు అరుదుగా వాంతులు చోటుచేసుకోవచ్చు. ఛాతీ ఎముక వెనుక భాగంలో నొప్పి కూడా ఉండవచ్చు.

ఇన్ఫెక్షన్‌ కారణంగా జిగురు పేరుకోవటం, వాయునాళాలు కుంచించుకుపోవడం వల్ల- ఛాతీలో పిల్లికూతలు వినిపిస్తాయి. ఈ దశలో బ్రాంకైటిస్‌ బాధ చూడటానికి ఉబ్బసాన్ని పోలి ఉంటుంది. అయితే బ్రాంకైటిస్‌లో పిల్లికూతల కంటే ముందే దగ్గు, జ్వరం కనిపిస్తాయి. వీటిని వేరు చేసి గుర్తించటం తేలికే. కొంతమంది పిల్లలు వాతావరణం, కాలుష్యాల కారణంగా తేలికగా బ్రాంకైటిస్‌ బారినపడుతుంటారు. కొందరు మరీ తరచుగా దీనికి గురవుతుంటారు. టాన్సిల్స్‌ ఇన్ఫెక్షన్‌, సైనస్‌ ఇన్ఫెక్షన్‌ మొదలైన బాధలకు గురైన పిల్లలు తరచుగా బ్రాంకైటిస్‌ వ్యాధికి కూడా గురవుతుంటారు. పళ్లు వచ్చే సమయంలో పిల్లలు తరచుగా బ్రాంకైటిస్‌కు గురికావడం గుర్తించిన విషయమే. ఇన్ఫెక్షన్‌ తోడైతే తప్పించి కేవలం బ్రాంకైటిస్‌ వ్యాధికి యాంటిబయాటిక్‌ ఔషధాలతో ఉపయోగం లేదు. ఇక ఫ్లూ, తట్టు, కోరింత దగ్గు, స్కార్లెట్‌ ఫీవర్‌ల ఆరంభ దశలో బ్రాంకైటిస్‌ కన్పించవచ్చు. ఇది గమనార్హం.

ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకువెళ్ళే గొట్టాలకు ఇన్ఫెక్షన్స్‌ రావడాన్నే బ్రాంకైటిస్‌గా వ్యవహరి స్తారు. దీనివల్ల దగ్గుపెద్ద శబ్దంతో వస్తూంటుంది. ఒక్కోసారి తెమడతో కలిసివస్తుంది. బ్రాంకైటిస్‌ అనేది సాధారణంగా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. .ఇది చాలా సాధారణమైన ఊపిరితిత్తుల సమస్య. శ్వాసకోశంలో, వాహికలో వాపు రావడం, దాంతో సంభవించే మార్పులనే బ్రాంకైటిస్ అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్.

అక్యూట్ బ్రాంకైటిస్ 90 శాతం వైరస్ కారణం కాగా, 10 శాతం బ్యాక్టీరియాతో వస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌కూ, అక్యూట్ బ్రాంకైటిస్‌కు లక్షణాలలోనూ, ఊపిరితిత్తుల్లో జరిగే పరిణామాల్లోనూ తేడా ఉంటుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌లో ఏడాదికి మూడునెలలపాటు దగ్గు, తెమడ ఉంటుంది. ఇది పొగతాగడం వల్ల, వాతావరణ మార్పులు, కాలుష్యం, ఇన్‌ఫెక్షన్స్ వలన శ్వాసనాళాలు దెబ్బతినడంతో వస్తుంది. ఇది పురుషుల్లో ఎక్కువ.

కారణాలు:
  • చల్లటి వాతావరణంలో వచ్చే జలుబు, ఫ్లూ జ్వరం,
  • బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ మైక్రో బ్యాక్టీరియమ్ నిమోనియా,
  • దుమ్ము, ధూళి, పొగ, కెమికల్స్, సిగరెట్ పొగ.

వ్యాధి లక్షణాలు...
  • జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వారం నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. ఛాతీనొప్పి, దగ్గు విపరీతంగా ఉంటాయి. పిల్లి కూతలు, ఆయాసం,ఎక్కువ సేపు నడవలేకపోవడం వంటివి.
  • బ్రాంకైటిస్ తరచుగా వస్తూ ఉంటే అది దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌గా మారడానికి అవకాశం ఎక్కువ. క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది, ఆస్తమాకు దారి తీస్తుంది.

వ్యాధి నిర్ధారణ:
  • ఛాతీకి ఎక్స్‌రే
  • కఫం పరీక్ష (స్పుటం కల్చర్)
  • పిఎఫ్‌టి సిబిపి,
  • ఇఎస్‌ఆర్

నివారణ ఎలా:
  • ధూమపానం మానాలి,
  • దుమ్ము, ధూళికి, కాలుష్యానికి దూరం గా ఉండాలి,
  • మంచినిద్ర, ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి.
  • ఆహారంలో ఎక్కువ భాగం ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి,
  • క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి,

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • జలుబు కొద్దిగా ఉన్నప్పుడే, రాను రాను తీవ్రంగా మారే ప్రమాదముందని గుర్తించి వెంటనే జలుబుతగ్గించడానికి అవసరమైన యాంటి హిస్టమిస్‌లను,
  • జ్వరం రాకుండా యాంటిపైరటిక్‌ను, ముక్కునుంచి కారుతున్న నీరు, చీముగా మరుతున్నప్పుడు యాంటిబయాటిక్స్‌ను వాడాలి.
  • జలుబు రాకుండా ఉండాలంటే చల్లని నీటితో తలస్నానం చేయకూదడు. తలస్నానం చేసిన వెంట నే అరబెట్టుకోవాలి.
  • శీతా కాలంలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ తాగినపుడుగొంతు పట్టేసి ఫేరింజై టిస్‌, టాన్సిలైటిస్‌ వచ్చే అవకాశం ఉంది.
చికిత్స:
  • సాధారణంగా బ్రాంకో డయలేటర్స్, కార్టిజోన్స్, యాంటిబయాటిక్స్ వాడుతుంటారు.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, January 23, 2012

Bent penis,కార్డీ



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కార్డీ, Bent penis- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషాంగం వంకరగా ఉండే కండిషన్‌ను కార్డీ అంటారు. చాలామందిలో పురుషాంగం కుడి, ఎడమ వైపులకు గానీ, కిందికి గానీ, పైకి గానీ 20, 30 డిగ్రీల వరకు వంగి ఉండటం సహజమే. సెక్స్ చేసేటప్పుడు సమస్య లేకపోతే దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఈ వంపు చాలా ఎక్కువ ఉండి, సెక్స్ చేయడానికి అడ్డంకిగా ఉంటే, అంగంపై గడ్డలాగా ఉంటే, దాన్ని తీసివేసి లోపల కొత్త చర్మం అమర్చాల్సి ఉంటుంది. ఇలా పురుషాంగంపై గట్టిగా ఉండే పొరలు వస్తే దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటారు. ఒకటే పెద్ద పొర ఏర్పడి, అది గట్టిగా ఉంటే, దాన్ని సరిచేయడానికి సర్జరీ మంచి మార్గమే అయినా, చాలామందికి సర్జరీ అవసరం రాని సందర్భాలే ఎక్కువ.

హైపోస్పిడియాస్‌ వున్నవారు చాలామంది చిన్న వయస్సులో డాక్టరుకి చూపించుకోరు. ఆపరే షన్‌ చేయించుకోరు. ఎదుగుతున్న కొద్దీ అంగం కూడా ఆర్చ్‌లాగా మారుతుంది. దీనిని ‘‘కార్డీ’’ అంటారు. అలా తయారైన వారికి ఆప రేషన్‌ చేసి వంకరని సరిచేయాలి. కొందరికి కార్డీ వుండదు. కానీ కొద్దిపాటి వంకర కింద కో, పక్కకో వుంటుంది. దీనికి సర్జరీ ఏ మా త్రం అవసరం వుండదు. హైపోస్పిడియాస్‌ వున్నప్పటికీ సెక్స్‌ లైఫ్‌లో పాల్గొనడానికి ఎటువంటి ఆటంకం వుండదు. సెక్స్‌ తృప్తి కలగడంలోనూ లోపం ఉండదు. స్ర్తీ కూడా మామూలుగా తృప్తి చెందు తుంది.
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, January 21, 2012

Dyslexia , డిస్లెక్షియా



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Dyslexia , డిస్లెక్షియా-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



డిస్‌లెక్సియాతో బాధపడే అలాంటివారికి అక్షరాలను చదవటం, రాయటంలో ఇబ్బంది పడటం ,అక్షరాలు ఒక వరుసలో కాకుండా గజిబిజిగా కనిపిస్తుంటాయి. అందువల్ల పదాల్లోని అక్షరాలు అటూఇటూ మారిపోయి.. వాటిని సరిగా చదవలేక, రాయలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే డిస్‌లెక్సియా బాధితుల్లో ఇదొక్కటే కాదు. శబ్దాలను.. ముఖ్యంగా మాటలను విని అర్థం చేసుకోవటంలోనూ మెదడు తికమకపడుతుందని తాజాగా తేలింది. డిస్‌లెక్సియాతో బాధితులతో పాటు కొందరు ఆరోగ్యవంతులపైనా ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వారి మెదడు ను స్కాన్‌ చేసి పరీక్షించారు. మామూలుగా మనం ఇతరుల మాటలను వింటున్నప్పుడు వాటిల్లోని శబ్దాల స్థాయికి (ఫ్రీకెన్సీ) అనుగుణంగా మెదడు కూడా సర్దుకుపోతుంది. అప్పుడే ఆ సంకేతాలను సరిగ్గా విభజించుకొని అందులోని సమాచారాన్ని గ్రహించటానికి వీలవుతుంది. లేకపోతే ఆయా మాటలను అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. డిస్‌లెక్సియా బాధితుల మెదడులలో ఈ ప్రక్రియ సరిగా జరగటం లేదని.. సుమారు 30 హెర్ట్జ్స్‌ స్థాయిలోని శబ్దాలను గ్రహించటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. మాటల్లోని సమాచారాన్ని విడమర్చి, అర్థం చేసుకోవటానికి ఈ స్థాయి శబ్దాలు చాలా కీలకం. డిస్‌లెక్సియా బాధితుల మెదదులు అధిక తీవ్రత శబ్దాలకు అతిగా స్పందిస్తున్నాయనీ తేలింది. వీరిలో జ్ఞాపకశక్తి సరిగా లేకపోవటానికి, అక్షరాలు.. మాటలను అవగతం చేసుకోలేకపోవటానికి గల కారణాలను విశ్లేషించటానికి ఈ పరిశోధన ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులో శబ్దాలకు సంబంధించిన భాగంలో సమస్య మూలంగా మాటలను అక్షరాలను అర్థం చేసుకోవటంలో ఇబ్బంది కలుగుతున్నట్టు దీని ద్వారా బయటపడిందని వివరిస్తున్నారు. మున్ముందు ఈ దిశగా మరిన్ని అధ్యయనాలు జరిగితే కొత్త చికిత్స పద్ధతులు పుట్టుకురాగలవని నిపుణులు ఆశిస్తున్నారు.




  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

కండలు పెంచడానికి స్టెరాయిడ్స్ వాడకము , Muscle growth and Steroids use



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కండలు పెంచడానికి స్టెరాయిడ్స్ వాడకము , Muscle growth and Steroids use- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సినిమా హీరోల 'సిక్స్‌ ప్యాక్‌' శరీరాలను చూసి ముచ్చటపడే వారి సంఖ్య పెరిగింది. ఇక కండలు పెంచి, జబ్బలు ఉబ్బించే వారిని చూసి.. ఉప్పొంగి పోయే యువకులకు మన సమాజంలో కరువే లేదు. అయితే సమస్యల్లా... అచ్చం వారిలాగే తామూ కండలు పెంచుకోవాలని ఉబలాటపడుతూ జిమ్‌లో తెగ వ్యాయామాలు చెయ్యటమేకాదు... కొందరు తెలిసోతెలియకో స్టిరాయిడ్లను ఆశ్రయిసున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. స్టిరాయిడ్లన్నవి కీలకమైన అవసరాల కోసం వైద్యులు వాడే మందులు. వీటిని విచక్షణా రహితంగా వాడేస్తే.. లైంగిక సామర్థ్యం కొరవడటం, బట్టతల, ఆత్మహత్య భావనలు కలగటం వంటి అనర్థాలు చాలా ముంచుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంతో కష్టపడితేనే గానీ సిక్స్‌ ప్యాక్‌ శరీరం సాధ్యం కాదని గుర్తించాలి. ఇందుకు నియమబద్ధ వ్యాయామం, క్రమశిక్షణ, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. తెర మీద కనిపించే హీరోలంతా తెర వెనక ఇంత కష్టం పడ్డవారే. అంత కష్టం మనమెక్కడ పడతామంటూ యువకులు తేలికగా పని అయిపోతుందని స్టిరాయిడ్లను ఆశ్రయిస్తుండటం అనర్థదాయకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వాడే స్టిరాయిడ్లను- ప్రధానంగా టెస్టోస్టిరాన్‌ వంటి పురుష హార్మోన్ల నుంచి తయారు చేస్తారు. యుక్తవయసు మగపిల్లలు వీటిని విచక్షణారహితంగా వాడితే వృషణాలు కుచించుకుపోవచ్చు. వీర్యకణాల సంఖ్య తగ్గొచ్చు. దీంతో లైంగిక సామర్థ్యమూ దెబ్బతినే ప్రమాదముంది. స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు తక్కువ ధరకు దొరుకుతుండటంతో చాలామంది వీటిపై మక్కువ పెంచుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాంసకృత్తుల ఉత్పత్తికి దోహదం చేస్తూ కండర కణజాలంలో కార్టిసోల్‌ ప్రభావాన్ని అడ్డుకునే ఈ స్టిరాయిడ్లు- కండర కణజాలం వేగంగా పెరిగేలా చేస్తాయి. క్రమేపీ అవే బయటకి పొంగుకొచ్చే కండల్లా మారతాయి. నిజానికి డాక్టర్లు వీటిని నిర్దుష్టమైన సందర్భాల్లో మాత్రమే వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడినా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడినా- కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగటం, హైబీపీ, గుండె పరిమాణం పెరగటం, ప్రవర్తన దురుసుగా మారటం, మొటిమలు రావటం, మానసిక కుంగుబాటు.. ఇలా ఎన్నో అనర్ధాలుంటాయి. మాత్రల రూపంలో తీసుకుంటే లివర్‌ కూడా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యుక్తవయస్కుల్లో ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.

  • source : Courtesy with eenadu sukheebhava
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Fasting or heavy meal not good for health,ఆహారం మానేసినా నష్టమే.. అతిగా తిన్నా నష్టమే

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Meals-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. మనిషికి ఈ రెండూ చాలంటారు! కానీ ఈ ఆధునిక కాలంలో.. మారుతున్న జీవనశైలి కారణంగా మొదటగా నిద్ర దెబ్బతింది. ఇప్పుడు తిండి వంతొచ్చింది. తినటానికి సమయం లేకపోవటం.. మరోవైపు తినటానికి రకరకాల కొవ్వులు, స్వీట్లతో చేసిన పదార్ధాలు అందుబాటులో ఉండటం.. ఈ రెండూ ఇక్కట్లు తెచ్చిపెట్టేవే. ఫలితంగా చాలామంది ఏదో పూట తిండి మానేస్తున్నారు.. ఆ వారం రెండోపూట అనారోగ్యకరమైన ఆహారాన్ని దండిగా, కడుపు నిండుగా లాగిస్తున్నారు! మనిషికి ఇంతకంటే జరగాల్సిన నష్టం మరోటి ఉండదు. ఆహారం మానేసినా నష్టమే.. అతిగా తిన్నా నష్టమే. చక్కటి సమతౌల్యంతో... పోషకాలన్నీ సమతులంగా ఉన్న ఆహారం తీసుకోవటం... నేటి అవసరం.

  • 1. పొద్దున్నే మానేస్తే.. శక్తి హీనం
ఉరుకుల పరుగుల జీవితాల్లో తరచూ వినిపించే పదం 'బ్రంచ్‌'. అంటే వీళ్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌- రెండింటి బదులూ ఒక్కసారే ఏదో ముక్కూనోటా కొట్టుకుంటున్నారన్నమాట. ఇది అస్సలు మంచి పని కాదు. ఉదయం టిఫిన్‌ ఎంత ముఖ్యమో, మధ్యాహ్న భోజనమూ అంతే ముఖ్యం. ఉదయం లేచిన తర్వాత ఒకటి రెండు గంటల్లో టిఫిన్‌ తినకపోతే చాలా అనర్ధాలున్నాయని పోషకాహార నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వాస్తవానికి రాత్రంతా ఆహారం లేకుండా ఖాళీగా ఉండటంతో శరీరంలో జీవక్రియలన్నీ మందగిస్తాయి. శక్తి కూడా సన్నగిల్లుతుంది. మనం ఉదయాన్నే టిఫిన్‌ తినటం వల్ల ఆ జీవక్రియలు వేగం పుంజుకుంటాయి. శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. ఇక రోజంతా అలాగే కొనసాగుతుంది. కాబట్టి అల్పాహారం మన శరీరంలో రోజంతా జరగాల్సిన జీవక్రియలను గాడిలో పెడుతుందని, చక్కటి ఉత్ప్రేరకంగా పని చేస్తుందని గుర్తించాలి. పెద్దలతో పాటు పిల్లలకు ముఖ్యంగా యవ్వనదశలో ఉన్నవారికి ఇది అత్యంత అవసరం. ఉదయం అల్పాహారం తినకుండా స్కూలుకు, ఆఫీసులకు వచ్చిన వారిలో చురుకుదనం మందగించి, చదువుల్లో, పనిలో సామర్థ్యం కొరవడుతున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే- ఎక్కువసేపు పనిచేసే సామర్ధ్యాన్నిస్తుంది, కొలెస్ట్రాల్‌ మోతాదును తగ్గించటంతో పాటు మనసును ఆహ్లాదంగా కూడా ఉంచుతుంది. టిఫిన్‌ తినకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగిపోయి నియంత్రణ లేకుండా తినే ప్రమాదమూ ఉంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట చక్కటి అల్పాహారం తీసుకోవటం మరవరాదు. ఇందులో బలవర్ధకమైన మాంసకృత్తులు, పప్పులతో చేసిన పదార్ధాలు, పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవటం మంచిది. మాంసకృత్తులు కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. కాబట్టి అల్పాహారంలో పొట్టుతీయని ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు, గుడ్లు, పండ్ల వంటివి ఉండేలా చూసుకోవాలి.
  • 2. మధ్యాహ్నం మానేస్తే మొదటికే మోసం
కార్పొరేట్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలు విస్తరించటం మొదలైన తర్వాత పని ఒత్తిడిలో పడిపోయి మధ్యాహ్న భోజనం మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు పని చేస్తుంటే శరీరంలోని శక్తి క్షీణిస్తూ పని సామర్థ్యం తగ్గిపోతుంది. పైగా మధ్యాహ్న భోజనం మానేస్తే గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలూ పెరుగుతాయి. ఇక బరువు తగ్గటం కోసం మధ్యాహ్న భోజనం మానేసే వారూ చాలామంది ఉన్నారు. దీనితో ప్రయోజనం శూన్యం. ఎందుకంటే భోజనం తర్వాత దాదాపు 2 గంటల వరకూ కూడా మనలో జీవక్రియలు 20-30% వేగవంతమవుతాయి. భోజనం మానేస్తే ఇవి మందగిస్తాయి. పైగా మధ్యాహ్న భోజనం మానేసినవాళ్లు- సాయంత్రం అయ్యేసరికి ఉండలేక రకరకాల స్నాక్స్‌ ఆబగా తినేస్తారు, దీంతో క్యాలరీల మోతాదూ పెరిగిపోతుంది. ఆఫీసుల్లో సాయంత్రం టీ సమయంలో సమోసాలు, పకోడీల వంటి నూనెలతో నిండిన రకరకాల పదార్థాలను దండిగా తింటుంటారు. క్యాలరీల పరంగా చూస్తే కొన్నిసార్లు ఇవి భోజనం మోతాదునూ మించిపోతాయి! ఒకవేళ సాయంత్రం స్నాక్స్‌ తినకపోతే- మధ్యాహ్నం భోజనంలేదు కాబట్టి రాత్రి భోజనానికి కూచున్నప్పుడు వేగంగా తినేస్తుంటారు. ఇదీ మంచిది కాదు. ఇక మధ్యాహ్నం పూట ఆకలి మంటలను చల్లార్చుకునేందుకు టీ, కాఫీల వంటివాటినీ ఆశ్రయిస్తుంటారు. ఇవి ఆ సమయంలో ఆకలిని చంపి, ఉత్తేజాన్నిచ్చినట్టే ఉంటాయిగానీ జీర్ణాశయానికి హాని చేస్తాయి. వీటివల్ల శరీరం పోషకాలను సరిగా గ్రహించలేని పరిస్థితి కూడా వస్తుంది. మధ్యాహ్న భోజనం మానితే ఇన్ని అనర్ధాలు. అందుకే మితంగా చక్కటి పోషకాహారం తినటం ఉత్తమం!
  • 3. ఆరోగ్యానికి హరివిల్లు
మనం తినే ఆహారం ఎంత వర్ణరంజితంగా.. రంగురంగులుగా.. ఎంత వైవిధ్య భరితంగా ఉంటే అంత ప్రయోజనకరమని పోషకాహార నిపుణులంతా చెబుతున్నారు. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ, ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధ ఆహారంలో- కీలక పోషకాలైన కెరొటినాయిడ్లు, బయోఫ్లావనాయిడ్ల వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలో విశృంఖల కణాల (ఫ్రీర్యాడికల్స్‌) దాడికి అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా కెరొటినాయిడ్లలో భాగమైన లైకోపేన్‌, లూటిన్‌, బీటా కెరొటీన్‌ వంటివి- వయసుతో పాటు శరీరంలో, కణజాలంలో వచ్చేక్షీణతను నిలువరించే ప్రయత్నం చేస్తాయి. టమోటా, పుచ్చకాయ, ద్రాక్ష, అంజీరా వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపేన్‌.. కణాల్లో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్‌'గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరిగేందుకూ దోహదపడుతుంది. మామిడి, బొప్పాయి, క్యారెట్లు, చిలగడ దుంప వంటి పసుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటాకెరోటిన్‌ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్‌-ఏ లోపం రాకుండానే కాదు, క్యాన్సర్‌ నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్‌టీ, బత్తాయి, నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయోఫ్లావనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పదార్ధాలకూ ఏదోఆరోగ్య ప్రయోజనం ఉంది. కాబట్టి ఎన్ని రంగుల పదార్ధాలు తింటే.. అంత మంచిదని గుర్తించండి.
  • 4. ఉపవాసం.. లంఖణం కాదు!
భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని మర్చిపోవద్దు. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.
  • 5. నీరు.. నిర్లక్ష్యం తగదు
చాలామంది నీళ్లు సరిగా తాగరు. నీళ్లను ఆహారంలో ఒక ముఖ్యభాగంగా పరిగణించకుండా.. తిన్నది గొంతు దిగటం కోసమే నీళ్లు అన్నట్టు వ్యవహరిస్తుంటారు. నీళ్లలో పోషకాలుండని మాట నిజమేగానీ మన శరీర బరువులో మూడింట రెండొంతులు నీళ్లే. మన మెదడు కణజాలంలో అయితే 70-80% వరకూ నీరే ఉంటుంది. కాబట్టి మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. మన ఒంట్లో 2% నీళ్లు తగ్గినా 'డీహైడ్రేషన్‌'కు దారి తీస్తుంది. చాలామందికి తెలియదుగానీ పగటిపూట నిస్సత్తువకు అతిముఖ్య కారణం- ఒంట్లో తగినంత నీరు లేక.. ఓ మోస్తరు 'డీహైడ్రేషన్‌'తో గడుపుతుండటం! కాబట్టి తగినన్ని నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా, అందులోని పోషకాలు ఒంటబట్టాలన్నా నీరు అత్యవసరం. కండరాలు పట్టేయకుండా నివారించటం, కీళ్లు సాఫీగా కదిలేందుకూ దోహదం చేయటం, చర్మం ముడతలు పడకుండా జీవత్వంతో నిగనిగలాడటం, ఒంట్లోని మలినాలను-వ్యర్థాలను బయటకు పంపించటం, రక్తసరఫరాను మెరుగుపరచటం, మలవిసర్జన సాఫీగా జరిగేలా చూడటం.. ఇలా నీటి ప్రయోజనాలు అనంతం. మనకు దాహంగా అనిపిస్తోందంటే అప్పటికే ఒంట్లో ఎంతోకొంత నీటి శాతం తగ్గిందని అర్థం. కాబట్టి పరిస్థితి దాహం అనిపించేంత వరకూ రాకుండా.. రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండటం ఉత్తమం. అంతా రోజుకి కనీసం 2 లీటర్లు, లేదా 8 గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సూచన. వ్యాయామం వంటి శారీరకశ్రమ చేసేవారైతే మరింత ఎక్కువ తాగాలి. భోజనానికి ముందు గ్లాసు నీళ్లు తాగితే ఆహారం మరీ ఎక్కువగా తినకుండానూ చూసుకోవచ్చు. దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. కొందరు బాగా దాహంగా అనిపించినప్పుడు నీళ్లకు బదులు కూల్‌డ్రింకుల వంటివి తాగుతుంటారు. వీటితో దాహం సరిగా తీరదు, పైగా అనవసరంగా క్యాలరీలూ పెరిగిపోతాయి. నిజానికి దాహం వేసినప్పుడు శరీరం కోరుకునేది- నీరు!
  • 6. తక్కువ సైజు.. ఎక్కువ సార్లు
మనలో చాలామందికి మూడు పూట్లే తినటం, ఆ తిన్నది దండిగా తినటంబాగా అలవాటు. అలాగే మధ్యమధ్యలో చిరుతిండ్లు మంచిది కాదన్న నమ్మకమూ ఉంది. కానీ ఇలా రోజు మొత్తమ్మీద తక్కువసార్లు తినటం, ఆ తిన్నప్పుడు కడుపు నిండేలా పెద్దమొత్తంలో తినటం కాకుండా తక్కువ తక్కువగా.. ఎక్కువసార్లు తినటం శ్రేయస్కరమని ఆధునిక పరిశోధనలన్నీ చెబుతున్నాయి. ఇలా తింటే ఒంట్లో శక్తి తగ్గదు, శరీరం బరువు పెరగదు! రోజుకి 4-5 సార్లు భోజనం లేదా చిరుతిండ్లు తినేవారిలో ఆకలి, బరువు నియంత్రణలో ఉంటున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. ఇలా తినేటప్పుడు ప్రతిసారీ ఆహారంలో తగినన్ని మాంసకృత్తులు అంటే పప్పు పదార్ధాలు, కొద్దిగా మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావననిస్తాయి. కండరాలు బలోపేతమయ్యేలా, కొవ్వు కరిగేలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి చేపల వంటి సముద్ర ఆహారం, కోడిగుడ్డులోని తెల్లసొన, సోయా, కంది మినుము వంటి పప్పులు, బీన్స్‌ వంటి ఆరోగ్యకర ప్రోటీన్లు గలవాటిని తీసుకోవాలి. చిరుతిండ్లు అంటే రెడీమేడ్‌, జంక్‌ఫుడ్‌ కాదు. చాలామంది జంక్‌ఫుడ్‌ అంటే పిజ్జాలు, బర్గర్లు మాత్రమేనని అపోహ పడుతున్నారు. బజారులో దొరికే చాలా పదార్థాల్లో నూనెలు, ఉప్పు ఎక్కుగా ఉంటాయి. అలాగే నూనెలో బాగా వేయించినవి కూడా హాని కారకాలే. కాబట్టి పప్పులు, పిండి వంటివాటితో ఇంట్లో చేసిన బలవర్ధకమైన వాటిని చిరుతిండ్లుగా తీసుకోవచ్చు.
  • 7. ఆదుర్దాతో అనర్థం.. తక్కువతోనే తృప్తి
కొందరు భోజనం ముందు కూర్చుంటారో లేదో... ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వేగంగా ప్లేటు ఖాళీ చేసేస్తారు. పక్కవాళ్లు పది ముద్దలు కూడా తినక ముందే మొత్తం ముగించేసే ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి, ఆస్వాదిస్తూ తినాలి. ఎందుకంటే వేగంగా తినే వారికి ఎంత తిన్నా కడుపు నిండిన భావనే కలగదు. ఎందుకో చూద్దాం. మన కడుపు ఖాళీగా ఉందా? నిండిందా? వంటి సమాచారాన్ని మెదడుకు చేరవేసేందుకు ఒక వ్యవస్థ ఉంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి వేస్తోందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. మనం ఆహారం తీసుకోవటం మొదలుపెట్టి కడుపు నిండగానే.. ఆకలి తగ్గిందనే విషయాన్నీ పంపిస్తుంది. ఈ సమాచారం మెదడుకు చేరటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అయితే గబగబా తినేవారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. దీంతో కడుపు నిండినా ఆకలి తగ్గిందన్న భావన కలగక... తృప్తి అనిపించక.. ఇంకా తినేస్తూనే ఉంటారు. ఫలితంగా అవసరాన్ని మించి ఎక్కువ తినటం, ఊబకాయం బారినపడటం.. తథ్యం! ఇలా ఆబగా తినే అలవాటు చాలా వరకూ చిన్నతనంలోనే అలవడుతుంది. ఇది పెద్దయ్యాకా కొనసాగుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పట్నుంచే నెమ్మదిగా, బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినటం నేర్పించాలి. దీనివల్ల తక్కువే తిన్నా.. తృప్తి కలుగుతుంది.
  • 8. మితంగా తింటేనే.. మన్నికైన జీవితం!
చాలామంది కంచం ముందు కూర్చుంటే కడుపు నిండిపోయే వరకూ కూడా ఆగలేరు. జిహ్వ చాపల్యంతో ఇలా పొట్ట నింపెయ్యటం కాదు.. భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలన్నది మన పెద్దల మాట. ఈ మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు ఆధునిక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కడుపు నిండా కాకుండా.. నాలుగు ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని, జీవిత చరమాంకంలో కూడా వీరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలేమీ ఉండటం లేదని పరిశోధకులు గుర్తించారు. స్వీట్లు, కొవ్వు, తీపి పదార్ధాల వంటి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్ధాలు బాగా తగ్గించేసి.. చిన్నతనం నుంచీ పీచుతో సహా చక్కటి పోషకాలుండే పండ్లు, కూరగాయల వంటివి మితంగా తీసుకుంటుండేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారనీ, ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానెయ్యద్దు... అలాగని ఎక్కువ తినొద్దు. సాధ్యమైనంత మితంగా తినటం, ఆ తినేదానిలో కూడా సాధ్యమైనంత చక్కటి పోషకాహారం ఉండేలా చూసుకోవటం.. అత్యుత్తమ జీవన సూత్రం!

Source : 17/01/2012 సుఖీభవ.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, January 15, 2012

పరిపూర్ణ ఆరోగ్యము-అవగాహన , Complete health-awareness ,



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పరిపూర్ణ ఆరోగ్యము-అవగాహన , Complete health-awareness - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • మన పయనం... విజయం నుంచి విజయానికి! ఒకప్పుడు వ్యాధులను జయించటమే గొప్ప. క్షయ, ప్లేగు, కుష్టు, సిఫిలిస్‌, గనేరియా.. ఇలా మానవాళిని కబళించి, మారణహోమం చేసిన వ్యాధులెన్నో. వీటితో తంటాలుపడి.. తలపడి.. సమర్థ ఔషధాల ఆవిష్కారంతో ఈ వ్యాధులను వదిలించుకుంటూ.. ఆరోగ్య పరిరక్షణలో చాలా దూరమే వచ్చాం. ఇది చిన్న విజయమేం కాదు!

ఇప్పుడు మన ఆలోచన మారుతోంది. మన లక్ష్యం విస్తరిస్తోంది. చక్కటి ఆరోగ్యమంటే... కేవలం వ్యాధుల్లేకపోవటమే కాదు. ఎటువంటి జబ్బులూ బాధలూ లేకపోవటం ఆరోగ్యానికి మూలమేగానీ... జబ్బు లేకుండా తిని తిరుగుతుండటాన్నే మనం 'ఆరోగ్యం' అనలేం. 'పరిపూర్ణ ఆరోగ్యం' అన్నది మన లక్ష్యం కావాలన్నది నేటి వైద్యరంగంఆలోచన!

కేవలం జబ్బుల్లేనంత మాత్రాన మనం జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉంటామన్న భరోసా ఏంలేదు! పరిపూర్ణ ఆరోగ్యమంటే.. శారీరకంగానే కాదు.. సామాజికంగా, మానసికంగా, వృత్తిపరంగా, భావోద్వేగపరంగా..ఆధ్యాత్మికంగా.. అన్ని రకాలుగా హాయిగా.. స్వస్థతతో ఉండటం! అప్పుడే మనం ఏ చీకూచింతా లేకుండా.. జీవితంలోని ఆనందాన్నీ.. మకరందాన్నీ ఆస్వాదించగలుగుతాం. చక్కటి ఆయుర్దాయంతో.. సంతోషంగా జీవించగలుగుతాం. అందుకే నేటి వైద్యరంగం.. వ్యాధుల చికిత్స నుంచి నియంత్రణ వైపు.. నియంత్రణ నుంచి వ్యాధుల నివారణ వైపు... కేవల 'ఆరోగ్యం' నుంచి 'పరిపూర్ణ ఆరోగ్యం' వైపు... దృష్టి సారిస్తోంది.

పరిపూర్ణ ఆరోగ్యమన్నది వైద్యంతో.. మందులతో సాధించేది కాదు. ఇది ఆసాంతం మన జీవనశైలితో.. మన అలవాట్లతో.. మన ఆలోచనలతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం. మన ఆరోగ్యానికి మనమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే విభాగం. భౌతికంగా, శారీరకంగానే కాదు.. మానసికంగా, సామాజికంగా కూడా మనిషిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే బహుముఖీన విధానం. అందుకే ఈ లక్ష్య సాధనలో మన అడుగులు ఎటు కదలాలో... మన ఆలోచనలు ఏ దిశగా సాగితే మంచిదో..తెలుసు కుందాం .
  • వృత్తిగత ఆరోగ్యం
సామర్థ్యం, తృప్తి ముఖ్యం---


ఉద్యోగంలో వ్యక్తిగతంగా మనకు తృప్తి, సంతోషం లభించటమన్నది ఆరోగ్యానికి చాలా కీలకమైన అంశం. వృత్తిలో, ఉద్యోగంలో మన నైపుణ్యాలనూ, సామర్ధ్యాలనూ సంపూర్ణంగా వినియోగిస్తున్నప్పుడు మనకు అర్థవంతంగా పని చేస్తున్నామన్న గొప్ప తృప్తి కలుగుతుంది. పని చేయటం ద్వారా మన జీవితం మరింత ఎత్తులకు వెళుతున్న పాజిటివ్‌ భావన కలుగుతుంది. ఉద్యోగంలోగానీ, స్వచ్ఛంద కార్యక్రమాల్లోగానీ మనసు పెట్టి హృదయపూర్వకంగా పని చేసినప్పుడు, వృత్తిపరంగా మనం సరైన దారిలో నడుస్తున్నప్పుడు మన పని, మన వ్యాపకాలే మనకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయి, అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంటాయి. పనిలో అంటీముట్టనట్టుండటం, క్రియాశూన్యంగా ఉండటం మన ఆరోగ్యానికే మంచిది కాదు. మీరు ఎంచుకునే వృత్తి, ఉద్యోగంలో తృప్తి, పైకి ఎదగాలన్న ఆకాంక్ష, పని సామర్థ్యం.. ఇవన్నీ కూడా మన పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే అంశాలే. అలాగే ఎప్పుడూ పనితో సతమతమవుతుంటే.. జీవితంలో సుఖశాంతులు అడుగంటుతాయి. లక్ష్యాలను చేరుకోలేకపోతుండటం, రోజుకు 24 గంటలకంటే ఎక్కువ టైముంటే బాగుండుననిపిస్తుండటం.. ఇవన్నీ సమయ పాలన సరిగా లేదని చెప్పే అంశాలు. ప్రాధాన్యం ప్రకారం పనిని వాయిదా వెయ్యకుండా చేసుకుంటూపోవటం, ఉన్న సమయానికి మించి ఎక్కువ పనులు నెత్తినేసుకోకుండా.. అవసరమైతే నిర్మొహమాటంగా 'చెయ్యలేను' అని చెప్పగలగటం, వీలైనచోట పని బాధ్యతలను ఇతరులకు అప్పగించటం.. ముఖ్యంగా విశ్రాంతి, వ్యక్తిగతమైన సరదాల సమయం హరించుకుపోకుండా చూసుకోవటం.. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు.
  • మేధో ఆరోగ్యం
కుతూహలమే ఇంధనం--

మనం అంతగా గుర్తించంగానీ... మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటమన్నది ప్రతి మనిషి అస్థిత్వానికి ఎంతో కీలకం. జీవించినంత కాలం.. జీవితం మీద ఆసక్తి తగ్గకూడదు. నిర్లిప్తతలోకి జారిపోకుండా.. సామాజికంగా ముడుచుకుపోకుండా.. నిరంతరం కుతూహలంతో ఉండటం ముఖ్యం. అందుకు మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించటం ఎంతో అవసరం. మన మేధస్సుకు సృజనాత్మకంగా, స్ఫూర్తిమంతంగా ప్రేరణనిచ్చే అంశాలపై శ్రద్ధపెట్టాలి. మేధోపరంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. తన విజ్ఞానాన్నీ, అవగాహనా ప్రపంచాన్నీ విస్తరించుకుంటూ.. తన విజ్ఞాన ఫలాలను నలుగురితో పంచుకుంటూ ఉంటాడు! నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, పుస్తకాలు, పత్రికలు చుదువుతుండటం, పజిల్స్‌-సమస్యల వంటివి పరిష్కరించటం, సృజనాత్మకంగా ఆలోచించటం అవసరం. ప్రస్తుతం మన సమాజంలో, మన చుట్టుపక్కల ఏం జరుగుతోందో, కొత్తకొత్త ఆలోచనలు, ఐడియాలు ఏమేం వస్తున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ఎప్పుడూ చంపుకోకూడదు. మనకున్న విజ్ఞానంతో మనకు మనమే సంతృప్తిపడిపోతూ.. కొత్తగా చేసేదేమీ లేకుండా నిరర్ధకంగా మారిపోవటం పరిపూర్ణ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలన్న కుతూహలం, ఏదో ఒకటి తెలుసుకోవాలన్న ఉత్సుకత... మన మేధస్సుకు నిరంతరం సవాళ్లు విసురుతుంటుంది, ఫలితంగా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మనకు అడ్డంకుల్లా, ప్రతిబంధకాల్లా కనబడవు, అవే విజయానికి మెట్లలా కనబడటం ఆరంభమవుతుంది. రకరకాల పుస్తకాలు, పత్రికలు చదువుతుండటం, కొత్తకొత్త విద్యలు, భాషలు, నైపుణ్యాలు, కళలు నేర్చుకుంటూ ఉండటం.. మేధోపరమైన అవసరం, అది ఏ వయస్సులోనైనా సరే!
  • మానసిక ఆరోగ్యం
కనిపించని సమస్య--

శరీరమూ, మనస్సూ విడదీయరానివేగానీ సంప్రదాయంగా మనం శారీరక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. అందుకే మానసిక సమస్యలను గుర్తించకపోవటం, ఈ సమస్యలతో బాధపడేవారిని చిన్నచూపు చూస్తూ హేళన చేయటం ఎక్కువ. ఈ ధోరణి మనకూ చేటు చేస్తుంది. ఎందుకంటే మనలో చాలామందికి కుంగుబాటు (డిప్రెషన్‌),ఆందోళన (యాంగ్జయిటీ) లక్షణాలు కనబడుతుంటాయి. ఇవి దైనందిన జీవితంలో సుఖశాంతులు లేకుండా చేస్తాయి. ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అయినా దాన్నో సమస్యగా గుర్తించేందుకు ఎవరూ ఇష్టపడరు, దీనికి చికిత్స తేలికే అయినా అందుకు సిద్ధపడటం లేదు. కొందరిని ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి వంటివి విడవకుండా బాధిస్తుంటాయి, ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ బయటపడదు. డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యల లక్షణాలు ఇలానూ బయటపడొచ్చని గుర్తించాలి. వృద్ధుల్లో ఆకలి తగ్గటం, నిద్ర పట్టకపోవటం, నిస్సత్తువ వంటి మానసిక సమస్యల లక్షణాలు కనబడుతున్నా 'పెద్దవయసులో ఇవి మామూలేలే!' అని కొట్టిపారెయ్యటం.. ఎవరైనా కాస్త భిన్నంగా ప్రవర్తిస్తుంటే 'పెంకి మనుషులు', ఎప్పుడూ 'ఏదో నస పెడుతుంటారు' అంటూ ముద్ర వెయ్యటం చేస్తుంటారు. కొందరు మానసిక సమస్యల కారణంగా మద్యం, మాదక ద్రవ్యాల వంటివాటికీ చేరువ అవుతారు. ఇవన్నీ విస్మరించటానికి వీల్లేని అంశాలు. నిత్య వ్యాయామం, తగినంత నిద్ర విశ్రాంతి, హాస్యంతో సరదాగా, సానుకూలంగా, సృజనాత్మకంగా ఉండే ధోరణి, చక్కటి ప్రేమానురాగాలు పొందటం, పంచటం.. ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి చాలా కీలకం!
  • శారీరక ఆరోగ్యం
దీని తర్వాతే ఏదైనా!---

ఎన్ని భాగ్యాలున్నా ఆరోగ్యాన్ని మించింది లేదు. శారీరక ఆరోగ్యం లేకపోతే జీవితమంతా నిస్సారంగా, నీరసంగా గడవాల్సిందే. శక్తి, పని సామర్థ్యం, కార్య దక్షత, సన్నద్ధత.. వీటన్నింటికీ శారీరక ఆరోగ్యమే కీలకం. శారీరకంగా అనారోగ్యం పాలైతేమనమూ, మన కుటుంబమూ దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మన ఆహారం, అలవాట్లు, వృత్తులు మారిపోతుండటం వల్ల.. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జీవనశైలీ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందుకే వ్యాధులు దరిజేరకుండా చూసుకునే చక్కటి జీవనశైలి, పుష్టికరమైన ఆహారం, తగినంత శారీరక శ్రమ చాలాచాలా అవసరం. ఏవైనా వ్యాధులున్నా వాటిని సమర్థంగా నియంత్రించుకునే సంకల్పం ఉండాలి. చాలామంది వ్యాయామానికి సమయం చిక్కటం లేదని వంకలు చెబుతుంటారు. ఇంట్లో ఎప్పుడూ టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతే ఊబకాయం, మధుమేహం, గుండెబజ్బుల వంటి వాటిని కొని తెచ్చుకున్నట్టే. వీటితో ఏదో ఒకనాడు ఆసుపత్రి పాలు కావటం ఖాయమని గుర్తించాలి. రోజుకి సుమారు అరగంట చొప్పున వారానికి ఐదుసార్లు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌ వంటివి ఉంటున్నాయేమో కనీసం ఆర్నెల్లకు ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలి. ఇవి ఉన్నవారు వాటిని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. ఏ కాస్త నలతగా ఉన్నా నిర్లక్ష్యం మాత్రం చెయ్యకండి!
  • నిద్ర ఆరోగ్యం
తగ్గిన కొద్దీ తంటాలే!---

ఒకప్పుడు ఎంత తక్కువ నిద్ర పోతే అంత మంచిదనీ.. గాంధీజీ వంటి ప్రముఖులంతా రోజుకు నాలుగు గంటలే నిద్రపోయేవారనీ.. గొప్పగా చెబుతుండేవారు. కానీ కాలం మారిపోయింది. మన అలవాట్లు, వృత్తులు, ఉద్యోగాలూ మారిపోయాయి. ఆధునిక జీవనశైలికి మొదటగా బలి అవుతున్నది మన నిద్ర. నిద్రకు సమయం లేని వారు కొందరైతే.. పడుకున్నా నిద్ర పట్టనివారు ఎంతోమంది. అందుకే ఇప్పుడు నిద్ర గురించీ, నిద్ర ఆరోగ్యం గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. రోజంతా పనితో అలసిన శరీరం నిద్రలోనే కొత్త శక్తిని పుంజుకుంటుంది. నిద్రాసమయం.. మన శరీరానికి మరమ్మతు సమయం. నిద్ర సరిగా పట్టకపోతే ఈ జీవ ప్రక్రియ అంతా దారితప్పుతుంది. దీంతో అధిక బరువు, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఏకాగ్రత లోపించటం, చిరాకు, కోపం, ఆందోళన, ప్రమాదాల బారినపడటం వంటి సమస్యలెన్నో బయల్దేరతాయి. నిద్ర లేమి మరీ తీవ్రమైతే గుండె జబ్బులతో పాటు హైబీపీ, ఒత్తిడి, హారోన్ల స్థాయులు పెరగటం, గుండె లయ తప్పటం వంటి జబ్బులూ దాడిచేస్తాయి. నిద్రలేమి రోగ నిరోధక వ్యవస్థ ను దెబ్బతీస్తుంది. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర కూడా కీలకమని గుర్తించాలి. నిద్ర పెద్దలకు సగటున రోజుకు 7-8 గంటలు తప్పనిసరి. పిల్లలకు ఇంకా ఎక్కువ అవసరం.
  • సామాజిక ఆరోగ్యం
విడిగా కాదు.. కలివిడిగా!--

మనం ఎవ్వరమూ కూడా ఒంటరి ద్వీపంలా ఉండలేం. మన కుటుంబం మీద ఆధారపడతాం, ఇరుగుపొరుగు మీద ఆధారపడతాం, సమాజం మీద ఆధారపడతాం.. ఈ ప్రకృతి మీదా ఆధారపడతాం. వీటన్నింటి మీదా మనకు తెలియకుండానే మన ప్రభావం చాలా ఎక్కువ. వీటన్నింటినీ మరింత మెరుగ్గా మార్చేందుకు మనం క్రియాశీలంగా ఉండటం.. మన సామాజిక ఆరోగ్యానికి ముఖ్యం. మన చుట్టుపక్కల వారితో మనసు విప్పి ఆలోచనలను, అవసరాలను పంచుకోవటం, మంచి కోసం వారందరితో కలిసి నడవటం, వీలైతే అందర్నీ నడిపించటం.. పనిలోనూ, విశ్రాంతిలోనూ కూడా ఇతరులతో కలిసిమెలిసి ఉంటూ సానుకూలంగా, సంతోషంగా నవ్వుతూ గడపటం, చక్కటి స్నేహితులను తయారు చేసుకోవటం, సాన్నిహిత్యంతో మెలగటం, వారి బాధలు వింటూ సహానుభూతితో స్పందించటం.. ఇతరులు మనకు సహకరించటానికి ముందుకొస్తే నిండు మనసుతో హర్షించటం.. నలుగురితో కలిసి గడిపేందుకు కొంత సమయాన్నీ, సొమ్మునూ కూడా కేటాయించుకోవటం అవసరం! ఒత్తిడిని ఎదుర్కొనటానికి, కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా.. చక్కటి సామాజిక ఆరోగ్యం ముఖ్యమైన మార్గం!
  • ఒత్తిడి ఆరోగ్యం
మితంగానే మంచిది!--

ఒత్తిడి.. స్ట్రెస్‌.. నిజానికి మనకు మేలు చేసే అంశమే. కాకపోతే అది మితి మీరకుండా చూసుకుంటేనే మంచిది. ఒత్తిడి తగు మోతాదులో ఉంటే లక్ష్యసాధన, పోటీతత్వం, ఉత్పాదకత వంటివన్నీ అద్భుతంగా పెరుగుతాయి. వేగంగా పని చేయటానికి, చురుకుగా ఆలోచించటానికి అవసరమైన శక్తి ఒత్తిడి నుంచి కూడా వస్తుంది. కానీ ఇది శ్రుతి మించితే మాత్రం నాడీ వ్యవస్థ లయ తప్పుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతినటం, ప్రతికూల ధోరణి, ఆందోళన, దిగులు, ఎప్పుడూ మూడీగా ఉండటం, కోపం, ఒంటరితనం వంటి లక్షణాలన్నీ బయల్దేరతాయి. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యానికి ఒత్తిడి మితంగా ఉండేలా చూసుకోవటం.. ముఖ్యంగా అది మితి మీరకుండా చూసుకోవటం అవసరం. ఒక రకంగా మనం సామాజికంగా, మానసికంగా,ఆధ్యాత్మికంగా, వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉంటే.. ఒత్తిడిని ఎదుర్కొనటం తేలిక అవుతుంది, అసలు ఒత్తిడి దరిజేరకుండా చూసుకోవటం కూడా సాధ్యమవుతుంది. వాటి పట్ల అవగాహన లేకపోతే.. కనీసం ఒత్తిడిని ఎదుర్కొనటం ఎలాగో నేర్చుకోవటమైనా అవసరం. ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే కండరాలను విశ్రాంతిగా వదిలేయటాన్ని సాధన చేయాలి. కొద్ది నిమిషాల సేపు నెమ్మదిగా ఛాతీనిండా శ్వాసను తీసుకోవటం, వదలటం చేయాలి. ఇలా 20-30 సార్లు చేస్తే ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఆత్మస్తుతి, పరనిందకు తావులేకుండా.. ప్రతికూల ఆలోచనలను అడ్డుకోవటమెలాగో సాధన చేయాలి.
  • అలౌకిక ఆరోగ్యం
మన శక్తి తెలిసొస్తుంది!---

తాత్వికత, ఆధ్యాత్మికత వంటివి మనకు ఏదోమతపరమైన నమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లా అనిపిస్తాయిగానీ.. ఆధ్యాత్మికమైన అవగాహన పెరిగిన కొద్దీ మన జీవితం మనకు మరింత అర్థవంతంగా, ప్రయోజనకరంగా కనిపించటం ఆరంభమవుతుందని ఆధునిక వైద్యరంగం స్పష్టంగా గుర్తిస్తోంది. దీనివల్ల మనం- మన చుట్టుపక్కల సమాజాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతాం. ఈ దృక్కోణం నుంచి చూడటం అలవాటైతే.. మన దైనందిన అనుభవాలను, సమస్యలను కూడా ఆవేశకావేశాలకు లోనుకాకుండా ఎంతో సానుకూలంగా, సమర్థంగా నెగ్గుకురాగలుగుతాం. ఆధ్యాత్మికంగా మనం ఎదిగిన కొద్దీ.. మనకూ, మన చుట్టుపక్కల సమాజానికీ మధ్య అవగాహన, సయోధ్య మెరుగవుతుంటాయి. మన అంతర్గత భావాలకూ, భావోద్వేగాలకూ... జీవితంలో ఎదురయ్యే ఎగుడుదిగుళ్లకూ మధ్య ఒక రకమైన సామరస్యం కుదురుతుంది. ముఖ్యంగా మన గురించి, మన శక్తిసామర్ధ్యాల గురించి, మనకున్న పరిమితుల గురించి స్పష్టమైన అవగాహన సాధ్యమవుతుంది. మనల్ని గురించి మనం తెలుసుకునే ఈ మార్గంలో మనకు ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు, అసంతృప్తులూ ఎదురవ్వచ్చు. అలాగే అనిర్వచనీయమైన ఆనందాలూ, సంతోషాలూ కూడా కలగొచ్చు. ఇవన్నీ అవసరమైన, ఆరోగ్యకరమైన అనుభవాలేనని అర్థమవుతుంది. మనం చక్కటి ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకొనేందుకు.. మంచిచెడ్డలను తర్కించుకునేందుకు.. మన చేతల్లో పవిత్రత సాధించేందుకు.. ప్రతి చిన్నదాన్నీ మనసుకు తీసుకుని బాధపడకుండా శాంతియుతంగా ఉండేందుకు.. మంచి విలువలకు కట్టుబడి ఉండేందుకు ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎంతగానో దోహదం చేస్తుంది.
  • పోషక ఆరోగ్యం
తెలివికి పరీక్ష!--

పిజ్జాలు, బర్గర్లు తినొద్దు.. కొవ్వు తినొద్దు, ఐస్‌క్రీములు తినొద్దు.. కూల్‌డ్రింకులు తాగొద్దు.. పోషకాహారం గురించి ఎవరు మాట్లాడటం మొదలుపెట్టినా ఇలాగే మొదలవుతుంది కథ. కానీ ఇది పూర్తిగా సరైన ధోరణి కాదు. పిజ్జాలు, బర్గర్లు తినకూడని విషపదార్ధాలేమీ కాదు.. కాకపోతే వాటిని మితి మీరి.. సమతౌల్యం తప్పి తింటేనే సమస్య! ఎప్పుడన్నా ఒకసారి వాటిని తింటే సమస్యేమీ ఉండదు. అందుకే నేడు ఆహారాన్ని ఎంచుకోవటమనేది మన తెలివికి, అవగాహనకు ఒక పరీక్షలా తయారైంది. మీ దినచర్యను చక్కటి అల్పాహారంతో మొదలుపెట్టండి. దీనిలో ఇడ్లీ, దోశ (ఇవీ మితంగానే) వంటి వాటితో పాటు ఒక పండు, పాలు వంటివీ ఉండేలా చూసుకోండి. ఆహారంలో ముడి బియ్యం, పప్పు, సీజన్‌వారీ వచ్చే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. నూనె తక్కువేసి వండుకోండి. స్త్రీలు పెద్దవయసులో కూడా దండిగా పాలు తాగాలి. బయట రెడీమేడ్‌గా ప్యాకెట్లలో దొరికేవి, స్వీట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఎక్కువగా తినొద్దు. చాలా రకాల సమస్యలకు పోషకాహారం తీసుకోకపోవటం.. లేదంటే సరైన పోషకాలు లేని పదార్ధాలు ఎక్కువగా తీసుకోవటమే మూలం. కాబట్టి ఈ పోషక ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటే... మనం సగం సమస్యలను అధిగమించినట్లే!
  • అలవాటులో ఆరోగ్యం
మంచి పెంచండి!--


అలవాట్లు అనగానే మనకు వెంటనే చెడ్డ అలవాట్లే గుర్తుకొస్తాయి. పొగ, మద్యం, మాదక ద్రవ్యాలు.. ఇవన్నీ చెడ్డ అలవాట్లు, వ్యసనాలే! వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే జీవితంలో మంచి అలవాట్లు పెంచుకుంటున్న కొద్దీ... చెడ్డ అలవాట్లు క్రమేపీ దూరమైపోతుంటాయని గుర్తించటం చాలా అవసరం. నిత్యం వ్యాయామం చెయ్యటం, క్రమబద్ధంగా జీవించటం, పనిని సమర్థంగా సమయ పాలనతో నిర్వహించుకోవటం, జీవితంలో సానుకూల దృక్పథంతో ఉండటం, కష్టాలేవైనా ఎదురైతే వాటిని ఎదుర్కొనటంలో సంయమనం పాటించటం... ఇలాంటి మంచి అలవాట్లు అలవరుచుకుంటే.. అసలు చెడ్డ అలవాట్ల అవసరమే ఉండదు. అవి మన దరికి చేరవు కూడా. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యానికి.. మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యమని గుర్తించాలి. ఏవైనా వ్యసనాలు ఉన్నా వాటితో వచ్చే చిక్కులపై అవగాహన పెంచుకొని.. వాటిని వదిలించుకునేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయటం చాలా అవసరం. పొగ మానెయ్యటం, లైంగికంగా ఒకే భాగస్వామికి కట్టుబడి ఉండటం, మద్యం వంటి వ్యసనాలకు బానిసైన మిత్రబృందాలకు దూరంగా ఉండటం, జీవితంలో కొన్ని మంచి విలువలతో వ్యవహరించాలన్న సంకల్పాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సడలిపోకుండా చూసుకోవటం.. ఇవి ముఖ్యం.

  • Source : Eeandu sukhibhava News paper.
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఇన్సులిన్‌ పంప్‌ చికిత్స-అవగాహన , Insulin pump treatment and Awareness


  • image : courtesy with Eenadu newspaper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఇన్సులిన్‌ పంప్‌ చికిత్స-అవగాహన , Insulin pump treatment and Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • వైద్యంలో కొన్ని విషయాలు వినటానికి భయంగా ఉంటాయి. కానీ వాటిని చూస్తే.. వాటిని ఉపయోగించటం మొదలుపెడితే.. ఆ భయాలు వాటంతట అవే తొలగిపోతాయి. 'ఇన్సులిన్‌ పంప్‌' కూడా అలాంటిదే. వైద్యులు 'ఇన్సులిన్‌ పంప్‌' పెట్టుకోవాలని సూచిస్తే.. భయం, బెరుకు సహజం! నిరంతరం మన శరీరానికి ఒక మిషన్‌ తగిలించుకుని తిరగాలంటే... అది రోజంతా లోపలకు కొద్దికొద్దిగా మందు పంపిస్తుందంటే.. వినటానికి ఎంతో ఆందోళన, బోలెడు అనుమానాలు ముసురుకుంటాయి. అయితే... దాని వాడకాన్ని ప్రత్యక్షంగా చూసినా.. దానిపై అవగాహన పెంచుకున్నా.. అంతగా భయపడాల్సిన పని లేదని అర్థమవుతుంది. వాస్తవానికి ఈ 'పంప్‌'లు ఎంతో సురక్షితం, వీటితో చక్కటి గ్లూకోజు నియంత్రణ సాధించవచ్చు. ముఖ్యంగా చిన్నవయసులోనే టైప్‌-1 మధుమేహం బారినపడిన వారెందరినో ఇది వరప్రదాయినిలా ఆదుకుంటోంది.

ఇన్సులిన్‌... మన శరీరానికి నిత్యావసరం. మన శరీరంలోని ప్రతి కణానికీ.. క్షణక్షణావసరం. మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఆ గ్లూకోజును మన శరీరం శక్తిగా మార్చుకుని.. ఇంధనంగా వినియోగించుకోవాలంటే.. ఇన్సులిన్‌ కీలకం! దీన్ని మన శరీరంలోని క్లోమ గ్రంథి తయారు చేస్తుంటుంది. అది విఫలమై ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోయినా.. లేక తగినంత లేకపోయినా.. మధుమేహం సంప్రాప్తిస్తుంది. అందుకే మధుమేహ నియంత్రణకు ఎన్ని మందులున్నా.. బయటి నుంచి ఇంజక్షన్ల రూపంలో.. ఆ సహజమైన 'ఇన్సులిన్‌'ను కృత్రిమంగా భర్తీ చేస్తుండం సమర్థమైన చికిత్సగా నిలుస్తోంది.

  • ఇంజక్షన్లకు పరిమితులు
మామూలుగా లోపల మన క్లోమ గ్రంథి నిరంతరాయంగా పని చేస్తుంటుంది. సమయాన్ని బట్టి.. అవసరాన్ని బట్టి.. మనం తింటున్న ఆహారాన్ని బట్టి.. అది శరీరానికి కావాల్సిన ఇన్సులిన్‌ను రోజంతా అందిస్తూనే ఉంటుంది. మధుమేహులకు.. మనం ఇదే తీరులో బయటి నుంచి ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వటం అసాధ్యం. అందుకే రోజు మొత్తంలో 2, 3, 4 సార్లు ఇంజక్షన్లు చేసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. ఇది ఆచరణకు వీలైనదేేగానీ.. దీనితో అందరికీ పూర్తిస్థాయి గ్లూకోజు నియంత్రణ సాధ్యం కాకపోవచ్చు. అందుకే మన శరీరానికి కావాల్సిన ఇన్సులిన్‌ను నిరంతరం సరఫరా చేస్తుండేందుకు ఒక 'పంప్‌'ను తయారు చెయ్యాలన్న ప్రయత్నం కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఇందుకోసం రకరకాల యంత్రాలను రూపొందించారు కూడా. అయితే అవన్నీ చాలా పెద్దగా, నాటుగా, మనతో పాటు తీసుకుపోవటానికి వీలు లేనంత భారంగా ఉండటంతో ఇన్నేళ్లుగా వాటికి అంత ప్రాచుర్యం రాలేదు. అయితే గత దశాబ్దకాలంలో ఈ పంప్‌లు అద్భుతమైన పురోగతి సాధించాయి. ఇప్పుడు పంప్‌ పెట్టుకోవటమంటే ఏమంత భయపడాల్సిన పని లేదు. అదేమంత అసౌకర్యంగానూ ఉండదు. ముఖ్యంగా- వీటితో గ్లూకోజు నియంత్రణ చాలా సమర్థంగా సాధ్యమవుతోంది. అందుకే 'పంప్‌'ల వాడకం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది.

  • 'పంప్‌'ల ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగా ఇన్సులిన్‌ను ఇంజక్షన్ల రూపంలో-
1. మన చర్మం కిందకే ఇవ్వచ్చు. కొన్ని గంటల పాటు మందు అక్కడే ఉండి.. క్రమేపీ కరుగుతూ రక్తంలో కలుస్తుంది. కానీ ఈ పద్ధతిలో మొత్తం తీసుకున్న ఇన్స్‌లిన్‌లో 30-50% మన శరీరానికి అందుబాటులోకి రాకుండా.. వృథాగా పోవచ్చు!

2. కండరాల్లోకి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే 70-90% అందుబాటులోకి వస్తుంది. కానీ ఇది వేగంగా అయిపోతుంది.

3. నేరుగా రక్తనాళాల్లోకి తీసుకోవచ్చు. దీనిలో దాదాపు పూర్తిగా (90% పైగానే) వినియోగమవుతుంది. కానీ రక్తనాళాల్లోకి ఇంజక్షన్‌ అన్నది ఇళ్లలో కష్టం. ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యం. పైగా ఇదీ చాలా వేగంగా అయిపోతుంది.

కండరాల్లోకి ఇచ్చినా, నేరుగా రక్తనాళాల్లోకి ఇచ్చినా ఇబ్బందేమంటే- ఇలా ఇచ్చిన ఇన్సులిన్‌ వేగంగా, రక్తంలో కలిసిన 20 నిమిషాల్లోనే కరిగి.. చాలా భాగం వృథాగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి రక్తంలో నిరంతరం ఇన్సులిన్‌ ప్రవహించేలా.. ఆ ఇన్సులిన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు భర్తీ చేయటానికి దశాబ్దాల తరబడి కృషి చేసి రూపొందించిన విధానమే.. 'ఇన్సులిన్‌ పంపు'. దీన్ని ఒక రకంగా వ్యవసాయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నచోట.. ఉన్న నీటినే సమర్థవంతంగా వినియోగించేందుకు అనుసరించే బిందు సేద్యం (డ్రిప్‌ ఇరిగేషన్‌) పద్ధతి లాంటిదే అనుకోవచ్చు.

ఈ విధానంలో ఇన్సులిన్‌.. నేరుగా రక్తంలో కలవకుండా కణజాలం మధ్యలో ఉండే ద్రవంలోకి (ఇంటర్‌స్టీషియల్‌ ఫ్లూయిడ్‌) చుక్కలు చుక్కలుగా పడుతుంది. ఇది వేగంగా వెంటనే రక్తంలో కలుస్తుంది. ఇది కూడా 20 నిమిషాల్లోనే కరిగిపోతుంది కానీ.. ఒక్కసారిగా ఎక్కువ ఇవ్వకుండా.. చుక్కలు చుక్కలుగా ఎప్పుడూ అందుతుండటం వల్ల.. నిరంతరం రక్తంలో తగినంత ఇన్సులిన్‌ ఉంటుంది, దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగే అవకాశం ఉండదు. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం అందించే బిందు సేద్యంలా.. మనం ఇస్తుండే ఇన్సులిన్‌లో బొట్టుబొట్టూ సద్వినియోగం అవుతుంది. అందుకే ఇన్సులిన్‌ పంప్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడకంలోకి వస్తున్నాయి.

  • పంపులు: రెండు రకాలు!
ఇన్సులిన్‌ పంపుల్లో 'ఓపెన్‌ లూప్‌', 'క్లోజ్డ్‌ లూప్‌' అని రెండు రకాలున్నాయి.
* క్లోజ్డ్‌ లూప్‌ పంపు: ఇది 5 నిమిషాలకు ఒకసారి రక్తంలో గ్లూకోజు మోతాదును తనే పరీక్షించుకొని.. అవసరమైన మేరకు ఇన్సులిన్‌ను తనే ఇచ్చేస్తుంటుంది. కానీ దీని సైజు పెద్దగా ఉండటం, ఖరీదు ఎక్కువగా ఉండటం వంటి కారణాల రీత్యా ఇదంత ప్రాచుర్యంలో లేదు. దీన్ని ఎక్కువగా ఆసుపత్రుల్లోనే వాడుతున్నారు.

* ఓపెన్‌ లూప్‌ పంపు: ప్రస్తుతం విరివిగా వాడుతున్న ఇన్సులిన్‌ పంపులు ఇవే. వాస్తవానికి ఇవి 40 ఏళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉన్నా అప్పట్లో ఈ యంత్రాలు చాలా పెద్దగా ఉండేవి. ఏదైనా కారణాన ఇన్సులిన్‌ విడుదల కాకపోతే హెచ్చరించే వ్యవస్థ ఉండేది కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో ఇవి సెల్‌ఫోన్‌ కంటే తక్కువ సైజుకు వచ్చేయటంతో వీటి వాడకంలో సౌలభ్యం పెరిగింది. వీటి సామర్థ్యమూ మెరుగైంది. అందుకే మధుమేహ నియంత్రణకు, ముఖ్యంగా టైప్‌-1 మధుమేహం బారినపడిన పిల్లలకు.. ఇప్పుడీ అధునాతన పంప్‌లు గొప్ప అవకాశాలుగా నిలబడుతున్నాయి.

  • పంప్‌: పనితీరు
సెల్‌ఫోన్‌ కన్నా చిన్నగా, పేజర్‌ సైజులో ఉండే అధునాతన పంప్‌లు.. ఎంత ఇన్సులిన్‌ ఇవ్వాలో కచ్చితంగా అంతే ఇస్తుంటాయి. దీనికి అనుసంధానంగా సన్నటి గొట్టం ఉంటుంది. ఈ గొట్టం చివర ఉండే ప్లాస్టిక్‌ మొన చర్మం కింద 6 లేదా 9 మి.మీ. లోతులో ఉండి.. బొట్టు బొట్టుగా ఇన్సులిన్‌ను కణజాల ద్రవంలోకి విడుదల చేస్తుంటుంది.

ఈ పంపు బ్యాటరీతో నడుస్తుంది. ఇందులో 300 యూనిట్ల ఇన్స్‌లిన్‌ నింపుకునే సామర్థ్యం ఉంటుంది. ఇందులో మనం రోజు మొత్తంలో ఎంత ఇవ్వాలో ఒక్కసారే సెట్‌ చేసి వదిలేస్తే చాలు. దీన్ని 'బేసల్‌' అంటారు. అలాగే ఆహారం తినే ముందు అందుకు తగ్గట్టు అదనంగా అప్పటికప్పుడు కొన్ని యూనిట్లు ఇచ్చుకునే సదుపాయమూ ఉంటుంది, దీన్ని 'బోలస్‌' అంటారు. మనం సెట్‌ చేసిన మేరకు.. గొట్టం ద్వారా ఇన్సులిన్‌ నిరంతరం, అద్భుతమైన కచ్చితత్వంతో శరీరంలోకి వెళ్లిపోతుంటుంది. అదక్కడ నిల్వ ఉండదు, వెంటనే రక్తంలో కలుస్తుంది. వృథా తక్కువ. ఫలితంగా మామూలు ఇంజక్షన్ల ద్వారా అవసరమయ్యే ఇన్సులిన్‌ మోతాదులో 60% శాతమే సరిపోతుంది.

  • సమర్థం.. సులభం.. సౌకర్యం!
ఇన్సులిన్‌ పంపు అనగానే చాలామంది దీన్ని రోజంతా మోసుకుంటూ తిరగాలి.. ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది.. ఎవరైనా చూస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది ప్రస్తుతం సెల్‌ఫోన్ల కన్నా చిన్నగా ఉంటుంది. బరువు కూడా తక్కువ. ప్యాంటుకుగానీ, పైజమాకుగానీ పెట్టేసుకోవచ్చు. దీన్నుంచి సన్నటి గొట్టం మాత్రమే బయటకు కనిపిస్తుంది. గొట్టం పొట్టకు ఉంటుంది, పైన చొక్కా వచ్చేస్తుంది కాబట్టి ఇక ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. మూడు రోజులకు ఒకసారి, కనీసం వారానికి ఒకసారి గొట్టాన్ని తీసి మరోచోటికి మార్చుకోవాల్సి ఉంటుంది, దీన్ని ఎవరికి వారే చేసుకోవచ్చు. పంప్‌ కింద పడినా పగిలిపోదు. పాడవదు. స్నానం చేసేటప్పుడు దీన్ని ఆపేసి తీసి పక్కనపెట్టి, తర్వాత మళ్లీ అమర్చుకోవచ్చు. గొట్టం చివర ఉండే సన్నటి ప్లాస్టిక్‌ సూది చర్మంలోకి 6 లేదా 9 మి.మీ. లోతువరకే వెళ్తుంది కాబట్టి నొప్పి కూడా ఉండదు. చాలావరకూ దీన్ని పొట్ట దగ్గరే అమర్చుతారు. దీన్ని ఎవరికివారే అమర్చుకోవచ్చు. నిద్రలో తొలగిపోవటమూ జరగదు. వ్యాయామం సమయంలో కూడా దీన్ని పెట్టుకునే ఉండొచ్చు. ఒకవేళ గొట్టం మడతబడో, సూది సరిగా లోనికి వెళ్లకో ఒక్క నిమిషంపాటు ఇన్సులిన్‌ విడుదల కాకపోతే.. వెంటనే దాన్ని సెన్సర్‌ దాన్ని గుర్తించి 'బీప్‌' ద్వారా హెచ్చరిస్తుంది. పంప్‌లో ఎప్పుడెంత ఇన్సులిన్‌ ఇచ్చిందీ గ్రాఫ్‌ రూపంలో నమోదవుతుంది కూడా. కావాలంటే ఆ సమాచారాన్ని కంప్యూటర్‌కు అనుసంధానించి చూసుకోవచ్చు. అలవాటయ్యే వరకూ మొదట్లో దీని వాడకం కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ సెల్‌ఫోన్‌ వంటివి వాడటం నేర్చుకున్నట్టే దీన్నీ.. ఎవరికి వారే తేలికగా వాడుకోవచ్చు.

  • ఎవరికి ఉపయోగం?
రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేనివాళ్లు ఖర్చు భరించగలిగే స్థితిలో ఉంటే పంపు అమర్చుకోవటం ఎంతో మంచిది. టైప్‌-1 మధుమేహులకు ఇది అత్యుత్తమం. టైప్‌-1 బాధితులు మధుమేహాన్ని గుర్తించినప్పటి నుంచే దీన్ని అమర్చేసుకుంటే మధుమేహ దుష్ప్రభావాలు దరిజేరకుండా చూసుకోవచ్చు.

* పిల్లలు: టైప్‌-1 బాధితులందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇన్సులిన్‌ పంపులు బాగా ఉపయోగపడతాయి. పిల్లల్లో యవ్వనదశలో హార్మోన్లస్థాయులు మారిపోతుంటాయి. పైగా ఇవన్నీ ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంటాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణ కష్టమవుతుంది. ఇలా నియంత్రణలో లేని (బ్రిటిల్‌ డయాబెటీస్‌) యవ్వనదశలో పిల్లల్లో ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. అందువల్ల వీరికి ఇతర విధానాల కన్నా ఇన్సులిన్‌ పంపులతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఎదుగుదల సక్రమంగా జరుగుతుంది. గ్లూకోజు హెచ్చుతగ్గులూ అదుపులో ఉంటాయి. నెల్లోపు పిల్లలకు పంప్‌లు అమర్చిన సందర్భాలూ ఉన్నాయి. దీన్ని లాక్‌ చేసే సదుపాయం ఉండటం వల్ల చిన్నపిల్లలకు, స్కూలుకెళ్లే పిల్లలకు అమర్చినా ఇబ్బందేం ఉండదు.

  • * గర్భిణులు:
ముందు నుంచీ గానీ.. లేక గర్భం ధరించిన తర్వాత గానీ మధుమేహం బయటపడిన స్త్రీలలో.. కాన్పు సమయంలో తల్లీ, బిడ్డకు సమస్యలు కొంచెం ఎక్కువ. అప్పటికే గర్భం పోవటం వంటి ఒకటిరెండుసంఘటనలు ఉన్నవారికి ముందే ఇన్సులిన్‌ పంపు అమర్చితే మంచి ఫలితం ఉంటుంది. పంప్‌తో హెచ్‌బీ ఏ1సీ 7 శాతానికి చేరుకున్నాక గర్భ ధారణకు ప్రయత్నిస్తే పెద్దగా ఇబ్బందులుండవు. కాన్పు అయ్యాక అవసరమైతే పంప్‌ తొలగించొచ్చు.

* అనియంత్రిత మధుమేహం: మధుమేహం వచ్చి 20, 25 ఏళ్లు దాటిపోయాక ఆహార, వ్యాయామ నియమాలు ఎన్ని పాటించినా.. ఎంత మంచి మందులు వాడినా.. ఇన్సులిన్‌ ఎంత బాగా తీసుకున్నా.. కొందరికి క్రమేపీ రక్తంలో గ్లూకోజు నియంత్రణ కష్టమైపోతుంటుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా వృద్ధులకు ఇన్సులిన్‌ పంపు బాగా ఉపయోగపడుతుంది.

  • పంప్‌: ప్రయోజనాలు అనేకం!
* కచ్చిత నియంత్రణ: రోజూ రక్తపరీక్షలు చేసుకుని, రోజుకు నాలుగైదుసార్లు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకునే వారిలో కూడా చక్కెర నియంత్రణలో 'గ్త్లెకేటెడ్‌ హీమోగ్లోబిన్‌'.. 8 శాతం వరకే వస్తుంది. అంతకంటే తగ్గించటం చాలా కష్టం. అదే పంప్‌ వాడే వారిలో ఇది తేలికగా 7 శాతానికి వస్తుంది. ఈ లక్ష్యాన్ని చేరటం ఇంజక్షన్లతో సాధ్యం కాదు.

* డోసులు తేలిక: పంప్‌ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అదనపు డోసులు ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా ఆహారం కాస్త ఎక్కువ తీసుకున్నా, కూల్‌డ్రింకుల వంటివి తాగినా రక్తంలో ఆ మేరకు పెరిగే గ్లూకోజు శాతాన్ని బట్టి ఎవరికివారు 'బోలస్‌'ను నొక్కటం ద్వారా వెంటనే అదనంగా ఒకటో రెండో యూనిట్ల ఇన్సులిన్‌ ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఆ సమయంలో రక్తంలో పెరిగే గ్లూకోజును సరిగా నియంత్రించొచ్చు. ఇది పంప్‌తో పెద్ద ప్రయోజనం, ఇంజక్షన్ల ద్వారా ఇది కష్టం.

* హఠాత్తుగా ఆపెయ్యచ్చు: మామూలుగా ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకున్నా.. లేక మాత్రలు వేసుకున్నా.. మధ్యలో ఎప్పుడైనా గ్లూకోజు స్థాయి తగ్గిపోయి 'హైప్లోగ్త్లెసీమియా' వస్తే (గ్లూకోజు డౌన్‌ అయిపోతే) దాన్ని వెంటనే అడ్డుకోవటం కష్టం. అప్పటికే తీసుకున్న ఇన్సులినో, మాత్రలో.. వాటి ప్రభావం పూర్తయ్యే వరకూ పని చేస్తూనే ఉంటాయి, ఆ 'హైపో' కొనసాగుతూనే ఉంటుంది. అదే పంప్‌లో అయితే వెంటనే ఇన్సులిన్‌ విడుదల కాకుండా కట్టెయ్యచ్చు, హైపో పెరగకుండా అడ్డుకోవటం తేలిక.

* అర్ధరాత్రి బెడద ఉండదు: రోజూ నాలుగుసార్లు ఇన్సులిన్‌ తీసుకునే వారు అర్ధరాత్రి లేచి ఇంజక్షన్‌ చేసుకోవాల్సిన బాధ పంపుతో తప్పిపోతుంది. మన నిర్దేశాల ప్రకారం రోజులో ఏ సమయంలోనైనా ఇన్సులిన్‌ డోసులు ఇస్తుంది.

* బాధలు తక్కువ: పంప్‌తో రక్తంలో గ్లూకోజు నియంత్రణ మెరుగ్గా ఉంటుంది కాబట్టి.. దుష్ప్రభావాలు తక్కువ. డాక్టర్లు, ఆసుపత్రుల మీద ఆధారపడటం తగ్గుతుంది.

*గొప్ప సౌలభ్యం: రెటినోపతీ కారణంగా దృష్టి సమస్యలు వచ్చిన మధుమేహులు తమకు తాముగా ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకోవటం కష్టం. ఇలాంటి వారికి సహాయకులు పంప్‌ ఒక్కసారి సెట్‌ చేస్తే నాలుగైదు రోజుల వరకూ దిగులుండదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి తరచూ హైపోగ్త్లెసీమియా వచ్చే అవకాశం ఎక్కువ. పంపుతో వీటిని బాగా నివారించుకోవచ్చు.

  • ఇబ్బందేమిటి?
* ప్రస్తుతం ఇన్సులిన్‌ పంపులతో ఉన్న ప్రధాన అవరోధం- ఖర్చు! ఈ పంప్‌ ఖరీదు దాదాపు రూ. 1.5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో వాడేది మామూలు ఇన్సులినే అయినప్పటికీ.. శరీరంలో ఉండిపోయే గొట్టం భాగం, దాన్ని ఎక్కించుకునేందుకు అవసరమైన సూదుల కిట్‌ వంటివన్నీ కలిపి దాదాపు రూ.500 వరకూ అవుతాయి. వీటిని కనీసం వారానికి ఒకసారైనా మార్చుకోవాల్సి ఉంటుంది. పంప్‌తో ఒనగూడే లాభాలతో పోలిస్తే ఈ ఖర్చు లెక్కలోనిది కాదుగానీ తప్పదు.

* కొద్దిమందికి పొట్ట మీద సన్నటి ప్లాస్టిక్‌ గొట్టం అమర్చే చోట అలర్జీలు రావచ్చు. ఈ ప్రదేశాన్ని మూడు రోజులకు ఒకసారి మార్చాలి. ఇది అమర్చిన చోట కొద్దిమందికి చిన్న పుండులా తయారై, మానటానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. దీన్ని గురించి వైద్యులతో చర్చిస్తే మార్గం చెబుతారు.
దశాబ్దాల చరిత్ర
అసలు ఇన్సులిన్‌ ఆవిష్కారమే అద్భుతమనుకుంటే.. దాన్ని నిరంతరాయంగా మన శరీరానికి అందించే 'పంప్‌' కోసం దశాబ్దాల తరబడి జరిగిన అన్వేషణ కూడా తక్కువదేం కాదు. బెస్ట్‌, బ్యాంటింగ్‌మహాశయులు ఇన్సులిన్‌ను ఆవిష్కరించి 90 ఏళ్లు అవుతోంది. మానవాళికి చేసిన ఈ మహోపకారానికి వారు నోబెల్‌ పురస్కారం సైతం అందుకున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి ఇంజక్షన్‌ చేయటం కాకుండా.. ఇన్సులిన్‌ను అచ్చం మన క్లోమం లాగే బయటి నుంచి నిరంతరాయంగా ఇచ్చే యంత్రం కోసం 1970 సం.ల నుంచీ అన్వేషణ ఆరంభమైంది. మొదట్లో ఇవి భుజానికి తగిలించుకునే సంచీ అంత పెద్దగా ఉండేవి. మెరుగులు దిద్దీ దిద్దీ.. 1980 లలో వీటిని పెద్ద ఇటుకరాయి అంత సైజుకు తెచ్చారు. అప్పట్లో దీర్ఘకాలం మన్నే బ్యాటరీలు లేకపోవటమూ సమస్యగానే ఉండేది. ప్రస్తుతం పేజర్‌ కంటే చిన్నసైజుకు చేరుకోవటానికి ముందు ఇంతటి చరిత్ర ఉంది.

  • Source : ఈనాడు న్యూస్ పేపర్ - సుఖీభవ. / డా.పి.వి.రావు డయాబిటీస్ ప్రొఫెషర్ నిమ్స్ హాస్పిటల్ - హైదరాబాద్ .
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, January 10, 2012

cancer screening Tests , క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --cancer screening Tests , క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్ ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా నయము చేయవచ్చును . అయితే క్యాన్‌సర్ ను ముందుగా గుర్తించడానికి మనకు రెండు రకాల కారకాలు అవసరము . అవి 1) క్యాన్సర్ వ్యాధి యొక్క ముందస్తు లక్షణాలు గురించి తెలుసు కోవడము . 2) స్క్రీనింగ్ .

  • క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

  • ముదంస్తు లక్షణాలు :
సామాన్య ప్రజలు కాన్‌సర్ యొక్క ముందస్తు లక్షణాలను గురించిన పరిజ్ఞానము కలిగి ఉండడము వలన క్యాన్సర్ త్వరగా గుర్తించడానికి వీలవుతుంది . గడ్డలు , అసాధారణ రక్తస్రావము , దీర్ఘకాలము పాటు ఆహారము సరిగా జీర్ణము కాకపోవడము , మందులు వాడినా సరిగా మానని పుండు ... మొదలైనవి క్యాన్సర్ ముందస్తు లక్షణాలలో కొన్ని . బ్రెస్ట్ కాన్‌సర్ , నోటి క్యాన్‌సర్ , పెద్దప్రేగుల కాన్‌సర్ , చర్మ కాన్‌సరు వంటివాటిలో పైన పేర్కొన్న లక్షణాలు ద్వారా క్యాన్‌సర్ ముందుగానే గుర్తించవచ్చును .

  • స్క్రీనింగ్ :
స్క్రీనింగ్ అనేది ఆరోగ్య్ముగా ఉండే వ్యక్తులలో నుగూఢమై ఉన్న క్యాన్‌సర్ ను గుర్తించడానికి నిర్వహించే పరీక్ష . క్యాన్‌సర్ కారకాలు శరీరములో దాగి ఉండే లక్షణాలు ఇంకా బయటపడని వ్యక్తులలో నిర్వహించే సాధారణమైన , సులువైన పరీక్ష . ముందుజాగ్రత్తగా ఈ పరీక్షలు చేసుకోవడము వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది .


క్యాన్సర్ వచ్చే అవకాశము గల వ్యక్తులు :
  • పొగ త్రాగడం అలవాటున్నవారు , పొగాకు నమలడము , గుట్కా, పాన్‌మసాల , జర్ధా మఒదలైనవి వేసుకునే అలవాటు ఉన్నవారు .
  • మద్యానికి బానిసలైనవారు . సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధులు కలవారు , .
  • వ్యాయామము చేయనివారు . . ఊబకాయము , కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకునేవారు , .
  • పీచుపదార్ధము తక్కువగా ఉండే ఆహారము తీసుకునేవారు , మసాలాలు ఎక్కువగా తినేవారు .

మహిళలకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు :
  • బ్రెస్ట్ క్యాన్‌సర్ :
  • 20 సం.లు నిందిన ప్రతి మహిళ రెగ్యులర్ గా ఇంటివద్దనే స్థనాలను పరీక్షించుకోవాలి . స్థనాలలో కణుతులు , గడ్డలు , వాపులు ఏమైనా ఉన్నాయోమో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి .
  • 20 నుండి 30 సం. నిండిన మహిళలు ప్రతి 3 సం.లకు ఒకసారి వైద్యునిచే స్థనాలను పరీక్ష చేయించుకోవాలి . 40 సం.ల నుండి మహిళలు ప్రతి సంవత్సరమూ స్థనాలలను వైద్యుని చే పరీక్ష చేయించుకోవాలి .
  • వయసు 40 సంవత్సరాలు నిండిన మహళలు ప్రతి సంవత్సరము డిజిటల్ మమ్మొగ్రామ్‌ పరీక్ష చేయించుకోవడము మంచిది .

సెర్వైకల్ క్యాన్‌సర్ :
  • సెక్ష్ లో పాల్గొనడం మొదలు పెట్టిన 3 సం.లు తరువాత నుండి ప్రతి మహిళ గర్భాశయ ముఖ ద్వారానికి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. సాధారణ పి.ఎ.పి పరీక్ష పద్దతిలో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి . అదే అత్యాధునిక లిక్విడ్ -బెస్ట్ పి.ఎ.పి. పద్దతిలో అయితే 2 సం.ల కొకసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది .
  • 30 సం.లు పైబడిన వయసు కలవారు ప్రతి 3 సం.లు ఒకసారి పి.ఎ.పి పరీక్ష మరియు హెచ్.పి.వి , డి.యన్‌.ఎ , పరీక్షలు చేయించుకుంటే మంచిది .
  • హెచ్ .ఐ.వి. ఉన్నవారు , అవయమార్పిడి , కీమోథెరపీ , మత్తుపదార్ధాల బానిసలు వంటి వాటివలన రోగనిరోధక శక్తి తగ్గినవారు లేదా కోల్పోయినవారు ప్రతిసంవత్సరము పైన చెప్పిన పరీక్షలు చేయించుకోవాలి .
  • 70 సం.లు పైబడిన మహిళలు , గత 10 సంవస్తరాలు గా పి.ఎ.పి. పరీక్ష నార్మల్ గా వచ్చినవారు .. స్క్రీనింగ్ టెస్ట్ ను ఆపేయవచ్చును .
  • హిస్టెరెక్టమీ ద్వారా గర్భాశయము తో పాటు సెర్వెక్ష్ కూడా తొలగించినవారు లో స్క్రీనింగ్ పరీక్షలు చేయాల్సినవసరము లేదు .
  • 10 సం.లు నిండిన ఆడపిల్లలకు , 46 సం.లలోపు మహిళలము సెర్వకల్ క్యాన్‌సర్ వాక్షిన్‌ ఇప్పించడము వలన 90% సెర్వైకల్ క్యాన్‌సర్ ని నివారించవచ్చును .

మగవారికి నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు :
మగవారిలో వచ్చు క్యాన్సర్‌లు : ముఖ్యంగా
  • నోటి క్యాన్సర్‌,
  • గొంతుక్యాన్సర్‌,
  • ఊపిరి తిత్తులు క్యాన్సర్‌,
  • అన్నవాహిక క్యాన్సర్‌,
  • ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మొదలైనవి.
పై మూడు క్యాన్సర్‌లు రావడానికి ముఖ్యకారణం ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడటం. (గుట్కా, పాన్‌ పరాగ్‌ మొదలైనవి). పైన పేర్కొన్న మూడు క్యాన్సర్‌ వ్యాధులు 23 శాతం ధూమపానం వలన వస్తున్నాయి.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ :
  • 50 సంలు నిండిన మగవారు ప్రతి సంవత్సరమూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్‌ (పి.యస్ .ఎ ) రక్తపరీక్ష , డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి .
  • కుటుంబకులో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్‌సర్ ఉన్నట్టు అయితే మిగతావారు 40 సంవత్సరాల వయసునుండే ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి .
క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తలు
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • అధిక బరువు తగ్గించుకోవాలి.
  • ఆహారంలో క్రొవ్వు పదార్థాలు తగ్గించాలి.
  • తాజా పళ్ళు, కూరగాయలు పీచుపదార్థం ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
  • యాంటి ఆక్సిడెంట్స్‌ ఉండే పదార్థాలు సమృద్ధిగా తీసుకోవాలి.
  • వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి.
  • లైంగిక పరిశుభ్రత పాటించాలి.
  • క్రమం తప్పకుండా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

నివారణ సాధ్యమే :
  • క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి.
  • క్యాన్సర్‌ లక్షణాలు గురించి వ్యాధి నిరోధక పద్ధతుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.
  • క్యాన్సర్‌ మొదటి దశలో గుర్తించేలా లక్షణాల గురించి గ్రామీణ వైద్యులు, ఫిజిషియన్స్‌కు ఇతర విభాగాల వైద్యులకు క్యాన్సర్‌ వైద్యులచే శిక్షణాతరగతులు నిర్వహించాలి.
  • ప్రతి సంత్సరం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకునేలా అవగాహనకు ప్రచారం చేయాలి.
  • అన్ని ప్రధాన ఆసుపత్రులలో పేద, మధ్యతరగతి వారికి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయించేలా మరియు ప్రధాన ఆసుపత్రులలో క్యాన్సర్‌ వైద్య నిపుణులు క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటుకు ప్రయత్నించాలి.
  • క్యాన్సర్‌ వైద్య చికిత్సకు అవసరమయ్యే జనరిక్‌ మందులు చవక ధరలో లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
  • క్యాన్సర్‌ వ్యాధి గురించి గ్రామీణ ప్రాంతాలలో ర్యాలీలు, కళాజాతరలు ద్వారా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కలిగించటానికి కృషి చేయాలి.
  • సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు వాడే వ్యాక్సిన్‌ను తక్కువ ధరలలో 13 సం||రాల బాలికలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి.
  • యాంటిఆక్సిడెంట్‌ వున్న ఆహారపదార్థాలు తీసుకొనేలా చిన్నప్పటి నుండి వ్యాయామం చేసేలా పిల్లలకు విద్యార్థి దశ నుంచి నేర్పించాలి.

పై నివారణ చర్యలు పాటించడం ద్వారా రాబోయే రోజులలో క్యాన్సర్‌ వ్యాధిని కొంతవరకైనా అరికట్టగలమని ఆశిద్దాం.

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, January 4, 2012

Blood Groups ,బ్లడ్ గ్రూప్స్

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Blood groups- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




Blood Groups
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEidHsvVgRCuNvgU8YxinzrSrz_snaPheTfOTMnZFucu_gWWaMEVs-gHMPej4dNTifQXOdakneP-Fspbf5fsp_YSjYw2QBU0Kc1H7T-YYIeZXmnRI78yjTEjuc70Ik9XiK5jjd0rJg19wDCi/s1600/ABO_T4.jpg





రక్తం లో ఏమి ఉంటాయి :
  • 55 శాతము ప్లాస్మా ,
  • 45 శాతము సెల్స్ .... ఉంటాయి .
  • ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
  • సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
  • ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
  • ----తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
  • -------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .
  • ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రక్త వర్గం ( రక్తం యొక్క రకం)-బ్లడ్ గ్రూప్ :


ఒక రక్త వర్గం ( రక్తం యొక్క రకం (బ్లడ్ గ్రూప్)) అనేది ఎర్ర రక్త కణాల(RBCs) ఉపరితలంపై ఉండే అనువంశికంగా పొందిన యాంటిజెనిక్ పదార్ధాలు ఉండటం లేదా లేకపోవడం పై ఆధారపడిన రక్తం యొక్క ఒక వర్గీకరణ. రక్తవర్గవ్యవస్థపై ఆధారపడిన ఈ యాంటిజెన్లు మాంస కృత్తులు, పిండి పదార్ధాలు , గ్లైకోప్రోటీన్లు, లేక గ్లైకో లిపిడ్లు అయి ఉండవచ్చు, వివిధ కణజాలాల యొక్కకణాల ఉపరితలంపై కూడా ఇవి ఉండవచ్చు. ఒక అల్లేలే (లేదా అతి సన్నిహితంగా బంధించబడిన జన్యువుల)మూలంగా గల ఈ ఎర్ర రక్తకణాల ఉపరితల యాంటిజెన్లు, సామూహికంగా ఒక రక్తవర్ణవ్యవస్థని ఏర్పరుస్తాయి.

రక్తం యొక్క రకాలు అనువంశికంగా తల్లిదండ్రుల నుండి వచ్చి ఇద్దరి గుణాలను కలిగి ఉంటాయి.మొత్తం 30 రకాల మానవ రక్తవర్గవ్యవస్థలు ఇంటర్నేషనల్ సొసైటీ అఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ISBT)చే గుర్తించబడ్డాయి.

అనేక మంది గర్భిణీ స్త్రీలు వారి కంటే భిన్నమైన రక్తవర్గాన్ని కలిగిన పిండంను మోస్తారు, మరియు పిండం యొక్క RBCలకు విరుద్ధమైన ప్రతి రక్షకాలని తల్లి తయారు చేసుకోగలదు. కొన్నిసార్లు ఈ తల్లి ప్రతి రక్షకాలు చిన్న ఇమ్మ్యూనోగ్లోబ్యులిన్ IgGగా ఉండి, మాయను దాటి పిండం RBCల యొక్క హేమోలిసిస్ కి కారణమవుతుంది, ఇది తరువాత నవజాత శిశువు యొక్క హేమోలిటిక్ వ్యాధికి దారితీస్తుంది, ఈవ్యాధిలో పిండం యొక్క తక్కువ రక్త కౌంట్ తక్కువ నుండి తీవ్రస్థాయి వరకు ఉండవచ్చు.

  • రక్తవర్గ వ్యవస్థలు
ఇంటర్నేషనల్ సొసైటీ అఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ISBT) వారిచే మొత్తంగా 30 మానవ రక్తవర్గ వ్యవస్థలుగుర్తించబడ్డాయి. ఒక పరిపూర్ణ రక్త వర్గం RBCల ఉపరితలంపై ఉన్న 30 రకాల పదార్ధాలను వివరిస్తుంది, మరియు ఒక వ్యక్తి యొక్క రక్తవర్గం, రక్తవర్గ యాన్టిజేన్ల యొక్క అనేక రకాల అవకాశాలున్న కలయిక. 30 రక్త వర్గాలలో,600 పైగా వివిధ రక్త వర్గ యాన్టిజేన్లు కనుగొనబడ్డాయి , వీటిలో చాలా రకాలు అరుదైనవి లేదా ఒక ప్రత్యేక సంస్కృతికి చెందిన సమూహాలలో ప్రధానంగా కనుగొనబడతాయి.

సర్వ సాధారణంగా, ఒక వ్యక్తి జీవిత పర్యంతం ఒకే రక్త వర్గాన్ని కలిగి ఉంటాడు, కానీ అత్యంత అరుదుగా ఒక వ్యక్తి యొక్క రక్తవర్గం అంటూ రోగాలు, పుండ్లు పెరగడం, ఆటోఇమ్మ్యున్ వ్యాధులలో ఒక అంటిజేన్ చేరుట లేదా అణచబడుట ద్వారా మారుతుంది. డెమి-లీ బ్రేన్నన్,అనే ఆస్ట్రేలియన్ పౌరునికి జరిగిన కాలేయ మార్పిడిలో అతని రక్త వర్గం మారిపోయిన అరుదైన సంఘటన దీనికి ఉదాహరణ. రక్త వర్గం మారే మరియొక సాధారణ కారణం ఎముక మజ్జ మార్పిడి. ఎముక మజ్జ మార్పిడి ఇతర రోగాలతో పాటు ఎక్కువగా లుకేమియా మరియు లిమ్ఫోమాస్ లకు జరుగుతుంది. ఒక వ్యక్తి వేరొక ABO వర్గం (ఉదా.A వర్గ రోగి O వర్గ దాత నుండి ఎముక మజ్జ పొందినపుడు ) కలిగిన వ్యక్తినుండి ఎముక మజ్జ పొందినపుడు ఆ రోగి యొక్క రక్త వర్గం దాత యొక్క వర్గంలోకి మారిపోతుంది.


కొన్ని రక్త వర్గాలు ఇతర వ్యాధుల వారసత్వంకు సంబంధించి ఉంటాయి ; ఉదాహరణకు , కెల్ యాన్టిజేన్ కొన్నిసార్లు మెక్లాయిడ్ సిండ్రోమ్ తో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని రక్త వర్గాలు అంటువ్యాధుల అనుకూలతపై ప్రభావాన్ని చూపిస్తాయి , ఉదాహరణకు డఫ్ఫీ యాన్టిజేన్ లోపం ఉన్న వ్యక్తులు ప్రత్యేక మలేరియా జాతులకు నిరోధకత చూపించడం . డఫ్ఫీ యాన్టిజేన్ దాని యొక్క సహజ ఎంపిక వల్ల ,మలేరియా ప్రాబల్యం ఉన్న ప్రాంత ప్రత్యేక సమూహాలలో తక్కువగా ఉంటుంది.


  • ABO రక్త వర్గ వ్యవస్థ --ABO blood group system
ABO వ్యవస్థ మానవ-రక్త మార్పిడిలో ఒక అతి ముఖ్యమైన రక్త వర్గ వ్యవస్థ. వ్యతిరేక -A ప్రతి రక్షకాలు మరియు వ్యతిరేక-B ప్రతిరక్షకాల సాహచర్యాన్ని "ఇమ్మునోగ్లోబ్యులిన్ M", IgM ప్రతిరక్షకాలు అంటారు. ABO IgM ప్రతిరక్షకాలు, జీవిత ప్రధమభాగంలో ఆహారము, బాక్టీరియా, మరియు వైరస్ ల వంటి పరిసర పదార్ధాలకు ప్రతిస్పందనగా ఏర్పడతాయి. ఇతర భాషలలో ABO లో "O" అనేది "0" (సున్న/శూన్యంగా) పిలువబడుతుంది.

  • Phenotype- Genotype
A-- AA లేక AO
B -- BB / BO
AB- AB
O -- OO

  • Rhesus blood group system

రీసస్ వ్యవస్థ మానవ-రక్త వ్యాపనంలో రక్త-వర్గ వ్యవస్థలో రెండవ అతిప్రధానమైనది. RhD అంటిజేన్ అతి ప్రధానమైన రీసస్ అంటిజేన్ ఎందుకంటే ఐదు ప్రధాన రీసస్ అంటిజెన్స్లో ఇది ఎక్కువ ఇమ్మునోజేనిక్ గా ఉంటాయి. RhD- నెగిటివ్ వ్యక్తులు అటువంటి అంటి-RhD IgG లేదా IgM ప్రతిరక్షకాలను కలిగి ఉండకపోవడం సాధారణం, ఎందుకంటే యాంటి-RhD ప్రతిరక్షకాలు సాధారణంగా పరిసర పదార్ధాలకు వ్యతిరేక సున్నితత్వంతో తయారుకావు. ఏదేమైనా, RhD-నెగిటివ్ వ్యక్తులు IgG అంటి-RhD ప్రతి రక్షకాలను సున్నితత్వపు సంఘటన నుండి తయారు చేసుకోగలవు: గర్భధారణ సమయంలో తల్లి గర్భం లోని పిండం యొక్క రక్త వ్యాపనం లేదా కొన్ని సార్లు RhD పాజిటివ్ RBCల తో రక్త వ్యాపనం. ఈ సందర్భాలలో Rh వ్యాధి కలుగ గలదు.


1. తల్లిదండ్రులిద్దరూ 'ఒ' గ్రూపు వారైతే బిడ్డ 'ఒ' గ్రూపుకే చెందుతుంది. 'ఎ', 'బి' గ్రూపు కానేకాదు.

2. తల్లిదండ్రులళో ఒకరు 'ఒ' మరొకరు 'ఎ' అయినా లేదా ఇరువురూ 'ఎ' గ్రూపుకి చెందిన వారైతే బిడ్డ 'ఎ' లేదా 'ఒ' గ్రూపుకి చెందుతుంది. 'బి'కి గాని, 'ఎబి'కి గాని చెందదు.

3. తల్లిదండ్రులలో ఒకరు 'బి' మరొకరు 'ఒ' అయినా, ఇరువురూ 'బి' అయినా బిడ్డ 'ఒ' లేక 'బి' గ్రూపు అవుతుంది. 'ఎ' లేక 'ఎబి' గ్రూపు అవదు.

4. తల్లిదండ్రులలో ఒకరు 'బి' మరొకరు 'ఎ' అయితే బిడ్డ నాలుగు గ్రూపులలో 'ఎ'గాని, 'బి'గాని, 'ఎబి'గాని, 'ఒ' గాని కావచ్చు.

తల్లిదండ్రులలో ఒకరు 'ఎబి' మరొకరు 'ఒ' అయితే బిడ్డ 'ఎ' గాని 'బి'గాని 'ఎబి'గాని అయితే బిడ్డ 'ఒ'వర్గం తప్ప మిగతా ఏ వర్గమైనా కావచ్చు. ఇవే కాకుండా యం.యస్(MS),ఆర్.హెచ్(Rh factor) మొదలైన వాటిగా బ్లడ్ గ్రూప్ లు తిరిగి వర్గీకరించబడ్డాయి. ఏదైనా బిడ్డకి సంక్రమించే బ్లడ్ గ్రూపులు, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే క్రోమోజోమ్ లు అందులో బ్లడ్ గ్రూపులకి సంబంధించిన రసాయనాల మీద ఆధారపడి వుంటుంది. బ్లడ్ గ్రూపులు వంశపారంపర్యం, తండ్రి/తల్లి బ్లడ్ గ్రూపు ఏది అయితే అదే పిల్లలకు వస్తుంది .

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/