Wednesday, February 26, 2014

Hints in running exercise, పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు,

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు,- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

  •  
    నడవటం.. పరుగెట్టటం.. చాలా తేలికైన వ్యాయామాలు. వీటికి ఎలాంటి సాధనాలతోనూ పనిలేదు. కాళ్లకు షూ, పరుగెట్టాలనే కోరిక ఉంటే చాలు. ఎవరైనా, ఎక్కడైనా చేసేయొచ్చు. అయితే పరుగెత్తటంలోనూ కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి. దీంతో త్వరగా అలసిపోకుండా, ఎక్కువసేపు పరుగెత్తే అవకాశముంది. గాయాల బారినపడకుండానూ కాపాడుకోవచ్చు. ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు సాగొచ్చు. కాబట్టి పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులేంటో చూద్దాం.
* పరుగెత్తేటప్పుడు తలను నిటారుగా ఉంచాలి. సుమారు 30-40 మీటర్ల దూరం మేరకు ముందుకు చూడాలి. పాదాలవైపు, కిందికి చూస్తూ పరుగెడితే మెడ, భుజాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే దవడ, మెడ గట్టిగా బిగపట్టకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి.

* భుజాలు కాస్త వెనకగా, కిందికి ఉండేలా చూసుకోవాలి. పైకి లాక్కుని, బిగపట్టి ఉంచితే భుజాలపై బాగా ఒత్తిడి పడుతుంది. శ్వాస సరిగా ఆడదు. దీంతో కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు.

* చేతులను మోచేతి వద్ద 90 డిగ్రీల కోణంలో వంచాలి. ముందుకూ వెననకూ కదిలిస్తూ సాగాలి. శరీరానికి అడ్డంగా కదిలించకూడదు. చేతుల కదలికలు శరీరం ముందుకు దూసుకుపోవటానికి తోడ్పడతాయని గుర్తుంచుకోవాలి.

* శరీరాన్ని పూర్తిగా నిటారుగా ఉంచకుండా కాస్త ముందుకు వంగేలా చూసుకోవాలి. దీంతో గట్టి నేలపై పరుగెడుతున్నప్పుడు ఆ ప్రభావం శరీరం మీద అంతగా పడకుండా చూసుకోవచ్చు.

* మోకాళ్లను మరీ పైకి లేపటం మంచిది కాదు. అలాగే పైకీ కిందికీ గెంతినట్టు పరుగెత్తటమూ చేయొద్దు. మోకాళ్లను కాస్త ముందుకు వంచుతూ, అడుగులు వేయాలి. దీంతో పాదాలపై భారం తగ్గుతుంది.

* అడుగు వేస్తున్నప్పుడు నేలకు ముందుగా కాలి వేళ్లను గానీ మడమను గానీ తాకించొద్దు. ముందుగా మధ్యపాదం నేలకు ఆనించటం సురక్షితమైన పద్ధతి.

* ఎట్టిపరిస్థితుల్లోనూ పాదాలను నేలకు గట్టిగా చప్పుడు వచ్చేలా తాకించొద్దు. ఇలా చేస్తే పాదాలపై, మోకాళ్లపై చాలా భారం పడుతుంది.

* నోటితో పీల్చుకుంటున్నా, ముక్కుతో పీల్చుకుంటున్నా శ్వాసను మాత్రం దీర్ఘంగా.. లయబద్ధంగా తీసుకోవాలి. ప్రతి రెండు అంగలకు ఒకసారి శ్వాస తీసుకునేలా ప్రయత్నించాలి.


  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Diabetes in children,పిల్లల్లో మధుమేహం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లల్లో మధుమేహం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

 
  
  •  
పరుగుకీ పద్ధతుంది.  చిన్నపిల్లల్లో మధుమేహం నానాటికీ పెరిగిపోతోంది. పెద్దల్లో మధుమేహం మాదిరిగానే.. పిల్లల్లో మధుమేహం కూడా మన దేశంలో ఎక్కువగానే ఉంటోంది. నిజానికి పిల్లలకు మధుమేహం వచ్చిందంటే అదో అనుమానాల పుట్ట! పిల్లల్లో మధుమేహానికీ.. పెద్దల్లో మధుమేహానికీ తేడా ఉందా? మధుమేహాన్ని నియంత్రించేందుకు 'డైట్‌ కంట్రోల్‌' చెయ్యాలా? చెయ్యకూడదా? ఈ పిల్లలకు మాత్రలు ఇవ్వాలా? ఇన్సులిన్‌ ఇవ్వాలా? ఆడుకోనివ్వచ్చా? లేదా? ఇంత చిన్నవయసులోనే అసలేమిటిదంతా? ఎదిగే వయసులో ఇటువంటి సమస్య తలెత్తితే.. వీళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ సందేహ పరంపరకు అంతులేదు. పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో మధుమేహం కాస్త భిన్నమైనదే. సమస్య ఒకటే అయినా ఆహార జాగ్రత్తల నుంచి నియంత్రించే మాత్రల వరకూ చాలా తేడాలుంటాయి. దీనిపై గత పదేళ్లలో వైద్యపరమైన అవగాహన కూడా చాలా మారుతూ వస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో మధుమేహాన్నీ... పెద్దల్లో మధుమేహాన్నీ అర్థం చేసుకునే విషయంలో ఎంతో మార్పు కనబడుతోంది.
ఒకప్పుడు మధుమేహం 15 ఏళ్లలోపు పిల్లల్లో వస్తే టైప్‌-1 అనీ, 35 ఏళ్లు దాటిన పెద్దల్లో వస్తే టైప్‌-2 రకమనీ.. అలాగే 15-35 మధ్య వయసు వారిలో వస్తే ఈ రెంటిలో ఏదైనా కావచ్చని భావించేవారు. ఎవరిలో ఏ రకమన్నది చాలా వరకూ వయసును బట్టే నిర్ధారణకు వచ్చేవాళ్లు. ఇలాంటి వర్గీకరణ ఇప్పటికీ చెలామణిలోనే ఉన్నా.. మొత్తమ్మీద గత పదేళ్లలో ఈ ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే పిల్లల్లో కూడా టైప్‌-2 మధుమేహం రావచ్చు... అలాగే పెద్దల్లోనూ టైప్‌-1 ఉండొచ్చన్న భావన బలపడింది.

స్థూలంగా చూసుకుంటే..
* టైప్‌-1లో: క్లోమగ్రంథి అస్సలు పని చెయ్యదు.. అంటే క్లోమం తయారు చెయ్యాల్సిన ఇన్సులిన్‌ వీరి శరీరంలో అసలే ఉండదన్నమాట. కాబట్టి వీరికి బయటి నుంచి ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వటం ఒక్కటే పరిష్కారం.

* ఇక టైప్‌-2లో: క్లోమగ్రంథి పని చేస్తూనే ఉంటుంది, ఒంట్లో ఇన్సులిన్‌ ఉంటుందిగానీ.. అది సమర్థంగా వినియోగంలోకి వస్తుండదు. వీరికి వెంటనే ఇన్సులిన్‌ ఆరంభించాల్సిన పనిలేదు... మాత్రలతో చికిత్స ఆరంభించి, కొంత కాలానికి అవసరమైతేనే ఇన్సులిన్‌ ఇంజక్షన్లకు మారొచ్చు.

రకాలను బట్టి చికిత్స వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు మధుమేహం వస్తే... నేరుగా దాన్ని టైప్‌-1గా భావించెయ్యకుండా అది ఏ రకమైనదన్నది నిర్ధారించుకోవటం కీలకంగా మారుతోంది. అందుకే పిల్లలకు మధుమేహం వచ్చినప్పుడు ఒకప్పటిలా టైప్‌-1 అనెయ్యకుండా.. 'డయాబిటీస్‌ ఇన్‌ చిల్డ్రెన్‌' అంటున్నారు.

ముందే గుర్తించొచ్చా?
దాదాపు 40-50% మందికి క్లోమగ్రంథి పాడై, ఇన్సులిన్‌ పూర్తిగా నిలిచిపోక ముందే.. అంటే ఇంకా క్లోమం ఎంతోకొంత పని చేస్తుండగానే ఆ విషయాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బాగా ఉపయోగపడేది 'సి-పెప్త్టెడ్‌' అనే ప్రోటీను. ఇది ఇన్సులిన్‌తో పాటే క్లోమం నుంచి విడుదల అవుతుంటుంది. కాబట్టి పిల్లలకు మధుమేహం వచ్చినప్పుడు రక్తంలో సి-పెప్త్టెడ్‌ పరీక్ష చేస్తే.. అది రక్తంలో తగినంత ఉంటే (0.3 నానోగ్రామ్‌/మిల్లీలీటర్‌ కంటే ఎక్కువగా ఉంటే) క్లోమగ్రంథి పని చేస్తున్నట్టుగా గుర్తించొచ్చు. అంతకన్నా తక్కువగా ఉంటే క్లోమం సరిగా పనిచెయ్యటం లేదని అర్థం. క్లోమం పని చెయ్యటం లేదంటే టైప్‌-1గానూ, పని చేస్తోందంటే టైప్‌-2గానూ గుర్తించొచ్చు. చిత్రమేమంటే దాదాపు 40% మంది పిల్లల్లో సి-పెప్త్టెడ్‌ స్థాయులు సాధారణంగానే ఉంటూ కూడా.. వారికి మధుమేహం వస్తోంది. అంటే వారికి క్లోమం నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి సాధారణంగా ఉంటూనే.. మధుమేహం వస్తోందన్న మాట. కాబట్టి వీరిది టైప్‌-1 రకం మధుమేహంగా భావించటానికి లేదు. క్లోమం బాగానే పని చేస్తోంది, ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగానే ఉంది, అయినా వీరికి మధుమేహం వచ్చింది కాబట్టి వీరిది టైప్‌-2 రకమే. వీరికి ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వనక్కరలేదు. పెద్దల్లో మధుమేహంలో మాదిరిగానే వీరికీ మాత్రలతోనే చికిత్స ఆరంభించొచ్చు. గత 10-12 ఏళ్లుగా ఈ అవగాహన బాగా పెరిగింది. దీని ముఖ్యోద్దేశం అనవసరంగా పిల్లలందరికీ ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇచ్చెయ్యకుండా... ఎవరికి ఇన్సులిన్‌ అవసరమో కచ్చితంగా గుర్తించటం! ఇలా గుర్తించి, నిజంగా అవసరమైన వారికి మాత్రమే ఇంజక్షన్‌ ఇవ్వటం.

కాబట్టి ఇప్పుడు మనం చిన్నపిల్లలకు మధుమేహం వస్తే నేరుగా ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వారిలో సి-పెప్త్టెడ్‌ ఏ స్థాయిలో ఉందో పరీక్షించి.. అది బాగా తక్కువగా ఉంటేనే ఇన్సులిన్‌ ఇవ్వటం, లేదంటే మాత్రల వంటివి ఇచ్చే అవకాశం ఉంది.

మున్ముందు మారొచ్చా?
చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు 9 ఏళ్ల పాపకు మధుమేహం వచ్చిందనుకుందాం. సి-పెప్త్టెడ్‌ పరీక్ష చేస్తే దాని స్థాయి ఎక్కువగానే ఉంది. కాబట్టి క్లోమం పనితీరు, ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగానే ఉందని భావించి.. దాన్ని టైప్‌-2 మధుమేహంగా నిర్ధారించుకుని... ఇన్సులిన్‌ ఇవ్వకుండా ఆ పాపకు మాత్రలతోనే చికిత్స ఆరంభించొచ్చు. కాకపోతే ఇక్కడో చిన్న సమస్య ఉంది. ఆ పాపకు క్లోమం పనితీరు ఇప్పుడు బాగానే ఉన్నా... మున్ముందు ఎప్పుడైనా క్లోమ గ్రంథి పనితీరు నిలిచిపోయి.. ఇన్సులిన్‌ ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి ఇలా మున్ముందు క్లోమం పనితీరు నిలిచిపోయే అవకాశం ఉందా? అన్నది ముందే తెలుసుకునేందుకు ఉపయోగపడేవి గ్యాడ్‌ యాంటీబోడీ, ఐలెట్‌ సెల్‌ యాంటీబోడీ, ఇన్సులిన్‌ యాంటీబోడీ పరీక్షలు. ఒకవేళ ఈ యాంటీబోడీలు ఉంటే.. పాపకు మున్ముందైనా ఇన్సులిన్‌ తప్పకపోవచ్చు కాబట్టి ఇప్పుడు మాత్రలతో మొదలుపెట్టే బదులు.. నేరుగా ఇన్సులిన్‌ ఆరంభించొచ్చు. ఈ యాంటీబోడీ పరీక్షలను ఏడాదికి ఒకసారి చేయించుకుంటే మంచిది.

అరుదుగా...
అరుదుగా కొందరు పిల్లల్లో ఇన్సులిన్‌ నిరోధకత మూలంగా వచ్చే టైప్‌1 డయాబెటీస్‌, ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి కాకుండా (పాంక్రియాటిక్‌ బీటా సెల్‌ డిస్‌ఫంక్షన్‌) వచ్చే టైప్‌2 డయాబెటీస్‌.. ఒకే సమయంలో ఈ రెండు రకాలూ కనబడతాయి. దీన్ని డబుల్‌/హైబ్రిడ్‌ డయాబెటీస్‌ అంటారు.

ఆహార నియంత్రణ వద్దు

* 15-25 మధ్య వయసు వారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువుంటే జంతు సంబంధ ఆహారం తగ్గించుకోవాలి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే పిండి పదార్థాలు తగ్గించుకోవాలి. ఇన్సులిన్‌ నిరోధకత అన్నది రక్తంలో ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంటుంది.

* 5-15 మధ్యవయసు వారికి ఎటువంటి ఆహార నియంత్రణలూ పెట్టకూడదు. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు మధుమేహం వచ్చినా ఎలాంటి ఆహార నియంత్రణలూ పెట్టరు. అలాగే ఈ చిన్నపిల్లలకు కూడా ఎలాంటి నియంత్రణలూ, ఆహారాన్ని తగ్గించే పనులూ చెయ్యకూడదు. అంతగా కచ్చితంగా ఉండాలనుకుంటే వాళ్ల ఎదుగుదలకూ, వాళ్ల బరువుకూ ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్ల సాయంతో తెలుసుకుని, వారి అజమాయిషీలోనే ఆహార నియమాలను పాటించాలి. అంతేగానీ మధుమేహం వచ్చిన అందరికీ ఒకటే ఆహార మంత్రం అన్నట్టు ఉండకూడదు. త్వరగా జీర్ణమైపోయే పిండి పదార్థాలను మాత్రం తగ్గించొచ్చు. ఇలాంటివన్నీ చాలా వరకూ మన ఇళ్లలో వండేవి కావు. బయట మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్‌ (కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు, నూడుల్స్‌, బిస్కట్లు, జామ్‌ల వంటివి) ఆహారాలే.

* ముఖ్యంగా... పిల్లలకు ఎదుగుదల ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు మరీ ఎక్కువ జాగ్రత్తతో వీరికి ఆహారం తగ్గించటం, వ్యాయామాలు పెంచటం వంటివి చేస్తే అసలే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే ఈ పిల్లలకు క్షయ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి వీరికి నియంత్రణలేవీ పెట్టకూడదు. వీరు పొడుగు పెరగాలి, జబ్బుల బారినపడకూడదు.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం..
* మధుమేహం నియంత్రణలో లేకపోతే మనం పెద్దవాళ్లలో చెప్పుకొనే గుండెపోటు, మూత్రపిండాల జబ్బులు, చూపు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు పిల్లల్లో కనబడవు గానీ.. వీరిలో క్షయ ముప్పు ఎక్కువ. 'మ్యుకర్‌ మైకోసిస్‌' వంటి అరుదైన, ప్రాణాంతక ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వీరిలో అధికం. పుష్టికరమైన ఆహారం ఇవ్వటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం, పరిశుభ్రత కచ్చితంగా పాటించటం.. ఇవి ముఖ్యం. పిల్లలు తగినంత బరువుండాలి. అతి జాగ్రత్తలతో ఆంక్షలు పెట్టకుండా.. వీరిని సాధ్యమైనంత సాధారణ జీవితం గడిపేలా చూడాలి.

* చిన్నపిల్లల్లో రక్తంలో గ్లూకోజు మోతాదు ఉదయం నిద్ర నుంచి లేవగానే 100, మిగతా సమయాల్లో 140 దాట కుండా చూడాలన్నది సూత్రం. 15-25 మధ్య వాళ్లు కొంత అటూఇటైనా నెగ్గుకొస్తారుగానీ 5-15 మధ్య ఇంత కచ్చితమైన పరిమితులు పాటించాలంటే షుగర్‌ పడిపోయే ప్రమాదం (హైపోగ్లసీమియాలు) కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ వయసువారు స్కూళ్లకు వెళుతూ, ఆటలాడుతూ చురుకైన జీవితం గడుపుతుంటారు. కాబట్టి వీరికి ఆహారపరమైన నియంత్రణలు పెట్టకుండా.. ఇన్సులిన్‌, మాత్రల ద్వారానే నియంత్రణ సాధించటం ముఖ్యం. దండిగా ఆహారం ఇవ్వాలి.

* మనిషి జీవితంలో 5-15 ఏళ్ల మధ్య కాలం చాలా కీలకం. కాబట్టి ఈ వయసు పిల్లలు మరీ అధికంగా బరువుంటే తప్ప బరువు తగ్గించేందుకు ప్రయత్నించకూడదు. దానివల్ల ఎదుగుదల తగ్గిపోయి ఇన్ఫెక్షన్ల వంటివి బయల్దేరతాయి. కాలి వేళ్ల మధ్య తేమ లేకుండా చూడటం, జననాంగాల వద్ద తేమ లేకుండా చూడటం, శుభ్రత పాటించటం రోజంతా ముఖ్యం. వారికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూడాలి.

భవిష్యత్తుకు బెంగ లేదు
* పిల్లలకు మధుమేహం వచ్చింది.. వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడాల్సిన పని లేదు. నిజానికి మధుమేహం కచ్చితంగా నియంత్రణలో పెట్టుకునేవారు సాధారణ ఆరోగ్యవంతుల కన్నా కూడా ఎక్కువ కాలం జీవిస్తుంటారు. ఈ విషయం అధ్యయనాల్లో కూడా స్పష్టంగా నిరూపణ అయ్యింది.

* చిన్నపిల్లల్లో 5-15 ఏళ్ల మధ్య మధుమేహ నియంత్రణకు ఇన్సులిన్‌ వాడితే వీరు మధుమేహం లేనివారికన్నా ఎత్తు పెరుగుతారు.

* 5 ఏళ్లలోపు పిల్లలకు ఇన్సులిన్‌ ఇవ్వాల్సి వస్తే రోజుకు ఒకటిరెండు సార్లే కాకుండా.. అవసరాన్ని బట్టి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఇవ్వటం మంచిది.

పట్టించే లక్షణాలు..
* కోమా: ఇన్సులిన్‌ లోపంతో వచ్చే టైప్‌-1 మధుమేహం హఠాత్తుగా వస్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు అకస్మాత్తుగా పెరగటం వల్ల 'హైపర్‌ ఆస్మాసిస్‌' వచ్చి, పిల్లలు స్పృహ తప్పి పడిపోతారు. ఐదేళ్లలోపు పిల్లల్లోనైతే ఇది ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. పదిహేనేళ్లలోపు పిల్లల్లో ప్రాణాంతకం కాకపోవచ్చు గానీ కోమాలోకి వెళ్లే ప్రమాదముందని గుర్తించాలి.

* ఎదుగుదల తగ్గటం: క్లోమం కొంతమేర పనిచేస్తూ.. సి-పెప్త్టెడ్‌ కొద్దిగా ఉండే పిల్లల్లో గ్లూకోజు మోతాదు నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. ఆర్నెల్లు, ఏడాది సమయంలో క్రమేపీ 100 నుంచి 500 వరకూ పెరుగుతూపోవచ్చు. మన దేశంలో అధికంగా కనిపించేది ఇలాంటి మధుమేహమే. క్రమేపీ పెరుగుతుంది కాబట్టి ఇది వచ్చిందని తెలుసుకోవటం కష్టం. వీరిలో ఎదుగుదల అంతగా ఉండదు. ఆ వయసుకు తగినంత ఎత్తు, బరువు ఉండరు.

* సోమరితనం: చురుకుదనం తగ్గటం, బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం, పనులు చేసుకోలేకపోవటం, పాఠాలు సరిగా చదవకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* అతి మూత్రం: వీరిలో ఎక్కువగా ఆకలి, దాహం వేయటం, మూత్రం పోయటం వంటివీ ఉంటాయి. కానీ ఇవన్నీ క్రమేపీ అధికమవుతాయి కాబట్టి వీటిని గుర్తుపట్టటం కష్టం. రాత్రిపూట పక్కలో మూత్రం పోసినా పిల్లల్లో అది సహజమేనని భావిస్తుంటారు.

* ఇన్ఫెక్షన్లు: మధుమేహం వచ్చిన పిల్లలకు రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీంతో వీరికి ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ముఖ్యంగా ముక్కు, చెవి, గొంతు, చర్మ జననాంగ ఇన్‌ఫెక్షన్లు అధికంగా కనిపిస్తాయి.

మొత్తానికి పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం విషయంలో ఏదైనా తేడాగా అనిపిస్తే రక్తంలో గ్లూకోజు పరీక్ష చెయ్యటం ఉత్తమం.

వయసును బట్టి చికిత్స
* 15-25 ఏళ్ల మధ్య: వీరికి మధుమేహం వచ్చినట్లయితే సి-పెప్త్టెడ్‌, ఆటోయాంటీబోడీల పరీక్షలు జరిపి, అవి ఎక్కువగానే ఉంటే.. అలాగే పెద్దల మాదిరిగా లావుగా ఉంటే.. మెట్‌ఫార్మిన్‌, పయోగ్లిటజోన్‌ వంటి 'ఇన్సులిన్‌' సెన్సిటివిటీ పెంచే మందులు ఇస్తారు.

* 15-5 ఏళ్ల మధ్య: లావుగా ఉంటే ఈ వయసు పిల్లలకూ ఇన్సులిన్‌ ఇవ్వకుండా మెట్‌ఫార్మిన్‌ వంటి నోటి మందులు, సన్నగా ఉన్నవారికి సల్ఫనైల్‌ యూరియా వంటి మందులు ఇస్తున్నారు. కానీ ఈ వయసులో ఒకవేళ గాడ్‌యాంటీబోడీలుంటే.. మున్ముందు ఇన్సులిన్‌ ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి ముందు నుంచే కొంత ఇన్సులిన్‌, కొంత మందులు కలిపి ఇస్తారు.

* 5 ఏళ్లలోపు: వీరికి మాత్రం మధుమేహం వస్తే సీ-పెప్త్టెడ్‌ ఎక్కువుందా? తక్కువుందా? వంటివేమీ పట్టించుకోకుండా.. ఇన్సులిన్‌ ఇవ్వటమే మంచిది. ఇది వీరిలో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల ముఖ్యం. దానికి ఇన్సులిన్‌ అవసరం. కాబట్టి వారికి ఇన్సులినే ఇవ్వటం, మాత్రలు ఇవ్వకపోవటం మంచిది.

పిల్లలకేమిటీ మధుమేహం?
ఇంతింత చిన్నచిన్న పిల్లలకు మధుమేహం రావటమేమిటన్నది ఆశ్చర్యకరమైన ప్రశ్న. దీని గురించి పరిశోధకులు చాలారకాల సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. వీటిల్లో ఎక్కువగా వినపడేది 'యాక్సిలరేటర్‌ హైపోథిసిస్‌'. దీనిలో ప్రధానంగా చెప్పేది- బిడ్డ శరీరతత్వం (కాన్‌స్టిట్యూషన్‌), ఒంట్లో వాపు స్వభావం (ఇన్‌ఫ్లమేషన్‌), రోగనిరోధక దాడి (ఆటోఇమ్యూనిటీ). పిల్లల్లో మధుమేహం రావటానికి ఈ మూడింటితో పాటు మరికొన్ని అంశాలూ కారణమవుతాయని చెప్పేందుకు రకరకాల సిద్ధాంతాలున్నాయి.

* కుటుంబాల్లో..
మధుమేహం జన్యుపరంగా వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఇంతవరకూ మధుమేహానికి కారణమయ్యే జన్యువులేవీ గుర్తించలేదు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య కూడా కాదు. కానీ కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ కుటుంబాల్లో పిల్లలు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఇతరత్రా ఎలాంటి ప్రత్యేక కారణాలేవీ లేకుండా కూడా మధుమేహం కనిపిస్తోంది. అలాగని ఇది పూర్తిగా ఆయా కుటుంబాల్లో వస్తుందనీ చెప్పలేం. తల్లిదండ్రులిద్దరూ మధుమేహులైనా కూడా.. వారి పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశం 60%, అదీ 60 ఏళ్ల నాటికి! ఇందులో కూడా తండ్రికి మధుమేహం ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ. తల్లికి మధుమేహం ఉంటే పిల్లలకు రాదని చెప్పలేం గానీ అంత త్వరగా రాకపోవచ్చు. వీటన్నింటినీ చూసిన తర్వాత ఇది శరీరతత్వం ప్రకారం వచ్చే జబ్బు అన్న అవగాహన ఇప్పుడు పెరుగుతోంది.

* ఆహారం..
కర్ర పెండలం, కంద, వెదురు బియ్యం, అడవి అరటిపండు తొక్కల్లో గానీ లోపల గానీ 'సైనో జైన్స్‌' అనేవి ఉంటాయి. ఇవి శరీరంలో హైడ్రోసయానిక్‌ ఆమ్లంగా మారతాయి. సాధారణంగా ఇది సల్ఫర్‌తో కూడిన అమైనో ఆమ్లాలతో నిర్వీర్యమై మూత్రంలో వెళ్లిపోతుంది. కానీ కొందరిలో ఈ అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. వీరిలో హైడ్రోసయానిక్‌ ఆమ్లం బయటకు వెళ్లిపోకుండా రక్తంలో పెరిగిపోతుంది. ఇది క్లోమాన్ని దెబ్బతీస్తుంది. ఇలా అమైనో ఆమ్లాలు తక్కువగలవారికి జన్యువులూ తోడైతే మధుమేహానికి దారితీయొచ్చు.

* క్రిమి సంహారకాలు..
పొలాల్లో చల్లే రసాయనాలూ, ఎరువులూ నేలలోకి ఇంకి.. ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పంటలపై చల్లే క్రిమి సంహారకాలు.. కూరగాయలు, పండ్లపై విషపదార్థాల వంటివీ మధుమేహానికి దోహదం చెయ్యొచ్చు.

* అలవాటులేని పదార్థాలు..
మనకు ఒక వయసు వచ్చేవరకూ జీర్ణక్రియ పూర్తిగా కుదురుకోదు. 12 ఏళ్ల వరకూ కొన్ని పదార్థాలు సరిగా జీర్ణం కావు. ఆర్నెళ్లలోపు పిల్లలకు పొడుల రూపంలో ఉండే పదార్థాలను అరిగించుకునే శక్తి ఉండదు. ఇలాంటివి తినిపిస్తే శరీరం వాటికి వ్యతిరేకంగా యాంటీబోడీలను తయారు చేస్తుంది. ఇవి ఆ పొడులనే కాదు.. శరీరంలోని కణాలనూ దెబ్బతీస్తుంది. కాబట్టి ఆర్నెళ్లలోపు పిల్లలకు త్వరగా ఘనాహారం పెట్టకూడదు. అలవాటులేని ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లుటెన్‌తో కూడిన గోధుమల వంటివి తీసుకుంటే పేగుల్లోని జిగురు పొరను (మ్యూకోజా) దెబ్బతీసే యాంటీబోడీలు పుట్టుకొస్తాయి. వీటిల్లో ముఖ్యమైంది 'టిష్యూ ట్రాన్స్‌ గ్లుటమినేజ్‌ యాంటీబోడీ'. ఈ యాంటీబోడీలు పేగులపై దాడులు చేస్తాయి. దీంతో శరీరంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. చివరికి జిగురుపొర దెబ్బతిని ఆహారంలోని కొవ్వు, చక్కెర వంటి సూక్ష్మకణాలు పేగుల్లోంచి నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి. ఫలితంగా మధుమేహం వచ్చే అవకాశముంది.

* యాంటీబోడీలు..
శరీరంలో యాంటీబోడీలు మరో సమస్య. క్లోమంలో ఉండే ఐలెట్‌ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే ఐలెట్‌ సెల్‌ యాంటీబోడీలు, ఇన్సులిన్‌ యాంటీబోడీ, గ్యాడ్‌ యాంటీబోడీలు.. ఇవన్నీ క్లోమగ్రంథిని దెబ్బతీస్తాయి. నిజానికి గ్యాడ్‌ పదార్థం మెదడులో ఉంటుంది. ఇది మెదడులోని నాడీకణాలకు అవసరమైన 'గాబా న్యూరోట్రాన్స్‌మిటర్‌'ను తయారు చేయటానికి ఉపయోగపడుతుంది. అయితే నాడీవ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయటానికి పుట్టుకొచ్చే గ్యాడ్‌యాంటీబోడీ.. పాంక్రియాస్‌ గ్రంథిని ఎందుకు దెబ్బతీస్తోందనేది ప్రస్తుతానికి వైద్యరంగానికి అంతుబట్టటం లేదు. ఏదేమైనా గ్యాడ్‌ యాంటీబోడీ ఉన్నవారికి పాంక్రియాస్‌ బీటా కణాలు త్వరలోనే దెబ్బతినే అవకాశముంటుంది. ఫలితంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి.. ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం (టైప్‌-1) రావొచ్చని కచ్చితంగా చెప్పొచ్చు.

* విటమిన్‌ డి..
ఇది మనం తిన్న ఆహారంలోని క్యాల్షియం రక్తంలో కలవటానికి, అక్కడ్నుంచి ఎముకల్లోకి చేర్చటానికి తోడ్పడుతుంది. అయితే ఇది చేసే పనుల్లో ఇదొక శాతం మాత్రమే. నిజానికిది రోగనిరోధక శక్తిని పెంపొందించే (ఇమ్యూనో మాడ్యులేటరీ) ప్రోటీను. ఇది చాలా విస్తృతమైన పనులు చేస్తుంది. పిల్లల్లో విటమిన్‌-డి మోతాదు తక్కువగా ఉంటోంది. దీంతో రోగనిరోధకశక్తి వికటించి.. శరీరంపైనే దాడి (ఆటో ఇమ్యూనిటీ) ఆరంభిస్తోంది. అందువల్ల విటమిన్‌ డి తక్కువగా గలవారికి మధుమేహం వచ్చే అవకాశమూ పెరుగుతుంది.

* పర్యావరణం..
తేమ, పగలూరాత్రీ కాంతి సమయం, ఉష్ణోగ్రత, వర్షం వంటివన్నీ 'బయోక్త్లెమేట్‌' కిందికి వస్తాయి. ఉష్ణదేశాల నుంచి చలిదేశాలకు, అలాగే చలి దేశాల నుంచి ఉష్ణదేశాలకు వచ్చినప్పుడు, నిద్రకు సంబంధించిన నియమాలు పాటించనప్పుడు మధుమేహం రావచ్చు. ముఖ్యంగా రాత్రి 1 నుంచి ఉదయం 7 గంటల మధ్య శరీరంలో కణాల మరమ్మతు జరుగుతుంటుంది. ఈ సమయంలో సరిగా నిద్రపోకపోతే హార్మోన్లన్నీ గందరగోళంలో పడిపోతాయి. దీనివల్ల కూడా మధుమేహం రావచ్చు.

  •     Courtesy with : P.V.rao (prof and HOD) Diabetology NIMS-Hyd.@eenadu sukhibhava.15-Nov-2013

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, February 24, 2014

Medical treatments for cances,క్యాన్సర్ కు వైద్య చికిత్సలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -క్యాన్సర్ కు వైద్య చికిత్సలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  



  •  
స్టేజ్-1బి, 2ఎ వరకు, శస్త్ర చికిత్స ద్వారానే క్యాన్సర్ నుంచి 95 శాతం బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ స్టేజ్- 2బి దాటితే అప్పుడు కీమో థెరపీ, రేడియో థెరపీ ద్వారా వైద్యం చేయవలసి ఉంటుంది. క్యాన్సర్ తొలిదశలో ఉన్నప్పుడు, గర్భాశయాన్ని తీసివేసేందుకు చేసే శస్త్ర చికిత్సల్లో ఓపెన్ సర్జరీ కాకుండా ఒక చిన్న రంధ్రంలోంచి కీహోల్ విధానంలో చేస్తాం. దీన్ని ర్యాడికల్ హిస్టరెక్టమీ అంటారు. దీనివల్ల చాలా కచ్ఛితమైన ప్రమాణాలతో శస్త్ర చికిత్స చేయడం సాధ్యమవుతుంది. పైగా, గాయం త్వరగా మాని, చాలా త్వరగా కోలుకునే వీలుంటుంది. దీనివల్ల ఆ తరువాత ఎక్కువ రోజులు ఆగకుండా శస్త్ర చికిత్స జరిగిన ఒకటి రెండు వారాల్లోనే రేడియో థెరపీ, కీమోథెరపీ ఇవ్వడం సాధ్యమవుతుంది.

ఒకవేళ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారానికే పరిమితం కాకుండా ఇతర భాగాలకు పాకిందేమో అన్న అనుమానం క లిగితే శరీరం మొత్తాన్ని పరిశీలించడానికి పెట్ సీటీ -స్కాన్ చేయించవలసి ఉంటుంది. ఒకవేళ స్టేజ్ 3బిలో గుర్తించినా కీమో థెరపీ, రేడియో థెరపీ ద్వారా 25 శాతం మందికి పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ క్యాన్సర్ ఆలస్యంగా బయటపడినా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను ఆలస్యంగా అంటే 3బి స్టేజ్ దాటిన తరువాతే గుర్తించినా ఆధునికమైన కొన్ని చికిత్సల ద్వారా వారి జీవిత కాలాన్ని బాగా పొడిగించే అవకాశాలు ఉంటాయి.


క్యాన్సర్ చికిత్సలు రోగి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. జీవితం మీద ఆశలు హరింపజేస్తాయి. క్యాన్సర్ వ్యాధి ఎంత వేగంగా విస్తరిస్తున్నదో ఆ వ్యాధి నివారణకు అంతే వేగంగా ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న చాలా రకాల క్యాన్సర్ సమస్యలకు ఇప్పుడు కొంత వరకు పరిష్కారమార్గం లభించింది. ముఖ్యంగా ఆధునిక చికిత్సా విధానాల ద్వారా రోగికి ఎంతో ఊరట కలుగుతున్నది. క్యాన్సర్ చికిత్సా విధానంలో వచ్చిన ఆధునిక పద్ధతుల్ని వివరిస్తున్నారు యశోద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మెడికల్, రేడియేషన్, సర్జికల్ ఆంకాలజిస్టులు.

టార్గెట్ థెరపీతో ట్యూమర్ ్సకు చెక్
మన దేశంలో ఎక్కువగా పురుషులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. పొగతాగటంతోపాటు పొగాకుతో చేసిన ఉత్పత్తులను నమలటం, మారిన ఆహారపు అలవాట్లు, వైరస్‌ల వల్ల పురుషులకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వస్తుంది. కారణాలేవైనా నోటిలో అల్సర్ రావటం, రక్తం స్రవించటం, గొంతు వద్ద గడ్డ ఏర్పడటం, గొంతు ధ్వని మారటం, నోటిలో నొప్పి అనిపించటం ఈ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో గుర్తించ వచ్చు.
ఈ వ్యాధిన ప్రాథమిక దశలో గుర్తిస్త్తే దీన్ని నిర్మూలించడం చాలా సులభం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కు ఓరల్‌కెవిట్ ఓరో ఫారినెక్స్, హైపోఫారినెక్స్‌ల విధానాల ద్వారా కీమోథెరపీ, రేడియో థెరపీ చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్స్‌ను నిర్మూలించవచ్చు.

వైరస్ ఇన్‌ఫెక్షన్, ధూమపానం వల్ల మహిళలు సెర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. పట్టణ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గ్రామీణ మహిళలకు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జననాంగం నుంచి రక్తం స్రవించటం, వైట్ డిశ్చార్జి, నీళ్లు రావటం, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌లకు గురికావటం సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను ప్యాప్సీమేర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య గల మహిళలు రెండు,మూడేళ్లకు ఓ సారి ప్యాప్సీమేర్ పరీక్షలు చేయించుకోవటం ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్‌ను కీమోథెరపీ, రేడియో థెరపీల ద్వారా నివారించవచ్చు. ర్యాపిడ్ ఆర్క్ మిషన్ సాయంతో కొత్త విధానంలో సాధారణ కణాలు దెబ్బతినకుండా క్యాన్సర్ ట్యూమర్స్‌ను మాత్రమే తొలగించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవటం ఉత్తమం. ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉంది.


అన్ని రకాల క్యాన్సర్‌ల చికిత్సలలో రేడియో థెరపీ నేడు కీలకంగా మారింది. కొన్ని శరీర భాగాల్లో కీమోథెరపీ, శస్త్రచికిత్సలు చేయలేము. అలాంటి ప్రాంతాల్లో కూడా రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించవచ్చు. స్వరపేటిక, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు గతంలో వాటిని సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించేవారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యంతో రేడియేషన్ ద్వారా స్వరపేటిక, బ్రెస్ట్‌ను పూర్తిగా తొలగించకుండానే కేవలం క్యాన్సర్ ట్యూమర్లను మాత్రమే రేడియోథెరపీ ద్వారా నిర్మూలించవచ్చు. 80శాతం క్యాన్సర్‌లకు చికిత్సలో రేడియోథెరపీ అవసరమవుతుంది. తొందరగా క్యాన్సర్‌ను గుర్తించటంతోపాటు ఆధునిక వైద్య విధానాలతో సాధారణ కణాలు దెబ్బతినకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే తొలగించేందుకు రేడియోథెరపీ విశేషంగా ఉపయోగపడుతుంది. ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (ఐఎంఆర్‌టి) రేడియోథెరపీలో హై ఎనర్జీ ఎక్స్‌రే కిరణాల సాయంతో ఎక్కువ డోసు మందును ఇచ్చి క్యాన్సర్ గడ్డలను సులభంగా తొలగిస్తారు. ఈ చికిత్స వినిమల్ ఎక్స్‌లరేటర్ సాయంతో చేస్తారు.

ఇమేజ్ గ్రెడెడ్ రేడియోథెరపీ (ఐజిఆర్‌టి) : ర్యాపిడ్ఆర్క్ యంత్రం సాయంతో చికిత్స చేసే ముందు క్యాన్సర్ ట్యూమర్‌ను చూస్తారు. క్యాన్సర్ గడ్డ ఎక్కడ ఉందో, అక్కడకు మాత్రమే రేడియోథెరపీ ద్వారా ఆయా క్యాన్సర్‌కారక కణాలను చంపేస్తారు. వాల్యూహెట్రిక్ ఆర్క్ థెరపీ : ఈ విధానంలో ర్యాపిడ్ ఆర్క్ మిషన్ సాయంతో వేగంగా క్యాన్సర్ ట్యూమర్‌ను ఒకే సారి నివారిస్తారు. ఈ రేడియోథెరపీ కేవలం రెండు,మూడు నిమిషాల్లోనే పూర్తి అవుతుంది.

సైబర్‌నైఫ్ రేడియో సర్జరీ : రోబోటిక్ చేతికి వినిమల్ ఎక్స్‌లరేటర్‌ను తొడిగిస్తారు. రోబో సాయంతో క్యాన్సర్ ట్యూమర్‌ను గుర్తించి దాన్ని తొలగిస్తారు.

టోమోథెరపీ : ఈ విధానంలో సీటీ స్కాన్ తరహాలో స్లైస్ స్లైస్‌లుగా క్యాన్సర్ ట్యూమర్‌ను తొలగిస్తారు.

శస్త్రచికిత్సతో 90 శాతం క్యాన్సర్‌లను పూర్తిగా నయం చేయవచ్చు. మూడు దశల్లో ఉన్న క్యాన్సర్ వ్యాధికి సర్జరీయే మేలు. బ్రెస్ట్, నోటి, కొలొరెక్టల్, సెర్వైకల్ క్యాన్సర్‌లను శస్త్రచికిత్సతో సులభంగా నయం చేయవచ్చు. గతంలో క్యాన్సర్ వచ్చిన శరీర భాగాన్ని పూర్తిగా తొలగించేవారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్యంతో ఆర్గాన్ ప్రిజర్వేటివ్ సర్జరీలు చేయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు దాన్ని మొత్తం తొలగించకుండా బ్రెస్ట్ కంజర్వేటివ్ సర్జరీ చేయవచ్చు. క్యాన్సర్ గడ్డను మాత్రమే యాక్సిలరీ డిసెక్షన్ ద్వారా తొలగించి, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొడలోని కండతో బ్రెస్ట్ రీ కన్‌స్ట్రక్షన్ చేయవచ్చు. దీనివల్ల రొమ్ము ఆపరేషన్ తర్వాత కూడా సాధారణంగానే ఉంటుంది. బ్రెస్ట్‌లో ఏర్పడిన చిన్న క్యాన్సర్ గడ్డలను రోల్ టెక్నిక్ ద్వారా తొలగించవచ్చు. మెమోగ్రఫీ ద్వారా జే వైర్ సాయంతో ట్యూమర్‌ను గుర్తించి తొలగిస్తారు.

అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ : ఈ విధానంలో కొలోరెక్టర్ క్యాన్సర్స్ అయిన లివర్, ఉదరభాగాల్లో ఏర్పడిన క్యాన్సర్‌లను చిన్న రంధ్రం ద్వారా హార్మోని స్కాల్‌వెల్‌ను పంపించి క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగిస్తారు.

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అండ్ రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ : ఈ విధానంలో నోటి, స్వరపేటిక, గొంతు క్యాన్సర్‌లకు చికిత్స చేయటంతోపాటు క్యాన్సర్ ట్యూమర్‌లు తొలగించిన భాగాల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కాలి ఎముక, చేతి చర్మాన్ని అతికిస్తారు. ఆర్గాన్ లేజర్ కార్బన్‌డయాక్సైడ్ శస్త్రచికిత్స : స్వరపేటిక, నోటిక్యాన్సర్‌ల నివారణకు లేజర్ ట్రీట్‌మెంట్ చేస్తారు. కార్బన్‌డయాక్సైడ్ ఆర్గాన్ లేజర్ కిరణాల సాయంతో క్యాన్సర్ టిస్యూను కాల్చి తొలగిస్తారు.

రేడియో ప్రీక్వెన్సీ అబ్‌లేటర్ చికిత్స: లివర్ క్యాన్సర్‌కు రేడియో ప్రీక్వెన్సీ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాని సాయంతో లివర్‌ను పూర్తిగా తొలగించకుండానే అందులో ఉన్న క్యాన్సర్ టిస్యూలను కాల్చివేస్తారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌కు రోబోటిక్ సర్జరీ : ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించేందుకు రోబో సాయంతో చేసే ఆపరేషన్‌ను రోబోటిక్ సర్జరీ అంటారు.

Courtesy with Dr.Ch.Mohana Vamsy,Oncologist, Omega hos.Hyd.

  • ===================
visit my website : Dr.Seshagirirao.com/

Friday, February 21, 2014

Pap smear, Pap test,ప్యాప్ స్మియర్

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Pap smear, Pap test,ప్యాప్ స్మియర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  



A Pap smear, also called a Pap test, is a procedure to test for cervical cancer in women. A Pap smear involves collecting cells from your cervix .

వైరస్ లకు దయా, దాక్షిణ్యాలు ఏవీ ఉండవు. అతి క్రూరమైనవి. విచక్షణా రహితంగా  ముట్టడి చేస్తాయి, మానవులని. నిజ జీవితం లో  సర్వైకల్ క్యాన్సర్  ను అత్యంత తోలి దశలలో గుర్తించడానికి  ఒక ప్రత్యెక మైన పరీక్ష చేస్తారు. ఆ పరీక్షను   ప్యాప్ స్మియర్ టెస్ట్ లేక సింపుల్ గా స్మియర్ టెస్ట్ అంటారు.

ప్యాప్ స్మియర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే,---  జార్జ్  పాపనికలో  అనే గ్రీకు శాస్త్రజ్ఞుడు  మానవ  కణాలను, ఆ కణాలలోని మార్పులను స్పష్టం గా  గుర్తించడానికి అవసరమైన రసాయనాలను కనిపెట్టాడు. అందువలన. ఈ ప్యాప్ స్మియర్ పధ్ధతి వలన, సర్వైకల్  ఎపితీలియల్ అంటే ఉపరితలం మీద ఉన్న కణాలలో మొట్టమొదటి గా జరిగే మార్పులు, స్పష్టం గా గుర్తించవచ్చు. ఇలా గుర్తించి నట్లయితే, చికిత్స కూడా  సులభం అవుతుంది. ఎందుకంటే, వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా  ఆ  ( మార్పు చెందిన క్యాన్సర్ ) కణాలను నిర్మూలించ వచ్చు.

తోలి మార్పులు కొన్ని కణాల లోనే కదా, దాని గురించి ఎందుకు రాద్ధాంతం, దానిని ఎందుకు పట్టించుకోవాలి ? :
ఎందుకంటే క్యాన్సర్ కణాలు అత్యంత వేగం గా మల్తిప్లై  అవుతాయి. అంటే రెండు, నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, పదహారు ముప్పై రెండు ………..ఇలా చాలా వేగంగా సంఖ్యా పెరిగి పెద్ద వ్రణం లేక రాచ పుండు లా తయారవుతుంది.
ఇంకో ముఖ్య విషయం : ఈ పెరిగిన కణాలు అక్కడే ఉండక రక్తం ద్వారా, లేక లింఫు గ్రంధుల ద్వారా శరీరం లో మిగతా భాగాలకూ పాకుతాయి. దానినే స్ప్రెడ్ అవటం అంటారు. ఈ కారణం వల్లనే ,  అత్యంత తొలిదశ లో ఉన్నప్పుడు కనుక్కొని, ఆ కణాల ను నిర్మూలించడం మంచి పధ్ధతి.
ప్యాప్ స్మియర్ ద్వారా చూసే కణాలను కొన్ని రకాలు గా విభ జించుతారు. CIN 1:  ఈ దశలో  సర్వైకల్ కణాలలో మార్పులు మొదటి దశలో ఉంటాయి. CIN2: ఈ దశలో కణాలలో మార్పులు మోడరేట్ గా ఉంటాయి అంటే మధ్యస్తం గా, CIN 3: ఈ దశలో కణాలు ఎక్కువ మార్పులతో క్యాన్సర్ కణాలుగా ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.

ముందు చెప్పు కున్నట్టు, టీకా కేవలం నాలుగు రకాల వైరస్  లకు వ్యతిరేకం గానే రక్షణ ఇచ్చి , రోగ నిరోధక శక్తి ని ఎక్కువ చేస్తుంది. క్యాన్సర్ కలిగించే ముఖ్యమైన రకాలు ఈ నాలుగే అయినప్పటికీ , మిగతా రకాలు కూడా క్యాన్సర్ కలిగించ గలవు కాబట్టి , స్మియర్ టెస్ట్  క్రమంగా అంటే  ప్రతి మూడేళ్ళకో, అయిదేళ్లకో చేయించు కోవడం ఉత్తమం.

  • Courtesy with : http://baagu.net/our health.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

HPV టీకా , HPV vaccine(వాక్సిన్)

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -HPV టీకా , HPV vaccine(వాక్సిన్) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  



HPV infection (human papillomavirus) is very common. Near 20 million people in the U.S. are affected. Near 30 two 100 HPV types are transmitted sexually. This transmission of HPV can cause genital warts or abnormal cell changes in the cervix and other genital areas that can lead to cancer.

టీకా (vaccine) అనగా వ్యాధి నిరోధకత (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ (Edward Jenner) మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని(లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్దికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.

HPV వైరస్  ఒకరినుంచి ఇంకొకరికి  అరక్షిత అంటే అన్-సేఫ్  రతిక్రియ వల్లనే  పాకుతుంది. అంటే స్ప్రెడ్  అవుతుంది.   అందువల్ల రతిక్రియ  లో పాల్గొనాలని అనుకునే యువతీ యువకులు, కామ లేక రతి ద్వారా కలిగే లేక పాకే ఇన్ఫెక్షన్ లు అన్నిటికీ ముందే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.  ఇది చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ ,  ఇరువురికీ ఎంతో శ్రేయస్కరం.

వైరస్ ప్రత్యేకత
సాధారణంగా బాల్యంలో చికెన్‌పాక్స్ గానీ, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ వ్యాధులు సోకినప్పుడు శరీరంలో వాటిని ఎదిరించే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఆ సమస్య మరోసారి రాదు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను కలిగించే ప్యాపిలోమెటస్ వైరస్ మాత్రం ఎంతో తెలివైౖనది. ఇది గర్భాశయ ముఖద్వారంలోని కణాల్లోకి వెళుతుంది. కణాల్లోని న్యూక్లియస్‌లోకి ప్రవేశిస్తుంది. న్యూక్లియస్‌తో పాటు విభజనకు గురవుతుంది. కానీ, కణాలను చంపదు. సహజంగా కణాలను చంపినప్పుడే వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం మొదలెడుతుంది. ఈ వైరస్ కణాల్లోనే ఉంటున్నా, వాటిని చంపదు కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థకు ఇది దొరకదు. అందుకే వ్యాధి నిరోధక శక్తి పెరగదు. అందుకే టీకాల ద్వారానే ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచవలసి ఉంటుంధి.

HPV టీకా  లేక HPV వాక్సిన్ :  ఇప్పటి వరకూ రెండు మందుల కంపెనీలు  ఈ HPV టీకా ను తయారు చేస్తున్నాయి.  HPV వైరస్ లు  వంద కు పైగా ఉన్నాయి. అందు లో ముఖ్యమైన 6,11,16,18 రకాలు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ లకు కారణం. అందు వల్ల ఈ టీకాలు వేయించుకుంటే చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ HPV టీకా,  సర్వైకల్ క్యాన్సర్ రాకుండా  సంపూర్ణ రక్షణ ఇవ్వదు. ప్రతి యువతీ, ఈ టీకాను వారు రతి క్రియ లో  ప్ర ప్రధమం గా పాల్గొన బోయే సమయానికి ముందే  వేయించుకోవాలి. ఒకసారి రతి క్రియా జీవితం మొదలు పెడితే, ఇన్ఫెక్షన్ కనుక సంభవిస్తే  ఈ టీకా పూర్తి రక్షణ ఇవ్వదు. 12 నుంచి 13 ఏళ్ళ వయసు మధ్య ఉన్న అమ్మాయిలకు , మూడు టీకాలు, ఆరు నెలల వ్యవధి లో ఇస్తారు.

HPV టీకా తీసుకుంటే  స్మియర్ టెస్ట్  అవసరం లేదా ? :

వైరస్ లకు దయా, దాక్షిణ్యాలు ఏవీ ఉండవు. అతి క్రూరమైనవి. విచక్షణా రహితంగా  ముట్టడి చేస్తాయి, మానవులని. నిజ జీవితం లో  సర్వైకల్ క్యాన్సర్  ను అత్యంత తోలి దశలలో గుర్తించడానికి  ఒక ప్రత్యెక మైన పరీక్ష చేస్తారు. ఆ పరీక్షను   ప్యాప్ స్మియర్ టెస్ట్ లేక సింపుల్ గా స్మియర్ టెస్ట్ అంటారు.
ప్యాప్ స్మియర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే,  జార్జ్  పాపనికలో  అనే గ్రీకు శాస్త్రజ్ఞుడు  మానవ  కణాలను, ఆ కణాలలోని మార్పులను స్పష్టం గా  గుర్తించడానికి అవసరమైన రసాయనాలను కనిపెట్టాడు. అందువలన. ఈ ప్యాప్ స్మియర్ పధ్ధతి వలన, సర్వైకల్  ఎపితీలియల్ అంటే ఉపరితలం మీద ఉన్న కణాలలో మొట్టమొదటి గా జరిగే మార్పులు, స్పష్టం గా గుర్తించవచ్చు. ఇలా గుర్తించి నట్లయితే, చికిత్స కూడా  సులభం అవుతుంది. ఎందుకంటే, వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా  ఆ  ( మార్పు చెందిన క్యాన్సర్ ) కణాలను నిర్మూలించ వచ్చు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు అత్యంత వేగం గా మల్తిప్లై  అవుతాయి. అంటే రెండు, నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, పదహారు ముప్పై రెండు ………..ఇలా చాలా వేగంగా సంఖ్యా పెరిగి పెద్ద వ్రణం లేక రాచ పుండు లా తయారవుతుంది.
ఇంకో ముఖ్య విషయం : ఈ పెరిగిన కణాలు అక్కడే ఉండక రక్తం ద్వారా, లేక లింఫు గ్రంధుల ద్వారా శరీరం లో మిగతా భాగాలకూ పాకుతాయి. దానినే స్ప్రెడ్ అవటం అంటారు. ఈ కారణం వల్లనే ,  అత్యంత తొలిదశ లో ఉన్నప్పుడు కనుక్కొని, ఆ కణాల ను నిర్మూలించడం మంచి పధ్ధతి.

ప్యాప్ స్మియర్ ద్వారా చూసే కణాలను కొన్ని రకాలు గా విభ జించుతారు. CIN 1:  ఈ దశలో  సర్వైకల్ కణాలలో మార్పులు మొదటి దశలో ఉంటాయి. CIN2: ఈ దశలో కణాలలో మార్పులు మోడరేట్ గా ఉంటాయి అంటే మధ్యస్తం గా, CIN 3: ఈ దశలో కణాలు ఎక్కువ మార్పులతో క్యాన్సర్ కణాలుగా ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.

ముందు చెప్పు కున్నట్టు, టీకా కేవలం నాలుగు రకాల వైరస్  లకు వ్యతిరేకం గానే రక్షణ ఇచ్చి , రోగ నిరోధక శక్తి ని ఎక్కువ చేస్తుంది. క్యాన్సర్ కలిగించే ముఖ్యమైన రకాలు ఈ నాలుగే అయినప్పటికీ , మిగతా రకాలు కూడా క్యాన్సర్ కలిగించ గలవు కాబట్టి , స్మియర్ టెస్ట్  క్రమంగా అంటే  ప్రతి మూడేళ్ళకో, అయిదేళ్లకో చేయించు కోవడం ఉత్తమం.

  • హెచ్పీవీ వ్యాక్సిన్లు
‌గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మూడు విడతలుగా ఇవ్వాలి..గార్డాసిల్, సర్వారిక్స్ అన్న పేర్లతో లభిస్తున్న ఈ టీకాలను ఆరు మాసాల కాలంలో మూడు సార్లు, మూడు డోసులుగా ఇవ్వవలసి ఉంటుంది.

12-16 ఏళ్లలోపు అమ్మాయిలకు (సెక్సులో పాల్గొనడం మొదలుపెట్టని) ఇవ్వడం మంచిది. ఈ వ్యాక్సిన్లలో ఒకటి (బైవాలెండ్‌) 10-45 ఏళ్లలోపువారికి, రెండోది (క్వాడ్రివాలెండ్‌) 9-26 సంవత్సరాలలోపు యువతలకూ ఇవ్వొచ్చు. వ్యాక్సిన్‌ తీసుకునేముందు హెచ్‌పీవీ పరీక్ష అవసరంలేదు. లైంగిక జీవితం ఆరంభించిన స్త్రీలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తే ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఇప్పటికే ఉన్నా మిగిలినవి రాకుండా చూడవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడేందుకు ఇచ్చేవి మాత్రమే. అప్పటికే ఉన్న వాటిని నయం చేయడానికి పనికి రావు. వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదాని.. పాప్‌ స్మియర్‌ పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే ఉండాలి.

 Courtesy with : Wikipedia.org

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, January 31, 2014

Mis-carriage,గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌)

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Mis-carriage,గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 నారు పోసిన వాడు నీరు పొయ్యడా.... అన్నది మనందరి నమ్మకం! గర్భం విషయంలో కూడా చాలామంది ఇలాగే అనుకుంటూ.. ఒకసారి గర్భం వస్తే చాలు.. ఇక తర్వాత అంతా సజావుగానే

జరిగిపోతుందని భావిస్తుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదుగానీ.. గర్భం విషయంలో మాత్రం అన్నిసార్లూ ఇలాగే జరగాలనేం లేదు. పైగా గర్భం పోవటం.. కడుపు నిలబడకపోవటమన్నది

మనందరం అనుకునేంత అరుదైన సమస్యేం కాదు. దాదాపు ప్రతి ఆరు గర్భాల్లో ఒకటైనా ఇలా అర్ధాంతరంగానే ముగిసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే చాలకాలంగా వైద్యరంగం గర్భం

పోవటం.. (మిస్‌ క్యారేజ్‌) పైన లోతుగా దృష్టిపెడుతోంది.

కారణమేదైనా, గర్భం దాల్చిన తొలి వారాల్లోనే జరిగినా లేక ఆ తర్వాత జరిగినా.. అర్ధాంతరంగా గర్భం పోవటమన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను మిగిల్చే అంశమే. గర్భం పోవటమన్నది

చాలా రకాలుగా జరగొచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి మొత్తం వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు ముక్కలన్నీ బయటకువెళ్లిపోయి గర్భసంచీ శుభ్రం కావటానికి వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి రావచ్చు.

ఇందుకోసం వైద్యులు మందులు ఇస్తారు. అవసరమైతే కొన్నిసార్లు మత్తు ఇచ్చి, చిన్నాపరేషన్‌ చేసి శుభ్రం చెయ్యాల్సి రావచ్చు. అయితే ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో

అనుమానాలు ముసురుకుంటాయి.మళ్లీ గర్భం వస్తుందా? రాదా? అసలు ఎందుకిలా జరిగింది? ఒకవేళ వచ్చినా నిలబడుతుందా? లేక మళ్లీ ఇలాగే అవుతుందా? మళ్లీ గర్భం కోసం ఎప్పుడు

ప్రయత్నించొచ్చు? ఇలాంటి సందేహాలు అనంతం.


గర్భం ఎందుకు పోతుంది?
తొలివారాల్లో గర్భం పోవటానికి చాలావరకూ క్రోమోజోముల లోపమే కారణం కావచ్చు. దీన్నో రకంగా జన్యుపరమైన పొరపాటు అనుకోవచ్చు. ఇది చాలా వరకూ ఆ గర్భానికి సంబంధించినదే కాబట్టి

మళ్లీ ఇలా జరగకపోవచ్చు కూడా. అయితే గర్భిణి వయసు పెరుగుతున్న కొద్దీ.. 35 ఏళ్లు పైబడితే ఇటువంటి జన్యుపరమైన పొరపాట్లకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి 35 ఏళ్లు పైబడిన గర్భిణులకు

గర్భంపోయే ముప్పు కాస్త ఎక్కువ ఉంటుదని గుర్తించాలి.

అలాగే- గర్భిణులు పొగతాగినా, మద్యం తాగినా, అలాగే అధిక బరువు ఉన్నా, గర్భాశయంలో నిర్మాణపరంగా ఏవైనా లోపాలున్నా, లేక గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) బలహీనంగా ఉన్నా,

దీర్ఘకాలిక వ్యాధులేవైనా ఉన్నా, మధుమేహం ఉండి - అది అదుపు తప్పినా.. ఇటువంటి సందర్భాల్లో కూడా గర్భం నిలబడకుండా మధ్యలోనే పోయే ముప్పు కాస్త ఎక్కువగా ఉంటుంది.

* ఇవేవీ కాదు: గర్భంపోతే.. తామేదో తప్పు చేశామనీ, అందుకే ఇలా జరిగిందని చాలామంది తమను తాము నిందించుకుంటుంటారు. ముఖ్యంగా బరువులు ఎత్తటం వల్లనో, పని ఎక్కువగా చెయ్యటం

వల్లనో, మలబద్ధకంగా ఉంటే బలంగా ముక్కటం వల్లనో, మానసిక ఒత్తిడికి లోనవ్వటం వల్లనో, శృంగారంలో పాల్గొనటం వల్లనో, లేకపోతే ఏవో తినకూడనివి తినటం వల్లనో ఇలా జరిగిందని తమలో

తామే మథనపడుతుంటారు. కానీ ఇవేవీ గర్భస్రావానికి కారణం కావు. ఇటువంటి అపోహలను మనసులో పెట్టుకుని ఎక్కువగా మథనపడాల్సిన పని లేదు. వైద్యులు కూడా వరసగా రెండుమూడు

దఫాలుగా గర్భం పోతుంటేనే కారణం ఏమిటన్నది తెలుసుకునేందుకు ప్రత్యేక పరీక్షల వంటివి చేయిస్తారు.

ఏది కాదు.. ఏది అవును?
గర్భం దాల్చిన తొలి 12 వారాల్లో కొద్దికొద్దిగా, ఎప్పుడన్నా ఎరుపు కనబడటం సహజం. దానర్థం గర్భం పోతోందనేం కాదు. సాధారణంగా ఈ సమయంలో వీరికి నొప్పి ఉండదు. దీన్నే 'థ్రెటెన్డ్‌

మిస్‌క్యారేజ్‌' అంటారు. వీరిలో చాలామందికి మెల్లగా స్రావం ఆగిపోతుంది, లోపల బిడ్డ కూడా ఆరోగ్యంగానే పెరుగుతుంది. చాలా కొద్దిమందిలో మాత్రమే ఇది గర్భం పోయే వరకూ వెళుతుంది.
గర్భం పోతుంటే.. లక్షణాలేమిటి?
* పొత్తికడుపులో తెరలుతెరలుగా నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం.. గర్భం పోయేటప్పుడు కనబడే సాధారణ లక్షణాలివి. క్రమేపీ యోని నుంచి ఎర్రటి రక్తపు గడ్డల్లా, కణజాలం, ముక్కల వంటివి

బయటకు రావచ్చు. దీనర్థం గర్భం పోయిందనే. నొప్పి దీని ప్రత్యేక లక్షణం.

* కొంతమంది గర్భిణులకు చిత్రంగా... నొప్పి, స్రావం వంటి లక్షణాలేవీ ఉండవు. లోపల బిడ్డ పెరుగుదల ఆగిపోతుంది, లేదా అది చనిపోతుంది. అయినా లోపలే ఉండిపోతుంది. ఉన్నట్టుండి వేవిళ్లు

ఆగిపోవటం, రొమ్ముల్లో సలపరింత తగ్గిపోవటం.. వంటి లక్షణాలు మాత్రమే ఉండొచ్చు. వీరి విషయంలో చాలాసార్లు వైద్యులు పరీక్షించే వరకూ కూడా గర్భం పోయిన విషయం బయటపడదు. (దీన్నే

వైద్యులు 'మిస్డ్‌ మిస్‌క్యారేజ్‌' అంటుంటారు.)

*కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి కడుపునొప్పి మాత్రం చాలా తీవ్రంగా, ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఇది తప్పకుండా వైద్యుల దృష్టికి

తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. వీరికి పిండం గర్భసంచీలో కాకుండా ఫలోపియన్‌ ట్యూబుల్లో పెరుగుతూ (ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ), అది చిట్లిపోయిందేమో చూడటం చాలా అవసరం. వీరికి అత్యవసరంగా

ఆపరేషన్‌ చెయ్యాల్సిన అసవరం కూడా రావచ్చు.
ఆసుపత్రికి వెళ్లాలా?
గర్భం దాల్చిన తర్వాత ఏ రూపంలో రుతుస్రావం కనబడినా తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. ఎందుకంటే రుతుస్రావం కనబడటానికి గర్భం పోవటం ఒక్కటే కారణం కానవసరం

లేదు. అందుకే వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటివి చేసి కారణం ఏమిటన్నది నిర్ధారిస్తారు. స్కానింగులో పిండం గుండె కొట్టుకుంటోందంటే చాలావరకూ గర్భస్రావం కాదనే అర్థం. గుండె కొట్టుకోవటం

ఆగిపోతే గర్భం పోయిందని అర్థం. ఒకవేళ స్కానింగులో ఇంత స్పష్టంగా తెలియకపోతే ఒకటిరెండు వారాల తర్వాత మళ్లీ స్కానింగుకు రమ్మని చెబుతారు. గర్భం పోయిందని నిర్ధారణ అయ్యి.. ఇతరత్రా

సమస్యలేవీ లేకపోతే... చాలామందికి ముక్కలవీ కొద్దిరోజుల్లో సహజంగానే రుతుస్రావంతో కలిసి బయటకు వెళ్లిపోయి మెల్లగా రుతుస్రావం ఆగిపోతుంది. దీనికి 14 రోజుల వరకూ పట్టొచ్చు. ఇతరత్రా

సమస్యలేవైనా ఉంటే మాత్రం వైద్యులు ఇలా సహజంగా అదే వెళ్లిపోతుందని వదిలెయ్యకుండా చికిత్సా మార్గాలను సూచిస్తారు. ముఖ్యంగా ముక్కలన్నీ శుభ్రంగా బయటకువెళ్లిపోవటానికి మందులను

సూచిస్తారు. ఇందుకు నోటి ద్వారా తీసుకునే మాత్రలుంటాయి, కొన్నింటిని యోనిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో గర్భసంచీలోనిదంతా బయటకు వెళ్లిపోతుంది. దీనికోసం ఆసుపత్రిలో చేరాల్సిన

పని కూడా ఉండదు. దీనివల్ల ఓ మూడు వారాల వరకూ రుతుస్రావం అవ్వచ్చుగానీ, ఇదేమంత ఎక్కువగా ఉండదు. మూడు వారాల తర్వాత గర్భనిర్ధారణ పరీక్ష చేసి చూసుకోవటం అవసరం.

కొద్దిరోజుల్లో రక్తస్రావం ఆగకపోయినా, మరీ ఎక్కువ అవుతున్నా వైద్యులు చిన్నాపరేషన్‌ సూచించొచ్చు. మందులు కుదరకపోయినా, లేక మందులతో సరిగా అవ్వకపోయినా అప్పుడు వైద్యులు కొద్దిగా

మత్తు ఇచ్చి.. గర్భాశయ ముఖద్వారాన్ని వెడల్పుచేసి, లోపల మిగిలిపోయిన ముక్కల వంటివాటన్నింటినీ బయటకు తీసేస్తారు. దీంతో సమస్య సర్దుకుంటుంది. దీని తర్వాత జ్వరం వచ్చినా, లేక

దుర్వాసనతో స్రావాలు వస్తున్నా, పొత్తికడుపులో నొప్పి వస్తున్నా ఇన్ఫెక్షన్‌ వచ్చిందేమోనని అనుమానించి వైద్యులకు చూపించుకోవటం చాలా అవసరం. దీన్ని కూడా యాంటీబయాటిక్స్‌తో

సమర్థంగానే నయం చెయ్యొచ్చు.
మానసికంగానూ కోలుకోవాలి!
గర్భం పోయినట్లు తెలియగానే కాస్త బాధగా, వెలితిగా అనిపించటం సహజం. గర్భం కావాలనుకున్నది కాకపోయినా.. అది పోయిందని తెలిసినప్పుడు ఎంతోకొంత వేదనగా అనిపించొచ్చు. ఈ

సమయంలో మనసులో భావాలను ఇతరులతో పంచుకోవటం చాలా ఊరటనివ్వచ్చు. గర్భం వచ్చిన విషయం, అది పోయిన విషయం కుటుంబంలోని వారికి, స్నేహితులకు తెలియకూడదని

అనుకుంటుంటే వైద్యులతోగానీ, కౌన్సెలర్‌తోగానీ మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మనసులో రకరకాల భావోద్వేగాలు రేగుతూ.. పరిస్థితులు గందరగోళంగా అనిపించే అవకాశాలే ఎక్కువ.

ముఖ్యంగా భాగస్వామి నుంచి ఆశించినంత సహకారం దక్కుతోందా? ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎలా ఉన్నాయి? త్వరగా కోలుకుని రోజువారీ పనుల్లోకి వెళ్లిపోవాల్సిన అవసరం ఉందా? భవిష్యత్తులో మళ్లీ

గర్భం వస్తుందా? లేదా అన్న భయాలు.. ఇలాంటివన్నీ కలిసి.. మానసికంగా కల్లోలం రేగినట్లుండొచ్చు. వైద్యులు, లేదా కౌన్సెలర్ల సలహా తీసుకుంటే ఆత్మవిశ్వాసం, సాంత్వన లభిస్తాయి.
గర్భం పోయిన తర్వాత...
* గర్భం పోయిన తర్వాత.. చాలామందికి కొద్దిరోజుల్లో రుతుస్రావం ఆగిపోతుంది. కొందరికి మాత్రం రెండు వారాల వరకూ పట్టొచ్చు. మొత్తానికి చాలామందిలో ఎర్ర గడ్డల వంటివి పడొచ్చుగానీ

రుతుస్రావం మరీ ఎక్కువగా పోదు. బహిష్టు సమయంలో మాదిరిగానే కొద్దిగా నొప్పి ఉండొచ్చు. ఈ నొప్పికి కావాలంటే సాధారణ నొప్పి నివారణ మందులు తీసుకోవచ్చు.

* గర్భం పోయిన 4-6 వారాల తర్వాత మళ్లీ బహిష్టు మొదలవ్వచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, దుర్వాసన ఉన్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యులకు చూపించుకోవాలి. లోపల ఏదైనా ముక్క

మిగిలిపోయి, ఇన్ఫెక్షన్‌ ఆరంభమైతే ఇటువంటి లక్షణాలు కనబడతాయని గుర్తించాలి.

* రుతుస్రావం ఆగిపోయి, సౌకర్యవంతంగా అనిపించేంత వరకూ శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. సౌకర్యవంతంగా అనిపించేంత వరకూ కొద్దిపాటి విశ్రాంతి కూడా మంచిదే.

* గర్భం కావాలనుకుంటున్నవారు.. గర్భం పోయిన వెంటనే మళ్లీ ప్రయత్నించకుండా.. కనీసం ఒక రుతుచక్రం (బహిష్టు) అన్నా సాధారణంగా వచ్చి వెళ్లే వరకూ ఆగటం మంచిది. ఈ సమయంలో

గర్భనిరోధకాలు వాడుకోవచ్చు.

* గర్భం పోతే వెంటనే రక్తం గ్రూపు ఏమిటో చూపించుకోవాలి. ఒకవేళ గర్భిణిది నెగిటివ్‌ గ్రూపు అయితే.. గర్భం పోగానే 'యాంటీ డీ' ఇంజక్షన్‌ తీసుకోవటం అవసరం.
మరోసారి...?
గర్భం పోయిన తర్వాత చాలామందికి పట్టుకునే పెద్ద భయం.. మళ్లీ గర్భం వస్తుందా? రాదా? వచ్చినా నిలబడుతుందా? లేక మళ్లీ ఇలాగే అవుతుందా? అన్నది. నిజానికి గర్భం పోవటమన్నది

చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. దీనికి కూడా చాలాసార్లు కడుపులో ఉన్న పిండం సజావుగా లేకపోవటమే కారణమవుతుంటుంది. వరసగా రెండుసార్లు గర్భం పోవటమన్నది 5%

కంటే తక్కువమందిలోనే జరుగుతుంది, ఇక వరసగా మూడుసార్లు పోవటమన్నది 1% కంటే కూడా తక్కువ. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులుపడాల్సిన పని లేదు. గర్భం పోయిన

తర్వాత సహజంగా ఒక రుతుచక్రం అయ్యే వరకూ ఆగి, ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించొచ్చు. గర్భం వచ్చి, రెండు కంటే ఎక్కువసార్లు పోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం-పొగ వంటివాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలియాసిడ్‌ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా

చూసుకోవటం.. ఇవన్నీ తర్వాతి గర్భాలు ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేసే అంశాలు.
తరచూ పోతుంటే..?
మొదటి 23 వారాల్లోపే గర్భం పోతుండటం, ఇలా వరసగా మూడుసార్ల కంటే ఎక్కువగా జరిగితే దాన్ని వైద్యులు 'రికరెంట్‌ మిస్‌క్యారేజ్‌' అంటారు. ఇది మానసికంగా ఎంతో వేదన మిగిల్చే పరిస్థితి.

దాదాపు వందమందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంటుంది. వీరిలో ప్రత్యేకమైన సమస్యలేమైనా ఉన్నాయా? అని వైద్యులు లోతుగా పరీక్షిస్తారు. ఇందుకోసం కొన్ని రక్తపరీక్షలు, క్రోమోజోముల పరీక్షలు,

అల్ట్రాసౌండ్‌ వంటివి చేయిస్తారు. మరీ అవసరమైతే హిస్టెరోస్కోపీ, సోనోహిస్టెరోగ్రామ్‌ వంటివి చేయిస్తారు. వయసు ఎక్కువగా ఉండటంతో పాటు గతంలో గర్భాలు ఎన్ని ఎక్కువసార్లు పోతే.. మళ్లీ పోయే

రిస్కు అంత ఎక్కువగా ఉంటుంది. వైద్యులు జన్యుపరమైన లోపాల వంటివన్నీ చూస్తారు. అలాగే గర్భాశయ నిర్మాణం ఎలా ఉందన్నదీ పరిశీలిస్తారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌)

గర్భం పూర్తయ్యే వరకూ బిగువుగా ఉండాలి. కానీ కొద్దిమందిలో ఇది మధ్యలోనే బిగువు సడలిపోయి, 3-6 నెలల మధ్యే గర్భం పోయేలా చేస్తుంది. వీరిని అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో ముందుగానే

గుర్తించొచ్చు. ఇలాంటి వారికి వైద్యులు ముందస్తు జాగ్రత్తగా సర్విక్స్‌కు ఒక కుట్టు వేస్తారు. అండాశయాల్లో నీటితిత్తులు (పాలి సిస్టిక్‌ ఓవరీ) సమస్య ఉన్న వారికి హార్మోన్లు అస్తవ్యస్తమై గర్భం

పోవచ్చన్న భావన ఉందిగానీ పాలిసిస్టిక్‌ సమస్య వల్లే ఇలా జరుగుతుందని చెప్పేందుకు ప్రత్యేక ఆధారాలేవీ లేవు. అవసరాన్ని బట్టి వైద్యులు వీరికి హార్మోన్‌ చికిత్సలు అందిస్తారు. తరచూ గర్భాలు

పోతున్న వారిలో 15% మందికి 'యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబోడీ'లనేవి ఉంటాయి. వీటివల్ల గర్భం నిలబడే అవకాశాలు తక్కువ. వీరికి వైద్యులు పరిస్థితిని బట్టి రకరకాల చికిత్సా విధానాలు

సూచిస్తారు. తరచూ గర్భస్రావాలు ఎందుకు అవుతున్నాయన్నది అందరి విషయంలోనూ ఇదమిత్థంగా గుర్తించటం కష్టం కావచ్చు. ఒకవేళ గుర్తించలేకపోయినా దిగులుపడాల్సినదేమీ లేదు,

ఎందుకంటే ఏకారణమూ తెలియకుండా తరచూ గర్భస్రావాలు అవుతున్న 60-70 శాతం మంది కూడా.. ఆ తర్వాత చక్కగా గర్భం దాల్చి, పండంటి బిడ్డలను కంటున్నట్టు స్పష్టంగా గుర్తించారు.

కాబట్టి బెంబేలు పడిపోవాల్సిందేమీ లేదు, ఆశావహంగా ఉండటం ముఖ్యం!

Courtesy with : Dr.Pranathi Reddy (Rainbow hos.Hyd)@eenadu sukhibhava(28-Jan-14).
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, January 15, 2014

Care for prevention of heart & blood vessels diseases,గుండె పోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా జాగ్రత్తలు

  •  
 

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండె పోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...





మనకు గుండె జబ్బులు రాకుండా చూసుకోవటమెలాగో తెలుసు. గుండెను ఆరోగ్యకరంగా కాపాడుకోవటమెలాగో బాగానే తెలుసు. ఈ విజ్ఞానానికి కొదవ లేదు. అయినా ఈ దారిలో ప్రయాణించటంలో, ఈ గమ్యాన్ని చేరుకోవటంలో మనం ఘోరంగా విఫలమవుతున్నాం. ఇందుకు ఏటా 1.73 కోట్ల మంది గుండె, రక్తనాళాల వ్యాధులతో దుర్మరణం పాలవుతుండటమే ప్రత్యక్ష తార్కాణం! నేడు ప్రపంచ వ్యాప్తంగా మనుషులను అత్యధికంగా కబళిస్తున్న అతిపెద్ద ముప్పు... 'నంబర్‌ ఒన్‌ కిల్లర్‌'.. గుండె పోటు, రక్తనాళాల వ్యాధులే కావటం ఇందుకు ప్రబల నిదర్శనం! వీరిలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు.. యువకులు.. అన్ని వయసుల వారూ ఉంటున్నారు. పైగా పేద దేశాల వారే ఎక్కువ ఉంటున్నారు. ఇల్లు గడిపేవారూ, సంసారాన్ని నడిపే వారూ.. అందరూ ఉంటున్నారు. దీనివల్ల కుటుంబాలు కకావికలమైపోతున్నాయి. సమాజం అతలాకుతలమవుతోంది. నిజానికి ఇవన్నీ చాలావరకూ నివారించదగ్గ మరణాలే! మనం చక్కటి దారిలో నడిస్తే చాలు.. ఆరోగ్యకరమైన బాటలో పయనిస్తే చాలు... ఈ జబ్బులు మన జోలికి రావు. గుండెపోటు, పక్షవాతం వంటి రక్తనాళాల వ్యాధులకు కారణమవుతున్న ముప్పుల్లో చాలాభాగం నివారించుకోదగ్గవీ, నియంత్రించుకోదగ్గవే! కాబట్టి దారి తెలిసిన తర్వాత గమ్యం తప్పటం అర్థరహితం. అందుకే ఈ ఏటి 'ప్రపంచ హృదయ దినం' సందర్భంగా... మనందరం 'ఆరోగ్యకరమైన బాట పడదాం...World heart day, prevention of heart disease,ప్రపంచ హృదయ దినం,గుండె జబ్బుల నివారణ.


క్రమం తప్పకుండా బీపీ చూపించుకోండి
పక్షవాతం, గుండె జబ్బులకు అతిపెద్ద ముప్పు కారకం.. హైబీపీ! మనకు బీపీ ఎక్కువున్నా ఎటువంటి హెచ్చరికలూ, లక్షణాలూ, సంకేతాలూ ఉండవు. లోపల్లోపల అది చెయ్యాల్సిన నష్టం చేస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని 'సైలెంట్‌ కిల్లర్‌' అంటారు. తరచూ మీరే బీపీ చూపించుకోండి.

వెంటనే పొగకు--వీడ్కోలు పలకండి!
పొగ మానేసిన 2 ఏళ్లకు గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. కానీ దాని ప్రభావం పూర్తిగా తగ్గి... ఆ ముప్పు అస్సలు పొగ అలవాటు లేనివారి స్థాయికి చేరటానికి 15 ఏళ్లు పడుతుంది. కాబట్టి తక్షణం పొగ మానెయ్యండి. ఇందుకు అవసరమైతే వైద్యులు, నిపుణుల సహాయం తీసుకోండి.

రక్తంలో 'షుగరు'--పరీక్ష తప్పనిసరి
రక్తంలో గ్లూకోజు ఎక్కువుండటం మధుమేహానికి సంకేతం. మధుమేహుల్లో 60% మరణాలకు గుండెపోటు, పక్షవాతాలే కారణం. కాబట్టి ఇప్పటికే మనకు తెలియకుండా మధుమేహం ఉన్నా, లేక తెలిసీ అది నియంత్రణలో లేకున్నా.. అనవసరంగా మనం గుండెపోటు, పక్షవాతం ముప్పు పెంచుకుంటున్నట్టే. దానిపై కన్నేయండి!

చురుకైన శారీరక--శ్రమ చెయ్యండి!
రోజుకు 30 నిమిషాల చొప్పున ఒక మోస్తరు వ్యాయామం వారానికి ఐదుసార్లు చేసినా గుండెపోటు, పక్షవాతాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. వ్యాయామం కోసం పని గట్టుకుని జిమ్‌లకు వెళ్లక్కర్లేదు. శక్తిని ఖర్చుచేస్తూ, కండరాలకు బలాన్నిచ్చే ఏ పనైనా.. అంటే పిల్లలతో ఆడటం, నడవటం, నాట్యం.. ఏం చేసినా మంచిదే.

ఏం తింటున్నామో--ఒక కన్నేయండి!
నూనె, కొవ్వులు, ఉప్పు.. ఇవి ఎక్కువగా తిన్నకొద్దీ గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. కొవ్వు ఎక్కువైతే రక్తనాళాలు పూడికలతో మూసుకుపోయే ముప్పు పెరుగుతుంది. రడీమేడ్‌ ఆహారంలో ఉప్పూ, కొవ్వూ.. రెండూ ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకర ఆహారాన్ని తినటం అలవరచుకోండి.

మీ వ్యక్తిగత అంకెలు--తెలుసుకోండి
మన జీవితం హాయిగా సాగుతుండాలంటే కొన్ని అంకెలు ముఖ్యం. మన ఎత్తుబరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 లోపుండాలి. బీపీ 120/80కి దగ్గరగా ఉండాలి. రక్తంలో గ్లూకోజు పరగడుపున 100లోపు, తిన్న తర్వాత రెండు గంటలకు 140 లోపుండాలి. కొలెస్ట్రాల్‌ 200 లోపుండాలి. ఆర్నెల్లకోసారైనా ఈ అంకెలు చూసుకుంటూ ఉండటం ఆరోగ్యప్రదం.

హెచ్చరిక--ఏటా దాదాపు 30 లక్షల మంది కేవలం తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్లే మరణిస్తున్నారు. నిజానికి ఇవన్నీ నివారించదగ్గ మరణాలే!

మనం ఎక్కువగా అనారోగ్యకర ఆహారానికి అలవాటు పడిపోతున్నాం. అర్ధాంతర మరణాలకు కారణమవుతున్న పది ముప్పు కారకాల్లో కనీసం 4 దీనివల్లే సంప్రాప్తించే ప్రమాదం ఉంది. అవి- 1. హైబీపీ 2. మధుమేహం 3. వూబకాయం. 4. అధిక కొలెస్ట్రాల్‌.

పొగాకు తెచ్చిపెట్టే వ్యాధులతో ప్రపంచవాప్తంగా రోజుకు 15,000 మంది మరణిస్తున్నారు. పొగతాగే ప్రతి ఇద్దరిలో ఒకరు పొగ సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. వీళ్లే కాదు.. వీళ్లు వదులుతున్న పొగ పీల్చిన కారణంగా ఏటా దాదాపు 6,00,000 మంది -ఎలాంటి పొగ అలవాటూ లేనివారు కూడా- మరణిస్తున్నారు, వీళ్లలో పిల్లలూ ఉంటున్నారు.

స్త్రీలకూ ముఖ్యమే
* స్త్రీలకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు తక్కువని చాలామంది నమ్ముతుంటారుగానీ ఇది తప్పు. స్త్రీలు ఎక్కువ మంది మృత్యువు పాలవుతుండటానికి తొలి ముఖ్య కారణం గుండె జబ్బులే! ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా నిమిషానికి ఒక మహిళ చనిపోతున్నారు.

* గుండె జబ్బుల కారణంగా మృత్యువాతపడే ముప్పు మధుమేహం ఉన్న పురుషులకంటే కూడా మధుమేహం ఉన్న స్త్రీలకు చాలా ఎక్కువ. గర్భిణులకు హైబీపీ, మధుమేహం పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. పుట్టే బిడ్డలకూ రకరకాల ముప్పులు సంప్రాప్తిస్తాయి.

* నెలసరి నిలిచిపోయిన స్త్రీలకు హైబీపీ ముప్పు ఎక్కువ. గుండె జబ్బు, పక్షవాతాలకు హైబీపీ అతిపెద్ద కారకం. కాబట్టి స్త్రీలు తరచూ బీపీ చూపించుకోవటం చాలా ముఖ్యం.

* పొగతాగే పురుషుల కంటే కూడా పొగతాగే స్త్రీలకు పురుషుల కంటే కూడా పక్షవాతం ముప్పు ఎక్కువ. తాము తాగకున్నా ఇంట్లో ఇతరులు వదిలే పొగ పీల్చినా స్త్రీలకు గుండె జబ్బుల ముప్పు 15% పెరుగుతుంది.

* స్త్రీలకు గుండెపోటు వస్తే పురుషుల్లో మాదిరిగా ఛాతీ నొప్పి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, పైగా వీరిలో వికారం వాంతులు, నడుము నొప్పి, దవడ నొప్పి, శ్వాస కష్టం కావటం వంటి సాధారణ లక్షణాలే ఉండొచ్చు. దీన్ని గుర్తుపట్టలేకపోతే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి స్త్రీలు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించటం, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం వారికే కాదు.. యావత్‌ కుటుంబానికీ కూడా మంచిది.

పిల్లల్లోనే బీజం!
చిన్నవయసులోనే మనం ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పిస్తే పిల్లలు పెరిగి పెద్త్దెన తర్వాత కూడా అదే అలవాట్లను కొనసాగిస్తారు. మూడింట రెండొంతుల అకాల మరణాలకూ, పెద్దవారిలో కనిపించే మూడింట ఒక వంతు వ్యాధులకూ యుక్తవయస్సులోనే బీజాలు పడుతున్నాయి. పొగాకు వాడకం, వ్యాయామానికి బద్ధకించటం, అనారోగ్యకర ఆహారపుటలవాట్ల వంటివి ఈ వయసులోనే ఆరంభమవుతాయి.

* పొగ, పొగాకు బానిసల్లో చాలామంది యుక్తవయుస్సులోనే దాన్ని మొదలుపెడుతున్నారు. ఇక తల్లిదండ్రులు పొగతాగేవారైతే వారి పిల్లలకు ఈ అలవాటు అంటుకునే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.
* చిన్నవయసులోనే అధిక బరువు, వూబకాయం ఉన్న పిల్లలు.. పెద్దయ్యాకా స్థూలకాయులుగానే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. వీరికి మధుమేహం, గుండె జబ్బుల వంటివి చిన్నవయసులోనే వచ్చే అవకాశం మరింత అధికం.

* చిన్నప్పుడే వ్యాయామాన్ని అలవాటు చేస్తే.. అది పెద్దయ్యాకా కొనసాగుతుంది. దీంతో మున్ముందు మధుమేహం, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయి.

* చూడగానే ఆకట్టుకునేవి, 'అబ్బ ఎంతబాగుందో' అనిపించేవి చిన్నపిల్లలనూ, యుక్తవయసువారినీ బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన ఆరోగ్యకర పదార్థాలు, వాళ్లు ఇష్టపడే వ్యాయామాలు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. మంచి ఆహారం తింటూ బాగా వ్యాయామం చేసే పిల్లలు బడుల్లో, చదువుల్లో, ఆటల్లో అన్నింటా రాణిస్తారు. ఏకాగ్రతా పెరుగుతుంది.

* పిల్లల్లో మంచి అలవాట్లకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఇంట్లో పెద్దలు ఆరోగ్యకర ఆహారం తినటానికి, వ్యాయామం చెయ్యటానికి ప్రయత్నిస్తుంటే.. పిల్లలూ అదే బాట పడతారు. అందరూ ఆరోగ్యంగా ఉండటం కుటుంబ శ్రేయస్సుకు ముఖ్యమన్న భావన వారిలోనూ కలుగుతుంది.

* తాము ఆడలేని ఆటలు, చెయ్యలేని వ్యాయామాల గురించి చెబితే పిల్లలు చేయరు. కాబట్టి వాళ్లు చేయగలిగినవే వారికి చెప్పాలి. వాటిని ఒక పనిలా కాకుండా వినోదం అందించేలా మలచాలి. ఆటల్లో గెలిస్తే మెచ్చుకుంటూ, బహుమతులు ఇస్తూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. సైకిల్‌ తొక్కటం, ఈత, నడక వంటివి పిల్లలకు తేలికగా నేర్పించొచ్చు.

* టీనేజి పిల్లలపై తోటివారి ప్రభావం ఎక్కువ. కాబట్టి స్నేహితులతో ఆడుకునే అవకాశాలు కల్పించాలి. ఆటలంటే ఫుట్‌బాల్‌ వంటివే కానక్కర్లేదు, కలిసి డ్యాన్స్‌ చెయ్యటం, స్కూలుకు నడిచి వెళ్లటం వంటివీ మంచివే. వీటివల్ల పిల్లల్లో ఆరోగ్య స్పృహతో పాటు కలుపుగోలుతనమూ పెరుగుతుంది.

* టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేమ్స్‌ ముందు కూచునే సమయాన్ని పరిమితం చేయాలి. శారీరకంగా చురుకుగా ఉండేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉంచాలి.

* కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేస్తే పిల్లలు చెడు తిండ్ల వైపు మళ్లే అవకాశం తగ్గుతుంది. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఆహారం పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. అందువల్ల రకరకాల కూరగాయలతో వంటలు వండేలా చూసుకోవాలి. వీలైతే కూరగాయలు కొనేందుకు పిల్లలనూ వెంట తీసుకెళ్లాలి. ఏయే కూరగాయలు వండాలో వారినే ఎంచుకోమని చెప్పాలి. సాయంత్రం, రాత్రి ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వుల వంటివి బాగా తగ్గించి.. తప్పనిసరిగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూడాలి.

* పిల్లలు నానాటికీ బయట మార్కెట్లో ప్యాకెట్లలో అమ్మే తినుబండారాల పట్ల మోజు పెంచుకుంటున్నారు. వీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యకర కొవ్వులూ ఎక్కువే. కాబట్టి వీటిని బాగా తగ్గించెయ్యాలి.

 Source : sukhibhava@eenadu news paper - September 26, 2013
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, January 3, 2014

Brain surgery and awareness,మెదడుకు చేసే సర్జరీలూ అవగాహన





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మెదడుకు చేసే సర్జరీలూ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • మెదడు
మన మనుగడకు మూలాధారం! మన ఆశలకూ, ఆలోచనలకూ.. అనుబంధాలకూ, ఆశ్చర్యాలకూ.. మేధకూ.. చివరికి బాధలకూ... అన్నింటికీ అదే భాండాగారం! ఎంత కీలకమో అంత సున్నితం! అందుకే 'శిరోధార్యం'లా.. మన తలలో పటిష్ఠమైన రక్షణ ఏర్పాట్ల మధ్య.. దృఢమైన కపాల ఎముకల గూడులో.. నీటి అలల నడుమ.. సుతారంగా తేలుతుంటుంది మన మెదడు! అక్కడి నుంచే అణువణువునూ నియంత్రిస్తూ.. ఆపాదమస్తకాన్ని శాసిస్తూ.. అంతా తానై మన జీవితాన్ని నడిపిస్తుంటుంది.

అందుకే మెదడులో ఏదైనా సమస్య తెలెత్తిందంటే భయంతో కంపించిపోతాం. ఇక ఆ సమస్యను తొలగించేందుకు మెదడు మీద కత్తి పెడతారంటే... ఎంత భయం ముసురుకుంటుందో అనూహ్యం! కపాల ఎముక తెరిచి... మెదడును ముట్టుకుని.. దాన్ని మరమ్మతు చేస్తారన్న వూహే వణుకుపుట్టిస్తుంది. కానీ మన ఆధునిక వైద్యరంగం, 'న్యూరో సర్జరీ' విభాగం ఈ దిశగా ఎంతో పురోగమించింది. నిత్యం మెదడు మీద అత్యంత క్లిష్టమైన సర్జరీలను సునాయాసంగా పూర్తిచేస్తూ.. మనిషికి భరోసాగా నిలబడుతున్న ఈ విభాగంపై అవగాహన పెరిగిన కొద్దీ మనలో భయాలు తొలగిపోతాయి. అందుకే దీనికి సంబంధించిన ఎన్నో అబ్బురపరిచే అంశాలు .

మన మెదడు ఓ విస్మయాల పుట్ట! నిజంగా చెప్పాలంటే అదో కొవ్వు ముద్ద. తనకంటూ ఒక ఆకృతి ఉండదు. బయటకు తీసి బల్ల మీద పెడితే ముద్దలా, సుద్దలా కూలబడుతుంది. అలాంటి మన మెదడు.. పుర్రె ఎముక గూడులో నీళ్లలాంటి ద్రవంలో తేలియాడుతూ.. ఆ ద్రవం ఒత్తిడికే ఆ ఆకృతిలో ఉంటుంది. మన మెదడు గురించి ఇటువంటి వింతలూ, విశేషాలూ ఎన్నో! ఇదే కాదు, మెదడుకు చేసే సర్జరీలూ ఇంతే ఆసక్తికరం.

  • కీలకంలో అత్యంత కీలకం!
మెదడులోని భాగాలన్నీ కీలకమైనవే అయినా... కొన్ని ప్రాంతాలు మరింత కీలకం! వీటినే 'ఎలోక్వెంట్‌ ఏరియా'లంటారు. వీటికి ఏపాటి నష్టం జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు మన రెండు చెవులకూ పైభాగాన ఉండే మెదడు భాగం (మోటార్‌ కార్టెక్స్‌) దెబ్బతింటే.. ఏ వైపు దెబ్బతిందో దానికి అభిముఖంగా ఉండే శరీర భాగం బలహీనపడుతుంది. అలాగే స్పర్శలను తెలియజెప్పే 'సెన్సరీ కార్టెక్స్‌', మాటలకు కేంద్రమైన 'బ్రోకాస్‌' ప్రాంతం, జ్ఞాపకశక్తికి కీలకమైన 'హిప్పోకాంపస్‌', 'టెంపోరల్‌' లంబిక.. ఇలా ఏవి దెబ్బతిన్నా సమస్యే. మరోవైపు ఫ్రాంటల్‌, టెంపోరల్‌, ఆక్సిపిటల్‌ లంబికలకు ఆపరేషన్‌ చేసి, వీటి నుంచి కొంత భాగాన్ని తొలగించినా కూడా చెప్పుకోదగ్గ సమస్యలుండవు. అందుకే మెదడు సర్జరీల్లో.. ఎక్కడ ఎంత వరకూ తియ్యచ్చు? దేన్ని ముట్టుకోకూడదు? అన్నది కీలకం. ఈ ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు న్యూరో సర్జన్లు 'నావిగేషన్‌' వంటి అత్యాధునిక విధానాలను అనుసరిస్తుంటారు.
  • నొప్పి తెలియదు!
మన ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ మనకు తెలియజెప్పేది మెదడే అయినా.. స్వయానా దాని నొప్పులు మాత్రం దానికి తెలియవు. మెదడును ముట్టుకున్నా, సర్జరీ చేసినా, కొంత భాగం తొలగించినా కూడా నొప్పి ఉండదు. సర్జరీ సమయంలో తల మీద ఉండే చర్మాన్ని కట్‌చేసి తెరిచేప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. సాధారణంగా మెదడు సర్జరీలన్నీ పెద్దమత్తు (జనరల్‌ అనస్థీషియా) కిందే చేస్తారు. కానీ మెదడులోని కీలక ప్రాంతాల్లో కణితుల్లాంటివి ఉంటే, అవసరాన్ని బట్టి స్థానికంగా మత్తు ఇచ్చి సర్జరీ పూర్తి చేస్తారు. మెదడు మీద కొన్ని ప్రాంతాల్లో చేత్తో ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుందిగానీ కొన్ని ప్రాంతాల్లో అదీ తెలియదు. సాధారణంగా మెదడులోని నాడీకణాలన్నీ విద్యుత్‌ ప్రచోదనాలకే ఉత్తేజితమై, ప్రేరణ పొందుతాయి. అందుకే స్థానిక మత్తుతో ఆపరేషన్‌ చేస్తుంటే అవసరాన్ని బట్టి కొన్ని మెదడు ప్రాంతాలను గుర్తించేందుకు కరెంట్‌తో ప్రేరేపిస్తుంటారు కూడా!
  • మాట్లాడుతూనే సర్జరీ
మాటలకు, సంభాషణలకు కీలకమైన 'బ్రోకాస్‌' ప్రాంతం వంటి వాటికి సర్జరీ చెయ్యాల్సి వస్తే- మనం ఎంత ప్రాంతం తొలగిస్తున్నామన్నది తెలుసుకోవటం ముఖ్యం. లేకపోతే సర్జరీ తర్వాత రోగి మాట్లాడలేకపోవచ్చు కూడా. అందుకే స్థానికంగా మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేస్తూ... రోగిని మాట్లాడమని, అంకెలు లెక్కించమని చెబుతూ బ్రోకాస్‌ ప్రాంతాన్ని కరెంట్‌తో ప్రేరేపిస్తారు. ఆ ప్రాంతం ప్రేరేపితమైతే వెంటనే లెక్కించటం ఆగిపోతుంది. ఆగిపోయిందంటే అది 'బ్రోకాస్‌' ప్రాంతమని గుర్తించి, ఆ ప్రాంతంలో కణితి ఉన్నా.. దాన్ని ముట్టుకోకుండా, మిగతా ప్రాంతంలోని కణితిని తొలగించి సర్జరీ పూర్తి చేస్తారు. 'మోటార్‌ కార్టెక్స్‌' విషయంలోనూ ఇంతే. ఇవి రోగి స్పృహలో మాట్లాడుతుండగానే మెదడుకు చేసే సర్జరీలన్న మాట!
  • అపోహ
చాలామంది మెదడులోని కొంత ప్రాంతాన్ని తొలగిస్తే రోగికి మానసికసమస్యలు తలెత్తుతాయని, పిచ్చివాళ్లవుతారని.. రకరకాలుగా భయపడుతుంటారు. అది నిజం కాదు. కొన్నికొన్ని భాగాలను తొలగించినప్పుడు ఆ ప్రాంతం నిర్వహించే పనులను మెదడులోని మిగతా భాగాలు చేపడుతుంటాయి. కాబట్టి చాలామందిలో పెద్ద తేడా కనబడదు. మెదడుకు ఈ సర్దుబాటు శక్తి ఉంది. కీలక ప్రాంతాలు తప్పించి, మిగతా మెదడులో కణితుల వంటివి వచ్చి, కొద్దిభాగం తొలగించినా కూడా సాధారణ జీవితం గడపటానికి పెద్ద ఇబ్బందేం ఉండదు.
మెదడు సర్జరీ: ఎలా చేస్తారు?
ముందు మెదడులో ఏ ప్రాంతానికి సర్జరీ చెయ్యాలో కచ్చితంగా గుర్తించి.. ఆ ప్రాంతంలో తలపై గల చర్మాన్ని వలిచి పక్కకు తీస్తారు. అప్పుడు ఆధునిక పరికరాలతో ఆ కాస్త ప్రాంతం పుర్రె ఎముకకు కోతబెట్టి, దాన్ని తీసి పక్కనబెడతారు. పుర్రె ఎముక తియ్యగానే కింద 'మినింజెస్‌' అనే పొరలు కనబడతాయి. వాటిని కత్తిరించి ఒకవైపునకు తీస్తే కింద ద్రవంలో (సీఎస్‌ఎఫ్‌) మెదడు ప్రత్యక్షంగా కనబడుతుంది. దానిపైన సర్జరీ పూర్తి చేస్తారు. వెంటనే మళ్లీ మినింజెస్‌ను కప్పి కుట్టేసి, ఎముకను తెచ్చి యథాస్థానంలో అమర్చి, పైన చర్మాన్ని మూసి కుట్లేస్తారు. మనం ఒంటి మీద చర్మం ఎక్కడైనా కట్‌ చేస్తే క్రమేపీ అది మానిపోయి, పూడుకుపోతుంది. కానీ మెదడు ఇలా కాదు.. అది కలుస్తుందిగానీ... ఆ ప్రాంతం పనితీరు మెరుగవ్వదు. అందుకే ఎప్పుడూ కూడా మెదడులో అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాల ద్వారానే సర్జరీ చెయ్యాలని చూస్తుంటారు.
  • లంబికల అమరిక :
* నుదురు వెనకాలే ఉండే మెదడు భాగం ఇది. ఈ లంబికల్లో కణుతుల వంటివి పెరిగితే భావోద్వేగపరమైన సమస్యలు ఎక్కువ. కణుతులు లంబికలకు పైవైపున ఉంటే మానసిక కుంగుబాటు వంటి సమస్యలు ఎక్కువ, అదే కిందివైపు ఉంటే తిట్టటం, కొట్టటం వంటి ఉద్రేకపూరిత ప్రవర్తనలు ఎక్కువ. అలాగే వెనక వైపున వస్తే శరీర భాగాల కదలికలు ప్రభావితమవుతాయి.

* వినికిడి, జ్ఞాపకాలు, దృశ్యరూప జ్ఞాపకాలు, ముఖ్యంగా మాటలు, సంభాషణలకు కీలక ప్రాంతం ఇది.

* చెవి పైభాగాన ఉండే లంబికలు. సాధారణ స్పర్శలతో పాటు నొప్పి, వేడి-చల్లదనం వంటివన్నీ మనకు తెలియజెప్పే భాగాలివే. భాష, అంకెలు, లెక్కలు, గణకాలన్నింటికీ కూడా ఇవే కీలకం. అలాగే మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ఏవి ఎక్కడుంటాయి? అన్న పరిసర స్పృహకు కూడా ఇదే కారణం. ఈ లంబికలో కణితుల వంటివి పెరిగి, ఇది దెబ్బతింటే మనం ఇంటికి వెళ్లటం, ఇంట్లో ఏ గది ఎక్కడుందో తెలియటం కూడా కష్టం కావచ్చు.

* తల వెనక భాగాన ఉంటుంది. పరిమాణంలో చిన్నదైనా కంటి చూపునకు కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైనా కణితి పెరిగితే చూపు సమస్యలు తలెత్తుతాయి.
  • సాధారణ దుష్ప్రభావాలు
మెదడుకు సర్జరీ అనగానే చాలామంది రకరకాల దుష్ప్రభావాల గురించి భయపడుతుంటారు. నిజానికి 90% మెదడు సర్జరీలు విజయవంతంగా పూర్తవుతాయి. కేవలం ఓ 10% కేసుల్లో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. మొత్తానికి ఇతర సర్జరీలతో పోలిస్తే మెదడు సర్జరీలతో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం కాస్త ఎక్కువనే చెప్పాలి. కాకపోతే ఇవన్నీ కూడా తాత్కాలిక దుష్ప్రభావాలు. దీర్ఘకాలం మిగిలిపోయేవి కేవలం 1-2% మాత్రమే ఉంటాయి.

తక్షణ దుష్ప్రభావాలు
*మగత: సర్జరీ సమయంలో ఏదైనా తేడా వస్తే రోగి మత్తు నుండి త్వరగా బయటకు రాలేకపోవచ్చు. లేదంటే స్పృహకు కీలకమైన హైపోథాలమస్‌ వంటివి దెబ్బతింటే 4-5 రోజులు మగతగా ఉంటారు. ఇలాంటి వారిని కొద్దిరోజులు 'ఐసీయూ'లో ఉంచి చికిత్స చేస్తే క్రమేపీ మెలకువలోకి వస్తారు.

* ఫిట్స్‌: సర్జరీ సమయంలో ఎంతోకొంత మెదడు చికాకుకు గురవుతుంది. దీనివల్ల సర్జరీ తర్వాత ఫిట్స్‌ రావచ్చు. ఏ రకమైన మెదడు సర్జరీకైనా ఈ బెడద తప్పదు. అందుకే వారికి మూర్ఛ రాకుండా మందులు ఆరంభించి, వాటిని క్రమేపీ కొంతకాలానికి తగ్గిస్తారు.

* రక్తస్రావం: మెదడులో రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. శరీరంలోని మిగతా భాగాల్లో అయితే సర్జరీ సమయంలో రక్తనాళాలను కట్టటం, నొక్కటం వంటివి చేసి రక్తస్రావం ఆపొచ్చు. కానీ మెదడులో సూక్ష్మమైన రక్తనాళాలుంటాయి కాబట్టి అది సాధ్యం కాదు. అందుకే సర్జరీ సమయంలో వాటిని రసాయనాలతో ఆపటం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు సర్జరీ తర్వాత బీపీ పెరగటం వంటివి జరిగితే మెదడులో రక్తస్రావం కావచ్చు. ఇలా చిన్న రక్తం గడ్డ ఏర్పడితే మందులతో తగ్గించొచ్చుగానీ.. మరీ పెద్దగా ఉంటే మాత్రం మళ్లీ సర్జరీ చేసి.. మొత్తం తెరిచి, దాన్ని తొలగించాల్సి వస్తుంటుంది.

* గాలి-నీరు: సర్జరీ సమయంలో మెదడు పొరల్లో ఉండే నీరు బయటకు వస్తుంది. ఆ సమయంలో దాని స్థానంలో గాలి చేరి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి ఆ గాలి లోపల వ్యాకోచించి పీడనం పెంచుతుంది. దీంతో రోగికి మగత, ఫిట్స్‌ వంటివి రావచ్చు. వీరికి బయటి నుంచి అధిక మొత్తంలో ఆక్సిజన్‌ ఇస్తే శ్వాస ప్రక్రియ ద్వారా ఆ గాలి మెల్లగా బయటకుపోయి, దాని స్థానంలో ఆక్సిజన్‌ చేరుతుంది. సమస్య సర్దుకుంటుంది. ఇది పని చెయ్యకపోతే- చిన్న రంధ్రం చేసి, ఆ గాలిని బయటకు లాగెయ్యాల్సి ఉంటుంది.

మొత్తానికి ఇవన్నీ కూడా తాత్కాలికమైన దుష్ప్రభావాలే. వీటిని వైద్యులు సమర్థంగా ఎదుర్కొంటారు.
  • అపోహ
మెదడుకు సర్జరీ అంటే చాలామంది.. తలపైని పుర్రె ఎముక మొత్తాన్ని డిప్పలాగా కట్‌ చేసి పక్కనపెట్టి.. మెదడుకు మరమ్మతుచేసి.. మళ్లీ దాన్ని వెనక్కిపెట్టేస్తారని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మెదడులో ఏ ప్రాంతంలో సమస్య ఉందో ముందే గుర్తిస్తారు కాబట్టి.. కేవలం ఆ కాస్త భాగం దగ్గర మాత్రమే పుర్రె ఎముకను కట్‌ చేసి, మెదడు సర్జరీ పూర్తిచేస్తారు. డిప్పలా మొత్తం తియ్యటం ఉండదు.

  • నావిగేషన్‌: మెదడు మొత్తం ఓ మ్యాప్‌
మెదడు మీద సర్జరీ చేసేటప్పుడు.. తాము ఏ ప్రాంతాన్ని ముట్టుకుంటున్నామో, ఎక్కడున్నామో సర్జన్లకు తెలియటం అత్యంత కీలకం. ఇందుకోసం అద్భుతంగా ఉపయోగపడే పరిజ్ఞానం 'నావిగేషన్‌'. దీనికోసం ఆపరేషన్‌ థియేటర్లో 'ఇన్‌ఫ్రారెడ్‌ కెమేరాలు' అమర్చి ఉంటాయి. సర్జరీకి ముందు రోజే రోగి మెదడులో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాలు ఎలా ఉన్నాయనే వివరాలన్నింటినీ ఒక మ్యాప్‌లాగా దానిలో నిక్షిప్తం చేస్తారు. సర్జరీ రోజున రోగిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లగానే తలకు కెమేరాలకు అనుసంధానించిన ఫ్రేమ్‌ను అమరుస్తారు. ఇక అక్కడి నుంచీ అది కచ్చితంగా సర్జన్‌- మెదడు మీద ఏ ప్రాంతంలో ఉన్నారో, ఆ ప్రాంతం ఎలాంటిదో, దాన్ని తొలగించవచ్చో లేదో ఎప్పటికప్పుడు (జీపీఎస్‌ లాగా..) హెచ్చరిస్తుంటుంది. కాబట్టి తప్పు జరిగే ఆస్కారమే ఉండదు. కణితుల వంటివి మెదడు ఉపరితలం మీద ఉంటే స్పష్టంగా కనబడతాయిగానీ లోపలగా ఉంటే వాటిని గుర్తించటం కష్టం. ఇలాంటి సందర్భాల్లో 'నావిగేషన్‌' పరిజ్ఞానం బాగా ఉపకరిస్తుంది. గతంలో చిన్న కణితులను తొలగించాల్సి ఉన్నా.. దాన్ని చేరుకోవటానికి తల మీద పెద్ద ప్రాంతం తెరవాల్సి వచ్చేది. ఇప్పుడు నావిగేషన్‌ సాయంతో కచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడో గుర్తించి.. అక్కడే తెరిచి... వాటిని తొలగించొచ్చు.

  • ఇవీ సర్జరీలు--కణితులకు సర్జరీ
  •  
మెదడుకు సంబంధించిన సమస్యల్లో కణితులు ముఖ్యమైనవి. ఇవి మెదడులో ఎక్కడైనా రావచ్చు. వీటిలో దాదాపు 60% క్యాన్సర్‌ కణితులే. సాధారణ కణితిని సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ కాన్సర్‌ కణితులను తొలగించటంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివీ అవసరమవుతాయి. మెదడులో వచ్చే క్యాన్సర్‌ కణితుల్లో 4 గ్రేడులు ఉంటాయి. సాధారణంగా ఇతరత్రా క్యాన్సర్లు 1వ దశతో మొదలై.. క్రమేపీ ముదిరి 4వ దశకు చేరతాయి. కాబట్టి తొలిదశలో గుర్తిస్తే వాటిని దాదాపు నయం చేసే వీలుంటుంది. కానీ మెదడు కణితులు ఇలా కాదు. అవి క్రమేపీ ఒక దశ నుంచి మరోదశకు వెళ్లటమన్నది ఉండదు. మొదలవుతూనే 3వ, 4వ దశల్లో కూడా ఉండొచ్చు. కణితి 1, 2 గ్రేడుల్లో ఉంటే చికిత్సతో దాదాపు పదేళ్ల వరకూ కూడా బాగానే జీవించగలుగుతారు. 4వ దశ కణితులు తీవ్రమైనవి, వీరు ఎక్కువకాలం జీవించటం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగులో అది గ్రేడ్‌-1, 2 లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన పనిలేదు. అది పెరుగుతుంటే, 2-3 సెం.మీ. కంటే పెద్దగా ఉంటే సర్జరీ అవసరం. ఇక 3, 4 దశల్లో ఉంటే సర్జరీతో పాటు రేడియేషన్‌, కీమోథెరపీలూ అవసరమవుతాయి. అలాగే ఫ్రాంటల్‌, టెంపోరల్‌ లంబికల్లో వచ్చే కణితులను సర్జరీతో తొలగిస్తే చాలావరకూ సాధారణ జీవితం గడపగలుగుతారు. మెదడు మధ్య భాగంలో అంటే బేసల్‌ గాంగ్లియా, థాలమస్‌, కార్పస్‌ కలోజమ్‌ వంటి ప్రాంతాల్లో వచ్చే కణితులు మాత్రం ఉద్ధృతంగా ఉంటాయి.

* అందుకే ఎప్పుడైనా సరే- తీవ్రమైన, విడవని తలనొప్పి, వాంతులు, చూపు సమస్యలు, ఫిట్స్‌ వంటి లక్షణాలు ఉన్నట్టుండి మొదలైతే వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులకు చూపించుకుని, మెదడులో కణితులు లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.

* సర్జరీ: కణితులు కీలక ప్రాంతాల్లో వస్తే వాటిని పూర్తిగా తొలగించటం సాధ్యం కాకపోవచ్చు. మాటలు, కదలికలకు కీలకమైన ప్రాంతాలను గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితులను తొలగిస్తారు. మిగిలిపోయిన వాటిని రేడియో థెరపీ, కీమోథెరపీలతో నయం చేసే ప్రయత్నం చేస్తారు.

* కణితి మెదడు మధ్యలో వస్తే- మెదడు కణజాలాన్నీ, కణితినీ వేరుచేసి చూడటం కష్టం కావచ్చు. ఇలా పొరపాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ తేడా గుర్తించేందుకు- మైక్రోస్కోపు, నావిగేషన్‌ వంటి పరిజ్ఞానాలు ఉపయోగపడతాయి. ఒకవేళ మైక్రోస్కోపుతో గుర్తుపట్టలేమనుకుంటే సర్జరీకి ముందు రోజు- 'డై' రంగు మందు తాగిస్తారు. ఆ రంగు రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి మెదడులోని కణితుల్లో ఎక్కువగా చేరుతుంది. సర్జరీ సమయంలో అక్కడ 'ఫ్లోరసెంట్‌ లైట్‌' వేస్తే కణితి స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు దాన్ని తొలగించటం తేలిక. అదీ కష్టమనుకుంటే మెదడు కణజాలం, రక్తనాళాలు దెబ్బతినకుండా కేవలం కణితి కణాలను మాత్రమే ధ్వంసం చేసే 'అల్ట్రాసోనిక్‌ ఆస్పిరేటర్‌' సాయంతో కణితిని నిర్మూలిస్తారు.

* సర్జరీ కాని సర్జరీ: హైపోథాలమస్‌, థాలమస్‌, బ్రెయిన్‌ స్టెమ్‌ వంటి కీలక ప్రాంతాల్లో సర్జరీ సాధ్యం కాని చిన్న కణితులు ఉంటే- కత్తిపెట్టాల్సిన పని లేకుండా కేవలం రేడియేషన్‌ ద్వారా కచ్చితంగా కణితిని గుర్తించి దాన్ని తొలగించేందుకు 'రేడియో సర్జరీ' ఉపకరిస్తుంది. దీనికోసం గామానైఫ్‌, నోవాలిస్‌, సైబర్‌నైఫ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిని సాధారణ కణితుల కోసం వాడతారు.

* ముక్క తియ్యటం: మెదడు మధ్య భాగమైన థాలమస్‌, బేసల్‌ గాంగ్లియా వంటి ప్రాంతాల్లో క్యాన్సర్‌ కణుతులు వస్తే వాటిని పూర్తిగా తొలగించటం కష్టం. వీరికి- తల మీద చిన్న రంధ్రం చేసి.. దాని ద్వారా తలకు ఫ్రేమ్‌ బిగించి.. కణితి కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందో అక్కడి నుంచి ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. దీన్ని 'స్టీరియోటాక్సీ బయాప్సీ' అంటారు. దానిలో వచ్చే ఫలితాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలతో చికిత్స చేస్తారు.
  • మూర్ఛకు సర్జరీ
మూర్ఛకు చాలా వరకూ మందులతోనే చికిత్స చేస్తారుగానీ ఓ 30% మందికి మాత్రం 2, 3 రకాల మందులు వాడినా ఫలితం కనబడదు. ఇలాంటి వారికి సర్జరీతో ఫలితం ఉంటుంది. మందులు వాడినా నెలకు 2, 3 సార్లకు మించి ఫిట్స్‌ వస్తూ, రెండేళ్లకు పైగా బాధపడుతుంటే వారికి మందులన్నీ ఆపేసి.. ఆసుపత్రిలో చేర్చి ఫిట్‌ వచ్చినప్పుడు ప్రత్యేకమైన 'వీడియో ఈఈజీ' తీస్తారు. దీనిలో ఫిట్‌కు మూలమైన భాగం ఏది, విద్యుత్‌ సమస్య ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుస్తుంది. తర్వాత ఎమ్మారై చేసి.. ఆ ప్రాంతంలో ఏదైనా తేడా ఉందా? అన్నదీ చూస్తారు. రెంటిలోనూ ఒకే ప్రాంతంలో తేడా ఉందని గుర్తిస్తే- వారికి సర్జరీ చేసి ఆ ప్రాంతాన్ని తొలగించొచ్చు. దాంతో మూర్ఛ నుంచి చాలా వరకూ విముక్తి వస్తుంది. చాలామందికి ఈ సమస్య టెంపోరల్‌ లంబికలో ఉంటుంది. దాన్ని తొలగించినా పెద్ద నష్టం ఉండదు. కీలకమైన ప్రాంతం నుంచి వస్తుంటే మాత్రం వారికి సర్జరీ సిఫార్సు చెయ్యరు. ఒక్కోసారి మెదడులో ఒక ప్రాంతమని కాకుండా... ఒక అర్ధభాగం మొత్తం మూర్ఛకు కారణమవుతుంటుంది. అప్పుడు 'హెమీస్పెరాటమీ' అనే సర్జరీ చేసి.. మెదడులోని రెండు అర్ధభాగాల మధ్యనా ఉండే అనుసంధానాలను కత్తిరిస్తారు. ఇందుకు కంప్యూటర్‌ 'నావిగేషన్‌' పరిజ్ఞానం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
  • పార్కిన్సన్‌కు సర్జరీ
వాస్తవానికి మన మెదడు ఎప్పుడూ అతిగా పని చేసేందుకే ప్రయత్నిస్తుంటుంది. కానీ మెదడులోని మరికొన్ని భాగాలు దాన్ని ఎప్పటికప్పుడు అదుపులో పెడుతుంటాయి. ఇలా మెదడు సమతౌల్యంతో పని చేస్తుంటుంది. అతి చురుకుదనానికి 'బేసల్‌ గాంగ్లియా' భాగం మూలమైతే దాన్ని నియంత్రించేది 'ఫ్రాంటల్‌ లోబ్‌'. ఈ ప్రచోదనాలు ప్రసరించేందుకు సహకరించే రసాయనం డోపమైన్‌. ఏదైనా కారణాన ఈ డోపమైన్‌ ఉత్పత్తి పెరిగినా, తగ్గినా మెదడు అతిగా పని చేస్తూ.. కండరాల వణుకు, కంపనం, బిగువు వంటివి పెరిగి సమస్యాత్మకంగా తయారవుతాయి. ఈ సమయంలో నియంత్రణ పెంచేందుకు కొన్ని కేంద్రాలను ధ్వంసం (లీజనింగ్‌) చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకు 'స్టీరియో టాక్టిక్‌' విధానంలో కచ్చితమైన కేంద్రాన్ని గుర్తించి అక్కడ ఎలక్ట్రోడ్‌ను అమర్చి, విద్యుత్‌తో ప్రేరేపించటం ద్వారా రోగికి కండరాల బిగువు తగ్గుతోందేమో గమనిస్తారు. సర్జరీ సమయంలో రోగిని మెలకువగానే ఉంచుతారు. అలా తగ్గితే 'రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌' ద్వారా దాన్ని ధ్వంసం చేస్తారు. కొందరికి 'హైఫ్రీక్వెన్సీ పేస్‌మేకర్‌' వంటి పరికరంతో 'డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌' చేస్తారు. ఇది కాస్త ఖరీదైనది.

  • పక్షవాతం - సర్జరీ
మెదడులోని రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం రావచ్చు. దీన్ని 'హెమరేజిక్‌ స్ట్రోక్‌' అంటారు. ఇలాంటప్పుడు మెదడు వాచి ఉబ్బినట్లవుతుంది. కానీ అది పెరగటానికి వీల్లేకుండా పుర్రె ఎముక గట్టిగా అడ్డుపడుతుంటుంది కాబట్టి మెదడు వాచిన కొద్దీ లోపల్లోపలే నొక్కుకుపోతూ దెబ్బతినిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు కొందరికి.. ఆ వైపు పుర్రె ఎముకను కట్‌ చేసి మెదడు నొక్కుకుపోకుండా ఖాళీ కల్పించే సర్జరీ చేస్తారు. అలా కట్‌ చేసిన పుర్రె ఎముకను తాత్కాలికంగా డొక్కలో చర్మం కింద ఉంచుతారు. ఎముక తొలగించిన తర్వాత తల పైన చర్మాన్ని కుట్టేస్తారు. మొదట్లో మెదడు వాపు వల్ల అక్కడ ఉబ్బెత్తుగా ఉంటుందిగానీ ఐదారు వారాల్లో రక్తస్రావం దానంతట అదే సర్దుకుంటుంది. క్రమేపీ మెదడు వాపు తగ్గి అక్కడ సొట్టలా తయారవుతుంది. ఇక ఆ సమయంలో- మళ్లీ సర్జరీ చేసి, డొక్కలో పెట్టిన పుర్రె ఎముకను తెచ్చి తిరిగి తల మీద ఉంచి కుట్టేస్తారు.

వాస్తవానికి ఇది పక్షవాతానికి చికిత్స కాదు. రక్తనాళాలు చిట్లి మెదడు వాస్తున్నప్పుడు.. మిగతా మెదడు భాగం నొక్కుకుపోయి దెబ్బతినకుండా రక్షించుకునేందుకు చేసే చికిత్స. ఇలా చెయ్యకపోతే మిగిలిన మంచి భాగం కూడా దెబ్బతింటుంది. చాలామంది దీన్ని పక్షవాతం తగ్గించే సర్జరీ అనుకుంటూ.. ఈ సర్జరీ చేసినా పక్షవాతం పరిస్థితి మెరుగవ్వలేదని విమర్శిస్తుంటారు. వాస్తవానికి ఇది బాగున్న మెదడు భాగాలను రక్షించుకునే సర్జరీనేగానీ పక్షవాతం, దాని దుష్ప్రభావాలను తగ్గించేది కాదు.

* ఇవే కాదు, మెదడుకు క్షయవంటి రకరకాల సందర్భాల్లో కూడా మెదడుకు సర్జరీలు అవసరమవుతుంటాయి.

Courtesy with Dr.Manas Panigrahi(Neuro-surgeon)KIMS hos.Hyd@sukhibhava of eenadu news paper.
  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, December 27, 2013

Effects of NSAIDs on kidneys,మూత్రపిండాలపై నొప్పినివారణ మందుల ప్రబావము

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -,మూత్రపిండాలపై నొప్పినివారణ మందుల ప్రబావము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చీటికీ మాటికీ నొప్పి నివారణ మందులు వేసుకోవటం మంచిది కాదని, వీటితో మూత్రపిండాల వైఫల్యం ముప్పు పొంచి ఉంటోందని కేర్‌ ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో 250 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు పూర్తి చేసిన సందర్భంగా బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ చక్రవర్తి, నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ వి.విక్రాంత్‌రెడ్డి, డాక్టర్‌ కె.ప్రసాద్‌రాజు, డాక్టర్‌ కె.రామరాజు, తదితరులు మాట్లాడారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో పట్టణాల్లో, నగరాల్లో కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయని చెప్పారు. పట్టణ జనాభాలో దాదాపు 17% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, వీరిలో 12% మందికి ఈ సమస్యకు మధుమేహమే కారణమవుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఏటా 20 వేల మందికి కిడ్నీ మార్పిడి అవసరమవుతుండగా.. కేవలం 700 కిడ్నీలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. అందువల్ల అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా జీవన్మృతుల (బ్రెయిన్‌డెత్‌) కేసుల్లో అవయవ దానంపై కుటుంబ సభ్యులు చొరవ చూపితే... ఒకరి అవయవాలతో మరో ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించినట్లువుతుందని వివరించారు. కిడ్నీ జబ్బుల బారిన పడకుండా 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికి ఒకసారైనా కిడ్నీల పనితీరుపై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

నొప్పి నివారణ మందులు అంటే -NSAIDs లను సమాజములో  analgesic and anti-inflammatory benefits కోసము వాడడము జరుగుతూ ఉన్నది . NSAIDs చాలా రకాలైన మూత్రపిండ వ్యాధులు ... అంటే  hemodynamically-mediated acute kidney injury (AKI), electrolyte and acid-base disorders, acute interstitial nephritis (AIN), కలుగజేయును . దీని పర్యావసానంగా  nephrotic syndrome, మరియు  papillary necrosis అనేవి వచ్చును .

ఇవే కాకుండా కడుపు నొప్పిని కలుగుజేసే గాస్ట్రిక్ ట్రబుల్స్ , పెప్టిక్ అల్సర్ , డుయోడినల్ అల్సర్స్ వంటివి కలిగే అవకాశాలు ఎక్కువ .. ఎక్కువ కాలము అదే పనిగా ఈ నొప్పినివారణ మందులు వాడినవారిలో రక్తములో కొన్ని మార్పులు జరిగే అవకాశమూ లేకపోలేదు. గుండె సంబందిత వ్యాదులు ఈమందుల చెడు ప్రబావము వల్ల కలుగుతున్నాయి.

సాంక్రమిక రోగ విజ్ఞానం-EPIDEMIOLOGY
నొప్పినివారణ మాత్రలు వాడకము వల్ల మూత్రపిండాల ప్రతికూల వ్యాదులు సుమారు  1 to 5 శాతము మందిలో కనబడుతూ ఉంది. చాలా ఎక్కువమంది ఈ మందులు . . సుమారు 70,000,000  డాక్టర్ల సిఫార్శుతోనూ సుమారు 30 మిలియన్లు మందుల షాపులలో కొనుక్కొని వాడుతూ ఉన్నారని ప్రపంచ వ్యాపతము గా అధారు ఉన్నాయి. వీరిలో సుమారు 2-3 మిలియన్ల మంది మూత్ర సంబంధిత వ్యాదులకు(nephrotoxic) గురి అవుతూ ఉన్నారు.


  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, November 24, 2013

Coronary heart disease,కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండాసలహాలు,కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటే?

  •  



  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Coronary heart disease,కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

Q : కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటే ఎమిటి ?
A : మనశరీరంలోని ప్రతీ అవయవానికి రక్తం సరఫరా చేయ డానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాలు ఉంటాయి వాటి ద్వారా ఆయా అవయవాలకి రక్తప్రసరణ జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా అన్ని కణాలకు జరుగు తుంది. రక్తం చేరని ప్రాంతానికి ఇవి చేరక ఇబ్బంది పడతాం. రక్తం అంతా గుండె ద్వారా ఇతర అవయవాలకు చేరుతున్నా, గుండె తనకు రక్తం సరఫరా చేసే నాళాలైన ‘కరొనరి ఆర్టెరీ’ శాఖల ద్వారా వచ్చే రక్తాన్నే తనకోసం ఉపయోగించుకుంటుంది. ఈ కరొనరి ఆర్టెరీ శాఖలలో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకి రక్తం సరిగ్గా సరఫరా కాదు. దాంతో కండరాలు నీరసించి గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. గుండె రక్తనాళాలైన కరొనరి ఆర్టెరీ శాఖలలో ‘ఎథిరోస్ల్కీరోసిస్‌’తో పూడుకు పోవడం జరిగి తద్వారా గుండె రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటారు. గుండె రక్తనాళాల్లో ఈ మార్పు ఎలా వస్తాయంటే ముందు కొవ్వు కొద్ది కొద్దిగా రక్తనాళాలలోపలివైపు పేరుకుపోతుంది. ఆ తరువాత లిపిడ్‌, పైబర్‌ కూడా పేరుకుపోయి గట్టిపడతాయి. ఇవి సాధారణంగా రక్తనాళాలు మలుపుతిరిగేచోట కానీ, చీలేచోటగానీ ఏర్పడతాయి.

ఈ ప్లేక్స్‌ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాల్తో పెద్దగా ఏర్పడి సన్నటిక్యాప్‌ కప్పినట్లు పెరుగుతాయి. ఇవి చిదిమిపోవచ్చు. ఇలా రక్తనాళాల్లో అడ్డంకులేర్పడతాయి. పూర్తిగా రక్తనాళాల్లో అడ్డంకిగా ఏర్పడి ‘మయోకార్డియల్‌ఇన్‌ఫె‘న్‌’ ఏర్పడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఈ ప్లేకు ఫైబ్రస్‌ ప్లేక్‌ అవుతాయి. ఆర్టరీ శాఖలలో విస్తరిస్తాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50శాతం కన్నా ఎక్కువ పేరుకుపోతే అక్కడినుంచి రక్తసరఫరా తగ్గి ఆప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అంతకన్నా ఎక్కువ పేరుకుపోతే గుండె కండరాలు ఇంకా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కరొనరి ఆర్టరీ డిసీజెస్‌ వస్తాయి. దీన్ని ప్రారంభదశలో గుర్తించి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మామూలు కన్నా పొగతాగే వాళ్ళలో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ రెండు లేక మూడు రెట్లు ఎక్కువ. సిగరెట్లు తాగడం మానేస్తే ఈ రిస్క్‌ కూడా క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ధూమపానం అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

కరొనరి హార్ట్‌ డిసీజ్‌కి మరో రిస్క్‌ కొలెస్ట్రాల్క్త్రంలో పెరగడం. కొలెస్ట్రాల్‌ వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన శరీరంలో లోడెన్సిటి లైపోప్రొటీన్‌ (ఎల్‌.డి.ఎల్‌) తక్కువగా ఉండాలి. రక్షణ కల్పించే హై డెన్సిటి లైపోప్రొటీన్‌ (హెచ్‌.డి.ఎ) ఎక్కువగా ఉండాలి. అలా కాకుండా ఎల్‌డిఎల్‌ పెరిగినా, హెచ్‌డిఎల్‌ తగ్గినా కూడా రిస్క్‌ఎక్కువే! ట్రెగ్లిజరైడ్స్‌ ఎక్కువై వాటితోపాటు ఎల్‌డిఎల్‌ పెరిగి హెచ్‌డిఎల్‌ తగ్గడంతో రిస్క్‌ ఎక్కువవుతుంది. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కొలెస్ట్రాల్‌ స్థాయిని తట్టుకోగలరు. ఎందుకంటే బహిష్టు ఆగేవరకు ప్రత్యేక హార్మోన్లు రక్షణ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్‌ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయి. 1) వంశపారంపర్యంగా వచ్చేవి. 2) ఆహారం ద్వారా వచ్చేవి. చిన్న వయస్సులో కూడా కొన్ని జీన్స్‌ దెబ్బతినడం వల్ల వంశపారపర్యంగా ‘హైపర్‌-లిపిడిమియా’ బారినపడుతుంటారు.

దీంతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ చిన్న వయస్సులో వచ్చే రిస్క్‌ ఉంది. ‘సేచురేటెడ్‌’ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అధిక బరువు, డయాబెటిస్‌, అధికరక్తపోటుల వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో ఎథిరోస్ల్కీరోసిస్‌తో గుండెరక్తనాళాలు మూసుకుపోయే రిస్క్‌ ఎక్కువ. అధిక రక్తపోటు వల్ల కరొనరి డిసీజెస్‌ ఎక్కువ. రక్తపోటును తగ్గిస్తే ఆరిస్క్‌ తగ్గుతుంది.ఊబకాయం గుండె జబ్బులు రావడానికి ప్రధాన రిస్క్‌ ప్యాక్టర్‌గా గుర్తించారు. ఊబకాయాల వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఎల్‌.డి.ఎల్‌ పెరిగి హెచ్‌.డి.ఎల్‌ తగ్గుతుంది. కాబట్టి బాడీమాస్‌ ఇండెక్స్‌ చెప్పిన దానికన్నా ఎక్కువ బరువు ఉండకుండా చూడటం అవసరం. బి.ఎం.ఐ అంటే బాడీమాస్‌ ఇండెక్స్‌ ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును చెప్పడం. బి.ఎం.ఐ = బరువు కిలోగ్రాముల్లో /ఎత్తు మీటర్లలో అలాగుణించినప్పుడు 25కన్నా తక్కువ ఉండాలి.

ఛాతి చుట్టుకొలతని పిరుదుల చుట్ట కొలతతో పొల్చినప్పుడు ఆడవాళ్ళల్లో అయితే. 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. మగవాళ్ళల్లో అయితే. 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ రేషియో పెరిగిన కొద్దీ కరొనరి డిసీజెస్‌ రిస్క్‌ ఎక్కువ. సరైన ఎక్స్‌సర్‌సైజ్‌ లేకపోవడం కూడా కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ను పెంచుతుంది. వారంలో అయిదు రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు ఎక్స్‌సర్‌సైజులు చేయాలి. నడకైనా మంచిది. ఆల్కాహాల్‌ ఎక్కువ తీసుకున్నా ‘ట్రెగ్లిజరైడ్స్‌’ఎక్కువై లివర్‌ డిసీజ్‌తో పాటు కరొనరి డిసీజెస్‌ రావచ్చు. ఎక్కువగా స్ట్రాంగ్‌ కాఫీ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రాంగ్‌ కాఫీ వల్ల సైనస్‌ టేకికార్డియా లేకపోతే ఎరిథ్మియా కలగవచ్చు. కాబట్టి కాఫీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.

సాధారణంగా మెనూపాజ్‌ పీరియడ్‌ వచ్చేంతరకు వరకు ఆడవాళ్ళల్లో హార్మోన్స్‌ భద్రతను కలిగిస్తాయి. జీవనవిధానం మారడంతో ఇలాంటి లక్షణాలు దెబ్బతిని ఆడవాళ్ళల్లో చిన్నతనంలోనే కరొనరి హార్ట్‌డిసీజ్‌ వస్తుంది. కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే కారణాలు తెలుసుకున్నాం. వీటిని బట్టి మనం జీవన విధానం ఎలా మార్చుకోవాలో తెలుసుకోవచ్చు. ధూమపానం, ఆల్కాహాల్‌, కాఫీ లాంటి అలవాట్లను మానేయటం మంచిది. కొలెస్ట్రాల్‌ పెరగని విదంగా ఆహారపు అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి. ఊబకాయం, డయాబెటిస్‌, అధిక రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి. ఇలా జీవన విధానాన్ని మార్చుకొంటే కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుకోవచ్చు.

మానసిక ఒత్తిడితో కూడా కరొనరి హార్ట్‌డిసీజ్‌ రిస్క్‌ల్లో ఒకటి. టైప్‌-ఎ పర్సనాల్టీలో ఒత్తిడి ఎక్కువ. దీనితో వాళ్ళకి కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. టైప్‌-ఎ  పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో పోటీతత్వం ఎక్కువ. వాళ్ళు అనుకున్న పని పూర్తికాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. యోగ, మెంటల్‌ రిలాక్సేషన్‌లతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌తో వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

  • courtesy with : Dr.Ravikuma Aluri (cardiotogist) Hyd@surya Telugu news paper.October 7, 2013
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

HIB,హిబ్,Haemophilus influenzae type B vaccine,హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --HIB,హిబ్,Haemophilus influenzae type B vaccine,హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్. ఈ వాక్షిన్‌ వేయడము వలన పసికందులలో వచ్చే early childhood meningitis ను పూరిగా నివారించవచ్చును.

చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం. ఈ కార్యక్రమ వ్యూహాలు అమలు చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిల్లల్లో వచ్చే వ్యాధులను అరికట్టి సత్ఫలితాలు సాధించవచ్చు. అది పిల్లలకు మౌలిక అవసరం కూడా.

హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్... ఇది ఒక కాంజుగేట్ వాక్షిన్‌. developed for the prevention of invasive disease caused by Haemophilus influenzae type b bacteria. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్సన్‌ (CDC) చిన్నపిల్లకు రొటీన్‌ టీకాల పట్టీలో సిఫార్స్ చేసినది. అమెరికా లో ఈ వాక్షిన్‌ వాడడము వలన హిబ్ బాదితులు 40-100 / 100,000 నుండి 1-3 / 100,000 వరకు తగాయని రికార్డ్స్ ద్వారా తెలుస్తూ ఉంది.

హిబ్ వాక్షిన్‌ వేయవలసిన వయసు వివరాలు :

06 వారాలు -- హిబ్ 1,
10 వారాలు -- హిబ్ 2,
15-18 వారాలు -- హిబ్ బూష్టర్ ,

  • హిబ్ చరిత్ర వివరాలు :
1985 లో అమెరికాలో Polysaccharide vaccine మొదట తయారుచేయబడింది . దీని చర్య(రెస్పాన్స్ ) 18 నెలలలోపు పిల్లలో అంతగా కనబడలేదు . అందుకే దీనీ మరింత అభివృద్ది చేసి Conjugate vaccine ను తయారుచేసారు. ప్రస్తుతానికి దీనినే వాడుతూ ఉన్నారు. దీనిలో హిబ్ పాలీసాక్కరైడ్ కి ఒక పోటీన్‌ ని కాంజుగేట్ చేయబడినది.
దీనిలో అభివృద్ధి దిశగా Multiple combinations of Hib and other vaccines తయారీ వాడుకలోనికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో హిబ్ వాక్షిన్‌ తో diphtheria-tetanus-pertussis–polio vaccines and Hepatitis B vaccines మిలితం చేసి అమెరికాలో వాడుతూ ఉన్నారు.
హిబ్ -Haemophilus influenzae type b వాక్షిన్‌ non-type B disease పనిచేయదు (రక్షణ నివ్వ్దు).. ఈ నాన్‌ బి. ఇన్‌ఫ్లూయంజా చాలా అరుదుగా మానవాళి లో కనబడుతూ ఉంది. . . కావున ప్రమాదమేమీ లేదు .

పసిపిల్లలు పూవులాంటి వారని అంటారు. తేమ కాస్త ఎక్కువైతే పువ్వులు కుళ్లి పోతాయి, కాస్త తగ్గితే వాడిపోతాయి. పసివాళ్లు కూడా అంతే. ఏది ఎంత అవసరమో వారికి అంతే అందించాలి. ఏది ఎక్కువతక్కువలైనా సమస్యే. అందుకే వాళ్లని మల్లెపూవులా పదిలంగా చూసుకోవాలి.
------------------------------------------------
సంక్షిప్త పదాలు:
------------------------------------------------
బి .సి .జి = బేసిలస్ కాల్ మేట్ గ్యారిన్,
ఒ .పి. వి = ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అనగా నోటిలో వేసే పోలియో చుక్కలు,
డి .టి.డబ్ల్యుడి = డిఫ్తిరియా,టెటనెస్, హొల్ సెల్ పెర్టుసిస్,
డి .టి = డిఫ్తిరియా మరియు టెటనెస్ టాక్సాయిడ్,
టి, టి = టెటనెస్ టాక్సాయిడ్,
హెప్ ,బి = హెపటైటీస్ బి వ్యాక్సిన్,
ఎమ్ .ఎమ్ .ఆర్ = మిజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్.
హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్.
ఐ .పి .వి = ఇన్ యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్.
టి .డి = టెటనెస్,డిఫ్తిరియా టాక్సాయడ్ తగ్గించిన మోతాదు.
టి. డి.ఆప్ = టెటనెస్,డిఫ్తిరియా యొక్క తగ్గించిన మోతాదు మరియు యేసెల్యులర్ పెర్టుసిస్.
హెచ్ .పి .వి = హ్యుమన్ పెపిల్లోమా వైరస్ వ్యాక్సిన్.
పి .సి .వి = న్యూమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్.
డిటాప్ = డిఫ్తిరియా, టెటనస్, యేసెల్యూలర్ పెర్టుసిస్ వ్యాక్సిన్.
పి.పి.వి 23 = 23 వేలంట్ న్యూమోకోకల్ పోలీ సేకారైడ్ వ్యాక్సిన్.

కొత్తగా వాడుకలోకి వచ్చిన రోగ నిరోధక మందులు అనగా హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ (నీటి ద్వారా సంక్రమించే పచ్చకామెర్లు), హెమ్ బి వ్యాక్సిన్ మరియు వెరిసెల్లా (ఆటలమ్మ / చికెన్ పాక్స్) రోగ నిరోధక మందులు పిల్లల వైద్యనిపుణులు వాడుటలో ఒక వైద్యునికి మరో వైద్యునికి చాలా వైరుధ్యం వుంటుంది. పిల్లల తల్లిదండ్రులతో పిల్లల వైద్యనిపుణులు చర్చించి వీటిని వాడాలి. ప్రస్తుతం దేశంలో ఇప్పుడు అమలులో వున్న రోగ నిరోధక మందుల కార్యాచరణ ప్రణాళికలో పైన పేర్కొన్న రోగ నిరోధక మందులను ఇంకా చేర్చలేదు. ఈ రోగ నిరోధక మందుల ఖరీదు, పిల్ల వాని వయస్సు, తల్లి దండ్రుల ఇబ్బందులు, వీటి వాడకంలో పిల్ల వానికి వచ్చే ప్రమాదాలు మరియు వైద్యుడు, పిల్లవాని తల్లిదండ్రుల మధ్య చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం మొదలైన అంశాల ఆధారంగా వివేచనతో వీటిని వాడాలి.
  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/