Saturday, February 26, 2011

సంతానలేమికి కారణాలు,infertility Causes,Why do some couple have no children?



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంతానలేమికి కారణాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-ఆధునికత పెరిగిన కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, పొగతాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా సమస్యల కు కారణమవ్ఞతున్నాయి. అలాంటి వాటిలో సంతానలేమి కూడా ఒకటి. ప్రతి ఇరవై జంట ల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. అందుకే సంతాన సాఫల్యత కేంద్రా లకు వచ్చే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

సాధారణంగా పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఏడాదిలోపైతే 75 శాతం అవకాశం ఉంటుంది. 85 నుంచి 90 శాతం మందిలో పెళ్లయిన రెండేళ్లలోగా గర్భం రావచ్చు. రానియెడల ఆ స్థితిని ప్రాధమిక సంతానలేమి (primary ifertility) అంటాము .

పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?,
పెళ్లవగానే అందరూ ఎదురుచూసే తీపి కబురు కొత్త పెళ్లికూతురు నెల తప్పడం. కొంతమంది ఈ కబురు త్వరగా చెప్పేస్తారు. మరికొంతమందికి ఇలాంటి కబురు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు .కారణము తెలియదు .

ఎవరు కారకులు?
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇటువంటి కేసుల్లో 33 శాతం మగవారు, 33 శాతం ఆడవారు కారణం కాగా మిగిలిన 34 శాతానికి కారణాలు పూర్తిగా తెలియరావడం లేదు. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దీనివల్ల కొంతమందికి సంతాన సామర్ధ్యం ఉండడం లేదు. వేగంగా వాహనాలు నడపడం, అతిగా మద్యం సేవించడం, తినకూడనివి తినడం వంటి వాటివల్ల మగవారిలో పునరుత్పత్తి శక్తి దెబ్బతింటోంది. కొంతమంది మగవారిలో 35 సంవత్సరాలకే వీర్యంలో క్వాలిటీ తగ్గిపోతోంది. అటువంటి వారికి పిల్లలు పుట్టించే సామర్ధ్యం క్షీణించిపోతుంది. కొన్ని పరిశ్రమల్లో పనిచేసే మగవారి వృషణాలు ఎక్కువ ఉష్ణానికి గురికావడం వల్ల వారి వీర్యం పలుచబడిపోయి సంతానం పొందే సమర్థత కోల్పోతున్నారు. చిన్నతనంలో గవదలు వంటి రోగాల వల్ల శాశ్వతంగా వృషణాలు హానికి గురవుతుంటాయి.

మగవారిలో వంధత్వానికి కారణాలు

* ఏదో ఒక రకమైన అనారోగ్యం
* వైద్య చరిత్ర (గవద బిళ్లలు, సుఖరోగాల వంటివి)
* శస్త్రచికిత్సల చరిత్ర (వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా మరమ్మతు, శస్త్రచికిత్స వంటివి)
* వృత్తిపరమైన ప్రమాదాలు ( అధికంగా వేడికి గురికావడం, విష పదార్థాల ప్రభావానికి లోను కావడం వంటివి)
* ఔషధాలు (కీమోథెరపీ)
* పొగతాగడం, మద్యం సేవించడం.

ఆడవారిలో కారణాలు

*వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వైద్య చికిత్స చేయించినా ఇటువంటి వారిలో సత్ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తక్కువ వయసుగల యువతుల్లో అండాశయం పలుచగా ఉంటుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.

* గైనకాలజీ పరిస్థితులు
* అండాశయం సరిగా పనిచేయలేకపోవడం, రుతుస్రావం బాగా తగ్గిపోవడం, సెర్వికల్‌ మ్యూకస్‌ లోపాలు, యుటిరిన్‌ ఫైబ్రాయిడ్స్‌, ఎండోమెట్రియోసిస్‌... మొదలైనవి.
* సంధాన సమస్యలు
* క్రమరహిత రుతుస్రావం
* పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (ప్రస్తుతం లేదా పూర్వం)
* టి.బి (క్షయ) వంటి ప్రస్తుత రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
90 శాతం స్త్రీలు ఏడాదిలోపుగానే గర్భం ధరిస్తారు. క్రమం తప్పకుండా శృంగార జీవితం గడిపే దంపతుల విషయంలో 95 శాతం స్త్రీలు రెండు సంవత్సరాలలోపు గర్భం ధరిస్తారు. ఈ కాల వ్యవధిలో సంతానం కోసం చికిత్స అవసరం లేదు. ప్రయత్నించినా సాధారణంగా వైద్య చికిత్సకు వైద్యులు ఇష్టపడరు. ఈ సమయం దాటితే స్పెషలిస్టుని సంప్రదించడం మంచిది.

వైద్యుని దగ్గరకి ఎప్పుడు వెళ్లాలి?

*పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలుగకపోతే ,
*స్త్రీ వయసు 38 సంవత్సరాలు దాటితే ,
*మగవారిలో తక్కువ లేదా అసాధారణ వీర్య కణాలు ఉన్నప్పుడు.
*వంధత్వానికి కారణాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వైద్యచికిత్స ప్రారంభిస్తారు.

కొన్ని ముఖ్య సంగతులు

పిల్లలు కలుగని దంపతుల్లో 15శాతం మందిలో లోపానికి ఒకటికి మించి కారణాలు ఉంటాయి. మగవారికి వీర్యపరీక్ష ప్రాథమిక పరిశోధనగా చేయిస్తారు. వీర్యం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోతే రెండు లేదా మూడు నెలల కాలవ్యవధిలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వైద్యచికిత్సలు అవసరం మేరకు అందిస్తారు. ఆడవారి విషయంలో వైద్య పరీక్షలు కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. రుతుచక్రంలో వేర్వేరు సమయాల్లో అనేక హార్మోన్ల స్థాయిని కనుగొంటారు. దాన్ని బట్టి అండాశయంలో అండం విడుదల లోపాలను తెలుసుకుంటారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ఆడవారిలో 20 శాతం మందికి అండాశయ సమస్యలు ఉంటాయి. క్రమ పద్ధతిలో అండం విడుదల కాకపోతే హార్మోన్ల చికిత్స చేస్తారు. ఆడవారికి సెర్వికల్‌ మ్యూకస్‌ దళసరిగా తయారై ఉండడం, మగవారికి శీఘ్రస్కలనం, మగతనం లేకపోవడం లేదా తదితర శారీరక అసాధారణాలు ఉంటే స్త్రీ సెర్విక్సులోకి వీర్యాన్ని పంపుతారు.

ఇటువంటి చికిత్స ఆరోగ్యకరమైన ఫెలోపియన్‌ ట్యూబులు గల ఆడవారికే వీలవుతుంది. గర్భం ధరించే అవకాశాలు పెంచేందుకు స్త్రీలకు ఫెర్టిలిటి ఔషధాలు ఇస్తారు. దీనివల్ల అండాశయం నుండి కనీసం ఒక అండమైనా విడుదలయ్యేందుకు ఉత్తేజం కలుగుతుంది. కొంతమందికి అండంతో వీర్యకణాలు ఫెలోపియన్‌ ట్యూబ్‌లో సాధారణ పరిస్థితిలో కలవడం చాలా కష్టం లేదా అసంభవం కావచ్చు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా శరీరానికి వెలుపల ఒక గ్లాసు డిష్‌లో వీర్యం, అండం ఫలదీకరణ చెందిస్తారు. దీనినే కల్చర్‌ డిష్‌ అంటారు. సంతానం పొందేందుకు ఇంకా ఎన్నెన్నో అధునాతన విధానాలు అమల్లోకి వచ్చాయి. కేసును బట్టి వైద్య నిపుణులు తగిన పద్ధతి ఎన్నుకుంటారు.


ఇంకా కొన్ని కారణాలు :
హార్మోన్లలో తేడాలున్నా,
గర్భాశయంలో అనుకూల పరిస్థితులు లేకపోయినా గర్భం నిలవదు.
అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయకున్నా,
లోపభూయిష్ఠ అండాలు విడుదలైనా,
ఫెలోపియన్‌ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు. అంతేకాదు ,
క్షయ, ‌ వ్యాధులుంటే ,
ఎండోమెట్రియాసిస్ వ్యాధులుంటే ,
గర్భా శయం, దాని ముఖద్వారంలో చిక్కని ద్రవాలు ఉత్పత్తి అయి అడ్డు యేర్పడినా.

ఈ ద్రవాల గాఢతలో చాలా మార్పులు ఉం టాయి. అందువల్ల వీర్యకణాలు లోపలికి రాలేవు . పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉం డటం ఎక్కువ మందిలో కనిపి స్తుంది. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ వీర్యం లో 60 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే సం తానం కల గడం కష్టమవ్ఞతుంది. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ పరీక్ష చేస్తే తప్ప లోపం ఎవరిలో ఉందో, సమస్యకు పరిష్కారం ఏమిటో తేలదు.

ఫెలోపియన్‌ ట్యూబ్‌లో లోపం ఉన్నప్పుడు లాపరోస్కోపిక్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలా వీలుపడకపోతే ఐవిఎఫ్‌ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు. ఈ విధానాన్నే టెస్ట్‌ ట్యూబ్‌ పద్ధతి అంటారు. గర్భాశయ ముఖద్వారం లో సమస్యలుంటే ఐయుఐ పద్ధతి ద్వారా కృత్రిమంగా వీరాన్ని సరాసరి గర్భాశయ ముఖద్వారం వద్దకు పంపిస్తారు.

వీర్యకణాలు అతి తక్కువ ఉన్న యెడల ఇక్సీ టెక్నిక్‌ ద్వారా సంతానప్రాప్తి కలిగించవచ్చు. వీర్యంలో కణాలు లేకుంటే నేరుగా బీజము నుండి కణాలను తీసే పద్ధతిలో సంతాన ప్రాప్తిని కలిగించవచ్చు. సాదారణముగా వీర్యకణాలు 60,000,000/క్యూబిక్ మి.మీ. ఉండాలి .
  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-చాలామందికి చెవిలో విపరీతమైన పోరు ఉంటుంది. ఇలా చెవిలో హోరు వినిపిస్తోంటే చాలావరకు శ్రవణ నాడి దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. కర్ణభేరికి రంధ్రం, చెవికి ఎముకలు బిగిసినా, గొలుసు కదిలిపోయినా, మధ్యచెవిలో దీర్ఘకాలం స్రావాలు చేరినా, గట్టిగా తలకు దెబ్బ తగిలిన్ఠా, మెదడులో రక్తనాళాల వ్యాధి లేక కంతులు ఏర్పడినా లేక గువిలితో పూర్తిగా నిండి చెవి మూసుకున్నా చెవిలో హోరు రావచ్చు. కేవలం హోరు మాత్రమే ఉండి వినికిడిలో మార్పు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నరాలు దెబ్బతిని వినికిడి కూడా తగ్గవచ్చు. కాబట్టి ముందుగా హోరుకు సరైన కారణం, నిర్థారణ చేయవలసి ఉంటుంది.

పరీక్షలు
-పూర్తి వివరాలు తీసుకున్నాక చెవిపరీక్ష .
ఆడియోగ్రామ్‌ వంటి వినికిడి పరీక్షలు ,
అవసరమైతే సి.టి.స్కాన్‌, ఎమ్‌.ఆర్‌.ఐ.

చికిత్స:

- వినికిడి లోపం లేకుండా కేవలం హౌరు మాత్రమే ఉంటే మీరు అనుమానాలు భయాలు పెట్టుకోకుండా దానితో జీవించడానికి అలవాటు పడాల్సి ఉంటుంది.

- వినికిడి లోపం కూడా ఉంటే, వినికిడి యంత్రం సహాయపడుతుంది.- ఇది చాలా మటుకు హౌరుని తగ్గిస్తుంది.

- అలాగే లోపలి హౌరు ఇబ్బంది పెట్టకుండా రక రకాల మార్గాలను అనుసరిం చవచ్చు.

- ముందుగా సాధ్యమైనంత వరకూ దానిని పట్టించు కోకూడదు.

- ఆధునికంగా బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ లోపలి హౌరును తగ్గించే టినెటస్‌ మాస్కర్లను అవస రాన్ని బట్టి వాడవచ్చును. కాబట్టి నిపుణు లను సంప్రదిస్తే 'టినెటస్‌' హౌరుకి తగిన సలహాలు, చికిత్స పొందవచ్చును.
- తీవ్ర జలుబు, ఇతర వ్యాధులు ఈ టినెటస్‌కు కారణం కాదని నిర్ధారణ చేసుకున్నాక, ముఖ్యంగా వైద్యులు రోగికి మనోధైర్యం యివ్వాలి.

- ఈ లక్షణాల నుంచి దృష్టిని మరల్చుకోవాలి. ఇంకో వ్యాపకంపై దృష్టిని పెట్టుకోవాలి.

ఇంగ్లిష్ మందులు :
Tab . Diziron 1 tab 3 times / day 3-4 days
Tab. vertizac 1 tab 2 time /day 5-7 days
Tab .vertin 1 tab 2 times / day 4-5 day
పై మందులలో ఏదో ఒకటే వాడాలి . దానితో బి.కాంప్లెక్ష్ మాత్రలు వాడాలి
Tab . beplex forte 1 tab daily for 15 to 20 days.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/

Thursday, February 24, 2011

రజస్వల,Menarche



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రజస్వల - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆట పాటలతో అల్లరిచేసే చిన్నారి శరీరము లో హఠాత్తుగా వచ్చిన మార్పుకు అటు తల్లీ ఇటు బిడ్డా ఇద్దరూ కంగారుపడతారు . ఎవరెంత కంగారుపడినా అందోళన చెందినా ఇది సహజ పరిణామము . . శారీరక ఎదుగుదళ లలో బాగము . అమ్మాయి వయస్సు పదేళ్ళు దాటిన తర్వాత శారీరక స్థితిని అనుసరించి ఎప్పుడైనా రజస్వల కావచ్చు. నేటి కాలంలోఆడపిల్లల్లో రజస్వల వయస్సు త్వరగా వచ్చేస్తున్నదని పోషకాహారము , పరిసరాల (టి.వి) స్టిములేషన్‌ ఇందుకు కారణమేననిపుణులు చెప్తున్నారు . కాబబట్టి పిల్లలు ఐదు తరగతులకు చేరగానే వారికి తమ శరీరం గురించిన పరిజ్ఞానమును , మార్పులను తెలియజెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు .

యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని రజస్వల లేదా పుష్పవతి (Menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.


బహిస్ట రకము లో ఏముంటుంది : ప్రతి నెల అండము విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లో తయారవుతుంది. బహిష్ట ఫ్లో(రక్తము)(consists of a combination of fresh and clotted blood with endometrial tissue) మంచి, చెడు రక్తము, విచ్చిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారు గా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.

ఋతుక్రమము దగ్గరలో మార్పులు :
ఋతుక్రమము దగ్గరపడగానే స్తనాలు బరువుగా .. చాలా సున్నితముగా మారుతాయి . స్త్రీ జీవితం పూర్తిగా హార్మోనల్ నెలసరులతో నిండి ఉంటుంది . ప్రధాన హార్నోన్‌లు అయిన ఈస్ట్రోజన్‌ , ప్రొజెస్ట్రోన్‌ ల నడుమ ఉండే సహజ వ్యత్యాసాల రీర్యా నెలసరులు ఉంటాయి. రెండో స్త్రీతత్వ లక్షణమైన స్తనాల ఎదుగుగలకు కూడా ఇవే కారణమవుతాయి. కాబట్టి అమ్మాయి జీవితం తో స్తనాల ఎదుగుదల రజస్వల ఒకేసారి సంబవిస్తాయి. నెలసరిలో హార్మోనులు స్తనాల్ని ప్రభావితం చేస్తాయి. ప్రొజెస్టరాన్‌ ప్రభావము వల్ల కొద్దిగా నొప్పిగా(tender)మారుతాయి .. వాపూ ఉంటుంది. దాదాపు మహిళలందరికీ ఈ మార్ప్లులు సహజము , కొందరికి మరీ సున్నితం గా ఎక్కువ కాలము ఉంటుంది. దీనికి ఉపశమన మార్గము అవసరము లేదు . అవి సహజమేనని సర్ది చెప్పుకోవడం మే అలవాటు చేయాలి . మరీ ఇబ్బదిందిగా , నొప్పిగా బరువుగా ఉంటే తక్కువ దోసులో డైయూరెటిక్స్ (Lasix .tabs) 1-2 రోజులు ఇవ్వాలి , దీనివలన అసౌకర్యము తగ్గుతుంది .

ఆలస్యంగా రజస్వల అవడము

కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి 'ప్రైమరీ ఎమెనూరియా' కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు ... ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.

కారణాలు

* విపరీతమైన డైటింగు చేయడం
* ఎడతెరిపిలేని వ్యాయామాలద్వారా బాగా బరువుతగ్గడము
* పోషకాలు, పోషకాహారము అందకపోవడము
* స్థూలకాయము
* దీర్గకాళిక అనారోగ్యము
* పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు,
* థైరాయిడ్ సమస్యలు
* అండకోశ వ్యాధులు , మున్నగునవి.

ఋతుచక్రం (Menstrual cycle) స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. పూర్వం ఇలా నెలసరి లో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా ముట్టు అంటు బహిష్టు మైల అంటూ ఆరోగ్యకారణాల రీత్యా ఇంటి బయటే ఉంచేవారు. కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. ఇప్పుడు ముట్టు గుడ్డల(Napkins) వాడకంతో స్త్రీలు తమ తమ పనులు మామూలుగానే చేసుకోగలుగుతున్నారు.పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ (ముట్లుడిగిపోవటం) అంటారు.

నెలసరి నేప్కిన్లు

గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో నెలసరి సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం రుతుక్రమం వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లు (ముట్టు బట్టలు,ప్యాడ్లు/నేప్కిన్లు) ప్రభుత్వం అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్‌ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.

పి.ఎమ్.ఎస్.

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome): పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.

* బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
* జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
* పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
* వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
* కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ,
* తీపి తినాలనిపించడము.

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని ,ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంత వైవిద్యముగల లక్షణాలున్న ఈ పరిస్తితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.బహిష్టు కాలంలో నొప్పి ఎర్రబట్ట మరియు తెల్ల బట్ట తగ్గటానికి ట్రీట్మెంటు తీసుకుంటూ ఉండాలి .

* 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి .
*మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
* క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.
* క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
* కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
* నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.
బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటే - tab. Styptochrome లేదా tab.Keutan C అనే మాత్రలు రోజుకు 3 చొప్పున్న 2-4 రోజులు తీసుకోవాలి .

డిస్మెనోరియా Dysmenorrhea:
డిస్మెనోరియా (Dysmenorrhea) అనేది బహిష్టు సమయంలో చోటు చేసుకునే నొప్పికి సంబంధించిన ఒక స్త్రీ జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరిస్థితి, అది రోజువారీ చర్యలకు ఆటంకం కలిగించేదిగా ఉంటుంది ఇప్పటికీ, డిస్మెనోరియాను తరచుగా బహిష్టు నొప్పి గా నిర్వచించబడింది, రోజువారీ చర్యలకు ఆటంకం కలిగించే నొప్పి, డిస్మెనోరియా వివిధరకాల నొప్పులను కలిగి ఉండవచ్చు, ఇందులో కోతవలే అనుభవం కలగడం, నాడి అధికంగా కొట్టుకోవటం, మందకొడితనం, వికారం, మండుతున్నట్టు లేదా పోటు ఉంటుంది. రుతుస్రావం కన్నా అనేక రోజుల ముందు లేదా దానితో పాటు డిస్మెనోరియా ఉండవచ్చు, సాధారణంగా రుతుస్రావం తగ్గినప్పుడు ఇది తగ్గిపోతుంది. డిస్మెనోరియా అధిక రక్త నష్టంతో పాటు కూడా సంభవించవచ్చు, దీనిని మెనరాజియా అని పిలుస్తారు.

గర్భాశయం లోపల లేదా వెలుపల దాగి ఉన్న వ్యాధి, క్రమభంగం లేదా నిర్మాణాత్మక అసాధారణత లక్షణాలను ఆపాదించినప్పుడు ద్వితీయ స్థాయి డిస్మెనోరియా (Secondary Dysmenorrhea) ను నిర్థారించబడుతుంది. ఇందులో ఏ ఒక్కదాన్ని గుర్తించనిచో ప్రాధమిక డిస్మెనోరియా ( Primary Dysmenorrhea) గా నిర్థారించబడుతుంది.

చికిత్స :
Tab. Meftal spas ... 1 tab 3 times /day 2-3days or
Tab. Dysmen .... 1 tab 3 times / day 2-3 days వాడాలి .


  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, February 23, 2011

మద్యంతో అనారోగ్యము,Alcoholism ill-health


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మద్యంతో అనారోగ్యము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే నిద్రపట్టక సతమతమయ్యే కొందరు పడుకునేముందు మద్యం తాగటాన్నీ అలవాటు చేసుకుంటుంటారు. కానీ ఇది నిద్రా సమయాన్ని తగ్గించటమే కాదు, నిద్రాభంగాన్ని కూడా కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తాగగానే నిద్ర పట్టేమాట నిజమే గానీ.. ఇది కొద్దిగంటలు మాత్రమే. ఆ తర్వాత వెంటనే మెలకువ వచ్చేస్తుంది. అలాగే పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు. ఈ దుష్ప్రభావాలు పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే అధికంగా ఉంటున్నట్టూ బయటపడింది. నిద్రపై మద్యం ప్రభావం అనే అంశంపై ఇటీవల మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. 20 ఏళ్ల యువతీ యువకులను ఎంచుకొని ముందురోజు మద్యం కలిపిన చల్లటి పానీయాన్ని తాగించారు. మర్నాడు ఆ పానీయంలో వాసన రావటానికి కేవలం కొన్ని చుక్కల మద్యం కలిపారు. అనంతరం వీరిని పరిశీలించగా.. వాళ్లు మద్యం తాగిన వెంటనే నిద్ర పోయినప్పటికీ ఆ తర్వాత చాలాసార్లు మేల్కొన్నట్టు గుర్తించారు. మగవారి కన్నా స్త్రీలు 19 నిమిషాల సేపు తక్కువ నిద్రపోయారు. కలత నిద్ర సమయం 4 శాతం పెరిగింది కూడా.



మద్యపానము వల్ల నష్టాలు అవగాహన,Alcohol habit and ill-health awareness



  • image : Courtesy with Eenadu news paper

ఒకప్పుడు తాగటం పెద్ద తప్పు. ఇప్పుడు అదే పెద్ద ఫ్యాషన్‌! కాలమాన పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు. దాంతో పాటు మన అలవాట్లూ మారిపోయి ఉండొచ్చు. కానీ మద్యం వల్ల సంప్రాప్తించే నష్టాలుగానీ.. శారీరకంగా మానసికంగా సామాజికంగా అది చేసే చేటుగానీ ఏమాత్రం మారలేదు.. మారదు కూడా! ఎందుకంటే మద్యం మనిషికి శత్రువు. మన ఆరోగ్యానికి శత్రువు. మన శరీరంలోని చాలా అవయవాలకు శత్రువు. ముందు మద్యం మనం తాగుతున్నామనుకుంటాం. కానీ ఒక దశకు చేరిన తర్వాత అది మనల్ని మింగేయటం ఆరంభిస్తుంది. ఒళ్లంతా కబళించటం మొదలుపెడుతుంది. ఈ అవగాహన పెరిగితే.. కొందరైనా మద్యానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారన్న ఆశ.


ఇటీవలే 'మద్యం'పై వైద్యపరంగా ఓ విస్తృతమైన అధ్యయనం జరిగింది. మద్యానికి బానిసలైన వేలాది మందిని పరిశీలిస్తే- సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే వీరిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. శారీరక రుగ్మతలు, జబ్బులన్నింటినీ వేరు చేసి చూస్తే.. చివరికి వీరిలో మరణానికి 'మద్యం' అతి ముఖ్యకారణంగా నిలుస్తోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాల్లో 4%, అన్ని జబ్బుల్లో 5%.. కేవలం ఆల్కహాల్‌ వల్ల సంప్రాప్తిస్తున్నవే. దీన్నిబట్టి అర్థమయ్యేదేమంటే- ఎంత తక్కువ తాగితే అంత మంచిదని! కానీ మన దేశంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

దేశంలో మద్యం వినియోగం ఏటా 30% శాతం పెరుగుతోందని గొప్పగా చెప్పుకొంటున్నాం. 2015 నాటికి దేశంలో 1,900 కోట్ల లీటర్ల మద్యం వినియోగమవుతుందని, ఈ మద్యం మార్కెట్‌ 1.4 లక్షల కోట్లకు చేరుతుందని ఘనంగా లెక్కలేస్తున్నాం. సామాజిక అలవాట్లు, కట్టుబాట్లు మారిపోతూ మద్యం ప్రభావం నానాటికీ పెరిగిపోతుండటం ఏ ముప్పులకు దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు మితంగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు మంచిదన్న ప్రచారంతో దీన్నో సాకుగా తీసుకుని మందు గ్లాసు పట్టుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. కానీ మద్యం కొద్దిగా ఎక్కువైనా.. ఏ కొంచెం మితిమీరినా ఆరోగ్యం సంపూర్ణంగా దెబ్బతింటుంది. లివర్‌ ఒక్కటే కాదు.. శరీరంలోని దాదాపు అన్ని అవయవాలూ పడకేస్తాయి.. మనల్ని ముంచేస్తాయి!

  • కాలేయం (లివర్‌)
మద్యం తాగితే లివర్‌ చెడిపోతుందన్నది ఇప్పుడు చాలామందికి తెలిసిన విషయమే. కానీ దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియటం చాలా ముఖ్యం. మద్యం కారణంగా వచ్చే దీర్ఘకాలిక లివర్‌ వ్యాధిలో ప్రధానంగా నాలుగు దశలున్నాయి. వీటిలో సర్వసాధారణమైనది, కాలేయాన్ని ఓ మోస్తరుగా దెబ్బతీసేది- కొవ్వు పట్టటం! దీన్నే 'ఫ్యాటీ లివర్‌' అంటారు. ఈ సమస్యను అల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా తేలిగ్గానే గుర్తించొచ్చు. ఈ దశలో మద్యం మానేస్తే దెబ్బతిన్న లివర్‌ పూర్తి ఆరోగ్యంగా కోలుకునేలా కూడా చూడొచ్చు. ఈ దశలో కూడా ఇంకా తాగుతూనే ఉంటే.. దీర్ఘకాలిక వ్యాధులైన హెపటైటిస్‌, లివర్‌ సిరోసిస్‌ వంటివాటికి దారి తీస్తుంది. సిరోసిస్‌ అంటే- మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిపడిపోయి బుడిపెలు బుడిపెలుగా తయారై.. మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. ఇవే కాదు, పరిస్థితి లివర్‌ క్యాన్సర్‌కూ దారితియ్యచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది- లివర్‌ ఈ స్థితికి చేరితే ఇక ఎన్ని చికిత్సలు చేసినా అది కోలుకుని ఆరోగ్యంగా తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఈ లివర్‌ సిరోసిస్‌ కారణంగా పేగుల్లో రక్తస్రావం, పొట్టలో నీరు చేరటం (జలోదరం), కామెర్లు, మతి భ్రమణం వంటి సమస్యలూ ఎక్కువవుతాయి. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. అందుకే 'ఫ్యాటీ లివర్‌' సమస్య వచ్చిన తర్వాత కూడా ఇంకా తాగటమన్నది చాలా ప్రమాదకరమని గుర్తించాలి.

** మద్యానికి బానిసలైన ప్రతి 10 మందిలో కనీసం ఇద్దరికి ఎంతోకొంత లివర్‌ దెబ్బతినే ఉంటోంది.
** మద్యం మూలంగా లివర్‌ దెబ్బతినే రిస్కు స్త్రీలలో ఎక్కువ. అలాగే బరువెక్కువ ఉన్నవారు, స్థూలకాయుల్లో ఎక్కువ.
** మిగతా సమయాల్లో కంటే మద్యాన్ని కేవలం భోజన సమయంలో మాత్రమే తాగితే లివర్‌ దెబ్బతినే రిస్కు కొంత తక్కువని గుర్తించారు.

  • జీర్ణాశయం
ఎంత తాగితే జీర్ణ వ్యవస్థలో చికాకు అంత ఎక్కువవుతుంది. కొద్దిగా తాగినా.. అదిపెట్టే చికాకుతో జీర్ణాశయం ఆమ్లాన్ని (ఆసిడ్‌) ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనితో ఆమ్లం పైకి ఎగదన్నటమే (రిఫ్లెక్స్‌/అసిడిటీ)సమస్యలే కాదు.. జీర్ణాశయం పూత (గ్యాస్త్ట్రెటిస్‌) కూడా రావచ్చు. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు.. మరీ ఎక్కువగా తాగేవారిలో జీర్ణాశయంలో రక్తస్రావం కూడా అవ్వచ్చు. మద్యానికి బానిసై ఏళ్లపాటు తాగుతుండే వారిలో ఇది జీర్ణాశయం క్యాన్సర్‌కు కూడా దారితియ్యచ్చు. మద్యం తాగేవారిలో పేగుల్లో పుండ్లు (అల్సర్లు)పడే అవకాశమూ ఎక్కువే.బాగా తాగినప్పుడు వాంతి సాధారణమేగానీ.. వీటితోనూ తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరిగా స్పృహలో లేనప్పుడు వాంతి అయితే.. పొలమారినట్లే ఆ పదార్థం ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోవచ్చు. దగ్గుతో దాన్ని బయటకు తెప్పించలేకపోతే పరిస్థితి మరణానికి కూడా దారి తీస్తుంది. బలవంతంగా తోసుకొచ్చే వాంతులతో గొంతు చిట్లి రక్తం రావచ్చు. కొన్నిసార్లు అదీ తీవ్ర సమస్యలకు దారితియ్యచ్చు.

  • క్యాన్సర్లు
మితిమీరిన మద్యం.. లివర్‌ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌.. ఇలా చాలా క్యాన్సర్లకు ఇదే మూలం. ముఖ్యంగా నోరు, జీర్ణ అవయవాల్లో సంప్రాప్తించే క్యాన్సర్లకు- పొగ తర్వాత ఇదే అతి ముఖ్య కారణం. ఇక మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 20% వరకూ క్యాన్సర్ల రూపంలో సంప్రాప్తిస్తున్నవే. పట్టణ ప్రాంతాల్లో స్త్రీలు, యువతుల్లో మద్యం అలవాటు పెరుగుతోంది, దీనితో పాటే రొమ్ము క్యాన్సర్‌ కేసులూ పెరుగుతుండటం గమనించాల్సిన అంశం. ఇప్పటికే హెపటైటిస్‌-బి, సి వంటివి ఉన్నవారు మద్యం తీసుకుంటుంటే వారిలో లివర్‌ క్యాన్సర్‌ ముప్పు మరీ పెరుగుతోంది. ఒంట్లో ఈ వైరస్‌లున్న ప్రతి ఐదుగురిలో ఒకరు క్రమేపీ సిరోసిస్‌, లివర్‌ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. ఇక రోజూ తాగే ప్రతి రెండు యూనిట్ల మద్యంతో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు 8% వరకూ పెరుగుతోందని అధ్యయనాల్లో గుర్తించారు.

  • క్లోమం (పాంక్రియాస్‌)
క్లోమం అనేది మన జీర్ణప్రక్రియకు అత్యంత కీలకమైన ఎంజైములను, రక్తంలో గ్లూకోజును నియంత్రించేందుకు అవసరమైన హార్మోన్లను స్రవించే ముఖ్యమైన గ్రంథి. చాలామందికి ఇది ప్రాణాంతక సమస్యలను తెచ్చిపెట్టే వరకూ కూడా.. అసలు మన శరీరంలో ఇలాంటి గ్రంథి ఒకటి ఉందన్న విషయం కూడా తెలియదు. అతిగా మద్యం తాగటం వల్లఈ క్లోమ గ్రంథి వాచిపోయి.. ఇందులోని కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది, దీన్నే 'పాంక్రియాటైటిస్‌' అంటారు. ఇది ఉన్నట్టుండి ఉద్ధృతంగా (అక్యూట్‌) రావచ్చు, లేదంటే క్లోమం ఎప్పుడూ వాచే ఉండి.. దీర్ఘకాలికం (క్రానిక్‌)గా కూడా వేధించొచ్చు. ఇది ఉద్ధృతంగా (అక్యూట్‌) వచ్చినప్పుడు కొంతమందిలో కీలక అవయవాలు విఫలమైపోవటం, క్లోమం క్షీణించిపోవటం (నెక్రోసిస్‌), దాని మీద చీముగడ్డలు(ఆబ్సెస్‌),
నీటితిత్తులు(సిస్ట్‌లు) రావటం వంటి తీవ్రస్థాయి ప్రమాదాలూ ముంచుకొస్తాయి. కొద్దిమందిలో ఎన్ని చికిత్సలు చేసినా సమస్య ప్రాణాంతకంగా కూడా తయారవుతుంటుంది. మరికొందరిలో ఈ ఉద్ధృతమైన వాపు తరచూ వస్తూ.. దీర్ఘకాలిక వ్యాధిగా కూడా తయారవచ్చు. దీనివల్ల భరించరాని తీవ్రమైన కడుపునొప్పి, కొవ్వులు జీర్ణం కాకపోవటం, బరువు తగ్గిపోవటం, విరేచనాల వంటి బాధలు వేధిస్తాయి. ఈ సమస్యలు దీర్ఘకాలం ఉండేవారిలో క్లోమానికి క్యాన్సర్‌ కూడా రావచ్చు. ఇన్ని సమస్యలకు మితిమీరిన మద్యం కారణం కావచ్చన్న విషయం మర్చిపోకూడదు.

  • ఎంత తాగితే ఎక్కువ?
మద్యం ఎన్నో ఆరోగ్య, సామాజిక సమస్యలకు మూలం కాబట్టి ఎవరైనా అస్సలు మద్యం తాగకపోవటం ఉత్తమం. మరీ తప్పనిసరి అయితే- శుద్ధ ఆల్కహాల్‌ రోజుకు 3 యూనిట్లకు మించకుండా తాగాలి. ఇదేమిటో వివరంగా చూద్దాం. 10 మిల్లీ లీటర్లు లేదా 8 గ్రాముల శుద్ధ ఆల్కహాల్‌ను ఒక 'ఆల్కహాల్‌ యూనిట్‌'గా పరిగణిస్తారు. ఇది విస్కీ అయితే 25 మి.లీ., బీర్‌ అయితే ఒక పింట్‌లో మూడో వంతు, రెడ్‌వైన్‌ అయితే ఒక గ్లాసులో (175 ఎంఎల్‌) సగానికి సమానం. అంటే విస్కీ 75 మి.లీ., లేదా బీర్‌ అయితే ఒక పింట్‌ (సుమారు అరలీటరు), లేదా రెడ్‌వైన్‌ ఒకటిన్నర గ్లాసు మించకుండా చూసుకోవాలి. అంతకు మించితే మద్యానికి సంబంధించిన తీవ్రస్థాయి సమస్యలను వేగంగా రమ్మని చేజేతులారా ఆహ్వానిస్తున్నట్టే!

  • ప్రశాంతత.. ఓ భ్రమ!
చాలామంది తాగితే 'హాయిగా' ఉంటుందని, ఆందోళనలన్నీ తగ్గిపోతాయనీ, ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంటుందని, బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుందనీ.. ఇలా రకరకాల కారణాలతో తాగుతుంటారు. ఇక్కడ మర్చిపోతున్న అంశమేమంటే- ఎక్కువగా తాగేవారిలో వ్యసనాలే కాదు, మానసిక
సమస్యలు, వ్యాధులు కూడా ఎక్కువే. దీర్ఘకాలం మద్యం తాగటం వల్ల మెదడులోని రసాయనాల్లో మార్పులు వస్తాయి. అతిగా తాగేవారిలో ఆందోళన, కుంగుబాటు చాలా ఎక్కువ. ఆత్మహత్య భావనలు, తమకు తాము హాని చేసుకోవటం వంటివీ ఎక్కువే. కొన్ని వారాల పాటు మితిమీరి తాగుతుంటే మానసిక భ్రాంతులు, ఎవరో మనకు హాని చేయబోతున్నారన్న భ్రమల వంటివి (సైకోసిస్‌) పెరుగుతాయి. అతిగా తాగే అలవాటున్న వారు ఒక్కసారిగా మానేసినా.. తీవ్రస్థాయి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. మద్యం వల్ల జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా మెదడు 18, 19 ఏళ్ల వరకూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ వయసులో మద్యానికి బానిసైతే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

  • వూబకాయం
మద్యం ద్వారా చాలా క్యాలరీల శక్తి అదనంగా వస్తుంది, కానీ ఇది అనారోగ్య హేతువు! పోషకాహారం ద్వారా వచ్చే శక్తికి పోషకవిలువ ఉంటుందిగానీ దీనికి అదేం ఉండదు. అందుకే ఈ రకంగా వచ్చే శక్తిని 'ఎంప్టీ క్యాలరీస్‌' అంటారు. రెండోది- ఓ మోస్తరుగా తాగేవారు సగటున నెలకు 2,000 వరకూ అదనంగా క్యాలరీలను తీసుకుంటారని అంచనా. వైన్‌, బీరు వంటివన్నీ కూడా దాదాపు పిండి పదార్థాలు, చక్కెరలను పులియబెట్టటం ద్వారా తయారయ్యేవే. చక్కెరలు ఎక్కువ కాబట్టి వీటి ద్వారా క్యాలరీలూ ఎక్కువే వస్తాయి. కొన్నింటిలో దాదాపు ఇది కొవ్వులతో సరిసమానంగా కూడా ఉంటుంది. పైగా మద్యంతో పాటేనంజుకోవటానికి చికెన్‌ 65, జీడిపప్పు, వేయించిన చేప ముక్కల్లాంటి కొవ్వులు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ కూడా తినాలనిపిస్తుంది. వీటివల్లా క్యాలరీలు ఎక్కవ వస్తాయి. వీటన్నింటివల్లా వూబకాయం పెరిగిపోవటం తథ్యం. ఎన్ని వ్యాయామాలు చేసినా ఈ క్యాలరీలన్నీ ఖర్చవటం కష్టం, ఫలితంగా వూబకాయం, దానితో పాటే హైబీపీ, మధుమేహం, గుండెజబ్బులు, మోకాళ్లు అరిగిపోవటం వంటివన్నీ తయారవుతాయి.

  • మందులు
మద్యం ప్రభావం మనం తీసుకునే ఇతరత్రా మందుల మీదా ఉంటుంది. ముఖ్యంగా నిద్ర పట్టేందుకు ఇచ్చే డైజీపాం వంటివి, కుంగుబాటు తగ్గేందుకు ఇచ్చే ప్రొజాక్‌/ఫ్లుఆక్సిటిన్‌ వంటివి తీసుకునే వారు మద్యం జోలికి వెళ్లకూడదు. అలాగే మూర్ఛ, మధుమేహం వంటివాటికి దీర్ఘకాలం మందులు తీసుకునేవారు, రక్తం పల్చగా ఉండేందుకు వార్ఫారిన్‌ వంటివి తీసుకునేవారు మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు ఇచ్చే స్టాటిన్స్‌పై మద్యం ప్రభావం ఉంటున్నట్టు గుర్తించారు. అలాగే కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌ తీసుకుంటున్నప్పుడు మద్యం తాగకపోవటం ఉత్తమం. వీటి గురించి వైద్యులతో ముందే చర్చించటం అవసరం.

  • బానిస వ్యసనం
తాగకుండా ఉండలేకపోవటం, ఎంత తాగుతున్నామన్న దానిపై నియంత్రణ కోల్పోవటం.. ఇది మద్యం వ్యసనానికి బానిస అవుతున్నామని చెప్పే సంకేతం! దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇంట్లో వాతావరణం, అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి ఉండే కొన్ని వృత్తులు, లేదా సరదాగా సామాజిక సంబంధాల కోసం (సోషల్‌ డ్రింకింగ్‌) తాగాల్సి వస్తుండటం.. ఇవన్నీ కూడా వ్యసనాన్ని పెంచేవే. దీనికి బానిస కావటం వల్ల జరిగే చేటు: ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్య భావనలు పెరగటం వంటి మానసిక సమస్యల్లో కూరుకోవటంతో పాటు నిద్రలేమి, లైంగిక సామర్థ్యం తగ్గటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటివీ వేధిస్తాయి.

  • ఇంకా ఇంకా...
** అందానికి చేటు: మద్యం తాగే వారి స్వరూప స్వభావాలో్లనూ చాలా మార్పులు వస్తాయి. బాగా అలిసిపోయినట్లుండటం, ముఖం మీద మచ్చల వంటివి వస్తాయి. మద్యం ఒంట్లో ఉన్న నీటిని బయటకు పంపించేస్తుంది, కొన్ని విటమిన్లు, ఖనిజాలు చర్మానికి అందకుండా అడ్డుకుంటుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు, నిర్జీవంగా తయారవుతుంది. చర్మం తేలికగా ఎర్రబారిపోయేలా చేసే 'రొసాసియా' వంటి సమస్యలకూ మద్యంతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
** ఆటలకు దెబ్బ: మద్యం వల్ల క్రీడా సామర్థ్యం తగ్గుతుంది, వ్యాయామం సరిగా చేయలేరు. కాస్త ఎక్కువగా తాగినా యుక్తాయుక్త విచక్షణ పోయి నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది.
** సంతాన నష్టం: స్త్రీపురుషులు ఇరువురిలోనూ కూడా మద్యం సంతాన సామర్థ్యాన్ని, లైంగిక పటుత్వాన్ని తగ్గించేస్తుంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అతిగా మద్యం తాగితే టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గి.. పురుషుల్లో వాంఛలు తగ్గుతాయి, వీర్యం నాణ్యత తగ్గుతుంది. అయితే మద్యం మానేస్తే ఇవన్నీ సర్దుకుంటాయి.
** నిద్ర భగ్నం: నిద్రకున్న ముగ్గురు శత్రువుల్లో మద్యం పెద్ద శత్రువు. కాఫీ/కెఫీన్‌, పొగతో పాటు మద్యం కూడా నిద్రను దెబ్బతీస్తుంది. మద్యం వల్ల ఒంట్లో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. దీనివల్ల మధ్యరాత్రి టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. గుండెల్లో మంట, గురక వంటివీ పెరుగుతాయి.

** ప్రమాదాలకు దారి: పని ఎగ్గొట్టేవారిలో 20%, ఫ్యాక్టరీల వంటి పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల్లో 40% కేవలం మద్యం వల్లేనని గుర్తించారు. ఇక మద్యం కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. మద్యం వల్ల మెదడు చురుకుదనం తిగ్గి, వేగంగా స్పందించే లక్షణం దెబ్బతింటుంది. తలకు మెదడుకు గాయాలయ్యే తీవ్రస్థాయి ప్రమాదాల్లో 15-20% వరకూ కేవలం మద్యం కారణంగానే సంభవిస్తున్నాయి.

** ఇంట్లో చిచ్చు: మద్యం తెచ్చిపెట్టే అతిపెద్దసమస్య.. అందరికీ తెలిసిన సమస్య.. కుటుంబాలు విచ్ఛిన్నం కావటం! సంసారాలు వీధిన పడటం! భార్యల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించే భర్తల్లో 85% మంది మద్యానికి బానిసలైనవారే. మద్యం తగ్గించేలా చూస్తే గృహహింస కేసులు పదోవంతు తగ్గిపోతున్నాయని గుర్తించారు. మద్యం అలవాటు వల్ల అప్పులు పెరిగిపోవటం, పిల్లల చదువులు, ఇంట్లో తిండి వంటి వాటికి కూడా డబ్బుల్లేని దీనస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువ. మద్యం కారణంగా విడాకులకు వెళుతున్న జంటల సంఖ్య చాలా ఎక్కువ.

  • గుండె
ప్రస్తుతం గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజూ కొద్దిగా రెడ్‌వైన్‌ తీసుకుంటే గుండెకు మంచిదని చెబుతుంటే ఎవరికైనా గుండెజబ్బుల నివారణకు ఇదేదో తేలికైన మార్గమే అనిపిస్తుంది. రోజూ మితంగా మద్యం తీసుకోవటం గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు గుర్తించిన మాట నిజమేగానీ వాస్తవానికి ఈ లాభమన్నది కాలక్రమంలో 'ఎంత' తాగుతున్నారన్న దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు మనం తాగే అలవాట్లు, కుటుంబ చరిత్ర, వయస్సు, జన్యుపరమైన అంశాల వంటివీ కీలకమే. ముఖ్యంగా గుర్తించాల్సిందేమంటే- మితి మీరి తాగితే ఇది ప్రత్యక్షంగా గుండె జబ్బుకు ఓ ముఖ్యమైన రిస్కుగా తయారవుతుంది!

పొగతాగటం, వ్యాయామం చెయ్యకపోవటంలాగానే మద్యం మితి మీరి తాగటం కూడా గుండె జబ్బులకు దారి తీసే అంశమని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. చాలాకాలం విపరీతంగా తాగితే ఆరోగ్యవంతుల్లో ఉన్నట్టుండి గుండె లయ చెడిపోయే (హాలిడే హార్ట్‌) ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస ఇబ్బందులు, బీపీలో మార్పులు రావటంతో పాటు గుండెపోటు, హఠాన్మరణం ముప్పు కూడా పెరుగుతుంది. ఆల్కహాల్‌ రక్తంలో హోమోసిస్టీన్‌ అనే పదార్థం స్థాయులను ప్రభావితం చేస్తుంది, అది పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చే రిస్కూ పెరుగుతుంది.

  • వ్యసనం - విముక్తి
** ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా మద్యం కళ్ల ముందు లేకుండా చూసుకోండి. కనబడకుండా ఉంటే మనసును తొలచకుండా ఉంటుంది.

** భోజనం మానకండి. అది మద్యానికి తలుపులు తెరుస్తుంది.

** మద్యానికి బానిసలమయ్యామనీ, దాని ముందు అశక్తులమైపోయామనీ నిస్సహాయంగా ఆలోచించటంగానీ, మాట్లాడటంగానీ చెయ్యద్దు. మీ

అనుమతి, అంగీకారం లేకుండా మద్యం మీ గొంతు దిగే అవకాశమే లేదని మర్చిపోవద్దు.

** మానలేమని ముందే నిర్ణయానికి రావద్దు. ప్రయత్నం మానొద్దు.

** ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రోజూ వ్యాయామం చెయ్యండి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఎంత వ్యాయామం చేస్తే.. ఆల్కహాల్‌ తాగాలన్న కాంక్ష అంతగా తగ్గిపోతుంటుంది.

** చక్కెరలు, తీపి పదార్థాలు బాగా తగ్గించెయ్యండి. వాటి మీద కాంక్ష పెరిగితే మనసు మద్యం మీదకు మళ్లటం పెరుగుతుంది.

** మంచినీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఎంత గొప్ప మేలు చేస్తుందో మరువద్దు. రోజూ కనీసం ఐదు పెద్ద గ్లాసులైనా నీళ్లు తాగాలి.

** మద్యం వల్ల జీవితంలో ఎదురైన ఇబ్బందులు, కష్టనష్టాలు, దయనీయ ఘట్టాలను గుర్తుకు తెచ్చుకోండి.
** మీ జీవితం నుంచి మద్యాన్ని తుడిచిపెట్టేస్తే.. మీలోని నిజమైన మనిషి, ఆ స్ఫూర్తి మరింతగా ప్రకాశించే అవకాశం ఉంటుంది. మద్యం మానేస్తే మీలో దాగున్న ప్రేమ, ప్రతిభ, చతురత వంటివన్నీ బయటపడతాయి.

**ఆల్కహాల్‌ వ్యసనాన్ని పోగొట్టటంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందినవారు సైకియాట్రిస్ట్‌లు. వ్యసనాన్ని వదిలించటానికి చాలా రకాల విధానాలున్నాయి. కాబట్టి మద్యం నుంచి బయటపడేందుకు సైకియాట్రిస్ట్‌ల సహాయం తీసుకోవటానికి సంకోచించవద్దు.

** మద్యంతో పోరాడి బయటపడిన, పడుతున్నవారంతా కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సహకార సంస్థ 'ఆల్కహాలిక్స్‌ ఎనానిమస్‌.' దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దీని విభాగాలున్నాయి. మద్యం మానెయ్యాలని అనుకుంటున్న వారందరికీ ఇందులో సభ్యత్వం ఇస్తారు. స్థానిక విభాగాన్ని సంప్రదించటం లక్ష్య సాధన దిశగా గొప్ప ముందడుగు అవుతుంది.
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పిల్లల పెంపకం లోపాలు-ప్రవర్తనలు,Behavioural prablems in childres



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లల పెంపకం లోపాలు-ప్రవర్తనలు(Behavioural prablems in childres)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




- పిల్లల్లో విపరీత ప్రవర్తనలు పిల్లల ప్రవర్తనలో రెండు ప్రధాన భేదాలుంటాయి. వైద్యపరమైన కారణాల వలన వచ్చేవి మొదటి రకం. పెంపకంలో లోపాల వలన కనిపించే విపరీత ప్రవర్తనలు రెండవ రకానికి చెందినవి.. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మన పిల్లలు మనకు ఎంతగా ఇష్టమైనప్పటికీ, ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన ఇబ్బందిని, చిరాకును, అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంది. ఇలా జరిగినప్పుడు కోపాన్ని, విసు గునూ ప్రదర్శించకుండా సమస్య ఏమిటనేది నిదానంగా ఆలోచించి తగిన రీతిలో స్పందించాలి. ముందుగా సమస్య నిజంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి.

మీ పాప నిజంగానే సమస్యాత్మకంగా ప్రవర్తి స్తుంటే నిద్రలో ఏమైనా భయంకరమైన కలలు వస్తున్నాయేమో ఆలోచించాలి. లేకపోతే కుటుంబంలోకి కొత్తగా తమ్ముడో, చెల్లెలో ప్రవేశించి మీ మొదటి చిన్నారిలో ఈర్ష్యాద్వేషాలను రగిలిస్తుండవచ్చు. అలాగే కొత్తగా ఇల్లు మారడం, ఆటలాడుకునే స్నేహితులు మారడం మొదలైనవన్నీ పిల్లల ప్రవర్తనలో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజూ మీతోపాటు పడుకునే చిన్నారిని మీరు వేరే గదిలో పడుకోమంటే, కొత్త వాతావరణానికి అలవాటు పడక పేచీ పెడుతున్నదేమో గమనించాలి. లేదా మీ చిన్నారి అలిగిన ప్రతిసారీ మీరు మరీ ఎక్కువగా బుజ్జగిస్తుండవచ్చు. ఇది కూడా ఆ చిన్నారి ప్రవర్తనలో మార్పు తీసుకు వస్తుంది. అన్నిటికీ మించి మీ చిన్నారి సరిగ్గా ఏ సమయాల్లో విసుగెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నదీ గమనించండి.తనకు విసుగ్గా, బోర్‌గా అనిపించినప్పుడా? ఉద్విగ్నంగా ఉన్నప్పుడా? ఆకలిగా ఉన్నప్పుడా? లేక నిద్ర వచ్చినప్పుడా? అనే దానిపై దృష్టిపెట్టండి.

ఏం చేయాలి?
కుటుంబం, ఆచార వ్యవహారాలు తదితర అంశాలనుబట్టి పిల్లల ప్రవర్తనలు, వారు సృష్టించే సమస్యలూ అటూ ఇటూగా మారుతుంటాయి. ఫలానా వారిలో ఒక సూచన పని చేసిందని అందరిలోనూ సరిగ్గా అదే మాదిరి పరిష్కారం పని చేయకపోవచ్చు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనా సమస్యలను కొద్దిపాటి సంయమనంతోనూ, ప్రయోగాలతోనూ పరిష్కరించుకోవాలి. మీకు ఏది సబబుగా ఉన్నదని తోస్తే అది చేయవచ్చు. కాకపోతే మీరనుకున్న పరిష్కార విధానాన్ని కొద్దికాలంపాటు కుదురుగా ఆచరించి చూడాలి. తండ్రి నయమం పెడితే తల్లి దానిని నీరు గార్చకూడదు.

అయితే ఎవరైనా సరే పిల్లలకు ఎప్పుడూ శాసనాలను చేయ కూడదు.
ఏది ఎందుకు చేయాలో, ఏది ఎందుకు చేయకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో వివరంగా, సోదాహరణంగా వివరించాలి. ఉదాహరణకు గోడమీదనుంచి తొంగి చూస్తున్నప్పుడు గబుక్కున వెళ్లి వాళ్లు భయపడేలా అదిలించకూడదు. అప్పటికి ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని, సందర్భం వచ్చినప్పుడు - ఉదాహరణకు పేపర్లో కానీ, సినిమాలో కాని ఎవరైనా పిట్టగోడ మీదనుంచి పడిపోయిన దృశ్యాన్ని చూసినప్పుడు, దానిని పిల్లల మనస్సుకు హత్తుకునే విధంగా నాటకీయతను జోడించి తెలియజెప్పాలి.
తప్పు చేసినప్పుడు దండించే కన్నా, మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవడమూ, ప్రోత్సాహపూర్వకమైన బహుమతులను ఇవ్వడమూ చేయాలి. ఏ పిల్లవాడిలోనూ దండించి సత్‌ప్రవర్తనను నేర్పలేము. ముందుగా మనం ఆచరించి నేర్పించాలి. అలాగే ప్రేమాప్యాయతలను ఇవ్వడమూ, పుచ్చుకోవడమూ నేర్పించాలి.

ఆహారం తీసుకునేప్పుడు పేచీ
తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని వాపోతుంటారు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి- పిల్లలు భోజన వేళల మధ్యలో చిరుతిండ్లు తింటూ ఉండవచ్చు. లేదా వారికి నిజంగా ఆకలి తగ్గిపోయి ఉండవచ్చు.
భోజనం సంతృప్తిగా తిన్న తరువాతనే అవసరమనుకుంటే చిరుతిండ్లను పెట్టాలి. అన్నానికి ముందు ఏ రకమైన చిరుతిండ్లూ పెట్టకూడదు. పిల్లలకు బలవంతంగా ఏదీ తినిపించకూడదు. అలా చేస్తే పిల్లలు వారంతట వారు తినే ప్రయత్నం చేయరు. దీని వల్ల పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ అసహనానికి గురి కావలసి వస్తుంది.

మీరు దేనినైతే నియంత్రిస్తారో, పిల్లలు దానినే ఇష్టపడతారు. ఉదాహరణకు బంగాళా దుంపల చిప్స్‌ తినకూడదని మీరు కట్టడి చేస్తే, రుచిగా ఉన్నా లేకపోయినా పిల్లలు అవే కావాలని మారాం చేస్తారు. పిల్లలకు పెద్ద ప్లేటులో ఆహారాన్ని కొద్దిగానే పెట్టి, దానిమీద ఆసక్తిని కలిగించాలి. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు తప్పితే మిగతా ఎవరు తినిపించినా కిమ్మన కుండా తింటారు. మీ పిల్లలు మీ ఇంట్లో కాకుండా, పొరుగింట్లో ఎందుకు ఆనందంగా తింటారనే దానికీ, తాతయ్య, అమ్మమ్మల దగ్గరో, చుట్టాల ఇంట్లోనో ఎందుకు ఇష్టంగా తింటారనే దానికి సమాధానం పిల్లలు మార్పు కోరుకోవడమే.

మీ పిల్లలు ఏదో ఒక పదార్థానే ఇష్టప డుతూ,ఎప్పుడూ దానినే కోరుకుంటూ ఉంటే, కొంతకాలంపాటు దానినే తినిపించడంలో తప్పు లేదు. కాకపోతే, మధ్య మధ్యలో కొత్త రకమైన ఆహార పదార్థాలను ప్రవేశపెడుతుం డాలి. మళ్లీ మళ్లీ చెప్పేదేమిటంటే పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. మనం దానిని గుర్తిస్తే చాలు.పెరుగులోకొంచెం శొంఠిపొడిని, సైంధవ లవణాన్ని కలిపి పిల్లలకు తినిపిస్తే ఆకలి పెరు గుతుంది. భోజనానికి ఒకటి రెండు గంటల ముందు బెల్లం పానకానికి మిరియాల పొడిని చేర్చి తాగిస్తే కూడా ఆకలి వృద్ధి అవుతుంది.
  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-పురుషులకు మాత్రమే పరిమితమైన సమస్య - వృషణాలపై కంతులు ఏర్పడటం. వృషణాలపై ఏర్పడే కంతులు కేన్సర్‌ కానివి కావచ్చు.లేదా కేన్సర్‌ కంతులైనా కావచ్చు. వృషణాలపై కంతులు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నప్పటికీ, సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా యుక్తవయస్సులోకి త్వరగా అడు గిడిన మగపిల్లల్లో కనిపిస్తాయి.వృషణాలపై ఏర్పడే ఈ కంతుల్లో అత్యధిక శాతం కేన్సర్‌ కాని కంతులే ఉంటాయి.

ఇవి ఒకచోటినుంచి మరొక చోటకు వ్యాప్తి చెందవు. అయినప్పటికీ, వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. కేన్సర్‌కు చెందిన కంతులు వృషణాలపై ఏర్పడితే అవి అక్కడినుంచి మరొక చోటికి వ్యాప్తి చెందవచ్చు.సాధారణంగా ఊపిరితిత్తులు, కాలేయం, లింఫ్‌ నోడ్స్‌, కేంద్ర నాడీ మండల వ్యవస్థలకు ఈ కేన్సర్‌ కంతులు వ్యాప్తి చెందుతాయి.

కారణాలు
మగపిల్లల్లో వృషణాలపై కంతులు ఎందుకు ఏర్పడతాయనే విషయమై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం ఏదీలేదు. అయినా, ఇవి జెర్మ్‌ సెల్స్‌నుంచి ఏర్పడుతాయని భావిస్తున్నారు. గర్భస్థ పిండంలో ఎదిగే కణాలు ఈ జెర్మ్‌ సెల్స్‌. ఇవి పిండంతోపాటు అభివృద్ధి చెందుతూ పురుష, స్త్రీ జననావయవ వ్యవస్థగా రూపు దిద్దుకుంటాయి. జెర్మ్‌ సెల్స్‌ పిండంలో ఒక మధ్యస్థ రేఖన నుసరించి పెరుగుతూ, గర్భస్థ పిండం శిశువు స్త్రీ అయితే కటి వలయంలో అండాశయ కణాలుగానూ, శిశువు పురుషుడైతే, వృషణ కణాలుగానూ మారుతాయి.కేంద్ర నాడీ మండల వ్యవస్థ, మూత్ర, జన నావయవ వ్యవస్థల పనితీరు సక్రమంగా లేకపోవడం వంటి అనేక అంశాలు జెర్మ్‌ సెల్స్‌ కంతులుగా మారడానికి దోహదం చేస్తాయి.

లక్షణాలు
వృషణాల్లో వాపు, గట్టి దనం, వృషణాల రూపం, పరిమాణం మొదలైన వాటిలో అసాధారణతలు, వృష ణాల్లో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి. అయితే ఈ రకమైన లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపించే అవకాశాలు న్నందున తప్పనిసరిగా వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.

-నిర్దారణ
సాధారణంగా వృషణాలపై ఏర్పడే కంతులను మొట్ట మొదటగా గుర్తించేది తల్లిదండ్రులే. తమ బిడ్డకు వృషణాలపై వాపు కనిపించగానే వారు వైద్యసహాయం పొందాలి. హెర్నియా, ఎపిడిడిమస్‌కు సోకే ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలు కూడా ఈ లక్షణాలను ప్రతిబింబించే అవకాశాలున్నందున తమ బిడ్డను శిశు వైద్య నిపుణులకు చూపించి, తగిన సహాయం పొందాలి. రోగి ఆరోగ్య, అనారోగ్య అంశాలు, భౌతిక పరీక్ష మొదలైన వాటితో వైద్యులు ఈ సమస్యను అనుమానించి, నిర్ధారణ నిమిత్తం కొన్ని పరీక్షలు చేయిస్తారు.

అల్ట్రాసౌండ్‌ : అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయడం ద్వారా వృషణాల్లో ఉన్న కంతి ఏ రకమైనదనే విషయాన్ని నిర్ధారించవచ్చు. అవసరమైతే మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అత్యధిక తరచుదనం కలిగిన ధ్వని తరంగాలను వృషణాల్లోకి ప్రసరింపజేసి, కంప్యూటర్‌ మానిటర్‌పై వృషణాల్లోని రక్తనాళాలు, కణ జాలాలు మొదలైన వాటిని క్షణ్ణంగా పరీక్షిం చడానికి అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఉపకరిస్తుంది.

సి.టి.స్కాన్‌ : ఎక్స్‌రేలు, కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానాలను మేళవించి చేసే పరీక్ష ఇది. దీనిలో వృషణాలను మరింత క్షుణ్ణంగా పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. భూసమాంతరంగానూ, నిలువుగానూ వృషణాల్లో కొద్ది కొద్ది భాగాలను ముక్కలుగా (స్లయిస్‌) పరీక్షిస్తారు. దీని ద్వారా ఎముకలు, కండరాలు, కొవ్వు తదితర భాగాలను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.

ఎం.ఆర్‌.ఐ. : దీనిలో పెద్ద పెద్ద అయస్కాం తాలను, రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తూ పరీక్షిస్తారు.
బయాప్సి : కంతినుంచి చిన్న ముక్కను సేకరించి మైక్రోస్కోప్‌ కింద పరీక్షిస్తారు. దీని ద్వారా ఆ కంతి కేన్సర్‌కు చెందినదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.

సి.బి.సి. : ఈ పరీక్షను కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌ అంటారు. దీనిలో రక్త కణాల పరిమాణం, సంఖ్య, అవి పరిణతి చెందినవా? కాదా? అనే అంశాలను పరిశీలిస్తారు.

ఇతర పరీక్షలు : అవసరానుగుణంగా బ్లడ్‌ కెమిస్ట్రీ, కాలేయ, మూత్రపిండాల పని తీరు పరీక్షలు, జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.

చికిత్స
చికిత్స సమస్య తీవ్రతనుబట్టి, బాధితుడి వయస్సు, ఇతర అనారోగ్య సమస్యలు మొదలైన అంశాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే, రోగి ఏ రకమైన మందులను తీసుకోగలుగుతాడు, ఎలాంటి ప్రక్రియలు ఉపయోగిస్తే రోగికి ఇతరత్రా బాధలు ఉండవనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది.వృషణాలపై ఏర్పడిన కంతులు కేన్సర్‌కు చెందినవైనా, కేన్సర్‌ కాని కంతులైనా వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. దీనిలో కంతిని, దానితోపాటు ఆ కంతి సోకినవైపు ఉండే వృషణాన్ని తొలగిస్తారు. ఈ చికిత్సను ఆర్కియెక్టమీ అంటారు.

ఒకవేళ వృషణంపై ఏర్పడిన కంతి కేన్సర్‌ రకమైనదైతే, దానిని తొలగించిన తరువాత కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది. కీమోథెరపీలో కేన్సర్‌ కణజాలం పెరగకుండా చేసే మందులను ఇస్తారు. కంతులు కుంచించుకుపోయేలా చేసేవి, కేన్సర్‌ కణాలు నశింపజేయడానికి ఉపకరించేవి అయిన అనేక రకాల ఔషధాలు కీమోథెరపీలో ఉపయోగిస్తారు.

కీమోథెరపీ విధానం
ఈ ప్రక్రియలో ఔషధాన్ని మాత్రలుగా నోటి ద్వారా తీసుకోవడానికి ఇస్తారు. లేదా ఇంజక్షన్‌ రూపంలో కండరాల్లోనుంచి కాని, నేరుగా రక్తనాళంలోకి (సిరల్లోకి - ఇంట్రావీనస్‌ లేదా ఐవి) కాని ఇస్తారు. ఔషధాన్ని నేరుగా వెన్నుపాము ద్వారా ఇవ్వడాన్ని ఇంట్రాథెకల్లీ అంటారు.ఇవేకాకుండా, కేన్సర్‌ కణాలను నాశనం చేయడానికి అత్యధిక శక్తి కలిగిన ఎక్స్‌రేలను (రేడియేషన్‌)ను ఇస్తారు. ఈ ప్రక్రియను రేడియేషన్‌ థెరపీ అంటారు. చికిత్స తరువాత కూడా రోగిని కొంతకాలంపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

సౌందర్య పోషకాలు ఆరోగ్యముపై చెడుప్రభావము ,Cosmetics and side effects


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సౌందర్య పోషకాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సౌందర్యపోషకాలు(cosmetics) : మన శరీరము పై ఎటువంటి అసౌకర్యము , పనితనము లో మార్పులు కలుగజేయని రసాయనాలు ...శరీరము క్లీనింగ కోసము , శరీరము అందము కోసం , శరీరం ఆకర్షణ కోసము , శరీర చెడువాసలుపోగొట్టడానికి , ఇతరులచే ఆకర్షించబడుటకు వాడే వాటినే సౌందర్యపోషకాలు /సాదనాలు అంటాము .

రసాయనాలు మన దైనందిన జీవితంలో ఎంతగా కలిసిపోయాయంటే అది మన అంచనాలను మించిపోతోంది. వాటివల్ల జరుగుతున్న హాని మనపై చూపిస్తున్న ప్రభావం లెక్కకు మిక్కిలిగా వుంది. ఇవన్నీ తెలిసీ తెలియక కూడా వాటిని మనం ఎక్కువగా వాడుతున్నాం.
కొన్ని సౌందర్యపోషకాలు :
  • చర్మ సౌందర్యానికి వాడే క్రీములు , లోషన్లు ,
  • పౌడర్లు ,
  • వాసనకోసం వాడే ' ఫెర్ఫ్యూములు " ,
  • లిప్స్టిక్స్ - లిప్ గ్లాస్ లు ,
  • గోళ్ళ పోలిష్ రంగులు ,
  • కళ్ళకు , కళ్ళ బొమలకు రాసే రంగులు , కాటుకలు ,
  • జుట్టు కోసము డైస్ , స్ప్రేలు ,
  • షాంపూలు , హైర్ కేర్ లోషన్లు ,
  • స్నానాలలో వాడే ... బబుల్ బాత్స్ , బాత్ ఆయిల్స్ ,
  • చెమటవాసనలు పోగొట్టే ... డియోడరెంట్స్ , ........ మున్నగునవి .

ఇవి ఎంతవరకూ మన ఆరోగ్యంమీద ప్రభావం చూపెడతాయనేది మనకు తెలియదు. వాటిని గురించి తెలుసుకోవడానికి సమయం లేదు. ఒకరు వాడుతున్నారని ఇంకొకరు వాడటం లేక ప్రకటనలు చూసి ఆకర్షితులై కొనేయడం. ఆయా వస్తువుల లేబుల్స్‌ చదివి ఎలా ఉపయోగించాలి, ఎంతవరకూ ఉపయోగించాలి అనేది అసలు పట్టించుకోం. వీటిలో హాని కారకాలైన పదార్థాలున్నాయని తెలుసుకోవడానికి కూడా నేడెవరికీ తీరక లేదు. కానీ వీటివల్ల ఒనగూడుతున్న నష్టం గురించి కొంతైనా తెలుసుకోవాలి. అప్పుడే వాటిని ఎంతవరకూ ఉపయోగించాలి, వాటినుండి హానిరాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోగలం.

మనపై ప్రభావం చూపించే రసాయనాలు ఎక్కువగా వుండేది...
1. తినే పదార్థాలు కావచ్చు 2. సౌందర్య పోషకాలు కావచ్చు 3. ఇంటిని శుభ్రపరిచే ద్రవాలు కావచ్చు.

రసాయనాలవల్ల ముఖ్యంగా ఎవరికి హానికరం?

1. ఆడవాళ్లు పిల్లలను కనబోయేముందు, గర్భవతిగా ఉన్నపుడు ఆ స్త్రీకి, లోపల వున్న బిడ్డకీ.

2. పుట్టినప్పటినుండి పెరిగేదాకా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో

ఇంట్లో వాడే ఆహారంలో డయాక్సిన్‌ అనే రసాయనం ఎక్కువగా వుంటుంది.

కొవ్వు ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలలో రసాయన మందులు ఎక్కువగా వుంటున్నాయి. కొవ్వు ఎక్కువగా వుండే పందిమాంసం, హాకన్‌, ఎక్కువ కొవ్వు గల చీజ్‌, కొవ్వు అధికంగల చేపవంటివి అదేపనిగా రోజూ తినకూడదు. తక్కువ మోతాదులో తినాలి.

ఏమి తినొచ్చు:

డయాక్సిన్‌ తక్కువగా వుండే ఆహారంతినడం శ్రేయస్కరం. రొయ్యలు, తక్కువ హాని కలిగించే చీజ్‌, తక్కువ కొవ్వు వుండే మాంసం, మార్గరిన్‌. కొవ్వులేని మాంసం అంటే చికెన్‌, చెరువు చేప ముఖ్యమైనవి. తక్కువ కొవ్వుండే మేకమాంసం అప్పుడప్పుడూ తీసుకోవచ్చు.

జంతువుల కొవ్వుకంటే వెజిటబుల్‌ ఆయిల్‌నే వాడాలి. ఎందుకంటే జంతువుల కొవ్వులో రసాయనాలు కలిసే అవకాశం ఎక్కువ.

నేటి కూరగాయల్లో రసాయనాల శాతం చాలా వుంటోంది. పంట దిగుబడికోసం ఎక్కువ పురుగుమందులు వేసి పెంచుతున్నారు. వీటిలో పురుగుమందుల శాతం తగ్గించాలంటే కూరగాయలు రెండుమూడుసార్లు నీటిలో కడగాలి. నేలలో పండే కేరెట్‌, ముల్లంగివంటి దుంపలు తోలు తీసి వాడుకోవాలి. ఆపిల్‌కూడా పై తోలు తీయాలి. ఇప్పటి యాపిల్స్‌ను నునుపు, మెరుపుకోసం వాక్స్‌(మైనం) పాలీష్‌చేసి అమ్ముతున్నారు. అందుకే ఈ జాగ్రత్త.

- సౌందర్యపోషకాలు: మనం సౌందర్యసాధనాలు అంటూ ఎంతో ప్రీతిపాత్రంగా ఉపయోగిస్తున్నవన్నీ వివిధ రసాయనాల సమ్మేళనాలే. ఇవన్నీ సౌందర్యం ఇనుమడించడానికి ఇసుమంతైనా సాయపడకపోగా ఇక్కట్లపాలు చేయడమే ఎక్కువ. సౌందర్యం అనగానే మనకు గుర్తొచ్చే టాల్కమ్‌ పౌడర్లు, లిప్‌స్టిక్‌లు, కాటుక, సుర్మా, గోళ్లరంగు, షాంపూలు, చలికాలంలో వాడే క్రీములు... ఇవన్నీ రసాయనాలు నిండిన పదార్థాలే. ఇవి నేడు ప్రతి ఇంట్లో, మళ్లీ మాట్లాడితే ప్రతి అమ్మాయి హ్యాండ్‌బ్యాగుల్లోనూ తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఇవికాక చెమటవాసన రాకుండా డియోడరెంట్లు, అలమరాలలో చెడు వాసన అరికట్టడానికి కెమికల్స్‌ మరెన్నో విరివిగా వాడుతున్నారు.

సౌందర్య సాధనాలను ప్రపంచం భారీగా తయారుచేస్తోంది. మందులకు, సౌందర్య సాధనాలకు మధ్య విభజన రేఖే బక్కచిక్కిపోయింది. క్రమబద్ధీకరించని రసాయనాలను మితిమీరి ఉపయోగించడం ఆరోగ్యాన్ని చాపకింద నీరులా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. కఠిన పరీక్షలు, నిఘా, ప్రమాణాలను నిర్ణయించే వ్యవస్థలనుంచి తప్పించుకుని మందులే సౌందర్య సాధనాల పేరిట విపణివీధికొచ్చి చేరిపోతున్నాయి.

ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ మరియు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికోలాజికల్‌ రిసెర్చ్‌ తాజా అధ్యయనాలు అనేక వాస్తవాలను వెల్లడిచేశాయి. ఇండియన్‌ ఐ రిసెర్చ్‌ గ్రూప్‌ అధ్యయనాలు కంటి ముస్తాబుకు సంబంధించిన కఠిన నిజాలను వెలికి తీసుకొచ్చాయి. ఈ వివరాలు ఇండియా టుడే ప్రకటించింది.

లక్నో మెడికల్‌ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ అబ్బాస్‌ అలీ మహ్దీ, ''ఆయా ఉత్పత్తుల్లో ఏం కలుపుతున్నారో ఎవరికీ తెలీదు. అవి చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతాయని ప్రతి ఉత్పత్తిదారుడూ ఊరిస్తారు. వాస్తవానికి అవి శరీర స్వాభావిక యంత్రాంగంలో జోక్యం చేసుకోవడం ద్వారా వ్యవస్థను దెబ్బతీసే అవకాశం వుంది. అనేక ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో ఉపయోగించే హైడ్రోక్వినోన్‌ చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్ల యంత్రాంగంలో జోక్యం చేసుకుంటుంది. దానికి కేన్సర్‌ను కలిగించే శక్తి ఉంది అంటున్నారు. పౌడర్లు, ఫౌండేషన్లలో మెత్తగా వుండడానికి అతిగా చూర్ణంచేసిన నానో కణాలను కలుపుతున్నారు. అవి చర్మం, రక్తనాళాలు, కణాల్లోకి చొచ్చుకుపోయి లోపలి అవయవాల్లో తిష్టవేస్తాయి. అంతేకాదు, అవి ఆకతాయి కణాలను పుట్టించి డిఎన్‌ఏని, జీవకణాలను విచ్ఛిన్నంచేస్తాయి. షాంపూలు నిల్వ వుండటంకోసం వాటిలో వివాదాస్పదమైన పేరాబెంజన్లను ఉపయోగించినట్లు నిర్థారణ అయింది. ఇవి శరీరంలోని ఎండోక్రైన్లను దెబ్బతీయడంతోపాటూ, కేన్సర్‌ను కలిగించగలవు. అమోదయోగ్యమైన 0.8శాతానికి మించి వాటిలో అవి వున్నాయి. ఈ రకమైన రసాయనాల సమ్మేళనం సాధారణ ఉత్పత్తులలో కాదు. ప్రముఖ కంపెనీ ఉత్పత్తుల్లో మితిమీరి కనిపించడం విశేషం. నానో కణాలు ఎల్‌ ఓ రియల్‌ యాంటీ రింకిల్‌ ఫౌండేషన్‌, రెవ్‌లాన్‌ ఏజ్‌ డి ఫైయింగ్‌ స్పా కన్సీలర్‌ 15 ఎస్‌పిఎఫ్‌లు వుందని తేలింది.

సౌందర్యసాధనాలైన లిప్‌స్టిక్‌, టాల్కమ్‌ పౌడర్‌, షాంపూ, కాటుక, జుట్టురంగుల్లో సీసం, రాగి, నికెల్‌, క్రోమియం, కోబాల్ట్‌, ఆర్సెనిక్‌ లాంటి విష పదార్థాలను గుర్తించారు. ఆఖరికి హెర్బల్‌ ప్రొడక్ట్‌ అని పేరుపెట్టిన సౌందర్యసాధనాల్లోనూ నిల్వ వుండటంకోసం రసాయనాలు ఉపయోగిస్తున్నారని తేలింది. ''మూలికా మిశ్రమాల్లో అలర్జీ కారకాలు ఎక్కువగా వున్నాయి. వాటిలో పిసరంతే మూలికలు. తక్కినదంతా ఇతర ఉత్పత్తుల తరహానే'' అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు డాక్టర్‌ వికె శర్మ.

సీసం పరిమిత శాతం 20 పిపిఎంలు కాగా టాల్కంపౌడర్‌- 21, షాంపూ-24.2, కాటుక- 136.3, హెయిర్‌ కలర్‌- 71.9 పిపిఎంలు వున్నట్లు తేలింది.

పైన చెప్పిన సౌందర్యసాధనాలన్నీ ఎంత ఎక్కువగా ఆపితే అంత మంచిది. నిజానికి మనది వేడి ప్రాంతం. నవంబరు, డిశంబరు తప్ప ఎక్కువగా మనం వేడినే భరిస్తుంటాం. మన వాతావరణానికి క్రీములు, పౌడర్లు అనవసరం. కావలసింది చెమటలనుంచి వచ్చే చికాకు, స్కిన్‌ ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవడం. అందుకు రెండుపూటలా స్నానంచేసి బట్టలు మార్చుకుంటే సరిపోతుంది. శారీరక పరిశుభ్రత ముఖ్యం. ఆరోగ్యంగా, చర్మం మెరుగ్గా వుండటానికి అది చాలు.

దేశీయ పద్ధతులు అన్నివిధాలా మంచిది. కానీ వాటిని మనం వదిలేశాం. కుంకుడుకాయలు, షీకాకారులు తలస్నానానికి వాడొచ్చు. కాటుక ఇంట్లో చేసుకోవచ్చు. మీగడలు, సున్నిపిండిలు సరేసరి. ప్రకృతి సహజంగా దొరికే ఎలోవెరా, పసుపు, నిమ్మ వంటి అనేక పదార్థాలను ఉపయోగించి సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవచ్చు. వీటివల్ల చాలా అలర్జీలు తగ్గిపోతాయి. ఒక్క కాటుక వల్లనే 10- 15శాతం ఎలర్జీలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. కళ్లు శుభ్రంగా వుండాలంటే రసాయనాలు వాడకూడదు.

ఆరేండ్లలోపు చిన్నపిల్లలున్నచోట జుట్టు రంగులు వాడకపోవడం మంచిది. ఇప్పుడు తల నెరిసినవారు కాకుండా ఫ్యాషన్‌కోసమంటూ రకరకాల హెయిర్‌ డైలు వాడుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికే కాదు, కుటుంబంలోని వారికి కీడుచేస్తుంది.

క్రిందనున్న పట్టిక చూస్తే మనం వాడే సౌందర్యసాధనాల్లో వుండే రసాయనాలు, వాటి పర్యవసానాలు మనకిట్టే అర్థమవుతాయి.

Ingredients and Diseases:

  • Paraben can cause skin irritation and contact dermatitis ,
  • Prolonged use of makeup has also been linked to thinning eyelashes,
  • Synthetic fragrances are widely used in consumer products. ..cause allergic reactions,
  • SLS ( Sodium Laureal Sulphate) causes a number of skin issues ncluding dermatitis,
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, February 22, 2011

పొలమారడం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పొలమారడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నప్పుడు అది పొరపా టున మన శ్వాసనాళంలోకి వెళ్లినప్పుడు దానిని బయటకు నెట్టివేయడానికి పొలమరిస్తూ దగ్గుతూ నానా తంటాలు పడతాము. ఇటువంటి సందర్భాలలోనే పెద్దవాళ్లు నెత్తి మీద అరచేతితో చిన్నగా చరుస్తూ 'ఎవరో తలచుకుం టున్నారు అంటూంటారు. పొలమరింతను కొద్ది నిము షాలలోపే తగ్గించకపోతే ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించడానికి అవకాశముంది.

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో డాక్టర్‌ను పిలవ డానికి అవకాశం ఉండదు. ఇంటిలోని వారే ఎవరో ఒకరు పూనుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సి ఉంటుంది. ఇది ఒక విధంగా ఎమర్జెన్సీలాంటిదే. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలనే విషయం ప్రతివారికీ తెలిసి ఉండటం అవసరం.

పొలమరింతకు సబంధించిన ఉక్కిరిబిక్కిరి (చోకింగ్‌) ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా అయిదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. వీళ్లు ఆటల్లో చిన్న చిన్న వస్తువులను నోటిలో పెట్టుకోవటం ఇందుకు కారణం.
చిన్న చిన్న గింజలు, ఆహారపు తునకలు మొదలైనవి వీళ్లకు ఎక్కువగా శ్వాసనాళాలలోకి వెళ్లి అడ్డు పడు తుంటాయి.
ఏవైనా తినడానికి పనికి వచ్చే పిండి, మిల్క్‌ పౌడర్‌, చక్కెర మొదలైనవి కూడా ఒక్కసారిగా నోటిలో వేసు కుంటూ ఉంటారు పిల్లలు. అదే సమయంలో గాలి పీల్చు కోవడానికి కూడా చేసే ప్రయత్నంలో ఆ పౌడర్‌ శ్వాస నాళంలోకి పోయి తీవ్రంగా దగ్గడం, ఉక్కిరిబిక్కిరి కావడం జరుగుతుంది.

పొలమరింత, దగ్గుతో కూడుకున్న ఉక్కిరిబిక్కిరి కలగ డానికి సాధారణంగా గబగబా తినడానికి ప్రయత్నించడం కారణమవుతుంది. పుట్టుకతో వచ్చే అంగుటి లోపాలు, పెద్ద పెద్ద టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ మొదలైనవి కూడా పొలమరింతకు కారణమవుతాయి.
మాటిమాటికీ జలుబుతో ముక్కు దిబ్బడ వేసేవాళ్లు నోటి ద్వారా గాలిని పీల్చే అలవాటు చేసుకుంటారు. అలాంటి పిల్లలు తరచుగా పొలమరింతలకు గురయ్యే అవకాశాలున్నాయి. మరీ బలహీనులు, జబ్బుతో ఉన్న వాళ్లకు తినడానికి సంబంధించిన అసంకల్పిత చర్యలు సరిగ్గా పని చేయవు.

పక్షవాతంతో బాధపడే రోగులకు కూడా మింగటానికి పనికి వచ్చే అసంకల్పిత చర్యలు సరిగ్గా పని చేయవు. ఇటువంటి వారికి తరచుగా ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు శ్వాసనాళంలోకి పోయి వాళ్లు పొలమరింత బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొందరు తల్లులు పిల్లలు ఏడుస్తున్నా బలవంతాన ముద్దలను నోటిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సందర్భాలలో కూడా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి పొల మరింతలు, ఒక్కొక్కసారి మరణం సంభవించే ప్రమాదా లున్నాయి.
స్పృహ తప్పి ఉన్న మనుష్యులలో వాంతి మొదలైనా, బాగా తాగి ఉన్న మనిషికి వాంతులు అవుతున్నా, ఆ వాంతులకు సంబంధించిన పదార్థాలు శ్వాసనాళంలోకి వెళ్లి చోకింగ్‌కు కారణమవుతాయి. స్పృహలో లేని వ్యక్తికి వాంతులు అవుతుంటే అతడిని బోర్లా పడుకోబెట్టడం మంచిది.

పొలమరింతతో మనిషి బాగా దగ్గుతున్నప్పుడు శ్వాస పీల్చుకోవడం కష్టసాధ్యమవుతుంది. ముఖం, కళ్లు ఎర్రగా అవుతాయి. పెదవులు, మెడ, వేళ్ల కొసలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి, ఆ భాగాలు నీలిరంగులోకి మారు తాయి. స్పృహను కోల్పోయి, శ్వాస నిలిచిపోయి ఆ వ్యక్తి మరణించవచ్చు.

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో డాక్టర్‌ను పిలిచేంత వ్యవధి ఉండదు. నిముషాలలోనేప్రమాదం ముంచుకు వస్తుంది. కనుక ప్రతివారూ పొలమరింత తీవ్రంగా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుని ఉండాలి.

చికిత్స
ఒక మనిషి పొలమరింతకు గురయినప్పుడు అతడికి మూడు విధాలుగా ఉపశమనాన్ని కలుగజేయవచ్చు.
1. వీపు మీద చరచడం - పొలమరిస్తున్న వ్యక్తికి ఎడమవైపు ఒక పక్కగా నిలబడి వీపుమీద అరచేత్తో నాలుగు సార్లు గట్టిగా చరచాలి.
చరుస్తున్న చేతిని కాక రెండవ చేతిని పొలమరిస్తున్న వ్యక్తి ఛాతీమాద సపోర్ట్‌ కింద అదిమిపెట్టి ఉంచాలి.
అలాగే పొలమరిస్తున్న వ్యక్తి తలను ఛాతీ మీదకు కొద్దిగా వంచుకునేట్లు చేయాలి.
ఒకవేళ పొలమరిస్తున్న వ్యక్తి మరీ చిన్నపిల్లవాడైతే తల కిందివైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులా మూసి ఉంచి ప్లిలవాడి వెన్నుకింద చిన్నగా చరుస్తుండాలి.

2. స్పృహ లేని వ్యక్తి విషయంలో - పొలమరింత మొదలైనప్పుడు రెండు చేతులతో అతడిని పొట్ట వద్ద పట్టుకుని నిలబెట్టటం లేదా కుర్చీలో కూర్చోబెట్టడం చేయాలి.

అప్పుడు అతడిని వెనుకనుంచి రెండు చేతులతో బొడ్డు పైభాగాన పొట్టమీద పట్టుకుని నాలుగు సార్లు గట్టిగా పై వైపునకు నొక్కాలి.
దాని వలన అతడి శ్వాసనాళంలోకి వచ్చినపదార్థం బైటికి వచ్చేయటానికి అవకాశం ఉంటుంది.
అలా కానిపక్షంలో రోగిని వెల్లకిలా నేలమీద పడుకోబెట్టి మీ కాళ్లను అటూ ఇటూ వేసి, మోకాళ్ల మీద నిలబడి అరచేతుల్తో రోగి బొడ్డు పైభాగాన పొత్తి కడుపు మీద ఛాతీవైపునకు నాలుగుసార్లు గబగబా నొక్కాలి.

3. పొలమరిస్తున్న వ్యక్తి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటనవేలును, మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెచరుకునేట్లుగా చేసి, మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలోకంటా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటికి లాగివేయడానికి చేసే ప్రయత్నం మూడవది.

ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్‌లాగా వంచి పట్టుకుని ఇవతలకు లాగాల్సి ఉంటుంది.
పై పద్ధతులేవీ పని చేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలి.

  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

శ్వాసకోశ వైరస్ జలుబు,Cold due to Respiratory Virus


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjROCSd-njL89cQ-gXp2ZTdQS4_zxPJaCcNQL_TLhCvcHCW_0KJDzEOIgpsFM30hJWKB2F87OkOBlPjRhZ6T_1_tAhREX7OLu98jSsWnTVIjjEEtH2JXTnwvfkXr0JBDOJbqGd1z2Ctrp0/s1600/common+cold+infant.jpg

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శ్వాసకోశ వైరస్ జలుబు,Cold due to Respiratory Virus- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




    జలుబు శ్వాసావయవాలకు సంక్రమించే బాధ. శ్వాసావయవాలు రెండు. పీల్చిన గాలి ప్రయాణం చేసే విభాగం మొదటిది. గాలి మార్పిడి చోటుచేసుకునే గాలి గోళాలు (ఏల్వియులై) రెండో విభాగం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా శ్వాసావయవాల రోగులే అత్యధికం. శ్వాసావయవాల వ్యాధులలో జలుబు అతి సామాన్యమైన బాధ. ఇది వైరస్‌ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. --ఆరోగ్యంగా ఉండే పెద్దలకు, పిల్లలకు తరచుగా వచ్చే వ్యాధుల్లో శ్వాసకోశ వైరస్‌ వ్యాధులు ముఖ్యమైనవి.

సాధారణ జలుబు (కామన్‌ కోల్డ్‌), పెద్దల్లో రైనోవైరస్‌ మూలంగా (20 నుంచి 40 శాతం), పిల్లల్లో కరోనా వైరస్‌ (10 నుంచి 20 శాతం) కారణంగా వస్తుంది. పాఠశాలలకు, రోజువారీ వృత్తుల్లోని విధులకు హాజరు కాలేకపోవడానికి జలుబు ఒక ముఖ్య కారణంగా ఉంటున్నది. తుమ్మినప్పుడు వచ్చే తుంపరల్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది.
సాధారణ జలుబు వ్యాధిలో ముక్కు కారడం, తుమ్ములుముఖ్య లక్షణాలు. గొంతు నొప్పి, తలనొప్పి, నలతగా ఉండటం - కరోనా వైరస్‌ వల్ల వచ్చే జలుబులో ఉండవచ్చు.

సాధారణ జలుబు దానంతట అదే తగ్గే స్వభావం కలది. సాధారణంగా 5 నుండి 7 రోజులు బాధిస్తుంది. పిల్లల్లో ఈ జలుబు సంవత్సరానికి ఐదారుసార్లు వస్తుంది.

వయస్సు పెరిగే కొద్దీ తక్కువసార్లు వస్తుంది. లక్షణాలనుబట్టి ఈ వ్యాధిని వైద్యుడు నిర్ధారిస్తాడు.
అరుదుగానే, సైనుసైటిస్‌, బ్రాంకైటిస్‌, బ్రాంకియోలైటిస్‌, న్యుమోనియా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉపశమనానికి జలుబుకు, దగ్గుకు ఇతర లక్షణాలకు మందులు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.

ఇన్‌ఫ్లూయెంజా జ్వరం (ఫ్లూ) ఎ,బి,సి ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వల్ల వస్తుంది. ఈ వ్యాధి వర్షాలకు ముందు, చలికాలంలోను ఒకేసారి ఒకే ప్రాంతంలో అనేకమందికి (ఎపిడమిక్‌) సోకుతుంది.
ఇన్‌ఫ్లూయెంజా సోకినప్పుడు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నలతగా ఉండటం మొదలైన లక్షణాలు ఉంటాయి.

జ్వరం 38 - 41 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉంటుంది. కళ్లలో నొప్పులు, కళ్లు నీరు కారడం, మంటలు ఉండవచ్చు. జ్వరం రెండు మూడు రోజులు ఉండవచ్చు. రెండు మూడు రోజుల్లో తగ్గే జ్వరాలను ఫ్లూ జ్వరాలని పిలవడం పరిపాటే.
కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో ఫ్లూ లక్షణాలతో ప్రారంభించి న్యుమోనియా, గుండె వైఫల్యం, సి.ఒ.పి.డి. తిరగబెట్టడం వంటి ఇక్కట్లకు దారి తీయవచ్చు.

కాంప్లికేషన్లు లేని ఇన్‌ఫ్లూయెంజా జ్వరం 3నుంచి 5 రోజుల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో నీరసం, నిస్సత్తువ కొద్దివారాలు ఉండవచ్చు. ఈ జ్వరంలో వచ్చే ఇక్కట్లలో న్యుమోనియా ముఖ్య మైనది.
న్యుమోనియా వచ్చిన ప్పుడు జ్వరం తగ్గ కుండా, ఆయాసం (ఎగశ్వాస), కళ్లె పచ్చగా పడటం, గోళ్లు, చర్మం నీలం రంగుగా ఉండటం (సయనోసిస్‌) మొదలైన లక్షణాలు ఉండవచ్చు.
గొంతునుండి స్రావాలను స్వాబ్‌ ద్వారా తీసి లేబొరేటరీకి పంపి పరీక్ష చేయించి వైరస్‌ను కనుగొని వ్యాధి నిర్ధారణ చేస్తారు. రక్తంలో వైరస్‌ యాంటిబాడీ టైటర్‌ నాలుగు రెట్లు పెరుగుతుంది.

మామూలు ఇన్‌ఫ్లూయెంజా జ్వరాన్ని పారా సెటమాల్‌ వంటి ఔషధాలతో చికిత్స చేస్తారు. న్యుమోనియా వంటి కాంప్లికేషన్లకు యాంటిబ యాటిక్స్‌, ఆక్సిన్‌ మొదలైన అత్యవసర చికిత్స అందిస్తారు. ఎమాంటిడిన్‌ వంటి యాంటీవైరల్‌ ఔషధాలను ఉపయోగిస్తారు.
చైతన్యరహితమైన వైరస్‌నుంచి తయారైన ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను వ్యాధి సోకకుండా, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి లేని వారికి, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు, గుండె జబ్బులుఉన్నవారికి చేయించడం శ్రేయస్కరం.

ఈ వ్యాక్సిన్‌ను వానాకాలం ప్రారంభం కావడానికి ముందు జూన్‌ నెలలోనూ, చలికాలం ప్రవేశించకముందు నవంబర్‌లోనూ చేయించుకోవాలి.
పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ పిల్లల్లో ఎక్కు వగా బాధిస్తుంది. టైప్‌ 1 వైరస్‌ వల్ల క్రూప్‌ అనే తీవ్ర వ్యాధి వస్తుంది. ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, శబ్దంతో కూడిన దగ్గు ఈ వ్యాధి లక్షణాలు.

టైప్‌ 3 వైరస్‌ వల్ల పసిపిల్లల్లో బ్రాంకియో లైటిస్‌, న్యుమోనియా వస్తాయి. టైప్‌ 2, టైప్‌ 4 వైరస్‌ల వల్ల కొద్దిపాటి లక్షణాలు ఉన్న జ్వరాలు వస్తాయి. పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వ్యాధి వల్ల జలుబు, గొంతు నొప్పి, గొంతు జీరపోవడం, శబ్దంతో కూడిన దగ్గు ఉంటాయి.
ఈ వ్యాధికి గురైన చాలామంది పసిపిల్లలు ఒకటి రెండు రోజుల్లో కోలుకుంటారు. ఇక్కట్లు ఎదురైనప్పుడు పిల్లల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఆక్సిజన్‌, స్టీరాయిడ్స్‌ మొదలైన అత్యవసర చికిత్స జరగాలి.

జలుబుకి ... మార్కెట్ లో దొరికే (Anticold)జలుబు మాత్రలు వాడవచ్చు . ఉదా : Zincold , Coldact ,
జ్వరానికి : పారాసెటమోల్ (Paracetamol)
దగ్గుకి : ఏదైనా దగ్గుమందు ను తీసుకోవచ్చు . ఉదా : DM , Tossex , instaryl.
వాళ్ళు నొప్పులకు : Combiflame , dolomed , acelonac 750 ,
అప్పటికి తగ్గకపోతే వైద్య సలహా పొందాలి .
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా ,Trigiminal Neuralgia


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా ,Trigiminal Neuralgia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన మెదడునుంచి 12 జతల కపాల నాడులు (క్రేనియల్‌ నర్వ్స్‌) బయలుదేరుతాయి. వీటిలో ఐదవ నాడిని త్రిధారా నాడి (ట్రైజెమైనల్‌ నర్వ్‌) అంటారు. దీనికి మూడు శాఖలుంటాయి. నుదురు, కంటి భాగానికి (ఆప్థాల్మిక్‌) వెళ్లేది మొదటిది. పైదవడ ప్రాంతానికి వెళ్లేది (మ్యాగ్జి లరీ) రెండవది. కింది దవడకు, చుబుకానికి వెళ్లేది (మ్యాండిబ్యులార్‌) మూడవది. ఇవి మూడూ గసీరియాన్‌ గ్యాంగ్లియాన్‌ను కేంద్రంగా చేసుకుని బయలుదేరుతాయి.
ట్రైజెమైనల్‌ నరం ముఖ భాగంలో ఏర్పడే స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రతలను మెదడకు చేరవేయ డంతోపాటు ఆహారాన్ని నమలడానికి తోడ్పడే కండరాలను నియంత్రిస్తుంది. ఒకవేళ అది దెబ్బ తింటే ముఖంలో తీవ్రాతితీవ్రంగా నొప్పి వస్తుంది. దీనిని ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా అంటారు.

ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా నొప్పి హఠాత్తుగా మొదలై ఐదారు సెకండ్లనుంచి ఒకటి రెండు నిముషాలపాటు మాత్రమే ఉంటుంది. అయితే ఇదే తంతు దినమంతా పునరావృతమవుతుం టుంది. నొప్పి పొడుస్తున్నట్లు, విద్యుత్‌ ఘాతం తగిలినట్లు ఉధృతంగా ఉంటుంది. అలాగే ముఖంలో ఒక పక్కనే వస్తుంది. పైభాగంలో కాని, మధ్య భాగంలో కాని, కింది భాగంలో కాని కేంద్రీకృతమవుతుంది.
నొప్పి ఏ రకమైన సూచన లేకుండా హఠా త్తుగా మొదలవవచ్చు. లేదా చేతి స్పర్శ, కదలిక వంటి తేలికపాటి కారణాల వల్ల ప్రేరేపితమవ వచ్చు. మాట్లాడటం, నమలటం, తాగటం, తినడం, వేళ్లతో చర్మాన్ని తాకటం, పళ్లు తోము కోవడం, తల దువ్వుకోవడం, తలారా స్నానం చేయడం, ముద్దు పెట్టుకోవడం వంటి చర్యల వలన నొప్పి మొదలవుతుంది. చిత్రంగా ఇవే ఉత్ప్రేరక కేంద్రాలను గిల్లినా, ఒత్తిడి కలిగించినా నొప్పి రాదు.

ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా అటాక్‌ వచ్చిన ప్పుడు బాధితుడు హఠాత్తుగా నిశ్చేష్టుడై పోతాడు. వాక్ప్రవాహం ఆగిపోతుంది. ముఖ కదలికలు స్తంభిస్తాయి. నొప్పి మరింత పెరగకూ డదని ఇలా చేస్తాడు. ముఖం బాధతో వంకర తిరుగుతుంది. ఈ లక్షణాలు కొద్దిపాటి ఫిట్స్‌ను పోలి ఉండటంతో దీనిని 'టిక్‌ డౌలోరెక్స్‌ లేదా 'న్యూరాల్జియా ఎపిలెప్టీఫార్మిగా కూడా పిలుస్తారు.
ఈ నొప్పి సాధారణంగా నిద్రలో రాదు. కాక పోతే ఒక భంగిమలో తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ముందుకు వంగినప్పుడు ఎక్కువ కావచ్చు. ఒకపక్క వచ్చిన నొప్పి మరొక పక్కకు వ్యాపించదు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రం నొప్పి రెండువైపులా వస్తుంది. లక్షణాలు ఒక్కొక్కపక్కా ఒక్కొక్క రకంగా ఉంటాయి.

నొప్పి కొంతకాలంపాటు ఉధృతంగా ఉండి, దానంతటదే మరికొంత కాలంపాటు సద్దుమణు గుతుంది. నొప్పి లేనప్పుడు కూడా బాధితులు ప్రశాంతంగా ఉండలేరు. మళ్లీ నొప్పి వస్తుందే మోననే శంకతో గడుపుతుంటారు. నొప్పి ఉన్న ప్పుడు సాధారణమైన పెయిన్‌ కిల్లర్స్‌ అంతగా పని చేయవు.
సమయం గడిచే కొద్దీ నొప్పి వచ్చే సమయాల మధ్య వ్యత్యాసం తగ్గిపోతుంటుంది. నొప్పి తీవ్రత కూడా పెరుగుతుంటుంది. దీర్ఘకాల బాధితులలో ఎంతోకొంత నొప్పి నిరంతర లక్షణ మవుతుంది. ఈ వ్యాధి పరీక్షలకు దొరకదు.
నరాలకు సంబంధించిన న్యూరలాజికల్‌, క్రేనియోఫేషియల్‌ పరీక్షల్లో ఏ దోషమూ కనిపించదు. బాధితుడు వర్ణించే నొప్పి లక్షణా లనుబట్టి ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ జరగకముందు బాధితుడు అనేక రకాల చికిత్సలను ప్రయత్నించి విసిగి వేసారిపోయి ఉంటాడు.

-దంతాల వ్యాధి అని, టెంపొరో మ్యాండిబ్యు లార్‌ జాయింట్‌ వ్యాధి అని, సైనుసైటిస్‌ అని, కంటి గోళం నొప్పి అని, మైగ్రేయిన్‌ అని, మయోఫేషియల్‌ పెయిన్‌ అని - ఇలా రకరకాల కారణాల కోసం మందులు వాడి ఉంటాడు.
చివరకు మానసిక వైద్యం కూడా ప్రయత్నించి ఉంటాడు. వీటన్నింటితో ఆత్మస్థయిర్యం దెబ్బ తిని మరింత బేలగా తయారవుతాడు. ఈ నొప్పి వంశపారంపర్యంగా కనిపించదు. పురు షులలో కంటే స్త్రీలలో ఈ నొప్పి ఎక్కువగా కని పిస్తుంది. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కు లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

రకాలు- కారణాలు
సాధారణం
దీనినే క్లాసికల్‌ అని, ఇడియోపతిక్‌ అని, ఎసెన్షియల్‌ అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ట్రైజెమైనల్‌ నరం మెదడులోకి ప్రవేశించే ప్రాంతంలో రక్తనాళాలు (ముఖ్యంగా సుపీరియర్‌ సెరిబెల్లార్‌ ఆర్టరీ) నరానికి చేరువై, ఒత్తిడిని కలిగించడం వల్ల ఈ తరహా నొప్పి వస్తుంది. రక్తనాళాలలో రక్తం అలలమాదిరిగా వెళుతూ ట్రైజెమైనల్‌ నరాన్ని రేగేలా చేస్తుంది. కొంతకాలానికి ఇది నొప్పిగా పరిణమిస్తుంది.

అసాధారణం
దీనిలో నొప్పి నిరంతరమూ ఉంటుంది. మండుతున్నట్లుగాని, మరమేకు దింపుతున్నట్లు గాని తీవ్రస్థాయిలో ఉంటుంది. సాధారణ ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా కొంతకాలానికి ఈ తరహా నొప్పిగా మారే అవకాశం ఉంది. నరం మీద ఒత్తిడి పడటం (న్యూరో వ్యాస్కులార్‌ కంప్రెషన్‌), లేదా ట్రైజెమైనల్‌ నరం న్యూక్లియస్‌ అతిగా స్పందించడం వల్ల ఈ నొప్పి వస్తుంది.

పూర్వరూప స్థితి
అసలైన ట్రైజెమైనల్‌ న్యూరాల్జియాకు ముందు చాలా రోజులు లేదా సంవత్సరాల పాటు బాధితుడికి పూర్వరూపాలు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. పంటి నొప్పి, ముఖంలో అసౌకర్యం, సూదులు గుచ్చినట్లు నొప్పి, కారం పూసినట్లు మంట వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఇతర వ్యాధుల ప్రభావం
మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ అనే వ్యాధిలో నరాల పైనుండే మైలిన్‌ పొర దెబ్బ తింటుంది. ఒకవేళ ఈ పరంపరలో ట్రైజెమైనల్‌ నరం కూడా దెబ్బ తింటే తదనుబంధమైన నొప్పి వస్తుంది. ఒక్కొ క్కసారి కణితి వంటిది మెదడు ప్రాంతంలో పెరిగి ట్రైజెమైనల్‌ నరం మీద వత్తిడి కలిగించే అవ కాశం ఉంది.ఇలాంటి సందర్భాలలో ముఖంలో స్పర్శా రాహిత్యం, నమలడానికి సహకరించే కండరాల్లో పట్టు తగ్గిపోవడం, నొప్పి నిరంతరంగా కొనసాగటం వంటి లక్షణాలు ఉంటాయి.

కాగా, హెర్పిస్‌ జోస్టర్‌ అనే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారిలో నరాలు దెబ్బతిని నొప్పిని కలిగించే అవకాశం ఉంది. దీనిని పోస్ట్‌ హెర్పి టిక్‌ న్యూరాల్జియా అంటారు. ఒకవేళ ఇది ట్రైజె మైనల్‌ నరాన్ని దెబ్బ తీస్తే ముఖంలో ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా వస్తుంది.

అభిఘాత జన్యం
ముఖం లేదా కపాలం ప్రాంతంలో దెబ్బ తగి లినప్పుడు ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా వచ్చే అవ కాశంఉంది. సాధారణంగా రోడ్‌ ట్రాఫిక్‌ యాక్సి డెంట్లు, పన్ను పీకించుకోవడం, సైనుసైటిస్‌కు చేసే కాడ్‌వెల్‌లక్‌ సర్జరీ వంటివి నరాన్ని శాశ్వతంగా దెబ్బ తీసి, నొప్పిని ఉత్పన్నం చేస్తాయి.
కొన్ని సందర్భాలలో నొప్పితోపాటు కొంతమేర మొద్దుబారినట్లు కూడా ఉండొచ్చు. చలి వాతావరణానికి గురైనప్పుడు కాని, చలిగాలులు తగిలినప్పుడు కాని నొప్పి ఎక్కువ అవుతుంది. నిరంతరమూ మండుతున్నట్లు ఉంటుంది.

చికిత్స
సాదారణ నొప్పిమాత్రలు తాత్కాలిక నొప్పినివారణకు వాడాలి (Aceclofenac , tramadal , paracetamal )
కార్బమజెపిన్‌ మాత్రలు రోజుకు 600 నుండి 800 మిల్లీగ్రాముల వరకు డాక్టర్‌ సలహా మేరకు వాడాలి(Tegratal 200mg 3 times/day).
స్టేరాయిడ్లు, వ్యాధి నిరోధకశక్తి క్షీణకాలు డాక్టర్‌ సలహా మేరకు వాడాలి(prednisolone 10mg 3 times /day).
యాంటి డిప్రజెంట్స్ : Amytriptiline
Botos : దీన్ని ఇంజక్ట్ చేస్తే నొప్పి తగ్గుతుంది ,
Gabapentin : ఇది కూడా నరాల సంబంధించిన నొప్పిని తగ్గిస్తుంది .
sleepinga dose : clonazepam , వాడ వచ్చును .

Surgery : పెయిన్‌ సిగ్నల్స్ ని కట్ చేయడం ద్వారా నొప్పినుండి ఉపసయనము పొందవచ్చును .
Stereotactic radiation therapy-- కొంతమందికి ఇది ఉపయోగిస్తారు .


నివారణ - జాగ్రత్తలు

*మధుమేహ జబ్బును నియంత్రణలో వుంచుకోవాలి. పాదాల సంరక్షణ చేసుకోవాలి.

*సారాయిని మానివేయాలి.

*ధూమపానాన్ని మానివేయాలి.

*శారీరక పరిశుభ్రతను పాటించాలి. సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవాలి.

*రోజూ వ్యాయామం చేయాలి.

*రక్తపోటు, గుండె జబ్బు వంటి జబ్బులకు క్రమం తప్పకుండా మందువాడాలి.

*వృద్దాప్యం వల్ల కలిగే అజ్జీమర్సువ్యాధి, ఫార్కిన్‌ సోనిజమ్‌ వంటి వ్యాధులకు సంబంధిత డాక్టరును సంప్రదించి తగు చికిత్స. ఫిజియో, థెరపి మొదలగునవి తీసుకోవాలి.










=================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నొప్పి-వ్యాయామం ,Pain and Exercise


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgQGF7u_MaVOxWTL_B5gk94DoeU3UlCyNhWwXAKtwKoIhr2_vMBQIpk0wcai_nxI0Wjcv3ZmbDQ7mpoE2SDJs1yonn1N560oxumn1u8U1ccbqI5AQxsPM-vINRdN-68LaVyyMHkghusRG4/s1600/Exercises+after+delivery.jpg
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నొప్పి-వ్యాయామం (Pain and Exercise)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వ్యాయామ జీవితం :
చాలామంది వ్యాయామానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వరు. సన్నబడటం, మధుమే హాన్ని నియంత్రించుకోవటం వంటి వాటి కోసమే వ్యాయామాలు చేయాలి అనుకుంటారు. లేదా వ్యాయామనేది క్రీడాకారులకు సంబంధిం చిన వ్యవహారమనుకుంటారు.కానీ ప్రతివారూ వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా నడుము నొప్పితో బాధపడేవారికి వ్యాయామ చికిత్స అద్భుతంగా పని చేస్తుంది. శరీర నిర్మాణం, కండరాల శక్తి సామర్థ్యాలు, వ్యాధి తీవ్రత, ఇతర వ్యాధుల ప్రభావం వంటి అంశాల ఆధారంగా వ్యాయామ చికిత్సను వ్యక్తి గతంగా సూచించాల్సి ఉంటుంది.

-వెన్ను నొప్పిలో వ్యాయామం కీలక పాత్ర పోషి స్తుంది. మామూలు సందర్భాలలో నొప్పి ఉన్న ప్పుడు శారీరక కదలికలు తగ్గుతాయి. దీని పర్య వసానంగా నడుము కండరాలు దృఢత్వాన్ని కోల్పోయి శక్తిహీనంగా మారుతాయి. కొద్దిపాటి పనికే కండరాలు సడలిపోయి నొప్పి బయలు దేరుతుంది.

దీనిని చక్కదిద్దాలంటే నడుము కండరాలు తిరిగి దృఢంగా, బలంగా తయారు కావాలి. అప్పుడు ఇవి అదురును, దెబ్బలనూ కాచుకుని, వెన్నుపామును కాపాడుతాయి. వ్యాయామాల వలన శరీరంలో ఎండార్ఫిన్స్‌ విడుదలై నొప్పిని సహజమైన రీతిలో తగ్గిస్తాయి. ఇంతే కాకుండా, వ్యాయామాల వల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి.

1. శరీరంలో కదలికలు మెరుగుపడి కొయ్య బారినట్లు ఉండటమనేది తగ్గుతుంది. 2. కండ రాల్లో దృఢత్వం, శక్తి సామర్థ్యాలు పెరుగు తాయి. 3. సాధారణ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
చాలామంది వ్యాయామాలు చేయమనప్పుడు నొప్పి పెరిగినట్లుగా ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా నొప్పి పెరగడమనేది సహజ పరిణామమే. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే మాత్రం వ్యాయా మాలు అల్పస్థాయిలో మొదలెట్టి క్రమంగా మోతాదు పెంచుకుంటూ వెళ్లాలి. అంతేకాని, నొప్పి వస్తున్నదనే కారణంతో మానేయకూడదు. వ్యాయామ సమయంలో జనించే నొప్పికి ఐస్‌క్యూబ్స్‌ను, హాట్‌వాటర్‌ బ్యాగ్‌లను మార్చి మార్చి ప్రయోగించవచ్చు.

నడుము నొప్పిలో ఉపకరించే వ్యాయామా లను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి- శరీరాన్ని సాగదీస్తూ చేసే వ్యాయామాలు (స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌)కండరాలను స్థిరంగా, శక్తివంతంగా చేసే వ్యాయామాలు (స్టెబిలైజింగ్‌ ఎక్సర్‌సైజెస్‌) సాధారణ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వ్యాయామాలు (జనరల్‌ ఎక్సర్‌సైజెస్‌)

శరీరంలో కేవలం నడుము నొప్పే కాకుండా ఇతర జాయింట్ల నొప్పులున్న వారు కూడా ఈ తరహా వ్యాయామాలను చేయవచ్చు. కాకపోతే ఏది చేయాలి? ఏది చేయకూదనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

వెన్ను నొప్పిని తీవ్రతరం చేసే అంశాలు
ఒకమనిషి ఉన్నట్లుగా మరొకరు ఉండరు. గుణగణాలనుంచి శారీరక లక్షణాల వరకూ అన్ని టిలోనూ తేడాలు ఉంటాయి. ఒక్కొక్క శారీరక ప్రకృతికి ఒక్కొక్క అంశం ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. నాడి, ఆకృతి, నాలుక, స్పర్శ వంటి ఎనిమిది రకాల పరీక్షలను అష్టస్థాన పరీక్షలం టారు. వీటిని ఆధారం చేసుకుని చికిత్సను సూచించాల్సి ఉంటుంది.
మనందరిలోనూ కొన్ని సామాన్య లక్షణాలు న్నట్లుగానే కొన్ని సామాన్య వ్యాధి కారకాలు కూడా ఉంటాయి. నడుము నొప్పిని కలిగించే సామాన్య హేతువులను తెలుసుకుందాం.

ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం: ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ వాడకం అనివా ర్యమైపోయింది. అలాగే ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుని పని చేయాల్సిన వృత్తులు కూడా ఎక్కువైపోతున్నాయి.
కుర్చీలో ఒంగిపోయి లేదా చేరగిలపడి పని చేసే వారిలో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన భంగిమలో కూర్చోవటం అలవ ర్చుకుంటే నడుము నొప్పి బాధించదు.

వాహనాలు సరిగ్గా నడపకపోవడం
వాహనాలు మన జీవితంలో నిత్యావసరా లైపోయాయి. నేటి కాలంలో నడుము నొప్పికి దారి తీసే అతి పెద్ద కారణం వాహనాలను సక్ర మంగా నడిపించక పోవడమే.

వాహనం సీటును, స్టీరింగ్‌ లేదా హ్యాండిల్‌ ఎత్తుకు సరిపోయే విధంగా అమర్చు కోవడం ముఖ్యం. అవసరమైతే సీటుమీద మరొక కుషన్‌ వేసుకుని సరైన ఎత్తుకు చేరుకోవచ్చు. ఒకవేళ కారులాంటి నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారైతే నడుము వంపునకు అనుగుణంగా సీటు ఆకృతిని మార్చుకోవాలి.

సీటును మార్చడం కుదరకపోతే ఏదైనా బట్టను చుట్టి నడుము వంపు దగ్గర అమర్చు కున్నా సరిపోతుంది. మార్కెట్‌లో వీపు ఆకృతికి అనుగుణంగా తయారు చేసిన కుషన్లు దొరుకు తున్నాయి. వాటిని వాడవచ్చు. దూర ప్రయా ణాలు చేసేవారు ప్రతి గంటకూ ఐదేసి నిము షాల విరామం తీసుకోవాలి.

అలవి కాని బరువులను లేపడం
సాధ్యమైనంత వరకూ అధిక బరువులను లేపకూడదు. ఒకవేళ లేపాల్సి వస్తే బరువును శరీరానికి దగ్గరగా ఉంచుకుని మోకాళ్లు వంచి లేపాలి. బరువులను ఎత్తేప్పుడు పాదాలను ఎడంగా ఉంచడం మర్చిపోకూడదు.

ముందుకు వంగి పని చేయడం
బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, కుట్టు మిషన్‌పై పని చేయడం, మట్టి తవ్వడం వంటివి చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందుకు వంగాల్సి వస్తుంది. ఇలా ముందుకు వంగి పని చేసే వారిలో చాలామందికి నడుము నొప్పి వస్తుంది. వృత్తిరీత్యా చేయాల్సి వచ్చే ఇటువంటి రోజువారీ పనులను కొద్దిపాటి మార్పులు, చేర్పులతో చేసుకుంటే నడుము నొప్పి బాధించదు.
మానసిక ఆందోళన
అన్ని వేళలా ఉత్కంఠత, ఆందోళన అనుభ వించే వారిని నడుము నొప్పి ఎక్కువగా బాధి స్తుంది. మానసిక ఆందోళన వలన కండరాలు బిగదీసుకుపోయి రక్త సరఫరా తగ్గుతుంది. నడుము భాగంలో అనేక నిర్మాణాలు కొద్ది ప్రదే శంలో ఇరుకుగా అమరిఉండటంతో టెన్షన్‌ పెరిగి నప్పుడల్లా రక్త సరఫరా తగ్గి కండరాల్లో మలి నాలు సంచితమవుతాయి. దీని పర్యవసానంగా నడుము నొప్పి వస్తుంది.


సూచనలు
బెల్టుల పాత్ర : నేటికీ చాలామంది డాక్టర్లు నడుము నొప్పికి లంబో సాక్రల్‌ బెల్ట్‌ (కార్సె ట్‌)ను సూచిస్తున్నారు. అయితే ఈ బెల్టుల వలన ఆశించినంత ఫలితం కనిపించడం లేదు.
నడుము కదలికలను నియంత్రించాలని లేదా శరీరపు పైబరువును మోయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది డాక్టర్లు వీటిని సిఫార్సు చేస్తు న్నారు. కొద్దికాలంపాటు వీటిని వాడితే ఎలాంటి నష్టమూ ఉండదు.

ఈ బెల్టులు ఎక్కువ కాలం వాడితే కదలికలు తగ్గిపోవటం వల్ల కండరాలు క్రమంగా సన్నబడి పోయి డీలాపడతాయి. శరీరపు బరువును మోసే శక్తి సామర్థ్యాలను కోల్పోతాయి. అంటే వీటి వల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ గా జరుగుతుందన్నమాట.
చికిత్సగా మసాజ్‌ : శాస్త్రీయ పద్ధతిలో చేసే మసాజ్‌ వలన నిశ్చయంగా ఫలితం ఉంటుంది. థెరాప్టిక్‌ మసాజ్‌ అంటే కండరాల అమరికను, మానవ శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని చేసే చికిత్స. దీనిలో నిలబడటం, కూర్చోవటం వంటి వ్యక్తిగత భంగిమలను సైతం పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, February 21, 2011

Peptic ulcer , పెప్టిక్ అల్సర్


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Peptic ulcer , పెప్టిక్ అల్సర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే, మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అన్న వాహిక కింది భాగంలో, జీర్ణాశయంలో, డ్యుయోడినమ్‌లో ఏర్పడే పుండునే పెప్టిక్‌ అల్సర్‌ అంటారు. పెప్టిక్‌ అల్సర్‌ జీర్ణాశయంలో ఏర్పడితే గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ అని, డుయోడినమ్‌లో ఏర్పడితే డుయోడినల్‌ అల్సర్‌ అని అంటారు. జీర్ణాశయం బయట ద్వారం నుండి మొదలయ్యే చిన్న పేగు ఆరంభమయ్యే భాగాన్ని డుయోడినమ్‌ అంటారు. అన్నవాహిక (Oesophagus)చివరిలో ఏర్పడితే ఈసోపేజియల్ అల్సర్ అని అంటారు . మనం తీసుకునే ఆహారంలో, అలవాట్లలో మార్పులు చేసుకుంటే పెప్టిక్‌ అల్సర్‌ను నివారించొచ్చు.

కారణాలు

*వంశపారంపర్యంలో ఒక రకమైన జన్యువుల వల్ల.

*పొగతాగే వారిలో అవకాశం అధికం.

*గాస్ట్రినోమ అనే క్లోమగ్రంథిలో పెరిగే గడ్డ వల్ల.

*కొంతమందిలో గ్యాస్ట్రోజెజునాష్టమి ఆపరేషన్‌ చేసిన తర్వాత ఏర్పడొచ్చు.

*ఎక్కువ ఆందోళన చెందేవారిలో.

*మద్యం అపరిమితంగా సేవించేవారిలో.

*ఎక్కువ కారం, పులుపు, మసాల దినుసులు వాడే వారిలో.

*జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్‌ తయారవటం వల్ల.

*'హెచ్‌.పైలోరి' అనే సూక్ష్మజీవులవల్ల.

వొళ్లు నొప్పులు తగ్గించే (పెయిన్‌కిల్లర్స్‌) కొన్ని మందుల వల్ల.ఈ పెప్టిక్‌ అల్సర్‌ ఏర్పడుతాయి.

ఎలా మొదలవుతుంది ?

*జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణరసం ఉత్పత్తి.

*జీర్ణాశయం లోపలి వుండే పల్చటి పొర (గ్యాస్ట్రిక్‌ మ్యూకోజ) దెబ్బతిన్నప్పుడు (మద్యం అతిగా సేవించే వారిలో ఆస్పిరిన్‌ మొదలైన మందులు *వాడేవారిలో ఆ పొర దెబ్బ తింటుంది.)

*పెస్సిన్‌ ఆమ్లం ఎక్కువ ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్‌ మ్యూకోజా దెబ్బతిన్నప్పుడు.

*చర్మం కాలినప్పుడు, కొన్ని రక్త ప్రసరణ రోగాలు వచ్చినప్పుడు.

వ్యాధి లక్షణాలు

జీర్ణాశయం అల్సర్‌ : బాగామంటతో కూడిన నొప్పి. అన్నం తింటూనే ఎక్కువై, 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం. ఆకలి మందగించడం. వాంతుల వడం. బరువు తగ్గడం. వాంతి అయితే నొప్పి తగ్గడం. ఇవి దీని సాధారణ లక్షణాలు. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగితే, కాఫీ, డికాక్షన్‌ లాగ వాంతులవడం, మనిషి నీరసిం చిపోవడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

డ్యుయోడినల్‌ అల్సర్‌ : కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి. ఖాళీ కడుపు వున్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న రెండు, మూడు గంటలు దాటిన తర్వాత, అర్థరాత్రి, తెల్లవారు జామున అధికనొప్పి రావడం. అప్పుడేమైన తిని నీళ్లు తాగితే తగ్గుతుంది. ఇవి ముఖ్య లక్షణాలు. దీని లోపల, పుండు నుండి రక్తస్రావం జరిగితే వాంతితో పాటు, తారులాగా నల్లగా విరేచనమవుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

విపరీతలక్షణాలు : అల్సర్‌ నుండి రక్తస్రావం అవుతుంది. గ్యాస్ట్రిక్‌ అవుట్‌లెట్‌ అవరోధం. పుండు వున్న చోట రంధ్రం పడడం. పైలోరిక్‌ స్టినోసిస్‌ ఏర్పడడం. పుండు క్యాన్సర్‌గా మారటం.

వ్యాధి నిర్ధారణ

జిఐ ఎండోస్కోపి, బేరియం ఎక్సరే, రాపిడ్‌ బయాప్సి‌ (హెచ్‌.పైలోరి కనుక్కోవడానికి)

శస్త్ర చికిత్స

హెచ్‌.పైలోరి వున్నవాళ్లు డాక్టరు సలహామేరకు సరైన మందులు వాడాలి. కొందరిలో పైలోరిక్‌ స్టినోసిస్‌ వుంటే ఆపరేషన్‌ (గ్యాస్ట్రోజెజునాస్టమి) చేయాల్సి ఉంటుంది. పుండు రంధ్రంగా ఏర్పడతే దానికి వెంటనే తగిన శస్త్రచికిత్స చేయాల్సి వుంటుంది. పుండు నుండి అధిక రక్తస్రావం జరిగిన పక్షంలో కూడా మందులతో ఉపశమనం లేకపోతే శస్త్ర చికిత్స అవసరం వుంటుంది.

డాక్టరు పర్యవేక్షణలో తగిన సమయంలోమందులు వాడితే అల్సర్‌ మానిపోతుంది. ఇప్పుడు అల్సర్‌ నయమవడానికి మంచి మందులు అందుబాటులో వున్నాయి.

ముఖ్యముగా వాడే కొన్ని మందులు :
  • omeperazole ,
  • Esomiperazole ,
  • pentaprazole ,
  • Rabeprazole

నివారణ ఇలా

రోజు వారి ఆహారంలో పులుపు, కారం, మసాలా తగ్గించాలి.

*ధూమపానం, మద్యం, పొగాకు నమలడం మానాలి.

*మనసును ప్రశాంతంగా వుంచాలి.

*రోజుకు 6 నుంచి 8 గంటలు కలతలులేని నిద్రపోవాలి.

*ఆస్పిరిన్‌, ఇతర నొప్పి నివారణ మందులు అవసరమైతేనే డాక్టర్‌ సలహా ప్రకారం మాత్రమే వాడాలి.

*కాఫీ, టీలు, చాక్లెట్‌లు తగ్గించాలి.

*మూడు, నాల్గు గంటలకోసారి ఏదైనా ఆహారం తీసుకోవాలి.

మజ్జిగ, పాలు తాగుతుండాలి.

*బేకరి పదార్థాలు, నూనెలో వేయించినవి మానాలి.


పెప్టిక్‌ అల్సర్‌ వల్ల కలిగే అత్యవసర ప్రమాద చికిత్స :

-అత్యవసరంగా చికిత్స చేయాల్సిన కడుపు నొప్పులలో ప్రధానంగా పేర్కొనవలసింది కడుపులో పుండు (పెప్టిక్‌ అల్సర్‌), దాని వలన కలిగే విపత్కర పరిణామాలు. సాధారణంగా ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా 'నాకు గ్యాస్‌ ట్రబుల్‌ ఉంది అని చెబుతుంటారు. అల్సర్లు జీర్ణాశయంలో కాని, డుయోడినమ్‌లో కాని మొదలవుతాయి.

కారణాలు
అల్సర్‌ అనేది మధ్య వయస్సులోని పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ఏ వయస్సులో నైనా, స్త్రీలలో కూడా ఇది వచ్చే అవకాశాలున్నాయి. మద్యపానానికి బానిసలైన వారిలోనూ, ఆహారాన్ని తీసుకో వడానికి సరైన వేళలు పాటించని వారిలోనూ, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు అధికంగా తీసుకునేవారిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకనే డాక్టర్లు మద్యపానానికి, మసాలా తిండికి దూరంగా ఉండాలని ఈ సమస్యతో బాధపడే రోగులకు సలహా ఇస్తుంటారు. ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా అల్సర్‌ వ్యాధిని నిర్ధారిస్తారు.

అల్సర్ల వలన కలిగే దీర్ఘకాలిక సమస్యలను పక్కన పెడితే, దీనివలన కలిగే అత్యవసర విపత్కర (ఎమర్జెన్సీ) సమస్యల గురించి తెలుసుకుందాం.
ఎమర్జెన్సీ సమస్యలలో పుండు పగిలి జీర్ణాశయంలో రంధ్రం పడటం (పర్ఫొరేషన్‌) మొదటిది. పుండు రక్తనాళాల లోకి చొచ్చుకునిపోయి రక్తస్రావం కావడం రెండవది.

రంధ్రం పడటం
ఈ సమస్య ఎదురైనప్పుడు అత్యవసరంగా శస్త్ర చికిత్స కొన్ని గంటలలోనే చేయాల్సిఉంటుంది. లేనిపక్షంలో రోగి ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ సమస్యకు గురైన చాలా కేసుల్లో ప్రాణాపాయం సంభవిస్తుంటుంది.

లక్షణాలు
అల్సర్‌ కారణంగా కడుపులో రంధ్రం పడిన వ్యక్తికి విప రీతమైన కడుపునొప్పి బొడ్డు పైభాగంలో మొదలవుతుంది. ఇది క్రమంగా కడుపులోని ఇతర భాగాలకు ప్రాకుతుంది.
దీనిలో నాడి తీవ్రత అధికమవుతుంది. రక్తపోటు తగ్గు తుంది. వాంతులు కూడా అధికంగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ కడుపు భాగమంతా వ్యాపించడం వలన కొద్ది గంటల వ్యవధిలోనే రోగి మరణానికి చేరువ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ దశ రాకముందే రోగికి ఎక్స్‌రే అబ్డామిన్‌, స్కానింగ్‌ వంటి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
ఆపరేషన్‌ చేసే ముందు రోగిని ఆపరేషన్‌కు, మత్తుమందుకు తట్టుకునే విధంగా చేయాల్సి ఉంటుంది. దీనిని రిససిటేషన్‌ (Resuscitation) అంటారు.
ఆపరేషన్‌లో అల్సర్‌ వలన ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చి వేస్తారు. తరువాత కడుపులో చేరిన చీమును తొలగించి, కడుపు మొత్తాన్ని సెలైన్‌తో శుభ్రపరుస్తారు.

శస్త్రచికిత్స తరవాత రోగి నెమ్మదిగా పది రోజులలో కోలు కోవడం జరుగుతుంది. అల్సర్‌ పూర్తిగా తగ్గడానికి మూడు నెలల తరువాత మరొక ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.
అల్సర్‌ కారణంగా కడుపులో రంధ్రం పడటమనేది పెప్టిక్‌ అల్సర్లవలన మాత్రమే కాకుండా, టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడే వారిలోనూ కనిపిస్తుంది. దీనిని ఎంటరిక్‌ పర్ఫొరేషన్‌ అంటారు. ఈ అల్సర్‌ వలన పడే రంధ్రం కడుపులో కాకుండా, చిన్న ప్రేవుల్లో పడుతుంది.
టైఫాయిడ్‌ జ్వరంతో రోగి మూడు వారాలపాటు బాధపడిన తరువాత ఈ స్థితి సంభవి స్తుంది. ఇది పెప్టిక్‌ అల్సర్‌ కంటే ప్రమాదకరమైనది. దీనిలో మరణాల రేటు చాలా అధికంగా ఉంటుంది. దీనిని కూడా ఆపరేషన్‌ ద్వారా మాత్రమే సరి చేయాల్సి ఉంటుంది.

రక్తస్రావం
పెప్టిక్‌ అల్సర్‌ ఏదైనా రక్తనాళంలోకి చొచ్చుకొని పోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిలో రోగి విపరీతంగా రక్తాన్ని వాంతి చేసుకుంటాడు. ఫలితంగా షాక్‌కు గురవుతాడు. ఈ స్థితిని కూడా ఎండోస్కోపీ ద్వారా నిర్ధారించి, మందులతో నయం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆపరేషన్‌ అవ సరమవుతుంది.

నివారణ
ఎప్పుడైనా సరే చికిత్స కంటే నివారణే గొప్పది. కనుక అసలు అల్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసు కోవాలి.దీనికోసం ఈ కింది సూచనలు పాటించాలి.
- సరైన సమయంలో భోజనం చేయడం
- మసాలాలు, వేపుడు పదార్థాలను తక్కువగా తినడం,
- సిగరెట్లు, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండటం,
- నొప్పిని తగ్గించే మాత్రలు వేసుకోవాల్సి వస్తే వాటిని భోజనం తరువాత మాత్రమే వాడటం.
పైన పేర్కొన్న చిన్నపాటి జాగ్రత్తలను పాటించిన ట్లయితే అల్సర్లు సోకే పరిస్థితిని నివారించవచ్చు.
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

చిన్న పిల్లల్లో ఎఎస్‌డి, విఎస్‌డి రంధ్రాలు ,ASD,VSD in children


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చిన్న పిల్లల్లో ఎఎస్‌డి, విఎస్‌డి రంధ్రాలు ,ASD,VSD in children - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-సాధారణంగా ఫిజిషియన్‌ పాప తల్లి చెప్పిన కొన్ని లక్షణాలనుబట్టి తన స్టెతస్కోప్‌ సహా యంతో పరీక్ష చేసినప్పుడు కొన్ని భరించరాని చప్పుళ్లు వింటాడు. వీటినే మర్మర్స్‌ అంటారు. తరువాత కొన్ని పరీక్షలు నిర్వహించి గుండెలో రంధ్రం ఉందని నిర్ధారిస్తాడు. వీటి గురించి ఎన్నిసార్లు వివరించినా సందేహాలు పీడిస్తూనే ఉంటాయి. కొన్నింటికి అర్థాలు, చికిత్స ఎలా చేయాలో తెలుసుకుందాం.

పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు 1000 మందిలో 8 మందికి వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఖచ్చితంగా తెలియదు కాని గర్భంతో ఉన్నప్పుడు సోకిన వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, జన్యులోపం వల్ల కాని వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా ఏర్పడుతుందంటే శిశువు పుట్టక ముందు ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయన ప్పుడు రెండు ధమనుల మధ్య, రెండు ఏట్రి యమ్‌ల మధ్య ఏర్పడే రంధ్రం. ఈ ఫోరమెన్‌ ఒవేల్‌ సాధారణంగా శిశువు తీసుకునే మొదటి శ్వాసతో మూసుకుపోతుంది. కొన్ని సంద ర్భాల్లో ఇది ఫెయిల్‌అయి, ఇంకొన్నిసార్లు అరు దుగా సంవత్సరాల తరబడి ఇది మిగిలిపో తుంది. ఈ పదం రంధ్రం అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే శిశువు పుట్టేటప్పుడు రెండు ఏట్రియమ్‌ల మధ్య సంబంధం తెగిపోతే ఏర్పడుతుంది.

విభాజకంలో లోపం (సెప్టల్‌ డిఫెక్ట్‌)
దీనినే కొన్నిసార్లు గుండెలో రంధ్రం అంటారు. గుండె కుడి, ఎడమ గదులను వేరు చేసే కండరం తాలూకు గోడను సెప్టమ్‌ అంటారు. శిశువు ఈ రంధ్రంతో జన్మిస్తే రక్తం గుండె ఎడమ వెనుకభాగంనుంచి కారి కుడిభాగంలోకి వస్తుంది.
ఇది చిన్నదయితే చిన్న సమస్యలు ఉంటాయి. ఇది పెద్దదయితే పిల్లలు శ్వాస తీసుకోలేకపోతారు. సమస్యలు పెద్దవవుతాయి. ఎదుగుదల ఉండదు.

ఎఎస్‌డి
గుండెలో రెండు కర్ణికల మధ్యగల విభా జకంలో లోపం. అంటే రంధ్రం పై గదులు కుడి కర్ణిక, ఎడమ కర్ణిక మధ్య ఏర్పడిందని అర్థం. ఎందుకటే ఒత్తిడి గుండెకు ఎడమవైపు ఎక్కువగా ఉంది. రక్తం ఈ రంధ్రం ద్వారా ఎడమనుండి కుడికి ప్రవహిస్తుంది. శిశువు పుట్టక ముందు ఒక రంధ్రం ఉంటుంది. జన్మించే సరికి అది మూసుకుపోతుంది. ఒకవేళ మూసుకోకపోతే కొన్ని లక్షణాలు -

1) శ్వాస రేటు తగ్గిపోవడం లేదా శ్వాస పీల్చడం కష్టం కావడం
2) గుండె దడ, లేదా గుండె వేగంగా కొట్టుకోవడం (పాల్పిటేషన్స్‌)
3) ఎదుగుదల నిలిచిపోవడం
ఎఎస్‌డి ఉన్నప్పటికీ, పిల్లల స్కూల్‌ జీవితం అయ్యే వరకూ బైటపడకపోవచ్చు. కుడి జఠరిక క్రమంగా పెరుగుతుంది. ఇదిపెద్దయ్యాకా సమ స్యలు సృష్టిస్తుంది. వీరికి గుండె లయ తప్పి కొట్టుకోవడం, లేదా గుండె ఫెయిల్‌ కావడం సంభవిస్తుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే గుండెకు రక్త ప్రసరణ సరిపడా లేదా శరీర అవ సరాలకు సరి పడినంత లేదని అర్థం. తద్వారా ద్రవం శరీ రంలో నిలిచిపోతుంది. ఉదాహరణ : ఊపిరి తిత్తులు, కడుపు, లివర్‌, కాళ్లు.

ఎలా నయం చేయాలి?
దాదాపు 40 శాతం మందికి రెండు సంవ త్సరాల వచ్చేసరికి ఎఎస్‌డి సహజంగా మూసు కుపోతుంది. తరువాత సహజంగా మూసుకు పోవడం అరుదు. అందువల్ల శస్త్ర చికిత్స ద్వారా మూసివేయవచ్చు.
క్యాథ్‌ ప్రొసీజర్‌ : కొంతమంది వైద్యులు శస్త్ర చికిత్స అవసరం లేకుండా కూడా క్యాథటరై జేషన్‌ అనే పద్ధతి ద్వారా ఒక పొడవైన సన్నని గొట్టం (క్యాథటర్‌) శరీరంలోకి చొప్పించి టైనీ పరికరాల ద్వారా రంధ్రం మూసివేసి క్యాథటర్‌ తీసివేస్తారు.
శస్త్ర చికిత్స : 99 శాతం ఎఎస్‌డిలు సక్సెస్‌ అవుతాయి. చిన్న తనంలో శస్త్ర చికిత్స చేస్తే గుండె పరిమాణం 4 నుండి 6 నెలల్లో సాధారణ స్థితికి చేరుకుంటుంది.

విఎస్‌డి
వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌. ఇది కూడా ఒక రంధ్రం. ఇది గుండె కింది గదులను వేరు చేస్తుంది. సాధా రణంగా ఎడమ కుహరం మంచి రక్తాన్ని, ఆక్సిజన్‌ను అంద జేస్తుంది. రక్తాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో విఎస్‌డి ఉంటే కొంత రక్తం ఈ రంధ్రంలో పడుతుంది. ఇది సాధారణ ప్రసర ణకు ఆటంకం కలుగుతుంది. ఇంతే కాక, కుడి ఎడమ జఠరికలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు పని ఒత్తిడి గుండె పరిమాణం పెరగడానికి దోహద పడుతుంది.

విఎస్‌డి లక్షణాలు
శ్వాస రేటు తగ్గిపోవడం, చర్మం పాలిపో వడం, వేగంగా శ్వాస తీసుకోవడం, నాడి వేగం పెరగడం, తరచుగా శ్వాస పీల్చడంలో ఇన్‌ఫెక్షన్‌లు, పెరుగుదల మందగించడం. పుట్టిన కొన్ని వారల వరకూ ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.

ఎలా నయం చేయాలి?
చాలామందికి విఎస్‌డి ఉంటే శస్త్ర చికిత్స అవసరం రాకపోవచ్చు. మొదటి 4 సంవత్సరా లలోపు ఇది సాధారణంగా మూసుకుపోతుంది. లేదా చిన్నగా ఉండి శరీరానికి, గుండెకు హాని చేయనంతగా ఉంటుంది.
ఒకవేళ విఎస్‌డి పెద్దది అయితే శస్త్ర చికిత్స అవసరం. పల్మొనరీ ఆర్టరీ బాండింగ్‌ అనేది ఒక రకమైన పద్ధతి.
దీనిలో రక్త ప్రసరణపై ఒత్తిడి బాండ్‌ సహాయంతో తగ్గిస్తారు. తరువాత పాప / బాబు పెద్దయిన తరువాత ఈ బాండ్‌ తొలగించి, విఎస్‌డిని ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సహాయంతో పూర్తి చేస్తారు. ఒకవేళ రంధ్రంమరమ్మతు అవసరమైతే దాని అంచులు కుట్టివేస్తారు. ఒక కప్పుతో మూసివేస్తారు.

మనం ముందుగా రంధ్రం అన్నది ఉందని తెలుసుకుంటే కార్డియాలజిస్ట్‌ సహాయంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మందులు ఏవి వాడాలో పాటించడం అవసరం. పిల్లల్లో ఈ రంధ్రాలు ఉంటే అవసరమైతే వెంటనే శస్త్ర చికిత్స చేయాలి.

  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/